-
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి. టీడీపీ నుంచి ఓ ‘బిజినెస్’మ్యాన్, వైఎస్సార్సీపీ తరపున ఓ ఉన్నత విద్యావంతుడు పోటీలో ఉన్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మినహా మరో అర్హత టీడీపీ అభ్యర్థికి లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువు, ఉద్యోగం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పేదరికం విలువ తెలిసినోడు. పైగా తాను పోటీ చేసే సామాజికవర్గం మొత్తం తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థిలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1.15లక్షలు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే ఓటర్లు వీరే. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఓట్లు తమకు రావనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అందుకే తన నామినేషన్ నుంచి ప్రచారం దాకా ఎక్కడా కాషాయ జెండా కనిపించలేదు. కషాయ జెండా, కమలం గుర్తు కనిపిస్తే బీజేపీ ఓట్లు దూరమవుతాయనేది ఈ అభ్యర్థి భావన. అయితే తన తండ్రి ఏకంగా బీజేపీలోనే ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఇదే సమయంలో మైనార్టీ ఓటర్లకు మాత్రం ఈ దఫా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓ స్పష్టత ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అభ్యర్థి తండ్రి రంగంలోకి దిగి ప్రలోభాలకు తెరలేపాడు. ఒకరిది జన బలం.. మరొకరిది ధన బలం వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రజల మద్దతుతో గెలవాలనే భావనలో ప్రచారం చేస్తుంటే, టీడీపీ అభ్యర్థి తండ్రి మాత్రం డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడు. ఓ టీంను నియమించుకుని, వారికి జీతాలు ఇస్తూ 50 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి పారీ్టలతో సంబంధం లేకుండా ఓ జాబితా సిద్ధం చేయించారు. వీరందరికీ ఫోన్లు చేసి స్వయంగా పిలిపించుకుని డబ్బులిస్తూ, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రత్యర్థి పార్టీల నుంచి అనుకూలత లేకపోవడంతో తాను 2014, తన కుమారుడు 2019లో ఓడిపోయామని.. ఈ దఫా తన కుమారుడు ఓడిపోతే రాజకీయల నుంచి పూర్తిగా దూరం కావడంతో పాటు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసుకుంటారని చెబుతున్నారు. ఓడిపోతే హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసేవాడు, గెలిచినా అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఏం పనికొస్తారని ప్రత్యర్థిపారీ్టల నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇలాంటి వారికి మాకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. వైఎస్సార్సీపీ కోసం తిరగకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటే సరిపోతుందని సెలవిస్తున్నారు. ఒకరిద్దరు డివిజన్స్థాయి నేతలు ఆయన ప్రలోభాలకు లొంగడం మినహా తక్కిన వారంతా ధిక్కారస్వరం వినిపించడం గమనార్హం. ఓటుకు రూ.2వేల చొప్పున రూ.50కోట్లు పంచేందుకు సిద్ధం పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఈ లోపు ఓటుకు రూ.2వేల చొప్పున 2.50లక్షల ఓట్లకు రూ.50కోట్లు పంచేందుకు నగదు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇళ్లతో పాటు తన వ్యాపార సముదాయాల్లో నగదు నిల్వలను ఉంచినట్లు సమాచారం. ప్రతీ ఎన్నికల్లో కేవలం 50శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో మైనార్టీ ఓట్లు అధికంగా పోలవుతాయి. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు. ఈ వర్గాలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలమనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దీంతో వీరికి అవసరమైతే మరికొంత ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కూటమి నేతలకు భారీగా ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఖర్చు విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తగువు నియోజకవర్గంలో ఓ సామాజికవర్గం ఓట్లు ఎన్ని, ఏ పారీ్టకి ఎవరు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని లెక్కలు వేశారు. దీంతో మైనారీ్ట, ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఎస్టీ, బీసీలు కూడా వైఎస్సార్సీపీ వైపు అధికంగా ఉన్నట్లు వారి లెక్కలో తేలింది. పోలింగ్కు కూడా వీరే ఎక్కువగా వస్తారు. దీంతో తక్కిన వర్గాల ఓట్లు తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి లెక్కలు వేస్తే తమకు పరాభావం తప్పదని తేలింది. అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదని అభ్యర్థి తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ‘గత రెండు ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఈ దఫా ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మనకు సీటు కూడా ఇవ్వరు. కచ్చితంగా గెలవాలి. డబ్బులు చూడకూడదు’ అని తండ్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు వల్లనే ఇదంతా జరగుతోందని, పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును కూడా నిషూ్టరమాడుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
నానిని మళ్లీ గెలిపించాలని..
ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న గంగుల బిజేంద్రారెడ్డి(నాని) యువతతో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలో గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. నానికి మద్దతుగా ఆయన సతీమణి సారిక రెడ్డి, సోదరి అవంతిక రెడ్డి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తున్నారు. పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందజేశామని గుర్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, రెండో సారి నానిని గెలిపించాలని కోరుతున్నారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే
డోన్: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఇటీవల డోన్ పర్యటనలో తనపై ఆరోపణలు చేయడంలో అర్థం లేదని, తనను అప్పుల మంత్రిగా పేర్కొనడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులను చంద్రబాబు సొంత ఆస్తులు అమ్మి కట్టారా అని బుగ్గన నిలదీశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేసిన టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆర్థిక నేరస్తుడంటే అర్థం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వర్గీయ కోట్ల విజయభాస్కర్రెడ్డిపైన గౌరవంతో ఆయన గురించి స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నానని బుగ్గన అన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇన్కంట్యాక్స్ నోటీసు అందుకోలేదని బుగ్గన చెప్పుకొచ్చారు. ఎంపీగా పనిచేసి జిల్లాకు ఏమేర నిధులు తెచ్చి అభివృద్ధి చేశావు? మూడేళ్ల నా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని కోట్లకు బుగ్గన సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని దోచుకున్నదెవరో ప్రజలకు తెలుసు గతంలో బేతంచెర్ల మండలం గూటుపల్లె అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు జీపుపై తుపాకులు పెట్టి వచ్చి, పోయే వాహనాల వద్ద మామూళ్లు వసూలు చేసింది ఎవరో కోట్ల కుటుంబీకులు చెప్పాలన్నారు. డోన్లో సాక్షి నివాస్ వెంచర్ యజమానిని బెదిరించి బినామీ పేర్లపై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆతర్వాత ఆలూరు ఎన్నికల కోసం వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను ఖర్చు చేసింది ఎవరో చెప్పాలన్నారు. డీలర్లతో కుమ్మకై ్క ప్రతి నెల రూ.30వేలు మామూలు వసూలు చేయడం, అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులను పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిపించడం, పరిచయం ఉన్న వారందరి వద్ద చేతిబదులు పేరుతో లక్షల రూపాయలు అప్పులు చేసి ఎగ్గొట్టడం ఎవరో కోట్ల కుటుంబీకులు ప్రజలకు చెప్పాలన్నారు. స్థానిక మట్కా వ్యాపారుల ఇళ్లవద్దకు వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే మట్కా రాసుకుందురులే అని కోట్ల కుటుంబీకులు చెప్పడం వాస్తవం కాదా అన్నారు. బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో తమకు ఓటేస్తే సారా వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇప్పిస్తామని చెప్పిందెవరో ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో టైలర్స్ కాలనీని నేలమట్టం చేసి లక్షలాది రూపాయలను అక్రమంగా లబ్ధిదారుల నుంచి వసూలు చేసింది ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు. 2019 ఎన్నికల ముందు మార్కెట్లో ఒక్కొక్క వ్యాపారి నుంచి రూ.30వేలు, ఫ్లైఓవర్ కింద వ్యాపారులతో ఇష్టానుసారంగా మున్సిపల్ కమిషనర్ పేరుపై డీడీలు తీసి అక్రమంగా సంపాదించింది ఎవరో వివరణ ఇవ్వాలన్నారు. వైన్షాప్ల నిర్వహణలో కేఈ కుటుంబీకులతో 60, 40 శాతం కమీషన్లు తీసుకొని ప్రజల ప్రాణాలను తీసింది ఎవరో కూడా ప్రజలక సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు పోసు్ట్రపసాద్, కౌన్సిలర్లు మల్లికార్జునరెడ్డి, దినేష్గౌడ్, పార్టీ నాయకులు మల్యాల శ్రీనివాసరెడ్డి, పాలుట్ల రఘురాం, బొబ్బల శివరామిరెడ్డి పాల్గొన్నారు. నిరాధార ఆరోపణలు కోట్ల అజ్ఞానానికి నిదర్శనం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
No Headline
శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం కోసం ఆయన తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిన్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక్రెడ్డి హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు. ప్రత్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డిపైపంచ్లు వేస్తూ బుడ్డాకు చెమటలు పట్టిస్తున్నారు. అలాగే బుడ్డా విమర్శలకు అంతే దీటుగా సమాధానం చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కార్తీక్రెడ్డి సోదరి శ్వేతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ తండ్రి విజయం కోసం కృషి చేస్తున్నారు. -
రజకులకు అండగా ఉంటాం
కోవెలకుంట్ల: రజకులకు అన్ని విధాలా అండగా ఉండి వారి అభ్యున్నతికి పాటుపడతామని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. పట్టణ శివారులోని మహాలక్ష్మి ఫంక్షన్హాలులో నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల రజకులతో ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆల్వకొండ మద్దిలేటి అధ్యక్షతన శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కర్రా గిరిజా హర్షవర్ధన్రెడ్డి, గ్రామ సచివాలయాల బనగానపల్లె నియోజకవర్గ కో ఆర్డినేటర్ జీసీఆర్ సూర్యనారాయణరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ బీవీ నాగార్జునరెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాసగిరి సాయికృష్ణమూర్తి, రైతు సంఘం అధ్యక్షుడు కానాల రవీంద్రనాథరెడ్డి, కర్రా తేజవర్ధన్రెడ్డి, ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాంభూపాల్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నవరత్న పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా నిలిచిందన్నారు. మహిళా సంక్షే మానికి పెద్దపీట వేసి వైఎస్సార్ చేయూత, ఆసరా, అమ్మఒడి, తదితర సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చారన్నారు. కూటమి మాయమాటలు నమ్మొద్దు.. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల్లోకి వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాయమాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సూచించారు. 2014 ఎన్నికల్లో 650 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరలా ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ నాయకులు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజల్లోకి వస్తున్నారన్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని రజకులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో 25 సెంట్ల స్థలాన్ని కేటాయించి రూ. 30 లక్షలతో రజక కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేశామన్నారు. బనగానపల్లె పట్టణంలో రజకులు బట్టలు ఉతికి ఆరవేసుకునేందుకు రూ. 4 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయించామన్నారు. ఎన్నికల తర్వాత బనగానపల్లెలో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బాల తిమ్మయ్య, రాజశేఖర్, పెద్ద ఓబులేసు, నరసింహులు, నాగయ్య, నాగ శేషులు, సుబ్బరాయుడు, ఓబులేసు, ముసలయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, నాగేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు గజ్జెలరెడ్డి, దశరథరామిరెడ్డి, డీసీ ఉసేన్, తదితరులు పాల్గొన్నారు. మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించండి రజకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నవరతన్ నగలు.. పెట్టుబడికి మార్గం
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement