-
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి/సాక్షి, అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిల్లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3.30 గంటలకు వేమగిరిలో, 5.45 గంటలకు రాజుపాలెంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళతారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాల్గొంటారు. 8న మళ్లీ రాష్ట్రానికి.. ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. -
హోమ్ ఓటింగ్కు చక్కటి స్పందన
● రెండు రోజుల్లో సద్వినియోగం చేసుకున్న వారి సంఖ్య 641 తుమ్మపాల : జిల్లాలో రెండవ రోజు హోమ్ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. కశింకోట మండలం తాళ్లపాలెం, బయ్యవరం గ్రామాల్లో జరుగుతున్న హోమ్ ఓటింగ్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా పరిశీలించారు. 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో శనివారం 375 మంది హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీంతో మొదటి రెండు రోజుల్లో 641 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అయింది. నియోజకవర్గాల వారీగా రెండవ రోజు పోలైన ఓట్ల పోలింగ్ సరళి ఇలా.. చోడవరం –40, మాడుగుల–48, అనకాపల్లి – 91, యలమంచిలి – 36, పాయకరావుపేట – 131, నర్సీపట్నం – 29 మంది. కాగా వీరిలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు– 144 కాగా.. దివ్యాంగులు – 231 హోమ్ ఓటింగ్ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రియాన్ష్కు చోటు
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన విద్యార్థి రియాన్ష్ పాయకరావుపేట : శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో యుకేజీ విద్యార్థి బి.రియాన్ష్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఐదేళ్ల రియాన్ష్ ఆన్లైన్ ద్వారా జరిగిన ఎంపిక ప్రక్రియలో కేవలం 9 సెకన్లలో దక్షిణ ఆమెరికా ఖండంలో 13 దేశ జెండాలను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడు. అంతేకాకుండా ఈ విద్యార్థి ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడంతో పాటు ప్రపంచ దేశ రాజధానులను, భారతదేశ రాష్ట్రాల రాజధానులను గుర్తించడంలో కూడా ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆ విద్యార్థి ప్రతిభకు విద్యాసంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ అభినందనలు తెలిపారు. -
ఎపిక్, 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగం
తుమ్మపాల: ఎపిక్, 11 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదానితో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు. ఓటరు కార్డు లేని వారు ఓటు హక్కు వినియోగానికి ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకులు, తపాలాశాఖ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాలు, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డ్, పాస్ట్పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపుకార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులతో స్వేచ్ఛగా ఓటు వేయవచ్చన్నారు. -
కుట్ర కోణం..
ఓటమి భయం.. గూండాయిజంతో నెట్టుకురావాలన్న ప్రయత్నం.. ప్రత్యర్థిని హతమార్చయినా పదవి సాధించాలన్న మాయోపాయం.. వెరసి దేవరాపల్లి మండలంలో శనివారం సృష్టించిన ఘర్షణపూరిత వాతావరణం.. ఇది సీఎం రమేష్ రౌడీ రాజకీయానికి పరాకాష్ట. ప్రజాస్వామ్యానికే అప్రతిష్ట. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును హత్య చేసేందుకు పన్నాగం పన్నారన్నది ఆయన అభిమానుల భయాందోళన.. అందుకు ఊతమిచ్చేవిధంగా నిందితులను సీఎం రమేష్ వెనుకేసుకు రావడం, ముత్యాలనాయుడు ఇంటి వైపు దూసుకురావడం కుట్ర కోణాన్ని బలపరుస్తున్నాయి. రౌడీ రాజకీయం ● హత్యా రాజకీయాలకు తెర లేపుతున్న సీఎం రమేష్ ● ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర ● అనుమతి లేకుండా బూడి నివాసంపై డ్రోన్తో రెక్కీ ● బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ అనుచరులుగా గుర్తింపు ● ఇంకా ఎలాంటి విధ్వంసాలు చూడాలో అని జిల్లా ప్రజల భయాందోళనలు సాక్షి, అనకాపల్లి: అది ఆకతాయిల పని కాదు. అనుకోకుండా జరిగినది అంతకంటే కాదు. డ్రోన్తో ఏమైనా చిత్రీకరించాలంటే.. అదీ ఎన్నికల వాతావరణంలో.. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటిపై.. అనుమతి తీసుకోకుండా ఆ పని చేయకూడదని తెలియనివారు కాదు. అయినా సరే చేశారంటే.. తమపైనే దాడి జరిగిందని పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారంటే వారి ఘర్షణపూరిత వైఖరి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సీఎం రమేష్ వారికి మద్దతుగా రాత్రి వరకు హైడ్రామా సృష్టించడంతో కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూల పవనాలకు తోడు.. మాడుగలను అభివృద్ధి పథంలో నడిపించి ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసిన బూడి ముత్యాలనాయుడికి ఉన్న ప్రజాదరణ చూసి సీఎం రమేష్కు చెమటలు పడుతున్నాయి. ఓటమి భయం రోజురోజుకూ అధికమవుతోంది. అందుకే ఆ ఆందోళన ఇలా వ్యక్తమయింది. తమపై దాడి జరిగిందని సీఎం రమేష్, అతని అనుచరులు సానుభూతి డ్రామా ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ ఎదురుదాడి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్తో రెక్కీ నిర్వహించిన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని తెలుసుకున్న సీఎం రమేష్ తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో మధ్యాహ్నం సుమారు 4 గంటల ప్రాంతంలో దేవరాపల్లి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని.. లేకుంటే అమరావతి, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. ఘటన జరిగిన ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్తానని సీఎం రమేష్ సిద్ధం కాగా శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు నిరాకరించారు. పోలీసులను నెట్టుకుంటూ అనుచరులతో తారువ బయలుదేరి వెళ్లారు. ముత్యాలనాయుడి అనుచరవర్గం మోహరించి ఉందని తెలుసుకొని హనుమాన్ ఆలయం ముందు మెట్లపై సుమారు 2 గంటల పాటు కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకొని రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని, వెంటనే ఇక్కడి నుండి వెళ్లి పోవాలన్న పోలీసుల సూచనలతో సీఎం రమేష్ పోలీస్ జీపు ఎక్కారు. సీఎం రమేష్ ఎక్కిన పోలీస్ జీపుకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. తమ గ్రామం వచ్చి గుండాయిజం చేసి తమను రెచ్చకొట్టిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సుమారు అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీస్ వాహనం నిలిచిపోయింది. పోలీస్ వాహనాన్ని చుట్టముట్టడంతో సీఎం రమేష్, అతని అనుచర వర్గం భయంతో వణికి పోయారు. పోలీసులు అతి కష్టం మీద సీఎం రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా గ్రామస్తులు మాత్రం ఊరు పొలిమేర దాటే వరకు వెంబడించారు. దౌర్జన్యం.. దాడికి పాల్పడం పరిపాటి.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అధికారులపై దౌర్జన్యం, దాడులకు పాల్పడినందుగాను గతంలో సీఎం రమేష్పై కేసులు కూడా నమోదు చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అది కాకుండా.. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్స్టేషన్ పరిధిలో కోవిడ్ 19 నిబంధనలకు విరుద్ధంగా అమరావతి రైతు సంఘం జేఏసీ పేరిట పాదయాత్ర నిర్వహించడం, కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లడంతో పాటు తన కారు డ్రైవర్తో కలసి పరిగపాటి వెంకట సుధాకర్పై దాడి చేసిన కేసు, హైదరాబాద్లో గల జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, హైదరాబాద్ లకిడీకాపూల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఏపీ సెక్రటేరియట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ను దూషించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ను అడ్డుకున్నందుకు గాను హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు, హైదరాబాద్లోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు మరో కేసు సీఎం రమేష్పై నమోదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
మనసున్న ముఖ్యమంత్రి జగన్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement