-
Salur: ఇంట గెలవని రాణి..!
ఆమెది ఒంటెత్తు పోకడ వ్యవహారమన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీగా పదవి అనుభవించినా సంతృప్తి లేదు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నదే ఆమె లక్ష్యం. అయితే సొంత పార్టీలోని మాజీ ఎమ్మెల్యేతో ఇప్పటికీ విభేదాలే. కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పటికీ..కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థితోనూ సఖ్యత అంతంతమాత్రమే. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆమెను వ్యతిరేకించేవారే ఉన్నారని సొంతపార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఆమె ధోరణి, వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పలుమార్లు పార్టీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మక్కువ మండలంలోని ఆమె వ్యతిరేక వర్గం..కేవలం కూటమి ఎంపీ అభ్యర్థికి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. పాచిపెంట మండలంలోనూ పార్టీ కేడర్కు గతంలో ఆమెతో విభేదాలున్నాయి. పార్టీలోని సొంత వర్గీయులే కాదు..వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసే వరకూ ఆమె నిద్రపోరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ గతంలో సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ చాలదన్నట్లు కులవివాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంటా బయటా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి..ఎని్నకల్లో ఎలా ముందుకు వెళ్తారో అన్న చర్చ సాగుతోంది.పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశవిుస్తే అది చేస్తా..ఇది చేయిస్తా అంటూ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న గుమ్మిడి సంధ్యారాణి కొద్దిరోజులుగా ఊదరగొడుతున్నారు. కనీసం తాను ఎమ్మెల్సీగా పదవిని అనుభవించిన ఆరేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆరేళ్లు ఎమ్మెల్సీగా చేసినా నియోజకవర్గానికి ఆమె చేసింది శూన్యం. తాగునీరు, ఇతర అవసరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆమె చెబుతుంటే అధికార పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కనీసం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆమె ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు.పదవిలో ఆమె ఉన్నది ప్రజల శ్రేయస్సు కాద ని, ఆమె స్వలాభం కోసమేనని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. సాలూరులో ఆటోనగర్ను అభివృద్ధి చేస్తామని, లారీ పరిశ్రమను ఆదుకుంటామని స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాంలో హామీ ఇచ్చారు. బైపాస్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా వాటి సాధన కోసం ఆమె ఏనాడూ పట్టుబట్టలేదు. టీడీపీ హయాంలో ఏజెన్సీలో గిరిజ నుల మరణాలు అధికంగా సంభవించాయి. ఒక్క కరాసవలసలోనే డెంగీ జ్వరాలతో 10 రోజుల వ్యవధిలో 11 మంది వరకు చనిపోయారు. కొదమ పంచాయతీ గిరిశిఖర సిరివర గ్రామం నుంచి డోలీలో గర్భిణిని తీసుకువస్తే..మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. దీంతో మానవహక్కుల సంఘం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.ఎన్నికల ముందు హడావుడిసాలూరులో వంద పడకల ఆస్పత్రికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి సంధ్యారాణి హడావుడిగా భూమి పూజ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. కందులపథం బ్రిడ్జికి కూడా ఎన్నికలకు ముందు కొబ్బరికాయ కొట్టి పనులు చేయకుండా వదిలేశారు. సొంత మండలాన్నే ఆమె ఏనాడూ పట్టించుకున్న పా పాన పోలేదని..ఇంక నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ‘తెలుదేశం పార్టీలోని ఓ వర్గం ప్రశ్ని స్తోంది. తన పదవీ కాలంలో అంటీముట్టనట్లుగానే ఆమె కాలం గడిపేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు తాము కూడా అలాగే ప్రవర్తిస్తామని ఆ పార్టీ నేతలు, క్యాడర్ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. -
హలో..ఓటెయ్యాలి..రండి..!
● వలస ఓటర్లపై అభ్యర్థుల ఆశలు ● ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు ● ఒకరోజు ముందే వచ్చేలా రవాణా ఏర్పాట్లు ● గ్రామాల్లో వేడెక్కిన రాజకీయంవీరఘట్టం: సార్వత్రిక ఎన్నికలు సమీస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తుండగా వారికి మద్దతుగా కార్యకర్తలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఓటర్లను కూడగట్టడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని, ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. గెలుపు ఆశతో ఉన్న అభ్యర్థుల తరఫున బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల నియోజకవర్గం బాధ్యులు ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉండి ఉపాధి,ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. వారి బంధువులు, స్నేహితులు, తమ అనుచరులతో వలస ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారితో మాటలు కలుపుతున్నారు. హలో..మే 13న ఎలక్షన్ ఉందికదా..త్వరగా వచ్చేయండి. ఒకరోజు ముందుగానే ఊరికి వచ్చేలా రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 25 వేల మంది వలస ఓటర్లు పార్వతీపురం మన్యం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగాల కోసం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని హైదరాబాద్, రాయగడ, బరంపురం తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మే 13 జరగనున్న పోలింగ్కు ఈ ఓటర్లను ఎలాగైనా తీసుకువచ్చేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.గత సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా వలస ఓటర్లు జిల్లాకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వలస ఓటర్లు ఉన్న గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వారిని ఓటింగ్కు తీసుకురావడానికి అన్ని చర్యలూ చేపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వలస ఓటర్లను రప్పిస్తే తమ విజయావకాశాలు మెరుగుపడతాయనే ఆలోచనలో ఓటమి భయంతో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే వలస ఓటర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
వాహనమిత్ర
ప్రగతిరథ చోదకులకు ● వేలసంఖ్యలో ఉన్న డ్రైవర్లకు చేకూరనున్న లబ్ధి సాలూరు: దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో రవాణా రంగానిదే కీలకపాత్ర. అందులో లారీలు ప్రముఖ స్థానం. ఆ లారీలు నడుపుతున్న డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం. రాష్ట్రాలు దాటి రోజుల పాటు వాహనాలను నడుపుతున్న డ్రైవర్లకు జగన్మోహన్రెడ్డి అండగా నిలవనున్నారు. ఇప్పటివరకు వాహనమిత్ర పథకం కింద అర్హులైన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ ఏటా రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50వేలు అందించారు. తాజాగా జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోలో వాహనమిత్ర పధకాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు టిప్పర్, లారీ డ్రైవర్లకూ వాహన మిత్ర పథకం వర్తింపచేయనున్నారు. అంతేకాకుండా ప్రగతిరథ చోదకులైన డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సాలూరు రెండవ స్థానం రాష్ట్రంలో విజయవాడ తరువాత రెండవ అతిపెద్ద లారీ పరిశ్రమ ఉన్నది సాలూరులోనే. స్థానికంగా క్వారీలు ఉండడంతో టిప్పర్లు కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి. సుమారు 2 వేలకు పైగా లారీలు ఉండగా డ్రైవర్లు వేలసంఖ్యలోనే ఉన్నారు. జగన్మోహన్రెడ్డి తాజాగా లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపచేయనుండడంతో వేలాది మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రగతిరథ చోదకులైన డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమాను అధికారంలోకి రాగానే కల్పించనున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మా గురించి ఆలోచించిన ఏకై క నాయకుడు లారీ డ్రైవర్ల గురించి ఇంతవరకు ఏ నాయకుడూ ఆలోచించలేదు. మా డ్రైవర్ల గురించి ఆలోచించిన ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి. లారీ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపజేస్తామనడం ఆనందంగా ఉంది.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. యుగంధర్, లారీ డ్రైవర్, సాలూరు ముఖ్యమంత్రి చాలా మంచిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా మంచిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడంటూ చంద్రబాబు అవహేళన చేయడం చాలా బాధ కలిగించింది. మా డ్రైవర్లంటే చంద్రబాబుకు అంత చిన్న చూపా? మా డ్రైవర్ల బాధలను అర్థం చేసుకున్న జగన్మోహన్రెడ్డి మేలు మరువలేము. జగన్ అనేక సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరింది. ఇచ్చిన మాట ప్రకారం మా లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహనమిత్ర వర్తింపచేస్తారన్న నమ్మకం మాకు ఉంది. – శ్రీనివాసరావు, లారీ డ్రైవర్, సాలూరు -
మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా
పార్వతీపురం టౌన్: మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ పరిధిలో గల 53 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 8 బార్లలో అమ్మకాలను పరిమితులకు లోబడి సీసీటీవీ నిఘాలో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఐఎంఎఫ్ఎల్ డిపో నెల్లిమర్ల, ఇచ్చాడ నుంచి జీపీఎస్తో అనుసంధానించిన వాహనాల ద్వారా మద్యం సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో భాగంగా 5కేసులు నమోదు చేసి 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.46,250 విలువగల 253 మద్యం సీసాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించిన షాపుల్లో పనిచేస్తున్న 1 సూపర్వైజర్, నలుగు రు సేల్స్మెన్ను విధుల నుంచి తొలగించామన్నా రు. ఎకై ్సజ్ నేరాలు, ఫిర్యాదులపై సమాచారానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం ఉన్నవారు ఫోన్ 9392679980, 8500900923 నంబర్లకు కాల్ చేసి ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని పిలుపునిచ్చారు. మద్యం అక్రమ అమ్మకాలపై ఎకై ్సజ్, ఎస్ఈబీ శాఖల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5కేసుల నమోదు, 8 మంది అరెస్ట్ ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ -
శతశాతం ఓటింగ్ లక్ష్యం
విజయనగరం అర్బన్: జిల్లాలో శతశాతం ఓటింగ్ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్ బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందు కు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతి ఓటరు తమ ఓటును నిర్భయంగా వినియోగించు కోవాల ని కోరారు. ఓటర్లకు మరింత వెసులబాటు కల్పించడంలో భాగంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచినట్టు చెప్పారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం స్వీప్లో భాగంగా నగరంలోని రాజీవ్ స్టేడియం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరు శనివారం నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ స్టేడియం వద్ద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 85 ఏళ్లు వయస్సు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మే 7 నుంచి 10వ తేదీ వరకు హోం ఓటింగ్ నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఓటు వేయడంపై దృష్టి సారించామన్నారు. పరుగులో పాల్గొన్న వారితో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement