ప్రధాన వార్తలు
ఈ నెల 8లోగా రైతు భరోసా... లేకుంటే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 8వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని.. లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని.. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ మధ్య ఫైనల్స్ జరగనున్నాయని.. తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రేవంత్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా మీద రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లారు. ఈరోజు ఆయన రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మేం రైతు భరోసా స్కీంను డిసెంబర్లోనే మొదలుపెట్టాం. రాష్ట్రంలో మొత్తం 69లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం. మిగతా 4 లక్షల మంది ఖాతాల్లో ఈనెల 8వ తేదీలోగా రైతుబంధు తప్పకుండా జమ చేస్తాం.ఏ ఒక్క రైతు ఖాతాలోనైనా రైతుబంధు జమ కాలేదని నిరూపిస్తే.. అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతా. అర్హులందరికీ రైతుబంధు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సిద్ధమా? రాష్ట్రంలో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతలరాయుడిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పని అయిపోయింది. దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవడం కూడా వృథా. మే 13న ఫైనల్స్డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. ప్రజలు బీఆర్ఎస్ను మట్టికరిపించి కాంగ్రెస్ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.హరీశ్ రాజీనామాతో రెడీగా ఉండు.. బీఆర్ఎస్ పాలనలో 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడేళ్లయినా ఇవ్వలే. తునకలుగా ఇస్తే ఆ పైసలు మిత్తికి కూడా చాలలేదు. నేను అలా సోయి లేనోడిని కాదు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తా. హరీశ్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. రైతులకు బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం ఇప్పిస్తా.. సిద్దిపేటకు నీ నుంచి విముక్తి కల్పిస్తా. బీజేపీకి వాత పెట్టాలి రాష్ట్ర విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ట్రిపుల్ ఐటీ, గిరిజన వర్సిటీ.. ఇలా ఏమీ ఇవ్వకుండా గాడిద గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీ ఓటేద్దామా..? లేక కర్రు కాల్చి వాతపెడదామా ప్రజలే చెప్పాలి. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తూనే ఉంది. అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయి. ఎవరిని చెప్పుతో కొట్టాలి? రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్ననే బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం ప్రియాంబుల్ (ప్రవేశిక)ను మార్చేస్తామన్నారు. మరి ఇప్పుడు దుష్యంత్™ కుమార్ను చెప్పుతో కొట్టాలా? అబద్ధాలు చెప్తున్న నేతలను చెప్పుతో కొట్టాలా? ఎవర్ని కొట్టాలో బీజేపీ నేతలే చెప్పాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఆ పార్టీ దేశ ప్రజల నెత్తిపై వేలాడుతున్న కత్తి లాంటిది. పాలమూరు బిడ్డపై కుట్ర.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పాలమూరు బిడ్డను సీఎంగా ఎన్నుకుని 150 రోజులు కాలేదు. అప్పుడే దిగిపొమ్మని అంటున్నారు. ఢిల్లీ నుంచి పడగొడతామని బయలుదేరుతున్నారు. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండని డీకే అరుణమ్మ అంటోంది. నీకు, నాకు గెట్టు పంచాయతీ ఏముంది? ప్రజల దీవెన, సోనియమ్మ ఆశీర్వాదంతో నాకు సీఎం పదవి వచ్చింది. కానీ నన్ను దించేందుకు, ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేసేందుకు అమిత్ షాతో మాట్లాడి స్కెచ్ వేస్తోంది. నేనేం తప్పు చేశా? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్నదని చెప్పిన. ఆ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను లోపలేసి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు.’’ ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రసంగించారు. – బ్రిటీషర్లకు ఎదురు నిలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, తెలంగాణ సీఎంపై బెదిరింపులకు పాల్పడుతున్న ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. – బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి నాలుగు అక్షింతలు చల్లి ఊరుకుందే తప్ప చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎంగా ఏనాడూ ఖమ్మం జిల్లాకు రాని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చి కల్లి»ొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. – రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నవారికి ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్ముంటే యోధుడైన రేవంత్ను టచ్ చేసి చూడాలని ప్రత్యర్థి పారీ్టలకు సవాల్ విసిరారు. – పాలమూరు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్నికలు జరగబోతున్నాయని కొత్తకోట కార్నర్ మీటింగ్లో మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని, ర్మాణరంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడ్డారని విమర్శించారు. సీఎం బీజేపీలో చేరుతారని ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారని, పార్టీ మార్పు విషయమై బీజేపీ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని నిలదేశారు.హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. మోదీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని,8 సీట్లలో బీజేపీ గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదని అన్నారు.‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యం. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి. బీజేపీతో కలిస్తే జోడీ.. లేకుంటే ఈడీ. అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చింద,దిప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారు. కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటర్ కూడా కాలలేదు. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైంది. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి.ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలయ్యిందా?. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. కాంగ్రెస్ మోసం చేయని మనిషి లేడు.రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పట్ల రేవంత్ భాషను ప్రజలు ఆమోదించడం లేదు. యువతకు, భవిష్యత్ తరానికి రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?. కేసీఆర్ చేసినవాటికి వ్యతిరేకంగా చేయడమే రేవంత్ ఉద్దేశం. రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. మొదటి రోజు తప్ప మళ్లి కనిపించలేదు. 3.50 లక్షల దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కరించారో చెప్పలేదు. పార్టీలు మారినవారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి?. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ, బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే మేనిఫెస్టో ప్రకటించారు.
సీఎం రేవంత్ను కలిసిన రోహిత్ వేముల తల్లి
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొడుకు ఆత్మహత్య కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కాగా సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.మరుసటి రోజే రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. విచారణ, దర్యాప్తు విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారుజతదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని డీజీపీ పేర్కొన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ పాలిటిక్స్
వీడియోలు
మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
లోకేష్ 'రెడ్ బుక్' బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
నా తిరుపతి మహిళలకు మాటిస్తున్న..మైండ్ బ్లోయింగ్ స్పీచ్
వాలంటీర్లపై చంద్రబాబు,పవన్ ఏడుపు: కొడాలి నాని