-
కొనసాగిన హోం ఓటింగ్
ఫ ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న 1300 మంది నల్లగొండ : లోక్సభ ఎన్నికల హోం ఓటింగ్ శనివారం కొనసాగింది. హోంఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఎన్నికల అధికారులు వెళ్లి ఓటు వేయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,133 మంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటామని ఎన్నికల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 883 మంది సీనియర్ సిటిజన్లు, 1250 మంది దివ్యాంగులు ఉన్నారు. శుక్ర, శనివారం కలిపి మొత్తం 1300 మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నారు. వారిలో 508 మంది వృద్ధులు, 792 మంది దివ్యాంగులు ఉన్నారు. హోం ఓటింగ్కు వెళ్లే సిబ్బంది బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపర్, పోలింగ్ కంపార్ట్మెంట్తో వెళ్లి ఇంటి వద్దే ఓటు వేయిస్తున్నారు. శనివారం పలుచోట్ల హోం ఓటింగ్ కార్యక్రమాన్ని నల్లగొండ ఆర్డీఓ రవి పరిశీలించారు. -
ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
మర్రిగూడ, చండూరు(గట్టుప్పల్) : ప్రధానమంత్రి మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మర్రిగూడ, గట్టుప్పల, చండూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావుతో కలిసి మాట్లాడారు. సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఉన్నానన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది శూన్యమని, గతంలో ఉన్న ఆస్తిని అమ్మి రాజకీయాలు చేస్తున్నానన్నారు. రాజగోపాల్రెడ్డి 2001లో రూ.19కోట్లు ఆస్తి ఉంటే నేడు రూ.500 కోట్లు సంపాదించాడన్నారు. తనను ఆశ్వీరదించి ఎంపీగా గెలిపిస్తే రూ. 9వేల కోట్లతో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఆయన వెంట జాతీయ నాయకుడు మురళీధర్రావు, గంగిడి మనోహర్రెడ్డి, యాస అమరేందర్రెడ్డి, పాత్లావత్ రాజేందర్నాయక్, పిట్టల శ్రీనివాస్, గ్యార గోపాల్, పగిళ్ల లింగస్వామి, గ్యార యాదగిరి, నగేష్, రాములు, యాదగిరి, పరుశురామ్ పాల్గొన్నారు. బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ -
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
నల్లగొండ : లోక్సభ ఎన్నికలకు సంబంధించి డ్యూటీల కేటాయింపుపై ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ లోక్సభ పరిధిలో ఎన్నికల విధుల నుంచి కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పైరవీకారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు మూడు నెలల్లో రిటైర్డ్ అయ్యేవారు, గర్భిణులు, బాలింతలు, గుండె జబ్బులు ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం ఎన్నికల డ్యూటీలు వేశారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి, పలువులు యువకులకు మాత్రం డ్యూటీలు వేయలేదని తెలుస్తోంది. ఎన్నికల విధుల కేటాయింపు విషయంలో కలెక్టర్ హరిచందన కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు కిందిస్థాయి అధికారుల నిర్వాకం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల విధులకు సరిపడా ఉద్యోగులకు లేనప్పుడు అందరూ తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉన్న వారికి విధుల్లో మినహాయింపు ఇచ్చి, ఆనారోగ్యంతో ఉన్నవారికి విధులు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు పట్టని అధికారులు ఆరు నెలల్లోపు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ 2, 3 నెలల్లో రిటైర్డ్ అయ్యే వారికి కూడా అధికారులు డ్యూటీలు వేశారు. బాలింతలు, గర్భిణులు, నడవలేని వారి కూడా విధులు కేటాయించారు. దీంతో పలువురు వారి పరిస్థితిని వివరించి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులకు విన్నవించుకుంటే.. మొదటి విడత శిక్షణ సమయంలో రద్దు చేశారు. కానీ, తిరిగి రెండో విడత శిక్షణ నాటికి తిరిగి విధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారంగా ప్రస్తుత వేసవి, అనారోగ్యం దృష్ట్యా ఎన్నికల విధులు నిర్వహించలేమని ఆవేదన చెందుతున్నారు. మూడు నెలల్లో రిటైర్డ్ అయ్యే ఓ ఉపాధ్యాయుడికి ఎన్నికల డ్యూటీ వేయడంతో.. అతను డ్యూటీ క్యాన్సిల్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. వారు రద్దు చేయకపోవడంతో హైకోర్టుకు వెళ్లి డ్యూటీ రద్దు ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆరోగ్య సమస్యలున్నా విధులకు వెళ్లాల్సిందే.. గుర్రంపోడు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు త్వరలో రిటైర్డ్ అవ్వబోతున్నారు. అదే మండలంలో మరో ఉపాధ్యాయుడికి ఇటీవల గుండెపోటు రావడంతో స్టంట్ వేశారు. నాంపల్లి మండలంలో మోడల్ స్కూల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి ఓపెన్ హార్టు సర్జరీ అయ్యింది. దేవరకొండ మండలంలో ఓ చిన్న పాప ఉన్న ఉపాధ్యాయురాలికి డ్యూటీలు వేశారు. వీరంతా మినహాయింపు కోసం ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఫ సంఘాల నాయకులు, పైరవీకారులకు మినహాయింపు ఫ రెండు, మూడు నెలల్లో రిటైర్డ్ అయ్యే వారికి మాత్రం విధులు ఫ దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, గర్భిణులు, బాలింతలకు కూడా.. ఫ డ్యూటీల కేటాయింపుపై ఉద్యోగుల నుంచి విమర్శలుఈ పాఠశాలల టీచర్లకు డ్యూటీలు పడలే.. నార్కట్పల్లి మండలంలోని శాపల్లి, నార్కట్పల్లి, అక్కినపల్లి, ఆవులోనిబావి, బ్రాహ్మణవెల్లెంల , నెమ్మాని , పోతినేనిపల్లి, మాండ్ర, ఏపీలింగోటం, కనగల్ మండలంలోని తేలకంటిగూడెం, పొనుగోడు, తుర్కపల్లి, బోయినపల్లి, అమ్మగూడెం, గుర్రంపోడు మండలంలోని కాచారం, పార్లపల్లి, కొత్తలాపురం, వడ్డెరగూడెం, కొప్పోలు, గుర్రంపోడు–2, చాపెల్లి, పాల్వాయి, లక్ష్మీదేవిగూడెం, పాల్వాయి–2, మొండికానిగూడెం, కొప్పోలు–2, పాఠశాలల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీకి మినహాయింపు ఇచ్చారు. అనుముల మండలంలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయిచంలేదు. -
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
నల్లగొండ క్రైం : లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై.. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనాదీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సంబంధిత రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు, ధ్వేష పూరిత ప్రసంగాలు, అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో తప్పుడు పోస్టులు పెడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీట్కు అంతా సిద్ధం రామగిరి(నల్లగొండ) : నీట్ – 2024 నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏడు కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 2316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు పాస్ పోర్ట్సైజ్ ఫొటో, ఐడీ కార్డు తీసుకుని పరీక్షకు హాజరుకవాలని నీట్ జిల్లా కో ఆర్డినేటర్ జి.పార్థసారధి సూచించారు. 8, 9 తేదీల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఈనెల 8, 9 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకు పీఓ, ఏపీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులకు రూ.517 కోట్లు చెల్లించాం యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల భాగంగా జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.517 కోట్లు చెల్లించినట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 370 కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.631 కోట్ల విలువచేసే 2,86,565 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45,598 మంది రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 36,928 మంది రైతులకు రూ.517 కోట్లు చెల్లించామని.. మిగతా రూ.117 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ ఆదేశాల మేరకు టెక్నికల్ ఏఓలు, మండల వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాక్, విక్రయాలు తదితర విషయాలపై ఆరా తీశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ శ్రవణ్కుమార్ తెలిపారు. -
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని కలెక్టర్ దాసరి హరిచందన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో ముఖాముఖి మాట్లాడి బాలసదనంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని, ఎలా చదువుతున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనం మొత్తం పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై హోం సూపరింటెండెంట్ జయకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. బాలసదనం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మ్యాట్రిన్ సామ్రాజ్యాన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాలసదనంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పనితీరు కూడా సరిగాల లేదని.. వారిని వెంటనే సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లో బాల సదనం పరిశుభ్రంగా ఉంచాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. ఫ సదనం మాట్రిన్ సస్పెన్షన్ ఫ పర్యవేక్షకురాలికి షోకాజ్ నోటీస్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement