-
ప్రశాంతంగా నీట్ పరీక్ష
భీమవరం: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) భీమవరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని భారతీయ విద్యాభవన్స్ సంస్థలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 952 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 929 మంది హాజరయ్యారని సిటీ కో–ఆర్డినేటర్ ఎల్వీ రమాదేవి చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. అవస్థలు పడ్డ అభ్యర్థినులు నీట్ పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పలు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులతో కలిసి ఉదయం 9 గంటలకే పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై క్యూలైన్లు ఏర్పాటు చేయడం, కేవలం ముగ్గురిని మాత్రమే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు నియమించడంతో తీవ్రమైన ఎండలో అభ్యర్థులు క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించిరావాలని, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించడంతో అభ్యర్థినులు మండుటెండలోనే జుట్టు ముడివేసుకోవడం, చెవిదిద్దులు, చైన్స్, కాళ్ల పట్టీలు తొలగించి బంధువులకు అప్పగించాల్సి ఉంది. 952 మంది అభ్యర్థులకు 929 మంది హాజరు భీమవరం భారతీయ విద్యాభవన్స్లో పరీక్ష కేంద్రం -
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: భక్తుల పాలిట కల్పతరువుగా, కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా రాట్నాలకుంటలో వెలిసిన శ్రీరాట్నాలమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, పూజలు చేశారు. అమ్మవారికి కామవరపుకోటకు చెందిన పావులూరి రఘురాం, ప్రశాంతికుమారి దంపతులు రూ.5 వేల విలువ చేసే బంగారు సూత్రాలను బహూకరించారు. ఈ వారం పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.34,065, విరాళాల రూపంలో రూ.6,340 లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.10,590, ఫొటోల అమ్మకం ద్వారా రూ.2,885 వెరశి మొత్తం రూ.53,880 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ చెప్పారు. గోదావరిలో స్నానానికి దిగి ట్యాక్సీ డ్రైవర్ గల్లంతు పోలవరం రూరల్: గోదావరి నదిలో స్నానానికి దిగిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హెచ్సీ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన 42 సంవత్సరాల ట్యాక్సీ డ్రైవర్ ఆదివారం ఉదయం కొందరితో కలిసి పోలవరంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లాడు. అక్కడ గోదావరి రేవులో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు హెచ్సీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడి మృతి పోలవరం రూరల్: శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినట్లు స్టేషన్ హెచ్సీ కె.శ్రీనివాస్ చెప్పారు. పోలవరం గ్రామానికి చెందిన పోలవరపు వీరభద్రం (46) భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన ఇంటి సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ వద్ద ఉండగా ఒక్కసారి గోడ కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్ చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): చింతలపూడి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయాలని రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి సేవ ధర్మదాసు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎన్ఆర్గా ఉంటూ, తన ఓటును ఫారమ్ 6ఏ ద్వారా నమోదు చేయకుండా లోకల్ ఓటర్గా ఎపిక్ నంబర్ డబ్ల్యూఎక్స్డబ్ల్యూ 1469121గా నమోదు చేయించుకోవడం ఎన్నికల నియమావళికి విరుద్ధమే కాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8ఏ, 123 (2) ప్రకారం అనర్హత వర్తిస్తుందన్నారు. అంతేకాకుండా, ఏప్రిల్ 22న ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో గల బ్యాంక్ ఖాతాలను, ఇన్సూరెన్స్ విషయాలను కప్పిపుచ్చి, దానిపై తాను లేవనెత్తిన అభ్యంతరంతో ఏప్రిల్ 25న మరో నామినేషన్, అఫిడవిట్ దాఖలు చేసి తనకు అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో గల బ్యాంక్ ఖాతాలను, ఇన్సూరెన్స్ విషయాలను చేర్చి తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకున్నారన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి నుంచి కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదులు చేశామన్నారు. ఇటీవల చింతలపూడిలో దళితులతో నిర్వహించిన సమావేశంలో అగ్రవర్ణాలకు చెందిన వారిని వేదికపై కూర్చోపెట్టి దళితులను వేదిక కింద కూర్చోపెట్టి రోషన్ కుమార్ దళితులను అవమానించారని, అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పులు ధరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం అంబేడ్కర్ను అవమానించడమేనన్నారు. రోషన్ కుమార్ ఎన్నికల్లో గెలిచినా తరువాత అతనిపై అనర్హతకు గురవుతారని, చింతలపూడి నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రిటైర్డ్ ఎంఈఓ ఎస్.ధర్మదాసు -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం ఇద్దరు భక్తులు రూ.2,02,121 విరాళంగా అందజేశారు. కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన పచ్చిగోళ్ల లలితాప్రసాద్ రూ.1,02,121, రాజమండ్రికి చెందిన కవికొండల అప్పల నరసమ్మ రూ.1,00,000 ఆలయ కార్యాలయంలో జమచేశారు. దాతలకు విరాళం బాండ్ పత్రాలను అందించారు. మద్యం పట్టివేత యలమంచిలి: కొంతేరు గ్రామంలో ఆదివారం రాత్రి మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్సై కాకి శివ నారాయణ చెప్పారు. అతని వద్ద ఎనిమిది క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మద్యం సీసాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విస్సాకోడేరులో టీడీపీ నుంచి భారీగా చేరికలు
పాలకోడేరు: ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైఎస్సార్ సీపీకి జనాదరణ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వీరిలో ప్రధానంగా మహిళా కార్యకర్తలు ముందు వరసలో ఉన్నారు. ఆదివారం విస్సాకోడేరులో సర్పంచ్ బొల్లా శ్రీనువాసు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఎమ్మల్సీ కవురు శ్రీనివాస్, డీఎసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి సమక్షంలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. ఏ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచారో అదే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర ఆయనదని పరోక్షంగా రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి విమర్శించారు. ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పీవీఎల్ నర్సింహరాజు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పీవీఎల్ను గెలిపించాలని ఉమాబాల కోరారు. బీసీ కులాలకు నరసాపురం పార్లమెంట్ సీటు కేటాయించి సీఎం వైఎస్ జగన్ ఎంతో గౌరవం కల్పించారని, మీ ఆడబడుచుగా భావించి తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కాకపోయినా ఐదేళ్లుగా నియోజవర్గంలోని 72 గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రెయిన్లు, వాటర్ వర్క్స్ సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేయడానికి సహకారం అందించానన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, ఎంపీపీ భూపతి చంటిరాజు, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, వైస్ ఎంపీపీ ఆదాడ లక్ష్మీ తులసి, పిన్నమరాజు సహదేవరాజు, పిన్నంరాజు శ్రీనివాసరాజు, పృధ్విరాజు, చేబోలు బాలాజీ డాక్టర్ స్వర్ణలత, గెడ్డం జోషి, ఆరేపల్లి శ్రీనివాస్, గంగిరాజు వీరవెంకట సత్యనారాయణ, సూరగాని తాతారావు, ఎంపీటీసీ బొల్లం గాంధీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
పంజాబ్కు బ్రేకులు వేసిన సీఎస్కే
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement