-
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
కాంగ్రెస్లో జోష్..
వరుసగా కొత్తకోట, ఎర్రవల్లిలో జనజాతర సభలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/అలంపూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ అగ్రనేతల వరుస పర్యటనలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా శనివారం కొత్తకోటలో రోడ్షో, కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా ఎర్రవళ్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలు పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం.. సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎర్రవల్లి చౌరస్తాలో జరిగిన సభలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే.. ● భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ● అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన ● పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు -
అంగన్వాడీల్లో విలవిల
అచ్చంపేట: రెండు నెలలుగా భానుడి భగభగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో 46 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దలే బయట తిరగలేకపోతున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం నిత్యం అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులకు మాత్రం సెలవులు ఇవ్వకపోవడంతో ఏడాదంతా సెంటర్లు నడుపుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు వారికి సేవలు అందించే టీచర్లు, ఆయాలు, ఆరోగ్యలక్ష్మి కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన, పౌష్టికాహారం అందిస్తుండగా.. చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇరుకు గదులు.. కరెంటు, ఫ్యాన్లు కరువు.. జిల్లాలో 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 908 ప్రధాన, 223 మినీ కేంద్రాలు ఉన్నాయి. 457 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 138 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. 169 కమ్యూనిటీ హాళ్లు, 367 పాఠశాల ప్రాంగణాలో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నా.. చాలా కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు ఉన్న చోట ఫ్యాన్లు లేక ఎండ వేడిమికి చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అద్దె భవనాలు, ఇరుకై న గదులు, వెలుతురు లేని చీకటి గదుల్లో చిన్నారులు సతమతమవుతున్నారు. కరెంటు, ఫ్యాన్లు లేని పరిస్థితుల్లో ఆరేళ్లలోపు చిన్నారులు అవస్థలు వర్ణణాతీతం. కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తూ.. అక్కడే వంట చేస్తుండటంతో గదుల్లో వేడి మరింత పెరుగుతోంది. తగ్గుతున్న హాజరు శాతం.. అంగన్వాడీ కేంద్రాలకు సెలువులు ఉండని కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులు పౌష్హికాహారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రాలు తెరిచి ఉంచుతున్నారు. చాలా చోట్ల రోజురోజు పెరుగుతున్న ఎండలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడం తగ్గుతోంది. ఇంటికే పౌష్టికాహారం అందించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో టీచర్లు, ఆయాలకు సమస్యగా మారింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 1,131 చిన్నారులు 30,302 గర్భిణులు, బాలింతలు 10,277 ఇంటికి అందిస్తే మేలు.. వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లుగా, అంగన్వాడీలకు సెలవులు ఇచ్చి, పౌష్టికాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేసవి ముగిసే వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇంటికి ఇవ్వడంతో ఇబ్బందులు తీరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు నీరసించిపోతున్నారని, ఈ నెలాఖరు వరకు పౌష్టికాహారాన్ని ముందుగానే అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు ఫ్యాన్లు, కరెంట్కు నోచుకోని వైనం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల నుంచి 15 రోజులు టీచర్, మరో 15 రోజులు ఆయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండి పౌష్టికాహారం అందిస్తారు. ఎండల నేపథ్యంలో సెలవులు, ఇంటికి పౌష్టికాహారం అందించే విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – రాజేశ్వరీ డీడబ్ల్యూఓ నాగర్కర్నూల్ -
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
నడిగడ్డలోని బంగ్లా రాజకీయాలు అందరికీ తెలుసు. పొద్దున చెరొకవైపు ఉన్న వారు.. రాత్రయ్యే సరికి ఒకచోటికి చేరుతారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి. అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తోంది. అదే బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టాలి. కృష్ణా, తుంగభద్ర నది మధ్యలో ఉన్న నడిగడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. నడిగడ్డ బిడ్డలు ఎవరికై న మాట ఇస్తే తల తెగి కిందపడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు వెనుకేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడతారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు తెలంగాణకు నాయక్వతం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎరవ్రల్లి చౌరస్తా నుంచి రాయచూరు వరకు నాలుగు లైన్లు, పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసుకోవడానికి మీరందరూ కాంగ్రెస్కు అండగా ఉండాలి. నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలి. మీరందరూ డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయిందని అనుకుంటున్నారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్. ఈ నెల 13న ఫైనల్స్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతున్నాయి. గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపించుకుందాం. – రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement