-
ఆటో డ్రైవర్ నిజాయతీ
వీరవాసరం: చైతన్య యూనియన్ అమృత పాయింట్ సభ్యుడు, ఆటో డ్రైవర్ సూరి పెనుగొండ వెళ్లి వస్తుండగా నవుడూరు నుంచి వీరవాసరం మధ్యలో ఆటో ఎక్కిన నాగ దుర్గాభవానీ అనే మహిళ బ్యాగ్ మరిచిపోయింది. దీనిపై ఆమె వీరవాసరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుగా చేయగా ఎస్సై విచారణ చేస్తుండగా.. ఆటో డ్రైవర్ సూరి బ్యాగును తీసుకువచ్చారు. భీమవరం ట్రాఫిక్ ఏఎస్సై చేతులమీదుగా యూనియన్ ప్రెసిడెంట్ చెన్నంశెట్టి శ్రీనివాస్ ఆమెకు బ్యాగు అందజేశారు. బ్యాగులో మూడు కాసుల బంగారం, రూ.2,500 నగదు, బట్టలు ఉన్నాయి. నిజాయతీ చూపిన ఆటో డ్రైవర్ సూరిని పోలీసులు అభినందించారు. నో ఫ్లయింగ్ జోన్గా కౌంటింగ్ కేంద్రం ఉండి : నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగే భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య ప్రకటనలో తెలిపారు. మానవ రహిత వైమానిక వాహనాలు (యుఏవీ), డ్రోన్లు, బెలూన్లు మొదలైన వాటితో సహా ఎలాంటి విమానయాన పరికరాలను ఎగురవేయడం నిషేధమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు జూన్ 4న ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కౌంటింగ్ హాళ్లు, కళాశాల ప్రాంగణమంతా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించామన్నారు. 28న ఆల్ ఇండియా ఓపెన్ చెస్ పోటీలు నరసాపురం: ఏపీ చెస్ అసోసియేషన్, మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నూలిపాయి అభయ్ స్మారక ఆల్ ఇండియా చెస్ పోటీలు ఈనెల 28న పట్టణంలోని అల్లూరి సాంస్కృతి కేంద్రంలో నిర్వహించనున్నట్టు అభయ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకుడు నూలి శ్రీనివాస్ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని, విజేతలకు రూ.64 వేలు ఫ్రైజ్ మనీగా అందిస్తామన్నారు. ఏడేళ్లుగా తమ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వివరించారు. -
శ్రీనివాసా.. గోవింద
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయం తూర్పు వైపు అనివేటి మండపంలో భజన మండలి సభ్యుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాల్లో సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వేసవి సెలవులు ముగిసే వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ ఇలాగే ఉండొచ్చని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. -
పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కీలకం
భీమవరం (ప్రకాశంచౌక్): పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కీలకమని, ఓట్ల లెక్కింపునకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. వచ్చేనెల 4న జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొదట పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం ఉంటుందని, అనంతరం ఏడు నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్లను, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు టే బుళ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి గతంలో ఉన్న ఉత్తర్వులను అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు కొంత వెసులుబాటు కల్పిస్తూ సవరణలతో మే 25న మరో ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ విడుదల చేసిందన్నారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమన్నారు. ఒక్కో టేబుల్కు 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇస్తామన్నారు. అ లాగే పార్లమెంటు రిటర్నింగ్ అధికారి వద్దనే సర్వీ సు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యా లెట్ (ఈటీపీబీఎస్) లను కూడా లెక్కిస్తామన్నారు. 14 టేబుళ్ల చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, స్ట్రాంగ్ రూముల నుంచి 14 కంట్రోల్ యూనిట్లను తీసుకువస్తామని అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఒక రౌండ్ పూర్తయినట్లుగా ఫలితాన్ని ఆర్వో ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే వెంటనే చెప్పాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు గాని లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. విజేతల ఊరేగింపు, ర్యాలీలు, డీజే సౌండ్స్కు అనుమతి లేదన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్కు ఉ దయం 7 గంటలలోపు చేరుకోవాలన్నారు. పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే వారు మత్తు పానీయాలు సేవించరాదన్నారు. విజయం సాధించిన అభ్యర్థులు ఇతర అభ్యర్థులను ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడరాదన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఏజెంట్లను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపేందుకు రిటర్నింగ్ అధికారికి సర్వహక్కులూ ఉన్నాయని కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ సుమిత్కుమార్ -
ఉపాధిముమ్మరం
ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో జాబ్కార్డులు 1,78,669 యాక్టివ్గా ఉన్న జాబ్కార్డులు 71, 784 కూలీల సంఖ్య 2,92,058 పనులు చేస్తున్న కూలీలు 1,00,582 ఉపాధి పనుల లక్ష్యం 43 లక్షల పని దినాలు ఇప్పటివరకు పనుల కల్పన 20 లక్షల పని దినాలుభీమవరం (ప్రకాశం చౌక్) : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగిసిన నేపథ్యంలో కూలీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. కాలువలను కట్టివేయడంతో వ్యవసాయానికి ఊతమిచ్చేలా పంట బోదెలు, పంట కాలువల పూడికతీత పనులు, తూడు తొలగింపు పనులు చేస్తున్నారు. అలాగే ఖాళీ అయిన మంచినీటి చెరువుల్లో కూడా పూడికతీత పనులను కూలీలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో రోజుకు 48 వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. గతంలో రోజుకు రూ.270 వేతనం చెల్లించగా ప్రస్తుతం ఉపాధి కూలీకి వేతనం రూ.300 చొప్పున అందిస్తున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం నుంచి కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. రైతులకు మేలు చేసేలా.. ఉపాధి హామీ పథకం పనులతో రైతులకు మేలు జరుగుతుంది. పంట బోదెలు, పంట కాలువలు పూడుకుపోవడం, తూడు చెత్తాచెదారంతో అధ్వానంగా ఉండటంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శివారు ఆయకట్టుకు సాగునీరు అందడంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలతో పంట బోదెలు, కాలువలను బాగు చేయించడం ద్వారా ఖరీఫ్ సాగుకు సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో చెరువులు బాగు చేస్తున్నారు. జిల్లాలో చిన్నపాటి పంట కాలువలు సుమారు 200కుపైగా ఉన్నాయి. అలాగే జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పంట బోదెలు సుమారు 800 నుంచి 900 వరకు ఉన్నాయి. రూ.37.42 కోట్ల వేతనాలు చెల్లింపు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు సుమారు 20 లక్షల పనిదినాలు కల్పించగా వేతనాల రూపంలో కూలీలకు రూ.37.42 కోట్లు చెల్లించారు. అలాగే వివిధ రకాల పనుల్లో ఉపయోగించిన మెటీరియల్కు రూ.45.98 కోట్లు అందించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని దినాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఇప్పటివరకు జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి 20 రోజుల పాటు పనులు కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్లో 7,06,364 మంది కూలీలు, ఈ నెలలో ఇప్పటివరకు 6,89,062 మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించారు. జోరుగా ఉపాధి పనులు రోజుకు 48 వేల మందికి పనులు రూ.300కు పెరిగిన వేతనం రూ.37.42 కోట్ల వేతనాల చెల్లింపు పూడికతీత, తూడు తొలగింపు పనులుజిల్లావ్యాప్తంగా ఉపాధి పనులు జిల్లాలోని 20 మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి పనులకు సీజన్ కావడంతో రోజుకు జిల్లాలో 48 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది లక్ష్యం 43 లక్షల పనిదినాలు కాగా జూన్ నెలాఖరు నాటికి 30 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు సుమారు 20 లక్షల పనిదినాలు కల్పించాం. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ పని చూపించేలా చర్యలు తీసుకున్నాం. గతంలో రోజుకు వేతనం రూ.270 ఉంటే రూ.30 పెరిగి ఇప్పుడు రూ.300 చొప్పున చెల్లిస్తున్నాం. –ఎం.ప్రభాకర్, డ్వామా పీడీ, భీమవరం -
కాళ్లకూరులో ముగిసిన కల్యాణోత్సవాలు
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి (వెంకన్న) ఆలయంలో వార్షిక తిరు కల్యాణోత్సవాలు ఆదివారం జరిగిన విశేష కార్యక్రమాలతో పరిసమాప్తమయ్యాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చక్రాబ్ది మండలార్చన, శ్రీ పుష్పయాగోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు భీమవరానికి చెందిన ఓ భక్తురాలు ఇత్తడి కుంకుమ భరిణెలు, జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.అరుణ్ కుమార్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల సీజ్
కొయ్యలగూడెం: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ ఆదివారం తెలిపారు. ఎర్ర కాలువ నుంచి ఎర్రంపేట సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఏఈవోల సంఘం నూతనకార్యవర్గం ఎన్నిక తాడేపల్లిగూడెం రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు 12 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటే వారికి గ్రేడ్–1 స్కేల్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఏఈవోల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు డి.వేణుమాధవరావు తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్షా కేంద్రంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుమాధవరావు మాట్లాడారు. అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నెక్కంటి రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎండిఆర్.శివప్రసాద్, కోశాధికారిగా బి.శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా వి.గంగాధరరావు, ఉపాధ్యక్షుడిగా డి.నారాయణమూర్తి, కోరాడ అశోక్, డి.శేషుప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.రాధాకృష్ణ, కార్యదర్శిగా యు.మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా కే.శిరీష, ఎ.ప్రసాద్, జె.గౌరీ ప్రసన్న, ఆడిటర్గా ఎన్.శ్రీనివాసు, మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు ఆగిరిపల్లి: మండలంలో పలు గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్నాయి. మండల కేంద్రమైన ఆగిరిపల్లి, మసీదు రోడ్డు, ఈదర ప్రధాన రహదారిలో, ఎస్ఏ పేట, నెక్కలం గొల్లగూడెంలో నాటు సారా అమ్మకాలు సాగుతున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ సారాకి బానిసై పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ఈ నాటు సారా అమ్మకందారులపై కొరడా ఝలిపించాలని మహిళలు కోరుతున్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం: బాదంపూడి–తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ జి.శ్రీహరిబాబు తెలిపారు. రైలు నుంచి జారిపడటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. పసుపు రంగు బనియన్, డార్కు బ్లూకలర్ జీన్స్ ప్యాంటు ధరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిస్తే 9490617090 నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. స్వస్థలానికి చింతలయ్య మృతదేహం ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కై కరం శివారు వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన పంతుల చింతయ్య జీవనోపాధి కోసం మలేసియా వెళ్లాడు. అనారోగ్యంతో అక్కడ మృతిచెందాడు. అతని మృతదేహన్ని ఇండియాకు రప్పించడానికి అక్కడ కంపెనీ వారు రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులు మానవత రీజియన్ చైర్మన్ పుప్పాల గోపి సాయంతో లయన్ గట్టిం మాణిక్యాలరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంటనే స్పందించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మృతదేహాన్ని ఇండియాకి రప్పించి స్వగ్రామానికి చేరేలా చేశారు. మాణిక్యాలరావుకు చింతలయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
ఏలూరు (ఆర్ఆర్పేట) : దేశంలోని 23 ప్రతి ష్టాత్మక ఐఐటీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జేఈఈ అడ్వా న్స్డ్ పరీక్ష నిర్వహించారు. గత జనవరిలో జేఈఈ మెయిన్స్ మొదటి విడత, ఏప్రిల్లో రెండో విడత పరీక్షలు జరిగాయి. ఆయా పరీక్షల్లో నిర్దేశిత పర్సంటైల్ సాధించిన విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. వీరికి ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరిగాయి. సిద్ధార్థ క్వెస్ట్లో 180 మందికి 178 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 80 మందికి 79 మంది హాజరయ్యారు. మొత్తంగా 260 మందికి 257 మంది హాజరయ్యారు. ట్రిపుల్ఐటీలో ఎన్సీసీ శిక్షణ నూజివీడు : నూజివీడు ట్రిపుల్ఐటీలో ఎన్సీసీ 17వ ఆంధ్రా బెటాలియన్, విజయవాడ వార్షిక శిక్షణ శిబిరం ఆదివారం మూడో రోజు కొనసాగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 650 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.సురేంద్రన్ మాట్లాడుతూ క్యాడెట్ల శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నామని, మానసిక వికాసానికి శిక్షణ దోహదపడుతుందన్నారు. ఉదయం, సాయంత్రం డ్రిల్లో శి క్షణ ఇవ్వడం, ఫైరింగ్, ఆటలు, మ్యాప్ రీడింగ్, శత్రు శిబిరాల పరిశోధన, ఆత్మ రక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
నేత్ర పర్వంగా నాగేంద్ర స్వామి ఉత్సవాలు
వలసపల్లి(ముసునూరు): ప్రతి ఏటా వలసపల్లిలో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీనాగేంద్రస్వామి ఉత్సవాలు ఈ ఏడాది నేత్ర పర్వంగా జరిగాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం వలసపల్లిలో ప్రారంభమైన నాగేంద్రస్వామి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ప్రతి రోజూ ఆలయంలో తెల్లవారుజామునే స్వామి వారి మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, ప్రజల దర్శనానికి అవకాశం కల్పించారు. పలువురు భక్తులు పుట్టలో పాలు పోసి, తమ పిల్లల చెవులకు పోగులు కుట్టించి, సదా కాపాడమని వేడుకున్నారు. ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3,000 మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. దూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరై, రాత్రి పొద్దుపోయేవరకూ నాగేంద్ర నామం జపిస్తూ.. విశేష పూజలు చేసి, దీపారాధనలు చేశారు. రాత్రి పూట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 100 కేజీల పులిహోర కుంభం భీమవరం (ప్రకాశంచౌక్): మెంటేవారి తోటలోని శ్రీవిజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 100 కేజీల పులిహోర కుంభంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వలవల సూర్యనారాయణ, మహాలక్ష్మి దంపతులచే 100 కేజీలు పులిహార కుంభం అమ్మవారికి సమర్పణ చేశారు. -
చింత చిగురు.. నోరూరు
ఉపయోగాలివీ.. ● చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్ను తగ్గించి, మంచి కొలెస్టరాల్ను పెంచుతాయి. ● శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ● యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. ● చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ● మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ● పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. ● వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. ● గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ● నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. ● జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ● విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ● ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. ● షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ● కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ● తల్లిపాలను మెరుగుపరుస్తుంది. కై కలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కై కలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కై కలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కై కలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. చింత చిగురు ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. చింత చిగురుకు యమ డిమాండ్ పుష్కలంగా పోషకాలు కిలో ధర రూ.1,000 చిగురు లభ్యతకు అనువైన కాలం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిగురు సేకరణ చింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం 100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురం -
పెద్దింట్లమ్మా.. కరుణించమ్మా..
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ తల్లీ.. నీ చల్లని దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భారీగా భక్తులు విచ్చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మహిళలు పాల పొంగళ్లును సమర్పించారు. కోనేరులో స్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. ఇటీవల సర్కారు కాల్వపై పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం చేయడంతో ఎలాంటి రుసుం చెల్లించకుండా నేరుగా ఆలయం వద్దకు వాహనాల ద్వారా భక్తులు చేరారు. -
కొబ్బరిపువ్వుతో జీవనోపాధి
యలమంచిలి: బతుకుదెరువు కోసం ఏదోక పని చేసుకోవాలి. కొందరు సీజనల్గా దొరికే పండ్లు, కాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ఆలయాలు వద్ద ఇలాంటి చిరు వ్యాపారులను నిత్యం చూస్తూ ఉంటాం. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి (పెద్ద గోపురం) వద్దకు నిత్యం భక్తులు వస్తుంటారు. ఆ ప్రదేశం అనేక చిరు వ్యాపారులకు ఉపాధి కల్పిస్తుంది. అందులో ఒకటి కొబ్బరి పువ్వు వ్యాపారం. యలమంచిలి మండలంలోని అడవిపాలెం గ్రామానికి చెందిన దేశినీడి మాణిక్యాలరావు పెద్ద గోపురం వద్ద కొబ్బరిపువ్వు అమ్ముతుంటారు. అతనిని పలకరిస్తే ఈ వ్యాపారంలో ఉండే కష్టనష్టాల్ని వివరించాడు. మొలకెత్తిన కాయల నుంచే పువ్వు కొబ్బరి పువ్వు రుచికి బాగుంటుంది. పశ్చిమ డెల్టా, కోనసీమ వాసులకు కొబ్బరిపువ్వు సుపరిచితం. ఇతర ప్రాంతాల వారికి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. కొబ్బరిపువ్వు మొలకెత్తిన కొబ్బరికాయ నుంచి మాత్రమే వస్తుంది. కొందరు పెద్ద రైతులు, వ్యాపారులు కొబ్బరికాయను రాశులుగా పోస్తుంటారు. ఆ రాశులలో కింద కాయలు మొలకెత్తుతుంటాయి. కొబ్బరి మొక్కలు అమ్మే వ్యాపారులు, రైతులు కూడా రాశుల్లో ఏరివేసిన మొలకెత్తిన కొబ్బరికాయలను అమ్మేస్తుంటారు. వారి వద్ద నుంచి కాయలను తెచ్చుకుని కొబ్బరిపువ్వు తీస్తుంటారు. కష్టమెక్కువ..లాభం తక్కువ రైతులు, వ్యాపారులు వద్ద మొలకెత్తిన కొబ్బరికాయను సైజును బట్టి రూ.10 నుంచి రూ.13కు కొనాలి. తరువాత వలచి, కొట్టి పువ్వు తీయాలి. పువ్వు తీసిన తరువాత కొబ్బరి చెక్కలో ఇంకా కొంత కొబ్బరి ఉంటుంది. ఆ చెక్కలను ఎండబెట్టి, ముక్కలు తీసి కొబ్బరి నూనె తీయవచ్చు. ఇంత కష్టపడితే మార్కెట్లో కొబ్బరిపువ్వు సైజును బట్టి రూ.15 నుంచి రూ.20కి అమ్ముతారు. పువ్వును కాయ నుంచి వేరు చేసిన 12 గంటల్లో అమ్మేయాలి. లేదంటే వాసన వస్తుంది. ప్రతి రోజు తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేచి అందరూ కష్టపడి కొబ్బరిపువ్వు తీస్తారు. రోజు కూలి గిట్టుబాటైతే చాలు గతంలో సైకిల్పై కొబ్బరిపువ్వు పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మేవాళ్లం. ఇప్పుడు మోపెడ్పై తెచ్చి అమ్ముతున్నాం. ఎండ ప్రతాపం ఉన్నా లెక్కచేయకుండా వ్యాపారం చేస్తాం. రోజు కూలి డబ్బులు గిట్టుబాటు అయితే చాలు అన్నట్టుగా ఉంటుంది మా వ్యాపారం. దేశినీడి మాణిక్యాలరావు, విక్రయదారుడు -
తోతాపురి ‘ధర’హాసం
ఇంత ధర ఎన్నడూ లభించలేదు తోతాపురికి ఈరోజు టన్నుకు రూ.20 వేలు ధర లభిస్తోంది. జ్యూస్ ఫ్యాక్టరీల వారు, తాండ్ర, ముక్కల పరిశ్రమల వారు తోతాపురి కాయల కోసం ఎగబడుతున్నారు. 30 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నప్పటికీ రూ.10 వేలు పలికితే మంచి ధర వచ్చిందనుకునేవాళ్లం. ఈ ఏడాది అందుకు రెట్టింపు ధర లభించడం ఒక రకంగా తోతాపురికి చరిత్రే. వచ్చే ఎడాది ఇంత ధర ఉంటుందో లేదో చెప్పలేం. – శీలం రాము, మామిడి వ్యాపారి నూజివీడు : తోతాపురి.. మామిడిలో ఇదొక రకం.. వీటినే కలెక్టర్ కాయలు అని కూడా అంటారు. వీటి రుచి కూడా అమోఘం. సాధారణంగా వీటిని ముక్కలుగా చేసి ఊరబెట్టి తినడానికి, జ్యూస్ తయారీకి, తాండ్ర తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. తోతాపురి కాయలకు మామిడి చరిత్రలోనే ఇంతవరకు పలకని ధర ఈ ఏడాది పలుకుతోంది. దీంతో ఈ తోటల రైతులకు, తోటలను కాపునకు కొనుగోలు చేసిన వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. టన్ను తోతాపురి కాయలను రూ.19,500 నుంచి రూ.20 వేలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి రోజుకు 1500 టన్నుల తోతాపురి కాయలను ఎగుమతి చేస్తున్నారు. తోతాపురి కాయలకు ఏ ఏడాది చూసినా టన్నుకు గరిష్టంగా రూ.10 వేలకు మించి ధర లభించేది కాదు. ఈ ఏడాది మాత్రం ఇటీవల వరకు రూ.15 వేల వరకు పలికిన ధర గత వారం రోజులుగా అమాంతం పెరిగి రూ.20 వేలకు చేరింది. దీంతో రైతుల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గతేడాది కంటే దిగుబడి తగ్గడం వల్లే అత్యధిక ధర లభిస్తోందని తెలుస్తోంది. జ్యూస్, తాండ్ర, ముక్కలకు ఎగుమతి తోతాపురి (కలెక్టర్) కాయలు మామిడి జ్యూస్, తాండ్ర తయారీకే కాకుండా ముక్కలు కోసి వాటిని ఉప్పులో ఊరబెట్టి కోల్కతా, చైన్నె, ముంబయి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. జ్యూస్ తయారీకి చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి అవుతోంది. తాండ్ర తయారీకి స్థానికం గాను, ఇతర జిల్లాల్లో ఉన్న తాండ్ర తయారీ యూనిట్లకు తరలిస్తున్నారు. అయినా వ్యాపారులందరూ తోతాపురి కాయల కోసం ఎగబడుతుండటంతో ఎన్నడూ లేని విధంగా ధర లభిస్తోంది. నూజివీడు మండలం వెంకటాద్రిపురం, తూర్పు దిగవల్లి, ఆగిరిపల్లి మండలం ఈదర, రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లిల వద్ద ఉన్న ముక్కల కొట్టులకే దాదాపు 300 టన్నుల వరకు తోతాపురి కాయలు ఎగుమతి అవుతున్నాయి. నూజివీడు ప్రాంతంలోని వేయింగ్ బ్రిడ్జిలు ఖాళీగా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు బంగినపల్లి ధర పడిపోయిన నేపథ్యంలో తోతాపురికి ధర పెరగడంతో రైతుల్లోను, రైతుల వద్ద కాపు కొనుగోలు చేసిన వ్యాపారుల్లోను, ఫ్యాక్టరీలకు కాయలు ఎగుమతి చేస్తున్న వ్యాపారుల్లోను సంతోషం వెల్లివిరుస్తోంది. టన్ను రూ.20 వేలు చరిత్రలోనే అత్యధిక ధర రోజుకు 1500 టన్నుల ఎగుమతి -
గురక వ్యాధితో పశువుల ప్రాణాలకు ముప్పు
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. అనాదిగా ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితమవడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడం వల్ల అంటు రోగాలు సోకి విలువైన పశు సంపదను కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురక వ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ జె.లింగయ్య పలు సూచనలు చేశారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. గురక వ్యాధి సంక్రమణ ఇలా పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా ఈగలు, దోమలు, ఇతర కీటకాలు వ్యాధి తీవ్రతను పెంచుతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బతీస్తాయి. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువుల్లో గురక పెట్టడం, రొప్పడం, ఆయాస పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారెన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ కింద గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధి చికిత్స పశువులో వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థి తుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్,సెఫలాక్సిన్ వంటి యాంటీబయోటిక్ మందులను సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరసించిన పశువుకైతే డెక్టాస్రోజ్ సైలెన్లు పెట్టాల్సి ఉంటుంది. గురక వ్యాధి నివారణ ఇలా గురక వ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు, పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాలలో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమాక్సిన్, సైపర్ మెథ్రిన్,కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో పశువుల పాకను క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయడం మంచిది. గురక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తుంది. ప్రస్తుతం గురక వ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశు వైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. నివారణ చర్యలు మేలంటున్న అధికారులు -
వేసవి దుక్కులతో పంటకు మేలు
ముసునూరు: మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు పండించే భూములన్నింటిలో వేసవి(లోతు) దుక్కులు ఎంతో ప్రయోజనకరం. దుక్కి లోతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి పెద్ద మరతో 30 సెం.మీ లోతు వరకు దుక్కు చేయడం మంచిది. ప్రతి ఏటా వర్షాలను బట్టి భూమిని 15–20 సెం.మీ లోతు వరకు దున్నుకోవాలి. సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉన్న పంటలకు తుక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నేలల్లో 1–3 సార్లు దున్నాలి. కలుపు మొక్కలు, పంటల అవశేషాలు ఎక్కువగా ఉంటే కనీసం మూడు దఫాలుగా దున్నాలి. వేసవి దుక్కులకు అనుకూల పరిస్థితులు ● భూమిలో నిల్వ ఉంచుకునే తేమ 25 నుంచి 50 శాతం ఉంటే అది దుక్కులకు పూర్తి అనుకూలం. ● భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు దుక్కి చేయకూడదు. దీనివలన భూమి గుల్ల బారదు. ● భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నాగలికి మట్టి అంటుకుంటుంది. కింద ఉన్న మట్టి గట్టిపడి, భూమిలో గట్టి పొరలు ఏర్పడతాయి. వేసవి దుక్కులతో ప్రయోజనాలు ● వేసవి దుక్కుల వలన నేల గుల్ల బారుతుంది. తదుపరి వచ్చే వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ● తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుకు అడ్డంగా దున్నడం వలన నేల కోతను నివారించి, భూమి పైపొర భూసారాన్ని కొట్టుకు పోకుండా అరికట్టవచ్చు. ● లోతు దుక్కుల వలన భూమిలో నీరు ఉండి, తేమ శాతం పెరగడం వలన సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషకాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. ● భూమిని ఒక అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి వేర్లు సులభంగా భూమిలోకి దిగి భూమిలో ఉండే పోషకాలను గ్రహించి, మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. ● పంట పొలాల్లో లోతు దుక్కులు దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడ పీడలు, పురుగులు, బ్యాక్టీరియా, శిలీంద్రాలు, సిద్ధబీజాలు, కలుపు మొక్కల విత్తనాలు ఎండ వేడికి నశిస్తాయి. పక్షులు తినేయడంతో తెగుళ్ళ బెడద తప్పుతుంది. ● పొలంలో మట్టి గడ్డలు తొలగిపోయి, మెత్తని మట్టి ఏర్పడి పంట త్వరగా పెరిగేందుకు దోహద పడుతుంది. దీంతోపాటు సకాలంలో కలుపు నివారణా జాగ్రత్తలు తీసుకుంటూ, పంటలు పండించి, చిన్న, సన్నకారు రైతులు మేలు పొందవచ్చు. భూసారం పెంచుకోవాలి పంటలను బట్టి వేసవి దుక్కులను చేసి భూసారం పెంచుకోవాలి. వ్యవసాయ శాఖ ద్వారా లభించే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలి. సబ్సిడీపై వనరులు పొంది రైతులు లాభాసాటి వ్యవసాయం చేయాలి. సందిపాము మధుమోహన్, మండల వ్యవసాయాధికారి -
స్వచ్ఛందంగా పూడికతీత
తాడేపల్లిగూడెం రూరల్ : రైతులంతా నడుం బిగించారు.. రానున్న వర్షాకాలంలో పొలాలకు పొంచి ఉన్న ముంపు ముప్పును తొలగించేందుకు ఐక్యంగా ముందుకొచ్చారు. మండలంలోని నందమూరు అక్విడెక్ట్ వద్ద ఇసుక మేటల తొలగింపు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్వచ్ఛందంగా చేపట్టారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉండటంతో రైతులే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపట్టారని నందమూరు గ్రామ మాజీ సర్పంచ్ కోనేటి దానయ్య, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జడ్డు హరిబాబు తెలిపారు. స్వచ్ఛందంగా పూడికతీత పనులు చేపట్టిన రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నందమూరు అక్విడెక్ట్ వద్ద ఇసుక భారీగా మేటలు వేసిందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువ పరీవాహక గ్రామాలైన అప్పారావుపేట, మాధవరం, మారంపల్లి, నిడదవోలు మండలం తాళ్లపాలెం, శింగవరం గ్రామాల రైతులకు ముంపు పొంచి ఉండటంతో వారంతా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉన్న దృష్ట్యా ఆయన సూచన మేరకు రెండు మండలాల రైతులు స్వచ్ఛందంగా పూడికతీత పనులు చేపట్టినట్టు తెలిపారు. తమకు జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఇస్తే పూడిక పనులను పూర్తిచేస్తామని వారు చెప్పారు. తాళ్లపాలెం సర్పంచ్ యర్రా రామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి వివాదాలకూ తావు లేకుండా రైతులే స్వచ్ఛందంగా పూడిక తీత చేపట్టినట్టు తెలిపారు. ఎర్ర కాలువ పరీవాహక గ్రామాలైన నందమూరు, తాళ్లపాలెం గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కారుచౌకగా చేపలు
ఆకివీడు: ప్రతికూల వాతావరణం వల్ల చేపలు మత్యువాత పడడంతో ఆకివీడు మార్కెట్ను చేపలు ముంచెత్తాయి. ఆకివీడులోని హోల్సేల్ మార్కెట్కు ఆదివారం అధిక సంఖ్యలో మినీ లారీలు చేపల లోడుతో వచ్చాయి. స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో వీటిని సైజును బట్టి రూ.10 నుంచి రూ.25కు విక్రయించారు. దీంతో స్థానికులు ఎగబడి చేపల్ని కొన్నారు. మరికొన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ప్రతికూల పరిస్థితులతో చేరువుల్లో చేపలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఆక్సిజన్ అందక మొప్పలు తేలేసి చనిపోతున్నాయి. చేప రూ.10 నుంచి రూ. 25కు విక్రయం ప్రతికూల వాతావరణంతో మొప్పలు తేలేసిన చేపలు -
పారిజాతగిరికి బ్రహ్మోత్సవ శోభ
జంగారెడ్డిగూడెం: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఏడుకొండల్లో వెలసినట్టే జంగారెడ్డిగూడెంలో పారిజాతగిరి వాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. భక్తుల అభీష్టాలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతూ భక్తుల నిత్యపూజలందుకుంటున్నాడు. తిరుపతిలో జరిగే బ్రహ్మోహత్సవాల తరహాలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారి (516డి) ఆనుకుని ఆహ్లాదకరమైన పరిసరాలతో ప్రశాంత వాతావరణంలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. చిట్టియ్య అనే భక్తుడికి వేంకటేశుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరాన కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు. చిట్టియ్య అన్వేషించగా, ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వృక్షం కింద స్వామి వారి పాదాలు గల శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభీష్టాలు తీర్చుతూ ఆలయం పేరుగాంచింది. పాడిపంటలు కలిగిన ప్రదేశం కావడంతో గోకుల మని, పారిజాతగిరి వృక్షాలు కొండపై ఉండడంతో పారిజాతగిరి అని ప్రసిద్ధి గాంచింది. ఆత్మప్రదక్షిణతో పుణ్యం ఆగమశాస్త్రం ప్రకారం గిరిచుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల పుణ్య ఫలం లభిస్తుందని చెబుతారు. పారిజాతగిరి అభివద్ధి కమిటీ చైర్మనన్ పేరిచర్ల జగపతిరాజు, కార్యదర్శి కాకాని శ్రీహరిరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి గోకుల పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ గిరిప్రదక్షిణ తాత్కాలిక రోడ్డును నిర్మించారు. ఆరవ కొండకు ఎదురుగా కొద్ది దూరంలో గరుడకొండ ఉంది. గిరి ప్రదక్షిణ ద్వారా పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం. రాష్ట్రంలో ఏడుకొండలపైన వెలసింది తిరుమల వెంకటేశ్వరుడు కాగా, రెండోది పారిజాతగిరి వాసుడు. ఒక కొండ వెనుక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడు పాదపద్మాలు అవతరించాయి. పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడకొండ ఉంది. ఏడుకొండల్లో శేషాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి, వృషభాద్రి ఉన్నాయి. దాతల సహకారంతో రోడ్డు నిర్మాణం పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల మేర రూ.30 లక్షలతో తాత్కాలిక రోడ్డును నిర్మించారు. దీనికి మద్ది ఆంజనేయస్వామి దేవాలయం నుంచి కూడా ఆర్థిక సహాయం అందించారు. కొండ చుట్టూ ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో దాతల సహకారంతో శాశ్వత రోడ్డును నిర్మించనున్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటుపై భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ తరహా రోడ్డు అరుణాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. కాగా ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం, మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 28 నుంచి బ్రహ్మోత్సవాలు పారిజాతగిరిలో ఈ నెల 28వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 28వ తేదీ విశ్వక్సేన పూజ, అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ట, 29న విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ట, కుంభ స్థాపన, నిత్యహోమం, సాయంత్రం శేషవాహన సేవ, 30న నిత్యహోమం, నీరాజనం, తీర్థప్రసాదగోష్టి, రాత్రి హనుమంతవాహన సేవ, 31న నిత్యహోమం, తీర్థప్రసాదగోష్టి, లోక కళ్యాణార్ధం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణమహోత్సవం, రాత్రి అభినయ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, అనంతరం చంద్రప్రభ వాహన సేవ, జూన్ 1న నిత్యహోమం, తీర్ధప్రసాద గోష్టి, సాయంత్రం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, 2న నిత్యహోమం, వసంతోత్సవం, స్వామి వారి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, రాత్రి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, అనంతరం గజవాహన సేవ, ధ్వజఅవరోహణం, 3న ధృవమూర్తికి పంచామృతాభిషేకం, నవకలశ స్నపనం, రాత్రి ద్వాదశ ఆరాధన, ద్వాదశ కోవెల ప్రదర్శన, శ్రీపుష్ఫయాగంతో కార్యక్రమాలు పూర్తవుతాయి. 28 నుంచి ఉత్సవాలకు ఏర్పాటుబ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. 31న స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. – ఎం.రాంబాబు, కార్యనిర్వహణాధికారి, గోకుల తిరుమల పారిజాతగిరి, జంగారెడ్డిగూడెం -
ఆక్వా ఫీడ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం
రూ.30 లక్షల ఆస్తి నష్టం మండవల్లి: ఆక్వా ఫీడ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మండలంలోని శోభనాద్రిపురం పెద అగ్రహారంలో గల ఆక్వా ఫీడ్ గోడౌన్లో జరిగిన ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
చింత చిగురు.. నోరూరు
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. ఉపయోగాలివీ.. 👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్ను తగ్గించి, మంచి కొలెస్టరాల్ను పెంచుతాయి. 👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. 👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. 👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. 👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. 👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. 👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. 👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురంచింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం -
లారీని ఢీకొన్న ఆటో.. మహిళ మృతి
మొగల్తూరు: పుణ్య క్షేత్రానికి వెళ్తూ జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. మొగల్తూరు ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం శేరేదగ్గుమిల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది భక్తులు పాసింజర్ ఆటోలో తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామంలోని జాతీయ రహదారిపై ఆగిఉన్న సిమెంట్ లోడ్ లారీని శశనివారం ఉదయం 5 గంటల సమయంలో బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బొర్ర విష్ణువర్ధిని(53) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మిగిలిన ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ప్రత్యేక అవసరాల పిల్లలు చదువుకు దూరం కాకూడదు. భవిత కేంద్రాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 360 మందికి భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. 136 మందికి ట్యాబ్స్ అందించారు. ఇటీవల శిబిరాలు నిర్వహించి 419 మందికి ఉపకరణాలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. సుమారు రూ.54 లక్షలను అలవెన్సుల రూపంలో పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేశారు. అతి తీవ్ర వైకల్యం ఉండి పాఠశాలలకు రాలేని 190 మంది పిల్లల ఇంటికే వెళ్లి 38 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. – పి.శ్యాంసుందర్, జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పిల్లలను గుర్తిస్తున్నాం జిల్లాలోని 19 మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులు సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 229 మంది దివ్యాంగ పిల్లలను గుర్తించాం. తల్లిదండ్రులకు వి స్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈ విషయంలో ఐఈఆర్పీలు నిమగ్నమయ్యారు. ఇటీవల నిర్వహించిన క్యాంపుల్లో బడిఈడు పిల్లలను గుర్తించాం. వారిని చైతన్యపరిచి భవిత కేంద్రాలకు రప్పించి విద్యాబుద్ధులు నేర్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మూడేళ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో, ఆరేళ్ల వారిని పాఠశాలల్లో చేర్చించనున్నాం. – సీహెచ్ సుబ్రహ్మణ్యం, సహిత విద్య సమన్వయకర్త -
వైభవం.. వసంతోత్సవం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు శనివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చనాది కార్యక్రమాలను జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లను దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి భక్తులకు వసంతాలను అందజేశారు. అలాగే రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో రకం పిండి వంటను ఆరగింపుచేసి స్వామి, అమ్మవార్లకు హారతులిచ్చారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని ఘనంగా జరిపించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శయనమహావిష్ణువు అలంకారంలో శ్రీవారు ఘనంగా చూర్ణోత్సవం, శ్రీపుష్ప యాగోత్సవం ముగిసిన చినవెంకన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ శయన మహావిష్ణువుగా శ్రీవారు శేష పాన్పుపై పవళించిన శ్రీమహా విష్ణువుకు శ్రీదేవి, భూదేవి సేవలు చేస్తున్నట్లు ఉన్న శయన మహావిష్ణువు అలంకరణలో శ్రీవారు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో శ్రీవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. -
27 నుంచి సురభి నాటకోత్సవాలు
భీమవరం: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదిత్య కళావేదికపై ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి మూడురోజులపాటు సురభి నాటకోత్సవాలు నిర్వహించనున్నట్టు ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. శనివారం ఆ యన విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన సురభి నాటక సంస్థ 40 మంది కళాకారులతో నాటక ప్రదర్శనలిస్తారని అన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కు చెందిన సాయి సంతోష్ నాట్యమండలి మాయాబజార్ నాటకం, 28న భక్త ప్రహ్లాద, 29న పాతాళభైరవి నాట కాలు ప్రదర్శిస్తారన్నారు. హౌసింగ్ బోర్డ్ కాల నీ కార్యదర్శి సయ్యపురాజు సూర్యనారాయణ రాజు ,అల్లూరి బంగార్రాజు, తమిరి సాంబ మూర్తి, ఎం.సీతారాంప్రసాద్ పాల్గొన్నారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ భీమవరం (ప్రకాశంచౌక్): సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి సిబ్బంది కేటాయింపుపై తొలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను శనివారం కలెక్టర్ సుమిత్కుమార్ పూర్తిచేశారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య, డీఆర్వో జె.ఉదయ భాస్కరరావు, ఎన్ఐసీ అధికారులతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు, పర్యవేక్షణకు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు కలిపి 859 మంది అవసరం కాగా రిజర్వ్ సిబ్బందిని కూడా కేటాయిస్తూ మొత్తం 955 మందికి సంబంధించి ర్యాండమైజేషన్ నిర్వహించారు. వారిలో కౌంటింగ్ సూపర్వైజర్లు 292 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 346 మంది, మైక్రో అబ్జర్వర్లు 317 మంది ఉన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి 94.90 శాతం హాజరు భీమవరం: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు 94.90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్ఐఓ కె.చంద్రశేఖర్బాబు తెలిపారు. జనరల్ పరీక్షకు 6,490 మందికి 6,186 మంది, ఒకేషనల్ పరీక్షకు 396 మందికి 351 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 186 మందికి 149 మంది, ఒకేషనల్ పరీక్షకు 142 మందికి 97 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ప్రాక్టీసు కేసు లు నమోదుకాలేదని చెప్పారు. టెన్త్ పరీక్షకు 14.73 శాతం మంది జిల్లాలో శనివారం నిర్వహించిన టెన్త్ సప్లిమెంటరీ హిందీ పరీక్షకు 14.73 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 1,337 మంది విద్యార్థులకు గాను కేవలం 197 మంది మాత్రమే హాజరయ్యారని డీఈఓ ఆర్.వెంకటరమణ తెలిపారు. 24 కేంద్రాల్లో ఫ్లయింగ్స్క్వాడ్, 7 కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖాధికారి, 3 కేంద్రాల్లో పరీక్షల సహాయ కమిషనర్ తనిఖీలు చేశారన్నారు. ఎడెక్స్ ద్వారా 15 కోర్సులు తణుకు టౌన్: తణుకు ప్రభుత్వ కళాశాలలో బీకాం ఫస్టియర్ విద్యార్థిని ఎన్.జ్ఞానశ్రీ పద్మావతి ప్రభుత్వం చేపట్టిన ఎడెక్స్ ద్వారా 15 అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి 15 కోర్సులను పూర్తిచేసి సర్టిఫికెట్ పొందినట్లు ప్రిన్సిపాల్ పి.అనిల్కుమార్ తెలిపారు. శనివారం జంగారెడ్డిగూడెంలో జరిగిన జోన్–2 ప్రభుత్వ కళాశాలల సమీక్షా సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ పి.భాస్కర్ విద్యార్థినికి సర్టిఫికెట్లు అందించారన్నారు. ఎడెక్స్ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వర్సిటీల్లో కోర్సులు పూర్తిచేయవచ్చన్నారు. వీటిని డిగ్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశాంతంగా డీవైఈఓ పరీక్ష భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన ఏ పీపీఎస్సీ డీవైఈఓ స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో 130 మంది, విష్ణు కళాశా లలో 100 మంది, డీఎన్నార్ డిగ్రీ కళాశాలలో 100 మంది, నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో 100 మంది, తాడేపల్లిగూడెం వాసవీ ఇంజీనిరింగ్ కళాశాలలో 250 మంది, తాడేపల్లిగూడెం శశి ఇనిస్టిట్యూట్ టెక్నాలజీలో 160 మంది హాజరయ్యారు. మొత్తం 840 మంది అభ్యర్థులకు 532 మంది హాజరయ్యారు. -
ఓట్ల లెక్కింపును బాధ్యతగా చేపట్టాలి
కలెక్టర్ సుమిత్కుమార్ భీమవరం/భీమవరం (ప్రకాశంచౌక్): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శనివారం భీమవరం ఆనంద ఇన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, లెక్కింపులో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. జిల్లాలో రెండు కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటుచేయగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు, బీవీ రాజు కళాశాలలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతిఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉద యం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపునకు కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు ఉదయం 6 గంటలలోపు కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలన్నారు. స్ట్రాంగ్రూమ్లు ఉదయం 7 గంటలకు తెరవగానే ఈవీఎంలను పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో తరలిస్తామన్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, 8.15 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లకు నాలుగు టేబుళ్లు, సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపును ఒక టేబుల్ ఏర్పాటు చేస్తామన్నారు. 14 నుంచి 19 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి గదిలో సీసీ టీవీలు ఉంటాయని, ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారులదే సర్వాధికారమని కలెక్టర్ స్పష్టం చేశారు. జేసీ సీవీ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా ఎన్నికల శిక్షణాధికారి కేసీహెచ్ అప్పారావు, ఆచంట రిటర్నింగ్ అధికారి వి.స్వామినాయుడు, నరసాపురం, భీమవరం ఆర్డీఓలు అంబరీష్, కె.శ్రీనివాసులురాజు, బి.వెంకటరమణ, కె.చెన్నయ్య, బి.శివనారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్మాధుర్, ఎన్నికల సూపరింటెండెంట్ చందన దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement