మర్రిగూడ, చండూరు(గట్టుప్పల్) : ప్రధానమంత్రి మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మర్రిగూడ, గట్టుప్పల, చండూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావుతో కలిసి మాట్లాడారు. సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఉన్నానన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది శూన్యమని, గతంలో ఉన్న ఆస్తిని అమ్మి రాజకీయాలు చేస్తున్నానన్నారు. రాజగోపాల్రెడ్డి 2001లో రూ.19కోట్లు ఆస్తి ఉంటే నేడు రూ.500 కోట్లు సంపాదించాడన్నారు. తనను ఆశ్వీరదించి ఎంపీగా గెలిపిస్తే రూ. 9వేల కోట్లతో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఆయన వెంట జాతీయ నాయకుడు మురళీధర్రావు, గంగిడి మనోహర్రెడ్డి, యాస అమరేందర్రెడ్డి, పాత్లావత్ రాజేందర్నాయక్, పిట్టల శ్రీనివాస్, గ్యార గోపాల్, పగిళ్ల లింగస్వామి, గ్యార యాదగిరి, నగేష్, రాములు, యాదగిరి, పరుశురామ్ పాల్గొన్నారు.
బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి
బూర నర్సయ్యగౌడ్