-
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చెయ్.. రాజీనామా ఇస్తా..!
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ చేశారు. రేవంత్రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.వారిది ఢిల్లీకి గులాంగిరీ!రేవంత్రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు.కేసీఆర్ యాత్రను చూసి వణుకుకేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం. -
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి, సిద్దిపేట/ కుత్బుల్లాపూర్: దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసి కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మరోసారి ఆరోపించారు. తాను పది రోజులుగా ఈ విషయంపై మాట్లాడుతున్నందుకు ఢిల్లీ పోలీసులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులకు తాను భయపడబోనన్నారు. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి తనకు ఉందని, ఇకపై బీజేపీ ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. గురువారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జనజాతర సభ’, సిద్దిపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్, మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్లో రోడ్ షోలలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెల్లదొరల కాలం 1881 నుంచీ ప్రతీ పదేళ్లకో సారి దేశ జనాభాను లెక్కించారు. 2021 వరకు కొనసాగింది. కానీ బీజేపీ జనాభా లెక్కలను పక్కనపెట్టింది. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు రిజ ర్వేషన్లు పెంచుతామని చెబుతోంటే.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా గణన చేపట్టలేదు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారు. ఆ మార్పును దేశంలోని 15 రాష్ట్రాలు ఆమోదించాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు. బీజేపీకి ఓటు వేస్తే, అది రిజర్వేషన్లపై పోటు పొడవబోతోంది. తిరగబడి కొట్లాడుతా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసి రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్న విషయంపై పది రోజులుగా నేను మాట్లాడుతుంటే.. ఢిల్లీ పోలీసులతో నాపై కేసు పెట్టించారు. నాపై గత పదేళ్లలో 200 కేసులు పెట్టారు. చంచల్గూడ జైలుకు పంపారు. అలాంటి అక్రమ కేసులకు భయపడబోం. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి మాకు ఉంది. ఇకపై బీజేపీ ఆటలు సాగవు. తిరగబడి కొట్లాడుతా. తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కేంద్రాన్ని కోరితే గాడిద గుడ్డు ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేశారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. గత డిసెంబర్లో కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు. మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మోదీకి బాయ్ బాయ్ చెప్పాలి. ఆదిలాబాద్ను ఎవరూ పట్టించుకోలేదు గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆదిలాబాద్ను పట్టించుకోలేదు. 1.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత, కుమురంభీం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. సోయం బాపురావును ఎంపీగా గెలిపిస్తే.. ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. కాంగ్రెస్ది పేదల ప్రభుత్వం. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశాం. పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ పాలనను ప్రజలు బండకేసి కొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గతంలో కేసీఆర్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి వ్యాపారం చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇంటిని సిద్ధం చేస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థులు ఆత్రం సుగుణ, నీలం మధు, సునీతా మహేందర్రెడ్డిలను లక్ష ఓట్లకుపైగా మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఆసిఫాబాద్ సభలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్.. సిద్దిపేట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. కుత్బుల్లాపూర్ రోడ్ షోలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మామా అల్లుళ్ల నుంచి సిద్దిపేటకు విముక్తి ‘‘మెదక్లో దొరల గడీలను బద్దలుకొడతాం. మామ కేసీఆర్, అల్లుడు హరీశ్రావు సిద్దిపేటను 45 ఏళ్లుగా పాపాల భైరవుల్లా పట్టిపీడిస్తున్నారు. వారి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకే వచ్చా. హరీశ్రావు రాజీనామా లేఖ రాసిపెట్టుకో.. ఆగస్టు 15లోగా పక్కాగా రుణమాఫీ చేస్తాం.. సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను తెస్తా. ఇక్కడ లక్ష మంది రైతులతో సభ ఏర్పాటు చేస్తా. ఆగస్టు 15న సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోంది. ఈసారి ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అక్రమంగా ఫాంహౌస్లు కట్టుకున్నోళ్లు కావాలా? మంచి చేసేవాళ్లు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే ఉమ్మడి మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుంది. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసులతో కేసులు పెట్టించే పరిస్థితి వస్తుంది. కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో, కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగే. కరీంనగర్కు చెందిన వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్ధిగా నిలబెట్టారు.’’ -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ది నయవంచన: రఘునందన్రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
ముహూర్త బలం
● నేటి నుంచి నామినేషన్లు ● మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లుసాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్ కలెక్టరేట్లో, జహీరాబాద్ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. సమాయత్తమవుతున్నారు.. అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్ గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు. నామినేషన్ల ప్రారంభం 18న దాఖలుకు చివరి తేదీ 25 పరిశీలన 26 ఉపసంహరణ 29 పోలింగ్ మే 13కౌంటింగ్ జూన్ 4ముఖ్యనేతల రాక ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement