-
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం సాయంత్రం వెండి జోడు సేవ నిర్వహించారు. సబ్ జైల్, బాలసదన్లో వసతుల పరిశీలన భువనగిరి క్రైం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి.మాధవిలత శనివారం భువనగిరి సబ్ జైలును సందర్శించారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి జైలు అధికారికి సూచనలు చేశారు. అలాగే ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయంపై ఆరా తీశారు. అనంతరం బాలసదన్ను సందర్శించి బాలికల బాగోగులపై తెలుసుకున్నారు. వసతుల లేమిని గుర్తించి సమస్య పరిష్కరించాలని బాలసదన్ ఇన్చార్జిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ బండారు జయశ్రీ, డీసీపీఓ సైదులు, బాలసదన్ ఇన్చార్జి, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి సూర్యాపేట: జూన్ 2, 3 తేదీల్లో సూర్యాపేటలో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు వివక్ష, అణచివేత, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చైతన్యం చేసేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట కోశాధికారి ఝాన్సీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : పోలింగ్ ప్రక్రియలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సెక్టార్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వీల్ చైర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లుగా గుంపులుగా రాకుండా చూడాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమన్వయంతో సమస్యలు ఎదురుకాకుండా పోలింగ్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఉదయమే చేరుకుని తమ రూట్లకు సంబంధించిన ప్రైసెడింగ్ ఆఫీసర్లతో కలిసి ఎన్నికల సామగ్రి తీసుకొని మధ్యాహ్నం లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయమే 5.30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభించాలని, పోలింగ్ ఏజెంట్లు సకాలంలో హాజరయ్యేలా వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి కేటాయించిన వాహనాలకు జీపీఎస్ అమర్చనున్నట్లు వెల్లడించారు. ఈవీఎంలకు సంబంధించిన ఇంజనీర్లు, తహసీల్దార్లు, పోలీసు ఎస్హెచ్ఓల ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈవీఎం యంత్రాలను అమర్చడంపై మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది.. వారం రోజులే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారాల్లో ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటున్నారు. లోక్సభ నియోజకవర్గాలు, జిల్లాను బాధ్యతగా తీసుకొని మంత్రులు ఎన్నికల పోరులోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్లగొండలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. భువనగిరిలో గెలుపు బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీసుకోగా, అక్కడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారం అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం రెండు చోట్లా అభ్యర్థుల గెలుపు బాధ్యతను మాజీ మంత్రి జగదీశ్రెడ్డిపైనే పెట్టింది. దీంతో ఆయన అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర నేతలు తీసుకున్నారు. ప్రచార రథాలు.. సభలు, సమావేశాలు ప్రధాన పార్టీలు ఎక్కువగా ప్రచార రథాలు, సోషల్ మీడియాపై దృష్టి పెట్టాయి. ఇన్చార్జిలు, రాష్ట్ర స్థాయి నేతల పర్యటనలతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రచార రథాలను (మైక్తో కూడిన వాహనాలను) తిప్పుతున్నాయి. ఏ వీధికెళ్లినా ఆయా పార్టీల ప్రచార రథాలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ రికార్డు చేసిన వాయిస్తో కూడిన నినాదాలు ప్లే చేస్తూ తిప్పుతున్నారు. ముఖ్య నేతల పర్యటనలతో రోడ్షోలు, సభలు నిర్వహిస్తూ పార్టీలన్నీ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, భువనగిరి ఇన్చార్జిలు తమ అభ్యర్థులైన కుందూరు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు కోసం రోజువారీ షెడ్యూల్ రూపొందించుకొని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక రెండు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేష్ గెలుపు కోసం మాజీ మంత్రి జగదీశ్రెడ్డి నిత్యం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ నిత్యం ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో రెండుసార్లు పర్యటించగా, కేటీఆర్ రెండుసార్లు, హరీష్రావు రెండు నియోజకవర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఇతర నేతలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. ఫ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు ఫ వేగం పెంచిన పార్టీలు.. జోరుగా ప్రచారం ఫ రాష్ట్ర, జాతీయ నేతల పర్యటనలు ఫ మండుటెండలతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే సభలు, సమావేశాలు ఫ కాంగ్రెస్ పార్టీ భారం ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్పై.. ఫ బీఆర్ఎస్ గెలుపు బాధ్యత జగదీష్రెడ్డికే.. ఎండ మంట పుట్టిస్తున్నా.. ఎండలు మంట పుట్టిస్తున్నా.. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదవుతున్నా.. నేతలు ప్రచారంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి సమయం ఉండటంతో ఆ సమయం వరకు రోడ్షోలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిల్లో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించింది. రోడ్షోలు కూడా నిర్వహిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షోలను నిర్వహిస్తున్నాయి. -
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు
సాక్షి, యాదాద్రి : రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమయుమ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను కేటాయించారు. ఇందులో 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీ ప్యాట్లు ఉన్నాయి. మొత్తం 8,023 బ్యాలెట్ యూనిట్లు, 2,673 కంట్రోల్ యూనిట్లు, 2,994 వీవీ ప్యాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టరు బెన్ షాలోమ్, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఆర్డీఓ అమరేందర్, డి.సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, బి.ఎస్. లత, డి.కొమరయ్య, కె.అనంతరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, ఈడీఎం సాయి కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూంలు ఇక్కడే.. ఇబ్రహీంపట్నం : ఖానాపూర్లోని గురునానక్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్లో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేయనున్నారు. మునుగోడు : చండూరు మండల కేంద్రంలోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీ భువనగిరి : అరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజీ నకిరేకల్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ తుంగతుర్తి : వ్యవసాయ మార్కెట్ గోదాము ఆలేరు : ఇండోర్ స్టేడియం జనగాం : సోషల్ వైల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈవీఎంలను భద్రపరచనున్నారు. నియోజకవర్గాల వారీగా.. ఫ 25 శాతం అదనంగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం వీవీ ప్యాట్లు పోలింగ్ బ్యాలెట్ కంట్రోల్ వీవీ ప్యాట్లు కేంద్రాలు యూనిట్లు యూనిట్లు ఇబ్రహీంపట్నం 343 1287 428 480 మునుగోడు 317 1,188 396 443 భువనగిరి 257 963 321 359 నకిరేకల్ 311 1164 388 435 తుంగతుర్తి 326 1221 407 456 ఆలేరు 309 1158 386 432 జనగాం 278 1042 347 389 -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఈఓ భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి శివాలయం ఎదుట ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవు రోజుల్లో కొండపైన బస్టాండ్లో తాత్కాలిక అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు సమాచారం ఇవ్వడానికి హెల్ప్డెస్క్, వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిత్య కై ంకర్యాలు, స్వామివారి సంకీర్తనలు భక్తులకు వినిపించేలా ప్రత్యేక దివ్యవాణి ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్యూకాంప్లెక్స్లో వాల్మోటింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులను ఆహ్లాదం పంచేందుకు ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సంగీత, సాహిత్య, నృత్య సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8 లక్షల మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఒక్క ఏప్రిల్ మాసంలోనే 369 బస్సులను కొండపైకి, కొండ కిందకు 9,825 ట్రిప్పులు నడిపించామని ఈఓ తెలిపారు. 8లక్షల మంది భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం పొందారని, ఇందులో 70 శాతం మహిళలు, 30శాతం మంది పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.ఫ విడతల వారీగా వసతులు మెరుగుపరుస్తున్నాం ఫ యాదాద్రి ఈఓ భాస్కర్రావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement