ప్రగతిరథ చోదకులకు
● వేలసంఖ్యలో ఉన్న డ్రైవర్లకు చేకూరనున్న లబ్ధి
సాలూరు:
దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో రవాణా రంగానిదే కీలకపాత్ర. అందులో లారీలు ప్రముఖ స్థానం. ఆ లారీలు నడుపుతున్న డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం. రాష్ట్రాలు దాటి రోజుల పాటు వాహనాలను నడుపుతున్న డ్రైవర్లకు జగన్మోహన్రెడ్డి అండగా నిలవనున్నారు. ఇప్పటివరకు వాహనమిత్ర పథకం కింద అర్హులైన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ ఏటా రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50వేలు అందించారు. తాజాగా జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోలో వాహనమిత్ర పధకాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు టిప్పర్, లారీ డ్రైవర్లకూ వాహన మిత్ర పథకం వర్తింపచేయనున్నారు. అంతేకాకుండా ప్రగతిరథ చోదకులైన డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సాలూరు రెండవ స్థానం
రాష్ట్రంలో విజయవాడ తరువాత రెండవ అతిపెద్ద లారీ పరిశ్రమ ఉన్నది సాలూరులోనే. స్థానికంగా క్వారీలు ఉండడంతో టిప్పర్లు కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి. సుమారు 2 వేలకు పైగా లారీలు ఉండగా డ్రైవర్లు వేలసంఖ్యలోనే ఉన్నారు. జగన్మోహన్రెడ్డి తాజాగా లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపచేయనుండడంతో వేలాది మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రగతిరథ చోదకులైన డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమాను అధికారంలోకి రాగానే కల్పించనున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించింది.
మా గురించి ఆలోచించిన ఏకై క నాయకుడు
లారీ డ్రైవర్ల గురించి ఇంతవరకు ఏ నాయకుడూ ఆలోచించలేదు. మా డ్రైవర్ల గురించి ఆలోచించిన ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి. లారీ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపజేస్తామనడం ఆనందంగా ఉంది.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు.
యుగంధర్, లారీ డ్రైవర్, సాలూరు
ముఖ్యమంత్రి చాలా మంచిచేస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చాలా మంచిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడంటూ చంద్రబాబు అవహేళన చేయడం చాలా బాధ కలిగించింది. మా డ్రైవర్లంటే చంద్రబాబుకు అంత చిన్న చూపా? మా డ్రైవర్ల బాధలను అర్థం చేసుకున్న జగన్మోహన్రెడ్డి మేలు మరువలేము. జగన్ అనేక సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరింది. ఇచ్చిన మాట ప్రకారం మా లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహనమిత్ర వర్తింపచేస్తారన్న నమ్మకం మాకు ఉంది.
– శ్రీనివాసరావు, లారీ డ్రైవర్, సాలూరు