-
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
గుంటూరు, సాక్షి: భానుడి భగభగలతో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో.. ఉక్కపోతలతో అల్లలాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి కబురు. వాతావరణంలో మార్పులతో రాబోయే మూడు నాలుగు రోజులు ఎండలు, వడగాలులు తగ్గు ముఖం పట్టనున్నాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.రేపటి నుంచి మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, గుంటూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.అలాగే.. తీవ్ర ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోస్తా, రాయలసీమ జిల్లాల పరిధిలోనూ రెండ్రోజులపాటు(7-9 తేదీల మధ్య) వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష ప్రభావంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయంది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా సింగవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వైఎస్సార్ సీపీ మహా సైన్యం
కార్యకర్తలే.. పట్నంబజారు: ఎగిసి పడుతున్న సముద్రపు అలలకు సైతం ఎదురొడ్డి పోరాడగల సత్తా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సొంతమని.. పార్టీకి కార్యకర్తలే మహా సైన్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని పేర్కొన్నారు. స్థానిక చంద్రమౌళి నగర్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పోరాటాలతో పుట్టిన వైఎస్సార్ సీపీకి పోరు కొత్తేమి కాదని స్పష్టం చేశారు. అచంచల విశ్వాసంతో.. అలుపెరుగని దీక్షతో ముందుకు సాగే ప్రతి కార్యకర్తకు, నేతకు అండగా ఉంటామని హామినిచ్చారు. పశ్చిమ తలరాతను నిర్ణయించే సమయం వచ్చేసిందని, ఈ వారం రోజులే అత్యంత కీలకమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అప్రమత్తం చేశారు. డివిజన్లో ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లి నాయకులంతా కష్టపడి పనిచేస్తున్నారని, ఇలానే ముందుకు సాగితే ఊహించిన దానికంటే గొప్ప ఫలితాన్ని సాధించవచ్చాన్నారు. ఐక్యంగా పనిచేద్దాం.. పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుదామని శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమ పథకాలే రేపటి విజయానికి నాంది పలుకుతాయని స్పష్టం చేశారు. పార్టీ జెండాను భుజాన పెట్టుకుని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే, పార్టీ నగర అధ్యక్షుడు మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. డివిజన్ పరిధిలో ఏమైనా సమస్యలు తలెత్తితే.. తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పశ్చిమ తలరాతను నిర్ణయించే సమయం వచ్చేసింది ఈ వారం.. ప్రతి క్షణం అప్రమమత్తం అవసరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పశ్చిమలోని కార్పొరేటర్లు, నాయకులతో ప్రత్యేక సమావేశం హాజరైన మండలి విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మదాళి గిరి -
పెట్రోల్ బంకు యజమానిపై కేసు నమోదు
చేబ్రోలు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలు బంకులో రాజకీయ పార్టీలకు చెందిన ద్విచక్ర వాహనాల ర్యాలీకి కూపన్ల ద్వారా రూ.2 వందల లెక్కన పెట్రోలు పోస్తున్న బంకు యజమానిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్న్వాడ్ అధికారులు ఆదివారం తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, పొన్నూరు నియోజకవర్గ ఎఫ్ఎస్టీ బృందాలు సంయుక్తంగా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ పరిధిలోని సురేంద్ర ఆయిల్ పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ర్యాలీకి వెళ్లే ద్విచక్ర వాహనాలకు కూపన్లు తీసుకొని రూ.200లు లెక్కన పెట్రోల్ పోస్తున్నట్లుగా గుర్తించారు. పెట్రోలు బంకులో 374 కూపన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా కూపన్లు తీసుకొని రాజకీయ పార్టీల ర్యాలీకి పెట్రోలు పోయటం చట్ట వ్యతిరేక చర్య అని అధికారులు హెచ్చరించారు. దీనిపై బంకు మేనేజర్ను అదుపులోకి తీసుకోవాలని పొన్నూరు నియోజకవర్గ ఎఫ్ఎస్టీ బృందం ఇన్చార్జి వెంకట్రావును అసిస్టెంట్ కలెక్టర్ ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దారు కిరణ్ కుమార్, ఎకై ్సజ్ ఎస్ఐ మహమూద్ ఆసిఫ్, జీఎస్టీ ఆఫీసర్ వైస్.నాగేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన రాజకీయ పార్టీ ర్యాలీ బైక్లకుకూపన్లతో పెట్రోల్ పట్టిన వైనం అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో తనిఖీ -
ఫ్లయింగ్ స్క్వాడ్పై టీడీపీ నాయకుల దౌర్జన్యం
నాదెండ్ల: గణపవరంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చే వారిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్వ్కాడ్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఆ ఇంట్లోకి వచ్చిపోయే వారిని గుర్తించడంతో.. ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బంది ఆ ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నాయకులు స్క్వాడ్కు అడ్డు తగిలారు. ఇద్దరు సిబ్బందిని చొక్కా పట్టుకుని లాగి పడేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్, 7 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ తుషార్ డూడీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల, ప్రజల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లున్నారన్నారు. వీరిలో ఇప్పటికే 9.50 లక్షల మందికి ఓటరు స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశామన్నారు. 3.50 లక్షల ఓటర్లకు ఇప్పటికే ఎపిక్ కార్డులు కూడా అందజేశామని తెలిపారు. త్వరలో అందరికీ ఓటరు స్లిప్పులు అందుతాయని చెప్పారు. జిల్లాలోని పార్లమెంట్, 7 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. హోం ఓటింగ్కు సంబంధించి 85 ఏళ్లు పైబడిన వారు 12,611 మంది, దివ్యాంగులు 17,357 మొత్తం 29,968 మంది ఉన్నారన్నారు. వీరంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారన్నారు. వీరి ఓటరు స్లిప్పులు రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయన్నారు. పోస్టల్ బ్యాలెట్పై ఆందోళన వద్దు... కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 5 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. పీఓ, ఏపీఓ, ఓపిఓలు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చన్నారు. మన జిల్లాలో పనిచేసేవారు ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారని, ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న వారికి ఆయా జిల్లా కలెక్టర్ల వద్ద నుంచి ఫామ్–12ను తెప్పిస్తున్నామని, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి ఇక్కడ ఓటు ఉంటే వారికి కూడా ఫామ్–12ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నామన్నారు. దీనివల్ల ఎవరూ ఓటు హక్కును కోల్పోనవసరం ఉండదన్నారు. ఇప్పటివరకు 5860 ఫామ్–12 దరఖాస్తులు ఇతర జిల్లాలకు పంపగా, మనం ఇతర జిల్లాల నుంచి 5092 తీసుకొచ్చామని చెప్పారు. వారంతా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకుంటారన్నారు. అదనంగా ఈవీఎంలు.. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఇతర జిల్లాల నుంచి అదనంగా ఈవీఎంలను తెప్పించామని కలెక్టర్ తెలిపారు. పార్లమెంట్కు 2239, అసెంబ్లీలకు 1020 తెప్పించామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచే ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు. 1309 పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. 372 పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి ఇప్పటికే 9.50 లక్షల ఓటర్ స్లిప్పులు అందజేశాం ఓటు ఉన్న ప్రతి ఒక్కరికీ స్లిప్పు అందుతుంది పోస్టల్ బ్యాలెట్పై ఆందోళన వద్దు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఇబ్బందులు పడవద్దు: ఎస్పీ సమావేశంలో ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి విధ్వంసకర సంఘటనలు జరగలేదన్నారు. తనిఖీ బృందాలతోపాటు పోలీస్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. కొన్ని గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశముందని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
ఒంగోలు లోక్సభ అదనపు ఈవీఎంలకు ర్యాండమైజేషన్
వైఎస్ జగన్తోనే బలిజల సంక్షేమం, అభివృద్ధి
సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
పచ్చదండును నమ్మితే నట్టేట మునిగినట్లే..
దర్శి గడ్డ..వైఎస్సార్ సీపీ అడ్డా !
మాటపై నిలబడే జగనన్నకే మా మద్దతు
వైఎస్సార్ సీపీతోనే పేదల సంక్షేమం
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement