-
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నెక్కొండ : నిద్రమత్తులో బిల్డింగ్ మెట్లు దిగుతూ..ప్రమాదవశాత్తు పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండలోని వరంగల్ రోడ్డులో గల అశ్విని బిర్యానీ పాయింట్లో చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన దాసరి కుమార్(34) వేయిటర్గా పని చేస్తున్నాడు. కాగా రాత్రి వరకు పని ఉండడంతో ఇంటికి వెళ్లకుండా అక్కడే డాబాపై నిద్రిస్తున్నాడు. శనివారం రాత్రి యజమాని సైతం బిర్యాని పాయింట్ను మూసేసి ఇంటికి వెళ్లారు. కాగా రాత్రి సమయంలో కుమార్ మూత్రవిసర్జన కోసం డాబా నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడగా షెటర్, గేటు తగిలింది. దీంతో కుమార్ తలకు, ముఖం ముందు భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదివారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు. -
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కో ర్సుల 2వ, ఆరో సెమిస్టర్ల ప రీక్షలు ఈనెల 6 నుంచి, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్సూపరింటెండెంట్లను నియమించారు. ఓక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 123 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 1,71,115 మంది విద్యార్థులు -
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
న్యూశాయంపేట : వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధి హజ్ యాత్రకు వెళ్లే వారికి నేడు(సోమవారం) రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ వ్యాక్సినేషన్ క్యాంప్స్ కో–ఆర్డినేటర్లు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, సర్వర్ మోహియొద్దీన్ ఘాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్లో ఉదయం 9 గంటలకు వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధి యాత్రీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
హసన్పర్తి: బైక్ అదుపు తప్పిన ఘటనలో పంచాయతీ కార్యదర్శి (పీఎస్) మృతిచెందాడు. ఈ ఘటన ఉనికిచర్ల–వడ్డేపల్లి మార్గమధ్యలోని సుబ్బయ్యపల్లి సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలానికి చెందిన నాగపురి మహేష్(45) ధర్మసాగర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గోపాలపురంలోని విష్ణుపురి కాలనీలో ఉంటూ రోజూ ధర్మసాగర్కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ధర్మసాగర్ వెళ్లి సాయంత్రం బైక్పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలోని సుబ్బయ్యపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో మహేష్ అక్కడక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఎంజీఎం : వైద్యులు నూతన చికిత్స విధానాలను తెలుసుకొని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సంధ్య ఆన్నారు. ఆదివారం ఐఎంఏ హాల్లో ఐఎంఏ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ‘గుండె వ్యాధులు–నూతన చికిత్స విధానాలు’ అనే ఆంశంపై కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) కార్యక్రమం నిర్వహించినట్లు ఆ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎస్.సంధ్య హాజరై మాట్లాడారు. ఇలాంటి సీపీడీ కార్యక్రమాలు యువ వైద్యులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు చాలా అవసరమన్నారు. అనంతరం పలువురు ప్రముఖ గుండె వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య చికిత్స విధానాలను వైద్యులకు బోధించారు. ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్రెడ్డి, హరి సంధ్యరాణి, ఐఎంఏ వరంగల్ కార్యదర్శి బింగి శ్రీనివాస్, కోశాధికారి దిడ్డి శ్రావణ్కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, రామకృష్ణ, సీనియర్ వైద్యులు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement