-
No Headline
నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనికి బాధ్యులుగా పరిగణిస్తూ కలెక్టర్ ఎల్.శివశంకర్ను బదిలీ, ఎస్పీ జి.బిందుమాధవ్ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతలు అదుపుతప్పడంపై విచారణకు ఆదేశించింది. కలెక్టర్ శివశంకర్ రెండేళ్ల నుంచి జిల్లాలో పని చేస్తుండగా ఎన్నికలకు ముందే ఈసీ నియమించిన బిందుమాధవ్ అప్పుడే సస్పెండ్ కావటం గమనార్హం. ఎన్నికల ముందు వరకు సమర్థంగా జిల్లాను నడిపించిన ఎస్పీ వై.రవిశంకర్రెడ్డిని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఈసీ తప్పించింది. బిందుమాధవ్ను ఎస్పీగా నియమించింది. పోలింగ్ రోజున మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నిలువరించలేకపోవటం, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు చేసిన ఫోన్లకు కలెక్టర్, ఎస్పీ స్పందించలేదనే విమర్శలు ఈసీ వరకు వెళ్లాయి. దీంతో చర్యలకు ఉపక్రమించింది. అధికారయంత్రాంగం పూర్తిగా విఫలం పల్నాడు జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేయటంపై ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ పలుమార్లు కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసినా స్పందించలేదు. టీడీపీ నాయకులపై ఉదారంగా వ్యవహరించటంతో వారు రెచ్చిపోయి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నరసరావుపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, అతని అనుయాయులు దాడిచేసి బయటకు లాగి కొట్టినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే డ్రైవర్ను టీడీపీ నేతలు చితక బాదారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని మధ్యాహ్నం రెండు గంటలకే హౌస్ అరెస్టుచేసిన పోలీసులు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడలు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడినా చోద్యం చూస్తూ ఉండిపోయారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు మరీ విచ్రితంగా వ్యవహరించారు. సమస్యాత్మకంగా లేకపోయినా వైఎస్సార్ సీపీ సానుకూల గ్రామాలకు రెంటికి ప్రత్యేకంగా డీఎస్పీని నియమించి పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక మండలంగా పేరుగాంచిన కారెంపూడి మండలంలో సరైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఏడెనిమిది గ్రామాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు పోలీసులపై వెల్లువెత్తాయి. ఎన్నికల మరుసటిరోజు గొడ్డళ్లు, రాడ్లు, మారణాయుధాలతో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పచ్చమూకలు కారెంపూడికి వచ్చి వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు నిలువరించలేకపోయారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యపై దాడినీ పోలీసులు ఆపలేకపోయారు. మంత్రి అంబటి రాంబాబుకు ఒక సీఐ రివాల్వర్ గురిపెట్టాడంటే ఆ ధైర్యం అతనికి ఎస్పీ నుంచే వచ్చిందనే వాదన వినపడుతోంది. గురజాలలోని కొత్తగణేశునిపాడులో బీసీ వర్గాలను పలుకరించేందుకు వెళ్లిన పి.అనిల్, కాసు మహేష్రెడ్డిలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడడం కూడా పోలీసుల ఉదాసీనతకు నిదర్శనంగా ఉంది. ఎన్నికల ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో వీటిన్నింటికీ కలెక్టర్, ఎస్పీలే బాధ్యులని నిర్ణయానికొచ్చిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వీరితోపాటు గురజాల డీఎస్పీ పల్లపురాజు, నరసరావుపేట డీఎస్పీ వర్మ, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ సీఐలు, కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్ఐలపైనా ఈసీ వేటు వేసింది. -
రగిలిన పాత పగ
బాపట్ల టౌన్: యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి బాపట్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఈగల్ బార్ సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్న ప్రశాంత్ (28)ను నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టి వారి వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి చంపారు. మహీధర్ను హత్య చేసిన ప్రశాంత్ మృతుడు ప్రశాంత్ అలియాస్ మారి నెల్లూరులోని పెన్నా నది సమీపంలో వైకుంఠపురంలో కార్ డ్రైవర్గా జీవనం సాగిస్తుంటాడు. మృతుడికి సత్యనారాయణపురానికి చెందిన మహీధర్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను కూడా కార్ డ్రైవర్గానే జీవనం సాగించేవాడు. ఇద్దరూ గత ఏడాది వినాయకుని నిమజ్జనం సమయంలో గొడవపడ్డారు. అప్పట్లో పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అయినప్పటికీ కోపం తగ్గని ప్రశాంత్ మహీధర్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. గత ఏడాది అక్టోబర్ 18న రాత్రి నెల్లూరులోని సత్యనారాయణపురం జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో ప్రశాంత్ అలియాస్ మారి, మహీధర్, రామ్చరణ్లు కలిసి మద్యం తాగారు. దాని మత్తులో ఉన్న మహీధర్ను ప్రశాంత్, రామ్చరణ్లు వారి వెంట తెచ్చుకున్న కత్తులతో పొట్టలోని పేగులు బయటకు వచ్చేలా పొడిచారు. దీంతో మహీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకేసులో జైలుకెళ్లిన ప్రశాంత్ బెయిల్పై బయటకు వచ్చినప్పటి నుంచి మహీధర్ బాబాయి కృష్ణారెడ్డి అతడ్ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. పథకం ప్రకారమే ప్రశాంత్ హత్య బెయిల్పై బయటకు వచ్చిన ప్రశాంత్ అలియాస్ మారి... మహీధర్ బాబాయి కృష్ణారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలుసుకొని అతన్ని కూడా హతమార్చేందుకు పలు సందర్భాల్లో ప్రయత్నించాడు. దీన్ని మనస్సులో పెట్టుకున్న కృష్ణారెడ్డి, ప్రశాంత్ స్నేహితుడిని ఇన్ఫార్మర్గా పెట్టుకున్నాడు. బుధవారం ప్రశాంత్ తండ్రిని కలిసేందుకు బాపట్ల వచ్చాడు. విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి ప్రశాంత్ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడించి బాపట్లకు మరికొందరితో కలసి చేరుకున్నాడు. పట్టణంలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో రోడ్డుపై ఉన్నట్లుగా సమాచారం తెలుసుకొని కారుతో ఢీకొట్టి, వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పట్టణ సీఐ యు. శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులు బాపట్ల నడిబోడ్డున జరిగిన యువకుడి దారుణహత్య సంచలనం సృష్టించింది. హత్యకు పాల్పడిన వ్యక్తులు అనంతరం అదే కారులో చీరాల వైపు వెళ్తూ మార్గంమధ్యంలో వెదుళ్లపల్లి సమీపంలో కారు నిలుపుదల చేసి పంట పొలాల్లోకి పారిపోయారు. రక్తపు మరకలతో పొలాల్లోకి పారిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హంతకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాపట్లలో యువకుడి దారుణ హత్య మృతుడు నెల్లూరుకు చెందిన ప్రశాంత్గా గుర్తింపు పథకం ప్రకారమే హత్య చేసిన దుండగులు గతేడాది అక్టోబర్లో మహీధర్ను హత్య చేసిన ప్రశాంత్ ప్రతికారంతో ప్రశాంత్ను హత్యచేసిన మహీధర్ బాబాయి కృష్ణారెడ్డి -
డెంగీపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్వో విజయమ్మ బాపట్ల: డెంగీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ సూచించారు. జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరు విజయమ్మ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. దోమల్ని అరికట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటిస్తూ, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డిస్పోజబుల గ్లాసులను దూరంగా వేయాలని సూచించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ బ్రహ్మానందం, మరియమ్మ పాల్గొన్నారు. -
No Headline
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లావ్యాప్తంగా ఈ నెల 13న ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు ఓటుహక్కును అధికంగా ఉపయోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే ఓట్లు అధికంగా నమోదయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. పోలింగ్ సందర్భంగా మహిళల్లో చైతన్యం కనిపించింది. ఓటు వేయాలన్న ఉత్సాహం వారిలో వ్యక్తమైంది. దీంతో అన్ని పనులు వదలిపెట్టి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు అధికంగా నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 12,91,716 ఓట్లు ఉండగా 16,767 పోస్టల్ బాలెట్లతో కలిపి 11,16,750 ఓట్లు (86.45 శాతం) పోలయ్యాయి. ఇందులో 5,38,553 పురుషులు ఓట్లు కాగా 5,61,389 మహిళా ఓట్లు ఉన్నాయి. పురుషులతో పోలిస్తే జిల్లావ్యాప్తంగా 22,836 మహిళల ఓట్లు అధికంగా పోల్ కావడం గమనార్హం. పర్చూరు అత్యధికం అత్యధికంగా పర్చూరు నియోజకవర్గంలో 4213 మహిళా ఓట్లు అధికంగా పోల్ అయ్యాయి. బాపట్లలో 3981, అద్దంకిలో 3936, చీరాలలో 3905, వేమూరులో 3844, రేపల్లెలో 2957 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. బాపట్లతో పాటు వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే విధంగా నమోదయ్యాయి.మహిళల ఓట్లు అధికంగా నమోదు కావడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమని విష్లేకులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్. జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు మహిళల పేరున అందజేసింది. వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేసింది. ఇవన్నీ మరువని మహిళలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారని, దీంతో గెలుపు తమదేనని అధికారపార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఓటర్లదే ఆధిపత్యం గత ఎన్నికలతో పోలిస్తే అర్బన్ పోల్ పర్సెంటేజీ కొంత పెరిగినా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా నమోదైంది. ఉదాహరణకు జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలో 73.92 శాతం పోలింగ్ నమోదు కాగా బాపట్ల రూరల్ మండలంలో 87.44శాతం, కర్లపాలెం మండలంలో 87. 60 శాతం, పిట్టలవానిపాలెం మండలంలో 85. 65 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో 12 నుంచి15 శాతం వరకు అధికంగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక జిల్లాలో అన్ని పట్టణాల పరిధిలో కంటే గ్రామీణ ప్రాంతాల పోలింగ్ సగటున 15 శాతానికి పైనే నమోదైంది. ఇది అధికారపా ర్టీకి మరింతగా కలిసిరానుంది. ఈ ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేేయడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పెరిగిన గ్రామీణ మహిళల ఓటింగ్ జిల్లావ్యాప్తంగా ఇదే పోలింగ్ సరళి పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో 15 శాతం పెరిగిన పోలింగ్ జిల్లాలో పురుషుల కంటే 22,835 మహిళలు అధికం అధికార పార్టీకి అనుకూలంగా మహిళల ఓటింగ్ గెలుపు తమదేనంటున్న వైఎస్సార్ సీపీ శ్రేణులుజిల్లాలో మహిళా ఓటింగ్ సరళి నియోజకవర్గం పురుషులు, సీ్త్రలు, మెజార్టీ సీ్త్రల ఓట్లు వేమూరు 83,404 87,248 3,844 రేపల్లె 92385 95342 2957 బాపట్ల 77251 81232 3981 పర్చూరు 98025 102238 4213 అద్దంకి 105 718 109 654 3936 చీరాల 81770 85675 3905 5,38,553 5,61,389 22836 -
వైఎస్సార్ సీపీకే ఓటర్ల మొగ్గు
చీరాల: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల్లో ఆఖరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు కోసం పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఓటర్లు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలో నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి విజేతగా నిలుస్తారు ? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.పలువురు వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఢంకా బజాయించి చెబుతున్నారు. అత్యధిక శాతం పోలింగ్ నమోదు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 86.51 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో అభ్యర్థులు వారి వారి అంచనాలు వేసుకుంటూ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన శాతంపై ఆరా తీస్తున్నారు. ఈ ఎన్నికలలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్యనే పోరు నెలకొంది. దీంతో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాయ్ రాజా కాయ్ సార్వత్రిక ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె, వేమూరు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు అలుపెరగని ప్రచారాన్ని చేశారు. గెలుపు తమదంటే తమదే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొంత మంది బెట్టింగ్లను చాపకింద నీరులా గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్తో పాటు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నారు. దానిలో వచ్చిన తర్వాత చిన్న అంశం నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించడం సర్వసాధారణమైంది. వైఎస్సార్ సీపీ నేతల ధీమా అత్యంత కీలకమైన, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కూడా బెట్టింగ్ జరుగుతోంది. పోలింగ్ రోజు వరకు ఒక లెక్క అయితే.. పూర్తయిన తర్వాత మరో లెక్కన ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఒక వైపు గత ఐదేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పూర్తిగా సఫలీకృతమైన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి పక్ష కూటమి అభ్యర్థులు కూడా తామే గెలుస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు వారి వారి అంచనాలతో ముగిపోయారు. ఎన్నికల ముందు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిన వారిపై కూడా చర్చ నడుస్తోంది. పోల్ మేనేజ్మెంట్ ఎంత వరకు సాధ్యపడిందో అంచనాలు వేస్తున్నారు. పోలింగ్ సర ళిని బట్టి నేతల అంచనాలు వార్డు వారీగా పార్టీల నేతలతో అభ్యర్థుల చర్చలు గెలుపు ధీమాలో పార్టీ శ్రేణులు ఫలితాలు కోసం ఉత్కంఠగా ఎదురుచూపులు బాపట్ల జిల్లాలో 86.51 శాతం ఓటింగ్ -
శిక్షణలో నేర్పించే అంశాలు
● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. -
గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్లు
ఎస్పీ వకుల్ జిందాల్బాపట్ల టౌన్: జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు కొనసాగిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ ఎన్నికల రోజు, తర్వాత పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో పలుచోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల్ని పరిరక్షిస్తూ, ప్రజలకు రక్షణగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజలు కూడా సహనంతో మెలగాలని తెలిపారు. పికెట్లలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. -
ఆలయాలకు పెరిగిన ఆదాయం
అధికంగా పలికిన కౌలు వేలం పాటలు జే.పంగులూరు: మండలంలోని పంగులూరు వేణుగోపాలస్వామి దేవస్థాన భూములు, వీరేశ్వరస్వామి, భీమలింగేశ్వరస్వామి వార్ల దేవస్థాన భూములకు ఈవో యు. శ్రీనివాసరావు గురువారం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో కౌలు వేలం పాట నిర్వహించారు. మూడేళ్లకు గానూ జరిగిన పాటలో ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి 14.61 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూమికి సంవత్సరానికి గానూ కౌలు రూ. 93 వేలు వేలు కాగా, ప్రస్తుతం రూ.1.19 లక్షలకు పలికింది. వీరేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 25 ఎకరాలకు గతంలో రూ.2.64 లక్షలుకాగా, ప్రస్తుతం రూ. 4.65 లక్షలు పలికింది. భీమలింగేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 47.28 ఎకరాలకు గతంలో రూ. 6.70 లక్షలు కాగా ప్రస్తుతం రూ.12.51 లక్షలు కౌలు పలికింది. -
స్ట్రాంగ్రూమ్ను పరిశీలించిన కలెక్టర్
నరసరావుపేటరూరల్: కాకాని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్ను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం పరిశీలించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం యంత్రాలను ఇక్కడే స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్రూమ్ వద్ద భద్రతను పరిశీలించి సూచనలు చేశారు. స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. తుళ్లూరు మండలం నెక్కల్లుకు చెందిన ఆర్.కోటి సుధాకర్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారి రమేష్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు బహూకరించారు. కూల్డ్రింక్ షాపు దహనం నరసరావుపేటరూరల్: వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడికి చెందిన కూల్డ్రింక్ షాపును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు మండలంలోని పాలపాడుకు చెందిన పచ్చి సురేష్ పాలపాడు రోడ్డులో కూల్డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయింది. దుకాణంలోని రెండు ఫ్రిజ్లతోపాటు సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూరల్ ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. దోమల నివారణ , నియంత్రణ అందరి బాధ్యత పల్నాడు డీఎంహెచ్వో డాక్టర్ రవి నరసరావుపేట: దోమల నివారణ, నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పల్నాడు రోడ్డులోని జిల్లా కార్యాలయ ఆవరణలో ఆశాలు, ఏఎన్ఎంలతో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చేసుకోవటం ద్వారా చికెన్గున్యా, డెంగీ, మలేరియా, పైలేరియా, మెదడువాపు లాంటి జబ్బులను నివారించవచ్చన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుతూ పొడవాటి దుస్తులు ధరించటం, మస్కిటో రెఫెల్లెంట్లు వాడటం ద్వారా దోమలను నివారించవచ్చు అన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చిన్న దోమ–పెనుప్రమాదం, దోమ పుట్టరాదు–కుట్టరాదు, దోమతెరలు వాడండి–దోమకాటును నివారించండి, చేయి చేయి కలుపుదాం–డెంగీ వ్యాధిని నివారిద్దాం, నీటి తెట్లపై మూత–దోమల పెరుగుదలకు కోత అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ కొనసాగారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రత్నాకరం రాము, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాల, కళాశాలల బస్సుల ఫిట్నెస్ గడువు ఈనెల 15తో ముగిసిందని, రెన్యూవల్ చేయించుకోవాలని డీటీసీ షేక్ కరీమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500లకుపైగా విద్యా సంస్థల బస్సులు కచ్చితంగా 32 నిబంధనలు పాటిస్తూ ఫిట్నెస్ కలిగి ఉండాలని వెల్లడించారు. పాఠశాల బస్సు డ్రైవర్ 60 సంవత్సరాల వయో పరిమితి దాటిన వ్యక్తి అయితే అనర్హుడని పేర్కొన్నారు. డ్రైవర్ ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆ రికార్డులు భద్రపరచాలని వివరించారు. డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తెలియజేయడంతోపాటు, ఐదేళ్ల అనుభవం, హెవీడ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతినెలా వాహనానికి సంబంధించి స్థితిగతులను నమోదు చేయాలని తెలిపారు. బస్సులో అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భద్రపరుచుకునే బాక్స్లు తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వాహనాలను సరైన కండీషన్లో ఉంచుకుని రూల్ 185 (జీ) నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పకూడదని స్పష్టం చేశారు. అలా తిరిగే వాహనాలు సీజ్ చేయడంతోపాటు, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీటీసీ షేక్ కరీమ్ -
రెండు వర్గాల ఘర్షణ.. 11 మంది అరెస్టు
గుంటూరు ఈస్ట్: రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం నగరంపాలెం పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేవీపీకాలనీలో పాత కక్షల నేపథ్యంలో మంగళవారం పరస్పర దాడి చేసుకున్నారు. ఘర్షణలో షేక్ మునాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు బండారు ప్రభు, కారసాల కోటేశ్వరరావు, బత్తుల అశోక్, మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిడుముక్కల సర్పంచ్పై దాడి చేసిన 11 మందిపై అట్రాసిటీ కేసు తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కల సర్పంచ్ మాదాసు రత్నకుమారిని కులం పేరుతో దూషించి ఆమె, ఆమె సామాజిక వర్గంపై దాడిచేసిన ఘటనలో టీడీపీ వార్డు మెంబర్ నాగ స్వరూపతోపాటు మరో 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. తనపై దాడి జరిగిందంటూ నాగ స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషియడ్లపాడు: వచ్చే ఏడాది నాటికి క్షయ (టీబీ)వ్యాధి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. అర్జునరావు పిలుపునిచ్చారు. యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని అన్ని వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. అవి సరిపడా ఉన్నాయా లేదా ? అనే విషయాలపై ఆరా తీశారు. అక్కడ నుంచి వంకాయలపాడు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలను కలిసి క్షయ వ్యాధి లక్షణాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీసీజీ వ్యాక్సిన్ ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18–60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు, ఐదేళ్లలో క్షయ వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తుల కుటుంబీకులను బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉన్న, పొగతాగడం అలవాటు గత మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలో 464 మందికి బీసీజీ వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 16వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 2025 నాటికి పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బి గీతాంజలి, యడ్లపాడు పీహెచ్సీ వైద్యాధికారి ఎం ప్రభాకరరావు, డాక్టర్ బి భరద్వాజ, సీహెచ్వో ఎస్ పున్నారావు, సూపర్వైజర్లు వి రాజశేఖర్, బి గంగానమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. -
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు
నరసరావుపేట టౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితురాలికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.ప్రవల్లిక గురువారం తీర్పు చెప్పారు. బరంపేటకు చెందిన గొట్టిపాటి చంద్రమౌళి వద్ద చిలకలూరిపేటకు చెందిన షేక్ నాగూర్బీ 2020 అక్టోబర్ 10వ తేదీన రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి నిందితురాలికి ఏడాది జైలు శిక్షతోపాటు ఫిర్యాదుదారుడికి రూ.7.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. -
చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
చీరాల టౌన్/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్ కేంద్రానికి కొండయ్య యాదవ్ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారు.పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరుకున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అనుచరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యంచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కరణంపై ఆమంచి దాడిచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు
● ముగ్గురు మోసగాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ● కుప్పంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించబోతున్నారు ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి యర్రంవారిపాలెం (కారంచేడు): రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేర ట, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం ఎవరివల్లా కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మండలంలోని యర్రంవారిపాలెం గ్రామానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు మహిళలు, యువతీ యువకులు మళ్లీ జగనన్న పాలనపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ముగ్గురు మోసగాళ్లు ఏకమయ్యారు : జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేని ముగ్గురు మోసగాళ్లు ఏకమయ్యారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేయలేని చంద్రబాబు, ఆయన మోసాలకు వంత పాడుతున్న పవన్కల్యాణ్, బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు ముగ్గురు మోసగాళ్లను చూసి చీదరించుకుంటున్నారని, వాళ్లమాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో వాళ్లులేరన్నారు. ముస్లింలను మోసం చేసిన కూటమి : గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లు సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని ప్రకటించడం కుల, మతాలను రెచ్చగొట్టే ప్రకటనలు చెయ్యడం వారికే చెల్లిందన్నారు. సమావేశంలో యర్రం లక్ష్మారెడ్డి, ఈవూరి శ్రీనివాసరెడ్డి, భవనం వెంకటేశ్వరరెడ్డి, పోలూరి శివారెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ దండా చౌదరిబాబు, దేవగిరి వెంకటేశ్వరెడ్డి, గోగినేని బుల్లెబ్బాయి, కోట శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీ మేనిఫెస్టో చెల్లని చెక్కులాంటిది
మాజీ మంత్రి రావెల కిషోర్బాబు చీరాల: టీడీపీ కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చెల్లని చెక్కు లాంటిదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చీరాల వచ్చిన ఆయన స్థానిక దళిత సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల బతుకులు బాగుపడాలన్నా, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా వైఎస్సార్సీపీని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో అందరికి సుపరిపాలన అందాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. కూటమితో జతకట్టిన చంద్రబాబు ఓ చెల్లని చెక్కులాంటి అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టోను చూపిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ పథకాలకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చూపించారన్నారు. టీడీపీ మేనిఫెస్టో వల్ల రాష్ట్రం శ్రీలంకలా మారదా అని ప్రశ్నించారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మేదరమెట్ల/అద్దంకి రూరల్: ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అద్దంకిలోని కాకానిపాలెంలోని పోలింగ్ బూత్, కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ మేదరమెట్ల, బొడ్డువానిపాలెం పోలింగ్ స్టేషన్లను కొరిశపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని రావినూతల, పమిడిపాడు పోలింగ్ స్టేషన్లను శనివారం ఎస్పీ పోలీసు సిబ్బందితో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 269 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు రవాణా చేసే సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం 6 నుంచి రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఓటు హక్కును వినియోగించుకునే వారు మాత్రమే ఉండాలన్నారు. ఐదుగురికి మించి కలసి తిరగకూడదని, ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వెంట చీరాల డీఎస్పీ బీ.ప్రసాదరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐలు శివయ్య, చంద్రశేఖర్, పీ.కృష్ణయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బ్రాహ్మణ ద్రోహి చంద్రబాబు రాష్ట్ర దేవదాయ శాఖ సలహాదారుడు శ్రీకాంత్ అద్దంకి రూరల్: బ్రాహ్మణులను రాజకీయ, ఆర్థిక నిట్టనిలువుగా తొక్కిన ద్రోహి చంద్రబాబునాయుడని రాష్ట్ర దేవదాయ శాఖ సలహాదారు జ్వాలాపురపు శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి కరణీకాలను తొలగించి బ్రాహ్మణ జాతిని అణగదొక్కారన్నారు. చంద్రబాబు తమ జాతికి రాజకీయ పరంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవాలయాల్లో అర్చకులకు వంశపారపర్య హక్కులు కల్పించడంతోపాటు రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎన్నో పదవులు, కీలక బాధ్యతలు ఇచ్చారన్నారు. బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం కల్పించిన జగనన్నకు బ్రాహ్మణులంతా అండగా ఉంటారన్నారు. అద్దంకి అసెంబ్లీ అభ్యర్థిగా పానెం చిన హనిమిరెడ్డికి, పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుట్టంరాజు సీతారామయ్య, జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకులు హనుమంతరావు, నాగరాజు పాల్గొన్నారు. -
బంగారు బాపట్లగా తీర్చిదిద్దుకుందాం
బాపట్ల: బంగారు బాపట్లను తీర్చిదిద్దుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల ముగింపు సందర్భంగా శనివారం బాపట్ల పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శన చేపట్టారు. కోన నివాసం నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల కేంద్రంగా జిల్లా ఇవ్వటం ఈప్రాంతాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. బాపట్లకు మెడికల్ కళాశాల తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటు వేయాలంటూ చెప్పిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. పట్టణంలో శాశ్వత మంచినీటి సమస్యను పరిష్కారానకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని, జగన్ మోహన్రెడ్డి పాలన చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి సతీమణి రమాదేవి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, కాగిత సుధీర్బాబు, చేజర్ల నారాయణరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, నర్రావుల వెంకట్రావు తదితరులు ఉన్నారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి -
పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం
చెరుకుపల్లి: రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవాన్ని పెంచి కాపాడి ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి మంచి వ్యక్తిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం సిద్దం కావాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రచారం చివరిరోజు గుళ్ళపల్లి, చెరుకుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ ఈవూరి గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. సుమారు వెయ్యి ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన మెగా రోడ్ షోతో జాతీయ రహదారిపై కిక్కిరిసిపోయి జనజాతరను తలపించింది. ఈ సందర్భంగా సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ గడిచిన 59నెలల్లో జగనన్న పాలనలో ప్రతి గ్రామంలో అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ లంచాలకు తావు లేకుండా నేరుగా ప్రజలకే అందించారన్నారు. అదే తరహాలో పేద ప్రజలకు మరింత మంచి చేయాలని సాధ్యమయ్యే హమీలతో జగనన్న 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచారన్నారు. అనంతరం ఎమ్మేల్యే అభ్యర్ధి డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి జగనన్ మోహన్రెడ్డి పెత్తందార్లతో పోటీ పడుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేదలకు సంక్షేమాన్ని దూరం చేసేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు, జగనన్న సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలంటే అందరు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎమ్మేల్యేగా తనను, ఎంపీగా నందిగాం సురేష్ ను గెలిపించాలని కోరారు. ఎన్నిక రోజు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణలు ఉత్సాహంగా ప్రతి ఒక్కరినీ వదలకుండా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, గాదే మధుసూధన రెడ్డి, ఎంపీపీ మత్తి దివాకర రత్న ప్రసాద్, చెన్ను కోటేశ్వరరావు, ఫారూక్, చీరాల వెంకటేశ్వరరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న ను ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ సిద్దం కావాలి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధం
బాపట్ల: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. పౌరులు స్వేచ్ఛగా ఓటు వేయడం కోసం 120 శాతం పోలింగ్ సిబ్బందిని నియమించామని చెప్పారు. 12న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ యంత్రాలు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపుతామని తెలిపారు. అభ్యర్థులంతా ప్రచారాలను నిలిపి వేయాలని, ముందస్తు అనుమతి తీసుకుంటే ఇంటింటా ప్రచారానికి నలుగురితో కలిసి అభ్యర్థి వెళ్లవచ్చని సూచించారు. హోర్డింగులు, పార్టీ గుర్తులు, కరపత్రాలతో ప్రచారాలు చేయరాదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచురణ, ప్రసారాలు నిషేధమని పేర్కొన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థులు కేంద్రాలకు వెళ్లడానికి మూడు వాహనాలు అనుమతిస్తామని, ఒక్కో వాహనంలో ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.5.30కోట్ల విలువచేసే మద్యం, బంగారం, వెండి ఆభరణాలు, బహుమతులు, ప్రచార సామగ్రిని సీజ్ చేశామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన విలువైన ఓటు హక్కును పౌరులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్ బాషా తెలిపారు. గత ఎన్నికలలో సుమారుగా 86% ఓటింగ్ జరగ్గా, ప్రస్తుతం మరింత పెరగాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం సక్షం యాప్ అమల్లోకి వచ్చిందని, ముందస్తుగా నమోదు చేసుకున్నవారికి వాహనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు సమీపించినందున ఈసీ డ్రైడేగా ప్రకటించడంతో మద్యం విక్రయాలను నిలిపి వేశామని కలెక్టర్ తెలిపారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లౌడు స్పీకర్లపై తొమ్మిది9 కేసులు, అక్రమ మద్యంపై 14కేసులు, మరో 19 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు. పోలింగ్ రోజున బల్క్ ఎస్ఎంఎస్లు పంపినా, ముందస్తు అనుమతి లేకుండా పత్రికలలో ముద్రించడం, టీవీ చానల్స్లో ప్రసారాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 1,030 పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ యంత్రాల్ని ఒంగోలులోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారని వెల్లడించారు. అల్లర్లు జరగకుండా ప్రత్యేక చర్యలు –ఎస్పీ వకుల్ జిందాల్ రానున్న 48 గంటలలో జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాలోని పోలీస్ బలగాలే గాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి 250 మంది పోలీసులు వచ్చారన్నారు. జిల్లాలో మొత్తం 913 పోలింగ్ ప్రాంతాలలో 1,510 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. 269 ప్రాంతాల్లో 337 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, అక్కడ అదనంగా పోలీసు బందోబస్తు నియమించామని వివరించారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రితో వెళ్లే పోలింగ్ సిబ్బందికి సాయుధ బలగాలు ఎస్కార్ట్గా వెళ్తాయని ఎస్పీ చెప్పారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేంతవరకు అత్యధిక ప్రాధాన్యత కింద ఎస్కార్ట్ ఉంటుందని వెల్లడించారు. పోలింగ్ రోజున పోలీస్ సిబ్బందితోపాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, మాజీ సైనికులు కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్బాషా -
చీరాలలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించాలి
చీరాల: ఎన్నికల్లో ఫ్యాన్గుర్తుపై మీ ఓటుతో చీరాలలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించాలని చీరాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపును ఈపురుపాలెంలో బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు ఇద్దరు అభ్యర్థులకు నీరాజనాలు పలికారు. చేనేతలు అధికంగా ఉండే ఈపురుపాలెంలో వైఎస్సార్ సీపీకి అండగా నిలబడ్డారు. ముందుగా ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజలలో బలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీకి పట్టం కడితే సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు నిరంతరం అందుతాయన్నారు. చీరాల్లో ఎమ్మెల్యేగా కరణం వెంకటేష్ను గెలిపిస్తే మోడల్ చీరాలగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న ఆదరణ చూడలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలను చేస్తున్నాయన్నారు. చీరాలలో జెండా పాతేస్తాం : ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమమే థ్యేయంగా పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారన్నారు. పార్టీలకు అతీతంగా ఐదేళ్లు పథకాలను అమలు చేసి సుపరిపాలన అందించారన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రంలో స్వర్ణయుగ సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న ఆదరణ చూడలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలను చేస్తున్నాయన్నారు. చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేసి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్ను, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, 10వ వార్డు కౌన్సిలర్, క్లస్టర్–2 మహిళా అధ్యక్షురాలు గోలి స్వాతి, గోలి ఆనందరావు, బిట్రా శ్రీనివాసరావు, పాలపర్తి నాగేశ్వరరావు, దామర్ల శ్రీకృష్ణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటేసి గెలిపించండి.మీకు తోడుగా ఉంటా చివరిరోజున ఇంటింటా ప్రచార హోరు పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కరణం వెంకటేష్, నందిగం సురేష్ -
మీ బిడ్డగా అండగా ఉంటా
కారంచేడు: మీ బిడ్డగా నన్ను ఆదరించడండి..మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ అభ్యర్థి యడం బాలాజీ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన కారంచేడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున పెద్ద ఎత్తున రోడ్షో నిర్వహించారు. చీరాల నుంచి కారంచేడుకు చేరుకున్న బాలాజీని స్దానిక నాయకుల ఆధ్వర్యంలో పూలవర్షంతో అంబేడ్కర్ నగర్ కాలనీ వద్ద ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం కారంచేడులో ఒక గంట మాత్రమే రోడ్షో నిర్వహించాల్సి ఉండగా ఆయన రోడ్షోను పూర్తి చేసుకునే సరికి మూడు గంటల సమయం పట్టింది. అంబేడ్కర్ కాలనీలో పూల వర్షం కురిపించారు. అక్కడ నుంచి ఎస్టీ కాలనీ, పాత మాలపల్లె, మాదిగపల్లె, ముస్లీ కాలనీ, చెరువుకట్ట, ఉప్పరపాలెం, మాస్కో బజారు, పుట్టాయిపాలెం, చినవంతెన సెంటర్, ఎస్బీఐ సెంటర్ మీదగా కాలువ సెంటర్కు చేరుకున్నారు. దారి పొడవునా మహిళలు పూలు చల్లడమే కాకుండా హారతులతో ఘన స్వాగతం పలికారు. కాబోయే ఎమ్మెల్యే బాలాజీ అన్నా.. అంటూ నినాదాలు చేశారు. యువకులు, రైతులు దారి పొడవునా ట్రాక్టర్లతో విన్యాసాలు చేశారు. చర్చిలు, మసీదులు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కారంచేడు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతా : సంపన్నుల గ్రామంగా పేరొందిన కారంచేడు గ్రామంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు అభ్యర్థి యడం బాలాజీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన వెంటనే స్పందించి వచ్చేది మన జగనన్న ప్రభుత్వమేనని, స్థానికంగా నేను కూడా ఎమ్మెల్యే గెలిపొందిన వెంటనే ఈ సమస్యను ప్రభుత్వ పెద్దలతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేద్దామన్నారు. వీటితో పాటు అంతర్గత రహదారులు, రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్లు, డ్రైనేజీలను కూడా నిర్మాణాలు చేపడతామన్నారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, మాజీ వైస్ ఎంపీపీ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జేసీఎస్ మండల కన్వీనర్ యార్లగడ్డ శ్రీకాంత్, యార్లగడ్డ పాపారావు, నూతలపాటి జోనేష్, దుడ్డు మోషే, సుధాకర్, షేక్ మీరయ్య, జాగర్లమూడి సందీప్, జాగర్లమూడి చౌదరిబాబు, జాగర్లమూడి శివరామకృష్ణ, చాగంటి వాసు, పులి గంగారాజు, గర్నెపూడి ప్రసాద్, వెంపరాల సుబ్బారాయుడు, సుధాకర్, సదాశివరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతీ, యువకులు పాల్గొన్నారు. కారంచేడు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతా రోడ్షోలో పర్చూరు అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ -
ఏలూరికి ప్రతికూలతలు
టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు.నియోజకవర్గంలో 15 వేలకు పైగా ఉన్న దొంగ ఓట్ల వల్లే గతంలో గెలుపొందారన్న ప్రచారం ఉంది. ప్రజల ఫిర్యాదులతో ఇటీవలే దాదాపు 14 వేల దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. పెద్దఎత్తున వస్తున్న ఎన్నారై నిధులతో ఏలూరి సాంబశివరావు గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. గుంటూరులో ఎమ్మెల్యేకు చెందిన అగ్రి టెక్ కంపెనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎన్నారై నిధులతో ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాలు జరిగినట్లు ఆధారాలు దొరికాయి. దీంతో ఎమ్మెల్యే ఏలూరితోపాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో దేవరపల్లి దళితుల భూముల్ని ఆక్రమించే ప్రయత్నం చేయడం వివాదంగా మారింది . దీంతో దళితులు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థిపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది. చాలామంది నేతలు, క్యాకర్తలు ఆయన నియంత పోకడల్ని వ్యతిరేకిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు ఇటీవల పార్టీని వీడి అధికారపార్టీలో చేరారు. చాలామంది పార్టీలో ఉన్నా ఈ ఎన్నికల్లో ఏలూరికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. గడిచిన ఐదేళ్లలో వైఎస్. జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతోపాటు దొంగ ఓట్ల తొలగింపు కూడా కలిసి రానుండటంతో ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎడం బాలాజీ గెలుపు ఖాయంగా మారింది. -
పర్చూరులో ఫ్యాన్ జెట్ స్పీడ్
● వైఎస్.జగన్ పాలనపై సానుకూలత ● సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పేదల సంతృప్తి ● వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్న అన్ని వర్గాలు ● గెలుపు బాటలో యడం బాలాజీ ● టీడీపీకి గడ్డు పరిస్థితి ● అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు అసమ్మతి సెగ ● నేతలు, కార్యకర్తల్లో వ్యతిరేకత బాలాజీ అనుకూలతలు అధికార పార్టీ అభ్యర్థి యడం బాలాజీ విజయానికి ఐదేళ్ల వైఎస్. జగన్మోహన్రెడ్డి జనరంజకపాలన దోహద పడనుంది. ఆయన కాపు సామాజికవర్గానికి చెందడం అనుకూలించే అంశం. తక్కువ సమయంలో అటు నేతలు, ఇటు కార్యకర్తల్ని సమన్వయం చేసుకున్నారు. మంచితనం, ప్రజలకు మేలు చేసేగుణం ఆయనకు మరింత అనుకూలత. ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సాయమందించే మనసున్న వ్యక్తిగా పేరుంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులకంటే మెరుగైన నేతగా పేరు పొందారు. నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్తున్నారు. కార్యకర్తలతోపాటు ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తారన్న పేరు పొందారు. ఇక వైఎస్. జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల జనరంజక పాలన అధికారపార్టీ అభ్యర్థికి మరింతగా కలిసి రానుంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుకున్న ఎస్సీలతో పాటు బీసీ, ఓసీ, మైనారిటీ తదితర వర్గాలు ఈ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో పర్చూరులో ఎడం బాలాజీ విజయం నల్లేరుపై నడక కానుంది. పర్చూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా యడం బాలాజీ, టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బరిలో నిలిచారు. వైఎస్.జగన్ మోహన్రెడ్డి ఐదేళ్ల ప్రజారంజక పాలన, బాలాజీ వ్యక్తిత్వం, కలుపుగోలుతనం, నేతలు, కార్యకర్తల్ని తక్కువ సమయంలో సమన్వయం చేసుకోవడం వైఎస్సార్ సీపీకి అనుకూలాంశాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా అధికార పార్టీకే మద్దతు పలుకుతున్నాయి. టీడీపీ అభ్యర్థి ఏలూరిపై నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే కొందరు టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు దూరం కావడం పెద్ద అవరోధంగా మారింది. -
అన్నీ మంచి శకునములే..!
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి.. వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల జనరంజక పాలన తీరు ఇది. అర్హులైన అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు ఉన్నతస్థాయికి చేరారు. ఒకటో తేదీకల్లా పింఛన్ సొమ్ము చేతిలో పడటంతో అవ్వాతాతలు నిశ్చింతంగా ఉన్నారు. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలతో ప్రభుత్వ సేవలు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాయి. సంక్షేమం పేదల దరి చేరింది. అమ్మ ఒడితో పేదింటి బిడ్డలు చదువుల సరస్వతి ఒడిలో అక్షరాలు దిద్దారు. వైఎస్సార్ చేయూతతో మహిళలకు ఆర్థిక స్వావలంబన లభించింది. వైద్యం పల్లెబాట పట్టింది. ఇచ్చిన హామీల్ని నూరు శాతం అమలు చేసి, ఎన్నికల కదన రంగంలో దూకిన జగనన్నకు సామూహికంగా ఓట్లేసి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సన్నద్ధం అయ్యారు. పచ్చ పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించి పర్చూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడం బాలాజీని భారీ మెజార్టీతో గెలిపించనున్నారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల -
ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ దాడి
యద్దనపూడి: ప్రచారం నిమిత్తం వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై పర్చూరు నియోజకవర్గ పరిధిలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడికి తెగబడ్డారు. ఎంపీ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి చెప్పులు విసిరారు. ఎంపీపైనా, వైఎస్సార్సీపీ శ్రేణులపైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం వలపర్ల ఎస్సీ కాలనీలో పర్యటన నిమిత్తం ఎంపీ నందిగం సురేష్ యద్దనపూడి నుంచి ర్యాలీగా మార్టూరు వైపు బయలుదేరారు. సాయంత్రం 3.45 సమయంలో చింతపల్లి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ఎన్నికల ప్రచార ర్యాలీ ఎదురుపడింది. దీంతో ఎంపీ తన వాహనంతో పాటు వెనుక వచ్చే వాహనాలను సైతం పక్కకు ఆపారు. ఎంపీ వాహనాన్ని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సమీపానికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. చెప్పులు తీసి ఎంపీ కారు అద్దాలపై కొడుతూ కారులో ఉన్న ఎంపీని బూతులు తిట్టారు. నీ అంతు చూస్తామంటూ రాయడానికి వీలుపడని పదజాలంతో దూషించారు. టీడీపీ కార్యకర్తలు ఎంపీ కారుపైకిఎక్కి కాళ్లతో కారు పైభాగాన్ని తన్నుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటివరకు సంయమనం పాటించిన ఎంపీ సురేష్ కారు దిగి కారుపై ఉన్న వారిని కిందకు దిగాలని కోరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జెండా కర్రలతో ఆయనపైన, అనుచరులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని పంపించి వేశారు. దాడి నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతపల్లిపాడు నుంచి యనమదల మీదగా యద్దనపూడి పోలీస్స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం సీఐ సీతారామయ్య, ఎస్సై జీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు 15 మంది టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎంపీపై దాడి విషయం తెలుసుకున్న వందలాది మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు స్టేషన్కు చేరుకున్నారు.ఓటమి భయంతోనే దాడులుపోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. ‘ఎన్నికల ప్రచారం కోసం చింతపల్లిపాడు మీదుగా మార్టూరు మండలం వలపర్ల వెళ్తుండగా టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. చింతపల్లిపాడులో టీడీపీ ర్యాలీ జరుగుతుండటతో నా కారును పక్కన పెట్టుకుని ఉండగా.. కొంతమంది టీడీపీ నాయకులు నా కారును మోటార్ సైకిళ్లతో చుట్టుముట్టారు. కాళ్లతో నా కారును ఎగిరెగిరి తన్నటం ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు నా కారును చుట్టుముట్టి నానాబూతులు తిట్టడం మొదలెట్టారు. దీంతో నేను కారు దిగి కారును ఎందుకు గుద్దుతున్నారని ప్రశ్నించగా.. వారిలో ఓ వ్యక్తి సీఎం జగన్ను దూషించటమే కాకుండా వాడు పోటీ చేయించేవాడు, నువ్వు పోటీ చేసేటంత వాడివా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించటం ప్రారంభించాడు. మరో నెల రోజులు ఆగండి. మా అమరావతి పవర్ ఏమిటో చూపిస్తా’మంటూ బూతులు తిట్టారు. వివాదాలు దేనికని భావించి పక్కకు తొలగండని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. దీనిని చూసి అక్కడకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు రావటంతో కొంత వెనక్కి తగ్గారు. నేను ఇంకొల్లు సీఐకి సమాచారమిచ్చాను. ఈలోగా కొందరు మహిళలు నాకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని చెప్పారు. ‘టీడీపీ నాయకులు ఆడవాళ్లు అని కూడా చూడకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై గతంలో కూడా ఎస్సీ కాలనీ వాసులు తమపై రోజురోజుకూ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో టీడీపీ అరాచకాలను ప్రత్యక్షంగా చూశాను. ఇదేవిధంగా ఉంటే మమ్మల్ని ఓట్లు వేయినిస్తారా అని ఎస్సీలు చెప్పటం చూస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ద్వారా మాకు చాలా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు చెబుతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి’ అని ఎంపీ నందిగం వివరించారు. టీడీపీ నాయకులు ఎన్ని అవరోధాలు, అవాంతరాలు స్పష్టించినా 13న జరిగే ఎన్నికల పోలింగ్లో పర్చూరు ఎమ్మెల్యేగా యడం బాలాజీ, ఎంపీగా తాను, సీఎంగా జగన్మోహన్రెడ్డి గెలుపును అపటం ఎవరితరం కాదన్నారు. యడం బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇలా రెచ్చగొట్టేలా దూషించటం, దాడులకు పాల్పడటం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement