మెరుగైన వైద్యసేవలు అందించాలి | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలు అందించాలి

Published Mon, May 6 2024 3:35 AM

మెరుగైన వైద్యసేవలు అందించాలి

ఎంజీఎం : వైద్యులు నూతన చికిత్స విధానాలను తెలుసుకొని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సంధ్య ఆన్నారు. ఆదివారం ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో ‘గుండె వ్యాధులు–నూతన చికిత్స విధానాలు’ అనే ఆంశంపై కంటిన్యూయింగ్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ (సీపీడీ) కార్యక్రమం నిర్వహించినట్లు ఆ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ అన్వర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్‌ ఎస్‌.సంధ్య హాజరై మాట్లాడారు. ఇలాంటి సీపీడీ కార్యక్రమాలు యువ వైద్యులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు చాలా అవసరమన్నారు. అనంతరం పలువురు ప్రముఖ గుండె వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య చికిత్స విధానాలను వైద్యులకు బోధించారు. ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌రెడ్డి, హరి సంధ్యరాణి, ఐఎంఏ వరంగల్‌ కార్యదర్శి బింగి శ్రీనివాస్‌, కోశాధికారి దిడ్డి శ్రావణ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, రామకృష్ణ, సీనియర్‌ వైద్యులు, పీజీ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు, ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement