జగన్‌కు భూములు పంచడమే తెలుసు | Sakshi
Sakshi News home page

జగన్‌కు భూములు పంచడమే తెలుసు

Published Mon, May 6 2024 1:30 AM

జగన్‌కు భూములు పంచడమే తెలుసు

బుట్టాయగూడెం(జీలుగుమిల్లి): సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి భూములు పంచడమే తప్ప లాక్కోవడం తెలియదని ఏలూరు పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సచివాలయ పరిధిలోని గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూయాజమాన్య చట్టం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని, అయితే చంద్రబాబు ఫేక్‌ ఐవీఆర్‌ కాల్స్‌ చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌ తీరుతో రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిమ్మగడ్డ అనే వ్యక్తి సూట్‌ వెనుక ఎల్లో షర్ట్‌ వేసుకుని తిరుగుతూ వైఎస్సార్‌సీపీపై కుట్రలు చేస్తున్నాడన్నారు. సీఎం జగన్‌ వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటికే పింఛన్‌ అందిస్తుంటే అక్కసుతో చంద్రబాబు కుట్రలు పన్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మికి ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోలవరంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ అనడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవగా సీఎం జగనన్న వారందరికీ న్యాయం జరిగేలా కృషిచేస్తున్నారన్నారు. జగనన్న సంక్షేమ పాలన దేశానికే ఆదర్శమని నార్త్‌ అమెరికా ఎన్‌ఆర్‌ఐ వింగ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు రత్నాకర్‌ అన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ చందా ప్రసాద్‌, సొసైటీ అధ్యక్షుడు బోదా శ్రీనివాసరెడ్డి, నాయకులు ఉప్పల రాంపండు, జెడ్పీటీసీ మల్లం వసంతరావు ఉన్నారు.

ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌

11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం
1/1

11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

Advertisement
 
Advertisement