-
11,874 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
ఏలూరు(మెట్రో): జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన వచ్చింది. ఆదివారం సాయంత్రం నాటికి జిల్లాలో 11,874 మంది పోస్టల్ బ్యాలె ట్ను వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వా రీగా ఉంగుటూరులో 1,402 మంది, కై కలూరులో 1,305 మంది, నూజివీడులో 1,452 మంది, చింతలపూడిలో 1,662 మంది, పోలవరంలో 2,308, ఏలూరులో 1,827 మంది, దెందులూరులో 1,918 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఓటు వేయడం బాధ్యత : ఓటు వేయడం బాధ్యత అని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని జా యింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి సూచించారు. ఏ లూరు సీఆర్ఆర్ మహిళా కళాశాలలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఆదివారం ఆమె పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఓటింగ్ శాతం పెంచేలా.. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా స్వీప్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లాలో 83.75 శాతం ఓటింగ్ నమోదు కాగా ఏలూరు నియోజకవర్గంలో అత్యల్పంగా 68.10 శాతంగా నమోదయ్యిందన్నా రు. ఈ ఎన్నికల్లో 92 శాతం ఓటింగ్ శాతం పెంచేలా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓటర్స్ టర్న్ అవుట్ ప్రణాళికను రూపొందించారని, దీనిలో భాగంగా 2,500 స్వీప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సదుపాయాలు భేష్ .. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా జరగడానికి అధికారులు సకల సదుపాయాలు కల్పించారు. ఏర్పాట్లపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో ముక్కంటి, కమిషనర్ వెంకటకృష్ణ పర్యవేక్షించారు. -
ఏలూరు జిల్లా
గ్రామీణ జనాభా 16,22,314పట్టణ జనాభా 3,84,370ఇళ్ల సంఖ్య 5,47,790అక్షరాస్యత శాతం 70.7అసెంబ్లీ నియోజకవర్గాలు 7పార్లమెంట్ నియోజకవర్గం 1మండలాలు 28గ్రామ పంచాయతీలు 547నగరపాలక సంస్థ 1మున్సిపాలిటీలు 3జనాభా 20,06,684(2011 లెక్కల ప్రకారం) విస్తీర్ణం 6,577 చ.కిలోమీటర్లు -
ప్రశాంతంగా నీట్
దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 8లో uఏలూరు జిల్లాలో అభివృద్ధి జోరు కనిపిస్తోంది.. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు తీస్తోంది. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టడం.. గిరిపుత్రులకు అత్యాధునిక వైద్యసేవలందించడం.. ఏళ్ల నాటి కల ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల సాకారం కావడం.. తమ్మిలేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించడం.. జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి .. లక్షల్లో పేదల ఇళ్ల నిర్మాణం.. అడవిబిడ్డలకు వేలాది ఎకరాల భూపంపిణీ వంటివి విజయవంతంగా సాగాయి. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరు ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల 1980 నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ కళాశాల కావాలనేది బలమైన డిమాండ్. 2019లో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏలూరు, పాలకొల్లులో ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆ సమయంలో డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఏలూరులో వైద్య కళాశాల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. మరోవైపు రూ.60 కోట్లతో అధునాతన భవనం నిర్మించి 2022–23 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను ప్రారంభించారు. మొత్తంగా రూ.525 కోట్ల ప్రాజెక్టులో భాగంగా వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఇంటింటా సంక్షేమ కాంతులు జిల్లాలో 2,81,470 మందికి సామాజిక పింఛన్ల రూపంలో రూ.3,880.09 కోట్ల లబ్ధి చేకూర్చారు. వైఎస్సార్ బీమా కింద 4,554 మందికి రూ.57.32 కోట్లు అందజేశారు. ఏటా 1,73,699 మంది విద్యార్థులకు రూ.130.15 కోట్ల చొప్పున జగనన్న విద్యాకానుకకు వెచ్చించారు. 1,78,214 మంది విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్ల లబ్ధి చేకూర్చారు. 1,82,043 మంది చిన్నారులకు జగనన్న గోరుముద్ద ద్వారా రూ.223.43 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 38,675 మంది విద్యార్ధులకు రూ.383.40 కోట్లు అందజేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా 37,750 మంది రూ.142.96 కోట్లు జమ చేశారు. జగనన్న చేదోడు ద్వారా 17,935 మందికి రూ.71.74 కోట్లు అందజేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.410.18 కోట్ల విలువైన వైద్యసేవలను 1,95,651 మందికి అందించారు. వైద్య కళాశాల ఓ చరిత్ర -
జగన్కు భూములు పంచడమే తెలుసు
బుట్టాయగూడెం(జీలుగుమిల్లి): సీఎం జగన్మోహన్రెడ్డికి భూములు పంచడమే తప్ప లాక్కోవడం తెలియదని ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ అన్నారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సచివాలయ పరిధిలోని గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూయాజమాన్య చట్టం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని, అయితే చంద్రబాబు ఫేక్ ఐవీఆర్ కాల్స్ చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ తీరుతో రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిమ్మగడ్డ అనే వ్యక్తి సూట్ వెనుక ఎల్లో షర్ట్ వేసుకుని తిరుగుతూ వైఎస్సార్సీపీపై కుట్రలు చేస్తున్నాడన్నారు. సీఎం జగన్ వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే పింఛన్ అందిస్తుంటే అక్కసుతో చంద్రబాబు కుట్రలు పన్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోలవరంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ అనడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవగా సీఎం జగనన్న వారందరికీ న్యాయం జరిగేలా కృషిచేస్తున్నారన్నారు. జగనన్న సంక్షేమ పాలన దేశానికే ఆదర్శమని నార్త్ అమెరికా ఎన్ఆర్ఐ వింగ్, వైఎస్సార్సీపీ నాయకుడు రత్నాకర్ అన్నారు. పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు బోదా శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉప్పల రాంపండు, జెడ్పీటీసీ మల్లం వసంతరావు ఉన్నారు. ఎంపీ అభ్యర్థి సునీల్కుమార్ యాదవ్ -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
ఏలూరులోని 3 కేంద్రాల్లో 1,320 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారని ముందుగానే ప్రకటించడంతో విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచే తమకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో తమకు కేటాయించిన తరగతి గదుల కోసం కేంద్రం బయట ఏర్పాటు చేసి సూచిక బోర్డులో తమ నెంబర్లను వెతుక్కుని కేంద్రాల్లోకి ప్రవేశించారు. పరీక్షా కేంద్రాలలో సంబంధిత అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. వారి వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీఆర్ఆర్ అటానమస్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి చెవి పోగు ధరించడంతో అతని చెవిపోగుకు అధికారులకు ప్లాస్టర్ వేసి పరీక్షా కేంద్రంలోకి పంపారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులను, వారి గుర్తింపు కార్డులతో సరిపోల్చిన అనంతరమే వారిని లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు ఏలూరులోని మూడు కేంద్రాల్లో కలిపి మొత్తం 1,320 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ అటానమస్ కళాశాలలో 504 మందికి గాను 491 మంది, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో 504 మందికి గాను 487 మంది, ఆదిత్య డిగ్రీ కళాశాలలో 353 మందికి గాను 342 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సిటీ కో–ఆర్డినేటర్గా వైఎస్ఎస్ చంద్రశేఖర్ వ్యవహరించగా, సీఆర్ఆర్ అటానమస్ కళాశాల అబ్జర్వర్గా ఎం.కృష్ణ, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల పరిశీలకునిగా జీ ప్రభు, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల పరిశీలకునిగా ఓ.శ్రీహరి వ్యవహరించారు. విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రం వద్ద సందడి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement