-
అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరా..
ఐనవోలు/ధర్మసాగర్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఐనవోలు మండలం వెంకటాపూర్లో, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అవినీతికి కలిగిన కేసీఆర్ కుటుంబంలో ఉండలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర మాట్లాడుతూ.. కావ్యకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తాటికొండ రాజయ్య ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారని, మతిభ్రమించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నాయకులు గుర్రపు ప్రసాద్, అమరేందర్రెడ్డి, తోట నాగరాజు సీపీఎం నాయకుడు కాడబోయిన లింగయ్య పాల్గొన్నారు. కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మత్స ్య సంపద ౖపైపెకి..
గీసుకొండ : జిల్లాలో మత్స్య సంపద ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంది. వరుసగా నాలుగేళ్ల నుంచి చేపల దిగుబడి వస్తోంది. ఈసారి మరింత అదనపు దిగుబడి వస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. గత సంవత్సరం చేపల పంపిణీ ఆలస్యమైంది. దీంతో కొన్ని మత్స్య సంఘాల వారు కాకినాడ, రాజమండ్రి (బిక్కూరు)తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి చేపపిల్లలను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. ప్రస్తుత వేసవికాలంలో జలాశయాల్లో నీరు తగ్గుతోంది. దీంతో గతంలో ఉన్న పాత తెల్ల చేపలు సుమారు 5 నుంచి 10 కిలోల సైజ్లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో జలాశయాలు ఇలా.. జిల్లాలో 702 చెరువులు ఉన్నాయి. వాటిలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, నల్లబెల్లి, దమ్మన్నపేట, వర్ధన్నపేటలో కోనారెడ్డి చెరువులు పెద్దవి. ఇవే కాకుండా రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్ ఉంది. పాకాల చెరువు మత్య్సశాఖ పరిధిలోకి రాకుండా అటవీశాఖ ఆధీనంలో ఉంది. నాలుగేళ్ల నుంచి పెరుగుతున్న దిగుబడి.. గడిచిన నాలుగేళ్ల నుంచి జిల్లాలో మత్స్యసంపద దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. 2021–22లో చేపలు 8,500 టన్నులు, రొయ్యలు 301 టన్నులు.. రెండు కలిపి మొత్తం 8,801 టన్నుల దిగుబడి వచ్చిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 2022–23లో చేపలు 8,950 టన్నులు, రొయ్యలు 320 టన్నులు.. మొత్తం కలిపి 9270 టన్నులు, ఈ ఏడాది(2023–24)లో చేపలు 9,500 టన్నులు, రొయ్యలు 350 టన్నులు.. మొత్తం కలిపి 9,850 టన్నుల చేపల దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే ప్రస్తుత మే, జూన్ మాసాలు ముగిసేసరికి మరో 800 టన్నుల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. చేపల వైపే ప్రజల మొగ్గు.. ప్రస్తుతం చేపలకు గిరాకీ బాగానే పెరిగింది. మార్కెట్లో మాంసం, చికెన్ ధరలు పెరగడంతో మాంసాహారులు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి మేలు చేసే చేపల వైపు మొగ్గుతున్నారు. గతంలో కిలోకు రూ.100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తుండగా.. ప్రస్తుత సీజన్లో రూ.150 వరకు తెల్ల చేపలను విక్రయిస్తున్నారు. బొమ్మె రకం చేపలు కిలోకు రూ.400 వరకు ధర పలుకుతోంది. గతంలో కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు ఇక్కడికి దిగుమతి అయ్యేవి. జిల్లాలో మత్స్య సంపద గణీయంగా పెరగడంతో ఇక్కడి చేపలు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు పశ్చిమబెంగాల్లోని కోల్కతా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్పూర్కు భారీగానే ఎగుమతి అవుతున్నాయి. ఆశాజనకంగా చేపల దిగుబడి జిల్లాలో గతంలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, మైలారం రిజర్వాయర్లలో నీలకంఠ రొయ్య పిల్లలను పోశారు. ఇవి నాలుగు నెలల్లోనే పెరిగి చేతికివస్తాయి. మత్స్యకారులకు లాభదాయకంగా ఉంటాయి. ఈ ఏడాది తెల్ల చేపల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి మెరుగుపడింది. – నరేశ్కుమార్ నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారిజిల్లాలో చెరువులు, మత్స్యసంఘాల వివరాలు.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 800 టన్నుల అధిక దిగుబడి వచ్చే అవకాశం మన చేపలు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు ఎగుమతి నీలకంఠ రొయ్యలకు భలే గిరాకీ జిల్లాలో 702 చెరువులు.. 184 మత్స్య సంఘాలుచెరువులు 702 చెరువుల నీటి విస్తీర్ణం 12,910 హెక్టార్లు పోసిన చేపపిల్లలు 1,93,63,000 మత్స్య సంఘాలు 184 మొత్తం సభ్యులు 15,741 -
కాంగ్రెస్లో పలువురి చేరిక
నల్లబెల్లి : మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, నల్లబెల్లి అధ్యక్షుడు బత్తిని మహేశ్, నాయకులు మర్రి రాజు, మాసంపల్లి అఖిల్, మేకల మోహన్, సిద్ధు, పవన్ పాల్గొన్నారు. వసంతాపూర్లో.. గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ వసంతాపురంలో పలువురు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుండెకారి రవి ఆధ్వర్యంలో గుండెకారి మల్లేశం, ఆవునూరి కుమారస్వామి, నాంపల్లి రాజు, కడిదెల మధు, కుమారస్వామి, సందీప్తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగపురం రాజేశ్, మాటేటి రమేశ్, చెన్నూరి సతీష్ పాల్గొన్నారు. -
చిరు జల్లులతో ఉపశమనం
రాయపర్తి : భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఆదివారం కురిసిన చిరు జల్లులతో ఉపశమనం లభించింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వర్షానికి ఎక్కడ తడుస్తుందోననే రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలు తడవకుండా పరదాలు కప్పారు. నేటి ప్రజావాణి రద్దు కాళోజీ సెంటర్: కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని ఆమె కోరారు. కడియం కావ్యను ఎంపీగా గెలిపించాలి రాయపర్తి: కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించి సీఎం రేవంత్రెడ్డికి గిఫ్ట్గా ఇద్దామని కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మొరిపిరాల, పెర్కవేడు, ఊకల్ గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని, నియంత పాలన కొనసాగించిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు జాటోత్ హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డి, గోవర్ధన్రెడ్డి, పెండ్లి మహేందర్రెడ్డి, చిర్ర మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు తీగల సాయలు, సుతారి యాదగిరి, దామోదర్, బండి కుమార్, ఊగ మునిత, యాకయ్య, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. జనసభను విజయవంతం చేయాలినర్సంపేట : నర్సంపేటలో సోమవారం నిర్వహించనున్న జనసభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్రావు కోరారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసభకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్దామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 75 సంవత్సరాల చరిత్రలో ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి మూడు వరుసల్లో నిలబెట్టగలిగే ఏకై క నాయకుడు నరేంద్రమోదీ అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్, పట్టణ అధ్యక్షుడు శీలం రాంబాబు, నర్సంపేట ఇన్చార్జ్ గుడిపూడి రాధాకృష్ణ, కౌన్సిలర్లు జుర్రు రాజు, బోడ గోల్యానాయక్, కవితవీరన్న, ఎస్సీ మోర్చా జిల్లా కోకన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నె జగన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, గూడూరు సందీప్, నల్లబెల్లి మండల ఇన్చార్జ్ మల్యాల వినయ్ పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి పర్వతగిరి : విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన లాల్తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం వివరాల ప్రకారం.. లాల్తండాకు చెందిన బానోత్ మోతీలాల్ పాడిగేదె మేతకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సుమారు రూ.70వేల విలువ గల పాడి గేదె మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. లక్ష్మీపురంలో దుక్కిటెద్దు.. దుగ్గొండి : విద్యుత్ తీగలు తగిలి దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన ముద్దం యుగేంధర్ తన వ్యవసాయ బావి వద్దకు మేత కోసం ఎద్దులను తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై రూ.80 వేల విలువైన ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. -
Warangal: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
హసన్పర్తి: నగరంలోని వంగపహాడ్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.గది కిరాయి రోజుకు రూ.వెయ్యికాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement