-
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
రాయచోటి: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈనెల 5, 6 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ కోరారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లకు మే 5న, పోలీసు శాఖ అలాగే 33 అత్యవసర సేవల ఉద్యోగులకు మే 6న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా 5వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారు 6వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి రామాపురం: జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని నల్లగుట్టపల్లెలో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మండలంలోని మేరదపల్లె చెక్పోస్టును తనిఖీ చేసి అక్కడి రిజిస్టర్ను పరిశీలించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగస్వామి, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
●వలస నేతలను నమ్మొద్దు
ఓబులవారిపల్లె: చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం హైదరాబాదు నుంచి వలస వచ్చారు.. ఎన్నికలు అయిపోగానే మళ్లీ సొంత గూటికి వెళ్లిపోతారు.. అందుకే అలాంటి వారిని నమ్మొద్దు. స్థానికంగా ఉంటూ ప్రజలకు అండగా ఉండేవారికి ఓటు వేయండి.. అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఓబులవారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫామ్ హౌసుల్లో దాక్కున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నీరు చెట్టు పేరుతో టీడీపీ నాయకులకు దోచిపెట్టరన్నారు. అనంతరం సీనియర్ నాయకుడు ఓజీ శ్రీనివాసులు రెడ్డి స్వగృహంలో అల్పాహారానికి హాజరయ్యారు. . ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డైరెక్టర్ వత్తలూరు సాయికిషోర్రెడ్డి, సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు టి. కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు సుబ్రమణ్యంరెడ్డి, శ్రీధర్రెడ్డి, సినీ ఫొటోగ్రఫీ డిస్ట్రిబ్యూటర్ ఓజీ రఘురామిరెడ్డి, వైస్ ఎంపీపీ కొమ్మూరు నరసింహారెడ్డి,చిత్తూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ త ల్లెం భరత్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సులో మంటలు
బి.కొత్తకోట : కర్ణాటకలోని బెంగళూరు నుంచి బి.కొత్తకోటకు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కింద మంటలు వ్యాపించగా గమనించిన చెక్పోస్టు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పిన ఘటన శనివారం జరిగింది. ఉదయం బెంగళూరులో బయలుదేరిన బస్సు చింతామణి నుంచి బట్లపల్లె, కానుగమాకులపల్లె మీదుగా బి.కొత్తకోటకు వస్తోంది. మండలంలోని వర్రోళ్లపల్లె చెక్పోస్టు వద్దకు రాగానే బస్సుకింద మంటలు వ్యాపించడం చెక్పోస్టు సిబ్బంది గమనించి బస్సును నిలిపివేయించారు. వెంటనే స్థానికులు, బస్సులోని ప్రయాణికులు మంటలపై నీళ్లు చల్లడంతో ఆరిపోయాయి. బస్సు స్టార్టర్ వైర్, బ్యాటరీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగినట్టు బస్సు సిబ్బంది తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. వడదెబ్బతో వృద్ధురాలు మృతి రాజంపేట రూరల్ : మండల పరిధిలోని మందరం పంచాయతీలోని రాచపల్లెకు చెందిన పద్మావతమ్మ (88) వడదెబ్బతో శనివారం మృతి చెందింది. ఈమె పట్టణంలోని నూనెవారిపల్లెలో పెద్దకుమారుడు వెలగచర్ల రామిరెడ్డి వద్ద ఉంటోంది. భానుడి వేడి తాళలేక వడదెబ్బ కారణంగా ఇంట్లోనే ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు. కుప్పకూలిన గోడచిట్వేలి : మండల కేంద్రమైన చిట్వేలి సింగనమల వీధిలోని కోదండరామాలయం ముందు నిర్మాణంలో ఉన్న భవనం సన్సైడ్ గోడ శనివారం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో అక్కడ ఉన్న రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ సందర్భంగా వాహనదారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
వైఎస్సార్సీపీలోకి చేరికల జోరు
రాజంపేట : కాపు(బలిజ)ల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో కృషిచేశారని రాజంపేట మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అన్నారు. శనివారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్లో కాపు సామాజికవర్గం సంబటూరు శ్రీనివాసులు, మట్లి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 50 మంది యువకులు, మహిళలు వైఎస్సార్సీపీకి మద్దతు నిచ్చారు. వీరికి చైర్మన్ పోలా కండువాలను కప్పి, పార్టీలో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ గతంలో బలిజల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి కృషిచేశారన్నారు. కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. టీడీపీ, జనసేన మాటలకు బలిజలు మోసపోరన్నారు. రాజంపేట మున్సిపాలిటీ వైస్చైర్మన్ మర్రి రవి, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు కృష్ణరావు యాదవ్, కౌన్సిలర్స్ తంబా సుబ్రమణ్యం, విష్ణువర్ధన్, చలపతిగౌడ్, గోవిందుబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదవర్గాలు అధికంగా నివసించే రాంనగల్లో పోలా చేపట్టిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీలోకి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు రాజంపేట రూరల్ / సుండుపల్లె(రాజంపేట) : టీడీపీ సీనియర్ నాయకుడు, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు బత్తల శ్రీరాములు తన అనుచరులు, వడ్డెరలతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అంతకుముందు వారు బత్తల శ్రీరాములుకు ఏపీఐఐసీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డితో కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి సోదరుడు అనిల్కుమార్రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగలన్నదే తమ ఆశయమన్నారు. రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్సార్సీపీలోకి చేరికల జోరు ఓబులవారిపల్లె: మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో వైఎస్సార్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మండల కేంద్రంలోని కటికంవారిపల్లె గ్రామానికి చేందిన పది కుటుంబాలు మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం రెడ్డి అధ్వర్యంలో కాపు నాయకులు అరిగెల సుబ్బారాయుడు, అవులూరు ఈశ్వరయ్య, గబ్బి వెంకటేష్, అంకన ఈశ్వరయ్య, అరిగేల సుబ్రమణ్యం, కటికం వెంకటసుబ్బయ్య పది కుటుంబలవారిని ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్నఓరంపాడు మాజీ సర్పంచ్ ముక్కా రమేష్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కోమ్మిన పెంచలయ్య నాయుడు, పిడికెడు వెంకటసుబ్బయ్య నాయుడు, మన్యం విశ్వనాధ్నాయుడు చేరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డైరెక్టర్ వత్తలూరు సాయికిషోర్రెడ్డి, సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి ,సీనియర్ నాయకులు సింతు సుదర్శన్రెడ్డి, పున్నటి కృష్ణరెడ్డి, చౌడవరం గంగిరెడ్డి, యువనాయకు ఓడి అమర్నాధ్రెడ్డి, గంగన్నగారి పవన్,ఓజీ అనిల్ కూమార్రెడ్డి, గోపి,నిఖిల్,మందరం చంద్రరెడ్డి, ఓజీ జయప్రకాష్రెడ్డి, పున్నటి సుబ్రమణ్యంరెడ్డి,ఎసీ మండల కన్వీనర్ బీర్ ప్రెమ్ తదితరులు పాల్గొన్నారు. శివునిపల్లెలో 25 కుటుంబాలు చేరిక సిద్దవటం : మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ పరిదిలోని శివునిపల్లె గ్రామంలో శనివారం రాత్రి రాజంపేట వైఎస్ఆర్సీపీ నాయకుడు మేడా మధుసూదన్రెడ్డి, రాజంపేట ఎమ్మె ల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తనయుడు ఆకేపాటి సాయి భరత్రెడ్డి ఆధ్వర్యంలో శివునిపల్లె గ్రామానికి చెందిన 25 కుటుంబాలు టీడీపీ నుంచి వైస్ఆర్సీపీలో చేరాయి. ఈ మేరకు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో దాసరి పెద్ద అనుపుల్లయ్య, దారిపాల అనుపుల్లయ్య, దాసరి చిన్నయ్య, నడిపి అనుపుల్లయ్య, చిట్టిబోయిన వెంకటసుబ్బయ్య, గోపినేని రెడ్డెయ్య, చువ్వుల తిరుపాల్ వీరితోపాటుగా వీరి అనుచరులు 25 యాదవ వర్గానికి చెందిన కుటుంబాలు చేరాయి. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామిరెడ్డి, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. సుబ్బయ్య, మచ్చా సుబ్బరాయుడు, దాసరి అనుపుల్లయ్య, యూత్ కన్వీనర్ వావిళ్ల శ్రీనివాసులరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకట్, కాడె వెంకటరమణ, ఏకుల రామిరెడ్డి, రావుల సుబ్బారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, రాజారెడ్డి, చిన్న మల్లారెడ్డి, ప్రదీప్సాగర్ పాల్గొన్నారు. -
నేడు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
రాయచోటి : పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లకు ఆదివారం పౌస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని, అలాగే పోలీసుశాఖ 33 అత్యవసర సేవల ఉద్యోగులకు సోమవారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు ఉన్న పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లుగా ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 5వ నుంచి 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి స్థానిక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోచవ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన పోలీసుశాఖతో పాటు 33 అత్యవసర సేవల ఉద్యోగులు ఈనెల 6వ తేదీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఎవరైనా 5వ తేదీ పోస్టల్ బ్యాలెట్ ఓటును ఉపయోగించుకోలేని వారు 6వ తేదీ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినఫెసిలిటేషన్ కేంద్రాలు ఇవే.. రాజంపేట నియోజకవర్గానికి చెందిన వారికి వత్తలూరు రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రైల్వేకోడూరు నియోజకవర్గం వారికి తహశీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న హెచ్ఎంఎం హైస్కూల్లో, రాయచోటి నియోజకవర్గానికి చెందిన వారికి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ప్రభుత్వ డైట్ హైస్కూల్లో, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన వారికి జిల్లా పరిషత్ హైస్కూల్ అంగళ్ళు, కురబలకోట మండలంలో, పీలేరు నియోజకవర్గానికి చెందిన వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మదనపల్లె నియోజకవర్గానికి చెందిన వారికి బీటీ ప్రభుత్వ కళాశాలలో ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోచవ్చని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్, ఓటరు ఐడీకార్డు, ఆధార్ కార్డు తీసుకు వెళ్లాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement