-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మ వారి సన్నిధిలో సూర్యోపాసన సేవ జరుగుతోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువరు ఉభయదాతలు తమ నామ గోత్రాలతో పూజ జరిపించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. తమిళనాడు వాసి ఆత్మహత్య తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శనివారం సాయంత్రం నుంచి ఫుల్గా మద్యం తాగి తమిళంలో మాట్లాడుతూ మణిపాల్ సెంటర్, ఓల్డ్ టోల్గేట్, సీఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రాంతాల్లో తిరుగుతు రాళ్లు విసురుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. రాత్రి 12 గంటల సమయంలో తనకు తానే బ్లేడుతో పీకమీద కోసుకుని రోడ్డుమీద అటూ ఇటూ తిరుగుతుండడంతో ఓల్డ్ టోల్గేట్ వద్ద ఉన్న చెక్ పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో ఆతడిని ఆసుపత్రిలో ఉంచగా తెల్లవారుజామున బయటకు వచ్చి ఆస్పత్రి ఆవరణలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు, తీర్థయాత్రలలో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు, యాత్రికుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపున అమ్మవారికి తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, ఇతర ఆర్జిత సేవలలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఉన్న రద్దీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తగ్గింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత రద్దీ మళ్లీ పెరిగింది. -
జగనన్నతోనే రాష్ట్రానికి మేలు
పెడన: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గుర్తించి, ఆయన అమలు చేసే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు నేరుగా అందుతున్న తీరుకు మెచ్చి పలువురు స్వచ్ఛం దంగా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని పార్టీ పెడన ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) అన్నారు. పట్టణంలోని 14వ వార్డు టీడీపీ సీనియర్ కౌన్సిలర్ ఉమ్మిలేటి సుబ్రహ్మణ్యం, వార్డు నాయ కుడు అంగత సాంబశివరావు కుమారుడు అంగత రామాంజనేయులు, సేనాపతి రాంబాబు, సోమ శేఖర్ తదితరులు పార్టీలో చేరారు. కూడూరులోని తన ఇంటి వద్ద వారందరికీ ఉప్పాల రమేష్ (రాము) కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారిని రాము కోరారు. బళ్ల సాంబశివరావు, ఉమా, రామకృష్ణ, బండారు మల్లి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో టీడీపీ మాజీ కౌన్సిలర్ సహా పలువురు చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రమేష్ (రాము) -
గుర్తు తెలియని మృతదేహం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకాశం బ్యారేజీ వద్ద మెయిన్ కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మెయిన్ కెనాల్ లాకులు సమీపంలో కెనాల్ ఒడ్డున నీటిలో ఒక వ్యక్తి మృతదేహం ఉదని ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ మృతదేహాన్ని కెనాల్ నుంచి వెలికితీసి పురుషుడిదిగా గుర్తించారు. మృతుని వద్ద ఊరు, పేరు వంటి ఆధారాలు ఏమీ లభించలేదు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, వంటిపై రెడ్ కలర్ టీషర్టు, బ్లూ షార్ట్ ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement