-
బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకుందాం
ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: బాపట్లను బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. పౌర సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఎకో హౌసెస్ ఏర్పాటు చేసిన వేదికలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యుర్థులు పాల్గొన్నారు. ఈ వేదికలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ చరిత్ర కలిగిన బాపట్లను.. టెంపుల్ టౌన్గా అభివృద్ధి చేయటంతో పాటు పర్యాటక కేంద్రంగా మారుస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర స్థాయిలో బాపట్లను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేశామని కోన చెప్పారు. మరో ఐదేళ్లలో రూ.75 కోట్లతో బాపట్ల పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మరాజు, అభ్యుర్థులు వేద శ్రీనివాసరావు, జి.రాజారావు పాల్గొని, తమ పార్టీ అజెండాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సమాఖ్య సభ్యులు డాక్టరు పి.విజయ్కుమార్, డాక్టరు పి.సి.సాయిబాబు, డాక్టరు పి.ఆశా మాధవి, జి.రమాదేవి, జీవి పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు
చెరుకుపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమం చూసి వైఎస్సార్ సీపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయని ఎమ్యేల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. నిజాంపట్నం మండలం కళ్లిఫలం గ్రామంలో టీడీపీకి చెందిన గౌడ సంఘీయులు 30 కుటుంబాల వారు ఆ గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు బెల్లంకొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీని వీడి గుళ్లపల్లిలోని ఈవూరి గణేష్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి డాక్టర్ గణేష్ పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. బెల్లంకొండ వెంకటనారాయణ, సాంబయ్య, వెంకటస్వామి, శ్రీనివాసరావు, మణిఖంఠ, నాగలక్ష్మీ, నాగరాజు, శ్రీనివాసరావు, కాటూరి మునేశ్వరరావు, రాజమ్మ, మంగమ్మ, వెంకటేశ్వరమ్మ, పరిశా ప్రసాద్, బొలగాని వెంకయ్య, నాగేంద్రం, వెంకట రమణ, తదితరులు పార్టీలో చేరి వారిలో ఉన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్తూ..
కారు ఢీకొట్టిన లారీ.. ఆరుగురికి తీవ్రగాయాలు అద్దంకి: కారును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని శాంతినగర్ సమీపంలో ఆదివారం జరిగింది. అందిన వివరాల మేరకు.. సంతమాగులూరు మండలంలోని వెల్లల చెరువు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (బాబు) పంతులు ఆయన కుమార్తె విష్ణు, అక్క గోపు పద్మ, కేసరి శ్రీనివాస్రెడ్డి కారులో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అద్దంకి వస్తున్నారు. శాంతినగర్ సమీపంలో హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులోని ఆరుగురికి తీవ్ర గాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. -
ఎన్నికల సమరంలో పేదలు జగన్ వైపు నిలవాలి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఇశ్రాయేల్ పిలుపు పర్చూరు (చినగంజాం): పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో పేదలు సీఎం జగన్మోహన్రెడ్డి వైపు నిలవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఇశ్రాయేల్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఇడుపులపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ఐదేళ్లలో దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందించి, వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. దళితులు బాగుపడటం చంద్రబాబుకి ఇష్టం లేదని విమర్శించారు. కూటమి సభ్యుల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పర్చూరు అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీని, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దుడ్డు శేషగిరి, నూతలపాటి బలరాం, పిల్లి సుందరరావు, జొన్నలగడ్డ ఇజ్రాయేల్, మూట్లూరి కృపారావు, కంభంపాటి కోటి తదితరులు పాల్గొన్నారు. -
నవరత్నాలు నిజం..సూపర్ సిక్స్ అబద్ధం
చీరాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ చీరాల టౌన్: వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో నిజమని.. సూపర్సిక్స్ మేనిఫెస్టో పచ్చి అబద్ధమని చీరాల అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణ వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపాలిటీ 20వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ శిఖాకొల్లి రామసుబ్బులు ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కృషి చేసిన ఏకై క సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో.. స్థానిక సంస్థల్లో మహిళలకే పెద్దపీట వేశారని చెప్పారు. ప్రతి పథకం మహిళల పేరు మీదే అందించిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. అలాంటి నవరత్నాలు కొనసాగింపుగా ప్రస్తుత మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. కానీ, కూటమి కిచిడి పార్టీలు మేనిఫెస్టోను కాపీ కొట్టి.. అలివికాని హామీలు ప్రకటించినట్లు చెప్పారు. అవి సూపర్ సిక్స్ పథకాలు కావు.. పచ్చి మోసం చేసే పథకాలు అని కరణం వెంకటేష్ ఎద్దేవా చేశారు. చీరాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాదేనన్నారు. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కల్లగుంట అంజమ్మ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, రాష్ట్ర సేవ దళ్ సెక్రటరీ గోలి గంగాధర్, సలగల అమృతరావు, షేక్ మస్తాన్, అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, చిన్ని లీలధర్, పేరకం లక్ష్మీనారాయణ, అర్వపల్లి లీల, మద్దలా మురళి, పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement