-
వడదెబ్బతో నలుగురి మృతి
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్న్యూశాయంపేట : వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధి హజ్ యాత్రకు వెళ్లే వారికి నేడు(సోమవారం) రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ వ్యాక్సినేషన్ క్యాంప్స్ కో–ఆర్డినేటర్లు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, సర్వర్ మోహియొద్దీన్ ఘాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్లో ఉదయం 9 గంటలకు వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధి యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేవాదుల ఇన్టెక్వెల్ వద్ద చోరీ ● సిబ్బందిని బెదిరించి రాగితీగ అపహరణ కన్నాయిగూడెం : మండలంలోని తుపాకులగూడెం పంచాయతీ పరిధిలోని గట్టలగంగారం వద్ద నిర్మించిన దేవాదుల చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో రెండు రోజుల క్రితం దుండగులు.. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాదుల ఎత్తిపోతల వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లోకి దుండగులు చొరబడి కత్తులతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అనంతరం అక్కడ విలువైన సామగ్రి రాగితీగను అపహరించినట్లు తెలిపారు. దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, సమాచారం తెలిపిన వారికి రూ.10వేల బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.వడదెబ్బతో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్లలోని వాటర్ట్యాంక్ బజార్కు చెందిన జమాల్పూరి నాగేందర్(56) వడదెబ్బతో మృతిచెందాడు. కులవృత్తిలో భాగంగా నాగేందర్ గార్ల సమీపంలోని ఓ గ్రామంలో మటన్ కోసేందుకు వెళ్లి మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని నాగేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. అశోక్నగర్లో ఒకరు.. ఖానాపురం : మండలంలోని అశోక్నగర్కు చెందిన భిక్షపతి(40) టెంట్ వేసే పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం టెంట్ వేసేందుకు వెళ్లగా వడదెబ్బకు గురై గ్రామంలో తెలిసిన వారి ఇంటి వద్ద ఆగాడు. అక్కడ కూర్చున్న భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామలో గుర్తుతెలియని వృద్ధుడు.. జనగామ రూరల్: వడదెబ్బతో గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం జనగామ రైల్వేస్టేషన్ వద్ద మృతి చెందాడు. 70 నుంచి 80 సంవత్సరాల వయసు గల వృద్ధుడు రైల్వేస్టేషన్ జ్యూస్ సెంటర్ వద్ద వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఏరియా అస్పత్రికి తరలించి భద్రపర్చారు. ఆకుపచ్చ లుంగీ, తెలుపు నిండు చొక్కా ధరించి తెల్లని గడ్డం కలిగిఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712685260, 8712685032, 8712685202 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు చెప్పారు. రేగొండలో వృద్ధురాలి.. రేగొండ : మండల కేంద్రానికి చెందిన పోడేటి రామక్క(75) వడదెబ్బతో ఆదివారం మృతి చెందింది. ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన బాలుడుబయ్యారం: గంజాయి రవాణా చేస్తూ ఓ బాలుడు ఆదివారం బయ్యారం పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ బాలుడు చింతపండు సంచితో బయ్యారంలోని డీసీసీబీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఈ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై మౌలానా తన సి బ్బందితో కలిసి బాలుడి దగ్గర ఉన్న సంచిలో సో దాలు నిర్వహించగా చింతపండు మధ్యలో గంజా యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకుని 9.560 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.2.94 లక్షల నగదు సీజ్
కాళేశ్వరం : మహారాష్ట్రలోని సిరొంచ నుంచి భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన ఓ వ్యక్తి నగదు తీసుకు వస్తుండగా పోలీసులు కాళేశ్వరం బార్డర్ చెక్పోస్టు వద్ద ఆదివారం తనిఖీ చేసి పట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అంబట్పల్లికి చెందిన బొమ్మ ఆంజనేయులు రూ.2.94లక్షల నగదుతో పట్టుబడ్డాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు నగదును స్వాధీనం చేసి సీజ్ చేశారు. సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై భవానీసేన్, పలుశాఖల అధికారులు ఉన్నారు. -
బీజేపీతోనే మహబూబాబాద్ అభివృద్ధి
డోర్నకల్: బీజేపీ గెలుపుతోనే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి సాధ్యమని, అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించాలని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ జగదీశ్వర్ కిరణ్మయి అన్నారు. డోర్నకల్ మండలం టేకులతండాలో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సీతారాంనాయక్ మాత్రమే ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. ఆయన ఎంపీగా పని చేసిన సమయంలో డోర్నకల్ జంక్షన్ అభివృద్ధ్దితో పాటు పోస్టాఫీస్ భవనం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. సీతారాంనాయక్ను గెలిపిస్తే బయ్యారం చెరువును రిజర్వాయర్గా మారుస్తామని చెప్పారు.బూత్ కన్వీనర్ వినోద్కుమార్ ఆధ్యర్యంలో టేకులతండాలో భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ కన్వీనర్ సతీష్కుమార్, అసెంబ్లీ ప్రభారి బీరప్ప, మండల అధ్యక్షుడు గణేష్నాయక్, మున్సిపాలిటీ అధ్యక్షులు దేవానాయక్, మైనారిటీ నాయకులు రెహమాన్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనసభను విజయవంతం చేయాలి
నర్సంపేట : నర్సంపేటలో సోమవారం నిర్వహించనున్న జనసభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్రావు కోరారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసభకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్దామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 75 సంవత్సరాల చరిత్రలో ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి మూడు వరుసల్లో నిలబెట్టగలిగే ఏకై క నాయకుడు నరేంద్రమోదీ అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్, పట్టణ అధ్యక్షుడు శీలం రాంబాబు, నర్సంపేట ఇన్చార్జ్ గుడిపూడి రాధాకృష్ణ, కౌన్సిలర్లు జుర్రు రాజు, బోడ గోల్యానాయక్, కవితవీరన్న, ఎస్సీ మోర్చా జిల్లా కో కన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నె జగన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, గూడూరు సందీప్, నల్లబెల్లి మండల ఇన్చార్జ్ వినయ్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. రైతుల అవస్థలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిశాయి. దీంతో రైతులు ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకోవడానికి అవస్థలు పడ్డారు. కాగా ధాన్యం రాశుల చుట్టూ వర్షపునీరు చేరి నిలిచింది. వ్యవసాయ మార్కెట్లో సైతం రైతులు ఇబ్బందులు పడ్డారు. కూలిన విద్యుత్స్తంభం డోర్నకల్: పెను గాలులు వీయడంతో డోర్నకల్ మండలంలోని శాంతినగర్ మీదుగా బుద్దారం వెళ్లే మార్గంలో ఆదివారం విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా కూలింది. ఈక్రమంలో విద్యుత్ తీగలు సమీపంలోని వేప చెట్టుపై పడటంతో రోడ్డుపై కూలింది. అలాగే మున్సిపల్ కార్యాలయం వీధిలో వార్డు కౌన్సిలర్ బోడ అమల ఇంటి ఎదుట చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. బయ్యారంలో గాలివాన.. బయ్యారం:మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివానతో పలు చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. బయ్యారం, రంగాపురం, జగ్గుతండా, చర్లపల్లి, కట్టుగూడెం, ఇర్సులాపురం తదితర గ్రామాల్లో గాలివాన వల్ల చెట్లు కూలిపోయాయి. బయ్యారం–ఇర్సులాపురం రహదారిపై కట్టుగూడెం వద్ద చెట్టు రహదారిపై పడిపోవటంతో రాకపోకలు స్తంభించాయి. కూలిన ఎదరభాగం గోడ.. గార్ల: ఆదివారం ఈదులు గాలులకు రైల్వేస్టేషన్ భవనం ఎదర భాగం గోడ కూలిపోయింది. రైల్వే మూడో లైన్ మరమ్మతుల దృష్ట్యా ఈనెల 10వ తేదీ వరకు రైళ్ల రద్దుతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వేస్టేషన్ నేమ్ బోర్డు గోడ పూర్తిగా కూలిపోగా రేకులు లేచిపోయాయి.నిజాం కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనం నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని గార్ల పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్కు నూతన భవనం నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాళ్లవాన చిన్నగూడూరు/మరిపెడ రూరల్: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే మరిపెడ మండలం నీలికుర్తి గ్రామం శివారు రైతు వేదిక వద్ద తాటి చెట్టుపై ఆదివారం పిడుగు పడింది. కేసముద్రం మార్కెట్లో.. కేసముద్రం: అకాల వర్షంతో ఆదివారం సాయంత్రం వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆగమాగమయ్యారు. అదే విధంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో ధాన్యం స్వల్పంగా తడిసింది. ౖరెతుల ఇబ్బందులు..కురవి/దంతాలపల్లి/నర్సింహులపేట: కురవి, సీరోలు మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాగే దంతాలపల్లి మండంలోని కుమ్మరికుంట్ల, రామానుజపురం, పెద్దముప్పారం, గున్నెపల్లి మోస్తరు వర్షం కురిసింది. అదేవిధంగా నర్సింహులపేటలో అకాల వర్షం కురిసి ధాన్యం తడిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement