జనసభను విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

జనసభను విజయవంతం చేయాలి

Published Mon, May 6 2024 5:05 AM

జనసభను విజయవంతం చేయాలి

నర్సంపేట : నర్సంపేటలో సోమవారం నిర్వహించనున్న జనసభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు కోరారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసభకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌దామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 75 సంవత్సరాల చరిత్రలో ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి మూడు వరుసల్లో నిలబెట్టగలిగే ఏకై క నాయకుడు నరేంద్రమోదీ అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్‌, పట్టణ అధ్యక్షుడు శీలం రాంబాబు, నర్సంపేట ఇన్‌చార్జ్‌ గుడిపూడి రాధాకృష్ణ, కౌన్సిలర్లు జుర్రు రాజు, బోడ గోల్యానాయక్‌, కవితవీరన్న, ఎస్సీ మోర్చా జిల్లా కో కన్వీనర్‌ కూనమల్ల పృథ్వీరాజ్‌, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నె జగన్‌, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, గూడూరు సందీప్‌, నల్లబెల్లి మండల ఇన్‌చార్జ్‌ వినయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement