-
పోస్టల్ బ్యాలెట్ షురూ
జగిత్యాల: లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికల శిక్షణ పూర్తి కావడంతో ఈనెల 7వ తేదీ వరకు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. మొదటి విడత ఎన్నికల శిక్షణలో పోస్టల్ బ్యాలెట్పై అవగాహన కల్పించారు. అనంతరం ఫారం 12 దరఖాస్తులను అందించగా పోస్టల్ ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో నోడల్ అధికారులుంటారు. ఏమైనా ఇబ్బందులు, సందేహాలున్నా వారు నివృత్తి చేస్తారు. దరఖాస్తు ఫారంలో తెలిపిన వివరాల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారు. శనివారం ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్బ్యాలెట్ ఓటు హక్కును అదనపు కలెక్టర్ దివాకర వినియోగించుకున్నారు. -
అబద్ధాల కాంగ్రెస్కు పరాభవం తప్పదు
● బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కథలాపూర్(వేములవాడ): అబద్ధపు హామీతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం తప్పదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపెల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతకు గురైన కాంగ్రెస్ ప్రపంచ రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. మత రాజకీయాలు చేస్తూ ఎంపీ బండి సంజయ్ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్పీటీసీ నాగం భూమయ్య, వైస్ ఎంపీపీ కిరణ్రావు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భీమారంలో ప్రచారం.. మేడిపల్లి: మేడిపల్లి, భీమారం మండలాల్లోని పోరుమల్ల, కట్లకుంట, కొండపూర్, మన్నేగూడెం గ్రామాల్లో వినోద్కుమార్ పర్యటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కరీంనగర్కు చేసిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హరిచరన్రావు, సత్తిరెడ్డి, అజిత్రావు, అంగడి ఆనంద్ ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ 13 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలతో భారీగా జనాభా ఉన్న సువిశాలమైన జిల్లా. ఇంతటి జనాభా ఉన్న పాత జిల్లాలో సామాన్యులు చట్టప్రకారం అందాల్సిన కనీస సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. సామాజికపరంగా భద్రత కల్పించే అనేక రకాల సదుపాయాలను వివిధ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టింది. ఇంతవరకూ ఆ సేవలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో అందడం లేదు. కొన్ని సేవలు నేటికీ అసంపూర్తిగానే అందుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు గెలిచాక ఆయా సమస్యలకు ఈ సారైనా పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ సేవలెక్కడ? ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా మూడు రంగాల్లో కా ర్మికులు పనిచేస్తున్నారు. వీరు అనారోగ్యం పాలైతే వైద్యం అందించేందుకు కేంద్రం ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు తీసుకొచ్చింది. రామగుండంలో చిన్న డిస్పెన్సరీ తప్ప జనాభాకు తగినట్లు ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. అసలు ఆ ఆసుపత్రి ఉన్న విషయం కూడా చాలామంది తెలియకపోవడం గమనార్హం. ఈ సేవలు పొందాలంటే వరంగల్, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల మంది ప్రైవేటు టీచర్లు వివిధ స్కూళ్లలో పని చేస్తున్నారు. కానీ, వీరిలో 50శాతంపైగా మందికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేవు. 1,000 వరకు ఉన్న రైసుమిల్లుల్లో 20వేలకు పైగా కార్మికులు ఉన్నారు. అలాగే దాదాపు లక్షా తొంబై వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 370 వరకు గ్రానైట్ క్వారీల్లో 25వేల వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సరైన పీఎఫ్, ఈఎస్ఐ సేవలు అందడం లేదు. వేతన సవరణతో సేవలకు దూరం ఆపద కాలంలో కనీసం హైదరాబాద్లో అయినా ఈఎస్ఐ సేవలు పొందే వీలుండేది. 2015లో రూ.15,000 ఉన్న వేతన పరిమితిని కేంద్రం రూ.2,1000కు పెంచింది. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. కానీ, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత కేసీఆర్ ప్రభుత్వం 30శాతం వేతనం పెంచింది. దీంతో చాలామంది కార్మికుల వేతనాలు రూ.21,100 దాటాయన్న కారణంతో ఈఎస్ఐ సేవలకు దూరమయ్యారు. మారుతున్న కాలానికి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25వేలకు పెంచాలన్న కార్మికుల డిమాండ్ ఇంకా అమలుకు నోచుకోలేదు.అంగన్వాడీ ప్రతిపాదనలేవి? పిల్లలకు సరైన పోషకాహారంతోపాటు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అంగన్వాడీ కేంద్రాలు..పేద, సామాన్యుల పాలిట వరం. మన రాష్ట్రంలో దాదాపు 37,500 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి పెరుగుతున్న జనాభా, వెలుస్తున్న కొత్త కాలనీలకు అనుగుణంగా కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఆన్ డిమాండ్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది. అయినా, ఈ కేంద్రాల అమలుకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఆశించినంత స్థాయిలో చొరవ తీసుకోవడం లేదు. కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) కింద ఏర్పాటు చేయాల్సిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు మన వద్ద లేకపోవడం గమనార్హం. అలాగే 13 నియోజకవర్గాల్లో జరుగుతున్న సివిల్ పనుల్లో 0.1 శాతం మొత్తాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్)కు జమవుతుంది. ఆ మొత్తాన్ని వివిధ సివిల్ పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు గ్రాడ్యుయేట్ ఫినిషింగ్ స్కూల్ కోసం వెచ్చిస్తారు. అలాంటి శిక్షణ కేంద్రం ఉమ్మడి జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేసినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినవారవుతారు. కేంద్రం పరిధిలోని నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్తో రాష్ట్రం సమన్వయం చేసుకోని కారణంగా ఇక్కడ మైనార్టీలకు సరైన ఆర్థికసాయం అందడం లేదు. మైనార్టీ సంఖ్యను చూసినప్పుడు కరీంనగర్లో 1,29,000, పెద్దపల్లిలో 70,000పైగా, నిజామాబాద్లో 3,00,00 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లింలు అధికభాగం ఉండగా, మైనార్టీలు, సిక్కులు తదితరులు మిగిలిన సంఖ్యలో ఉన్నారు. ఈసారి గెలిచే ఎంపీలైనా మైనార్టీల ఆర్థికసాయానికి చొరవ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు జగిత్యాలకు కేసీఆర్
జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం హోదాలో జగిత్యాలకు వచ్చిన ఆయన మళ్లీ ఇప్పుడు వస్తున్నారు. కొత్తబస్టాండ్ నుంచి అంగడిబజార్, తహసీల్ చౌరస్తా మీదుగా రోడ్షో నిర్వహించి అనంతరం పాతబస్టాండ్ వద్ద ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో కేసీఆర్ రోడ్షోలో పాల్గొంటారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నాయకులు పరిశీలించారు. సభ అనంతరం ఎమ్మెల్సీ రమణ నివాసంలోనే కేసీఆర్ బస చేయనున్నా రు. సోమవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు. జిల్లాకేంద్రంలో రోడ్షో ఏర్పాట్లు పరిశీలించిన నాయకులు రాత్రి ఇక్కడే బస -
810 మంది హోం ఓటింగ్
● కలెక్టర్ యాస్మిన్ బాషా జగిత్యాల: నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరి ధిలో ఇప్పటివరకు 810 మంది హోం ఓటింగ్లో పాల్గొన్నారని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపా రు. వృద్ధులు, పోలింగ్కేంద్రానికి చేరలేనివారు, అంగవైకల్యం ఉన్నవారికి ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు హోం ఓటింగ్ తీసుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 849 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 810 మంది హోం ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపా రు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement