●వలస నేతలను నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

●వలస నేతలను నమ్మొద్దు

Published Sun, May 5 2024 6:55 AM

●వలస నేతలను నమ్మొద్దు

ఓబులవారిపల్లె: చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల కోసం హైదరాబాదు నుంచి వలస వచ్చారు.. ఎన్నికలు అయిపోగానే మళ్లీ సొంత గూటికి వెళ్లిపోతారు.. అందుకే అలాంటి వారిని నమ్మొద్దు. స్థానికంగా ఉంటూ ప్రజలకు అండగా ఉండేవారికి ఓటు వేయండి.. అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఓబులవారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫామ్‌ హౌసుల్లో దాక్కున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నీరు చెట్టు పేరుతో టీడీపీ నాయకులకు దోచిపెట్టరన్నారు. అనంతరం సీనియర్‌ నాయకుడు ఓజీ శ్రీనివాసులు రెడ్డి స్వగృహంలో అల్పాహారానికి హాజరయ్యారు. . ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డైరెక్టర్‌ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, సర్పంచ్‌ ఎన్‌పీ జయపాల్‌రెడ్డి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు టి. కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు సుబ్రమణ్యంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సినీ ఫొటోగ్రఫీ డిస్ట్రిబ్యూటర్‌ ఓజీ రఘురామిరెడ్డి, వైస్‌ ఎంపీపీ కొమ్మూరు నరసింహారెడ్డి,చిత్తూరు జిల్లా జేసీఎస్‌ కోఆర్డినేటర్‌ త ల్లెం భరత్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement