-
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్ చేసిన ఒక పోస్ట్తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి.' అంటూ అయిన షేర్ చేసిన పోస్ట్పై అందరూ ఎంతగానో ఆసక్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్ను కీర్తి సురేష్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది. -
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
సింగర్ సుచిత్ర గతంలో సుచీలీక్స్ పేరిట హీరోల పర్సనల్ ఫోటోలను లీక్ చేసి సెన్సేషన్ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్ఖాన్ గే అంది. వాటిపైనే ఆసక్తితన భర్త కార్తీక్ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్ రంగనాథన్పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అనిరుధ్తో..వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్నైల్స్ పెడుతూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్తో ఉంది.. అనిరుధ్తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్నైల్స్ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే.. -
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
పవన్ కల్యాణ్కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్కు పాజిటివ్గా పోస్ట్ పెడితే ఆ క్రెడిట్ అంతా పవన్కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్స్టాలో ఒక మెసేజ్ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్ అభిమాని ఇలా కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించే నటుడు సునీల్. తెలుగులో హీరోగాను పలు సినిమాల్లో మెప్పించిన ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పతో మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సౌత్ ఇండియాలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ 'జైలర్', కార్తి 'జపాన్', విశాల్ 'మార్క్ అంథోని' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు.తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే, హాస్యనటుడిగా కాకుండా విలన్గా అతడు మాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. 'భ్రమయుగం' తర్వాత మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.సీరియస్ లుక్లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కోలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. మాలీవుడ్లో కూడా తన సత్తా ఎంటో చూపించబోతున్నాడు. మే 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI— Mammootty (@mammukka) May 17, 2024 -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. కలర్ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్!
ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్లో నటించి చాలా కాలమైంది.ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)A bond for life with #sivakumar anna, who came to see me as I am recovering from a leg procedure.shared so much on drawings , pictures and our travel 🙏🙏🙏🙏 pic.twitter.com/qxwuBMZD4q— Radikaa Sarathkumar (@realradikaa) May 18, 2024 -
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!) -
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్లో ఓ నటి హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..హెల్మెట్ లేకుండా..కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్ అనే వ్యక్తి ఈ సీన్ను లైట్ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్ డైరెక్టర్పై, సదరు ఛానల్పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బండి యజమానికి సైతం ఫైన్దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్లో షూట్ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.చదవండి: భర్త కోసం స్పెషల్ పోస్ట్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా? -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
రష్మిక వీడియో వైరల్.. ఏకంగా ప్రధాని స్పందించేలా చేసింది!
ప్రస్తుత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కీలకమైన ఐదో దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్నా. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది కాస్తా నెట్టింట వైరల్గా మారిపోయింది. అసలేంటి ఆ వీడియో? ఇంతకీ నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.ఎలక్షన్స్ వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా చేసిన వీడియో పొలిటికల్ హాట్టాపిక్గా మారింది. అటు నార్త్లో ఇటు సౌత్లో టాప్ స్టార్గా దూసుకెళ్తున్న రష్.. కేంద్రంలోని మోదీ సర్కార్కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో కొందరు నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.ముంబయిలోని సముద్రప్రాంతంలో నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జిని ఉద్దేశించి రష్మిక ఓ వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ప్రశంసలు కురిపించింది. రెండుగంటల పట్టే ప్రయాణం.. కేవలం 20 నిమిషాల్లోనే చేరుకుంటున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది. యంగ్ ఇండియా అభివృద్ధిలో అద్భుతాలు సాధిస్తోందంటూ కొనియాడింది. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక.. అభివృద్ధికే ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ముద్దుగుమ్మ.అయితే రష్మిక చేసిన వీడియోపై ఏకంగా మన ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన వీడియోను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు ప్రధాని. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్కు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్రప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు గుర్తింపును దక్కించుకుంది.కాగా.. ఈ నిర్మాణం అద్భుతమని ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. సీ లింక్ ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తంచేశారు. తాజాగా ఎలక్షన్ టైమ్లో రష్మిక మందన వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ ప్రొపగాండాలో భాగమని కొందరు అంటుంటే.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Sir! What an honor! It's incredibly fulfilling to witness our country's growth as a super proud young Indian. 🙏🏻🤍 https://t.co/ZY19v2czFf— Rashmika Mandanna (@iamRashmika) May 17, 2024 -
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా
కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్) -
12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అది కూడా హీరోగా!
సినిమాలకు, రాజకీయాలకు అత్యంత సుపరిచితుడు రామరాజన్. దాదాపు 44 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సక్సెస్ఫుల్ నటుడీయన. పలు చిత్రాలకు దర్శకత్వం సైతం వహించిన ఈయన రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీర విధేయుడు రామరాజన్. కాగా సినీ, రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన గతంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. పద్నాలుగేళ్ల తర్వాత..సుమారు 14 ఏళ్ల తర్వాత రామరాజన్ మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అదీ కథానాయకుడిగా! అలా ఆయన నటించిన చిత్రం సామానియన్. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించిన ఇందులో రాధారవి, ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.హీరోయిన్ లేదుఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మీడియాతో ముచ్చటించింది. రామరాజన్ మాట్లాడుతూ సామానియన్ చిత్రంలో నటించడానికి ముఖ్య కారణం కథ అన్నారు. దర్శకుడు రాకేష్ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరన్నారు. ఒక సగటు సామాన్యుని కోపమే ఈ చిత్రమని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన, లేదని సినిమాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని కథలను వింటున్నానని వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.చదవండి: ప్రభాస్ నుంచి త్వరలో గుడ్ న్యూస్.. ఏమై ఉండొచ్చు? -
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
అబ్రాడ్కు వెళ్లిపోయిన రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ రజనీకాంత్కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ను ఇటీవలే పూర్తి చేశారు. తదిపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఫస్ట్ ఆఫ్ కథను సిద్ధం చేసి.. సెకండ్ ఆఫ్ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్ రిలాక్స్ కోసం తాజాగా అబ్రాడ్కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. சென்னை விமான நிலையத்திலிருந்து எதிஹாட் ஏர்வேஸ் விமானம் மூலம் அபுதாபி புறப்பட்டு சென்றார் நடிகர் ரஜினிகாந்த்...#Chennai | #Airport | #Actor | #Rajinikanth | #SuperStar | #AbuDhabi | #PolimerNews pic.twitter.com/j9JJvxcLlt— Polimer News (@polimernews) May 16, 2024 -
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో థియేటర్ల వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపే చూస్తున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్తో వినోదం అందించేందుకు రెడీ అయ్యాయి.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో అలరించేందుకు సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఆదాశర్మ నటించిన బస్తర్, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) ఆడియన్స్లో కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు సైతం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 10కి పైగా సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17 ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17 థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ 99 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17డిస్నీ ప్లస్ హాట్స్టార్ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17జీ5 బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17 తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమా జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17ఆపిల్ ప్లస్ టీవీ ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్లా (హిందీ సినిమా) - మే 17 -
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. -
సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్!
సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. మిలియన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్ మీనన్ ప్రతినాయకుడిగా ఫవర్ఫుల్ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్ మీట్ నిర్వహించింది.దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ..' సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్ మన్సూర్, ఎంఎస్ అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ ఐజీష్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్ తొలిసారిగా సూపర్ హ్యూమన్ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.ఇక నటుడు వసంతరవి స్క్రీన్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్ కరీమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది. -
విభేదాలు సరే.. వ్యక్తిగత దూషణలెందుకు?: కమల్ హాసన్
సినీ పితామహుడుగా పేరు గాంచిన సినీ పంపిణీదారుడు డి.రామానుజన్ శత జయంతి వేడుకను మంగళవారం సాయంత్రం చెన్నై లోని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన కృషి మరువలేనిదిఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. డి.రామానుజన్తో, ఆయన కుటుంబంతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆధునికతకు పెద్దపీట వేసిన ఆయన తమిళ సినిమా ఉన్నతికి అవసరం అయిన వాటిని సమకూర్చారన్నారు. అలాంటి వ్యక్తికి శతజయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం అని ప్రశంసించారు. వ్యక్తిగత దూషణలెందుకు?ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విభేదాలు ఎక్కువ అవుతున్నాయని, దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. విభేదాలు కలగడం సహజమేనని, అయితే వాటిని వ్యక్తిగత దూషణల వరకు తీసుకువెళ్లరాదన్నారు. అప్పట్లో తనకు డి రామానుజన్కు మధ్య కూడా చిన్న వివాదం తలెత్తిందని, కానీ దాన్ని తాము తీవ్రంగా తీసుకోలేదని చెప్పారు. సమైక్యతా భావం ముఖ్యంఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయితే సమైక్యతా భావం చాలా ముఖ్యమని కమల్ హాసన్ పేర్కొన్నారు. డి.రామానుజన్ శత జయంతి వేడుకలను నిర్మాత కలైపులి ఎస్.థాను చక్కగా నిర్వహించారని ప్రశంసిస్తూ ఈ సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వన్, దర్శకుడు నటుడు కె.భాగ్యరాజ్, నిర్మాత కేఆర్ వీసీ గుహనాథన్, ఆర్వీ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోలీవుడ్లో సుచిత్ర ప్రకంపనలు.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!
కోలీవుడ్లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ తారలపై సింగర్ సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధనుశ్ జంటపై చేసిన ఆరోపణలు, త్రిషపై చేసిన కామెంట్స్ కోలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ హీరో కమల్హాసన్ ట్రాన్స్జెండర్ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అంతేకాదు కమల్ బర్త్డే పార్టీల్లో అతిథులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని సంచలన ఆరోపణలు చేసింది.అయితే సుచిత్ర చేసిన కామెంట్స్ తర్వాత కమల్ హాసన్కు సంబంధించిన ఓ పాత ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ డ్రగ్డీలర్ జాఫర్ సాదిక్తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలపై జాఫర్ను 2024 మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసింది. అంతేకాదు.. జాఫర్ డీఎంకే పార్టీ మాజీ కార్యకర్త. అతను ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ డీలర్గా కొనసాగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.అయితే సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. కాగా.. గతంలో 2017లోనూ కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి సుచిత్ర తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి లాంటి వారి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.Suchitra Alleges Cocaine Served On Silver Plates At @ikamalhaasan Birthday Party, Netizens Dig Out Kamal's Pic With DrugKingpin #JafferSadiq @NIA_India 👇 pic.twitter.com/cURQc6Ty1K— Deepalakshmi 🚩 (@RSS_Activist) May 15, 2024 -
'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్ చేసిన నటుడు'
కొంతకాలంగా కోలీవుడ్లో టాప్ సింగర్గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్గా మారారు.అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్కు గురి చేసింది.తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్ చేసిన రక్షిత్
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా.. సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్ మాత్రం చిత్ర యూనిట్ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.తాజాగా డాగ్ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్ తెలిపారు. ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్ తెలిపారు. ట్రైనర్ ప్రమోద్ ఇంట్లో మే 09న 6 పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్,1 మేల్ పప్పీలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rakshit Shetty (@rakshitshetty) -
సుచీ లీక్స్.. కమల్ హాసన్పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర
కోలీవుడ్లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్గా మారిన విషయం తెలిసిందే.కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్కు హోస్ట్గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్గా పాల్గొంది. కమల్తో పాటు మాయ కూడా ట్రాన్స్జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. “Kamal Hassan is a transgender!” 🤯Shocking revelation by singer #Suchitra Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeakspic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement