-
బీఆర్ఎస్, బీజేపీలను బొందపెట్టాలి
నర్మెట: ‘బీఆర్ఎస్, బీజేపీలను బొందపెడితేనే దేశప్రగతి సాధ్యమవుతుంది.. పదేండ్ల పాలనలో కేసీ ఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కుటుంబ సభ్యులకు దోచిపెడితే.. అదానీ అంబానీలకు మోదీ లక్షల కోట్లు కట్టబెట్టాడు’ అని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్మెట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఉపాధిహామీ తదితర సంక్షేమ పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్సేనని, పథకాల పేరుతో కోట్లు కొల్లగొట్టింది బీఆర్ఎస్ అని అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డిని గెలిపించి రాహుల్గాంఽధీని ప్రధాన మంత్రిని చేస్తే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి అభివృద్ధికి లోటుండదని చెప్పా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, మహిళా అధ్యక్షరా లు బొడికె ఇందిర, పీసీసీ మెంబర్ శ్రీనివాస్రెడ్డి, బాలలక్ష్మి, భూక్య జయరాం, డాక్టర్ రాజమౌళి, గంగం నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
కొడకండ్ల : పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లి.. అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జనగామ డీసీపీ సీతారాం అన్నారు. శుక్రవారం గిర్నితండాలోని చెక్పోస్ట్ను సందర్శించిన ఆయన వాహనాల తనిఖీని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మాట్లాడు తూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై బండి శ్రావణ్కుమార్, ఇందిర సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: వేసవి క్రీడా శిబిరాన్ని సద్వి నియోగం చేసుకుని తమలోని ప్రతిభ, నైపుణ్యాలకు మరింత పదును పెట్టాలని డీవైఎస్ఓ వెంకట్రెడ్డి అన్నారు. పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించే వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అథ్లెటిక్స్ శిక్షణ ఉదయం 6 నుంచి 7 30, సాయంత్రం 5 30 నుంచి 6 30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, వాలీబాల్ క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధర్మకంచ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ ఐ సెక్రటరీ పోగుల నరేందర్, పీఈటీ వేణు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగ భద్రత అందరి నైతిక బాధ్యతదేవరుప్పుల : విద్యుత్ వినియోగ భద్రత ప్రతీ ఒక్కరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్పీ డీసీఎల్ డీఈ కె.లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థాని క సబ్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో గాలిదుమారం వచ్చినప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోతే సంబంధిత శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలే తప్ప రైతులు సొంత ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. అనంతరం వారోత్సవాల లక్ష్యసాధ నకు సంబంధించి వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఏడీఈ అనిల్కుమార్, ఏఈలు పి.సుధాకర్, ఎం.రాజవర్దన్రెడ్డి, సబ్ఇంజనీర్లు సోనియా, ఉదయ్, ఎల్ఐలు సత్యనారాయణ, సురేంద్రెడ్డి, లైన్మెన్లు రాజేశ్వర్ రోశయ్య పాల్గొన్నారు. సబ్స్టేషన్ను సందర్శించిన డైరెక్టర్ స్టేషన్ఘన్పూర్: మీదికొండ విద్యుత్ సబ్స్టేషన్ ను నోడల్ అధికారి, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ సదర్లాల్ శుక్రవారం సందర్శించారు. ఓల్టేజీ హెచ్చు తగ్గులు, విద్యుత్ సరఫరా, అంతరా యాలు తదితరాలను పరిశీలించారు. విద్యుత్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విద్యుత్ అంతరాయాలకు కారణాలు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. డీఈ హుస్సేన్నాయక్, లైన్మన్ గబ్బెట సుధాకర్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఐపీసీ అండ్ రాక్ సీజీఎంగా తిరుమలరావు హన్మకొండ: సీజీఆర్ఎఫ్ వరంగల్ ఇన్చార్జ్ చైర్మన్గా కొనసాగుతున్న కె.తిరుమల్రావును టీఎస్ ఎన్పీడీసీఎల్ ఐపీసీ అండ్ రాక్ చీఫ్ జనరల్ మేనేజర్గా నియమించారు. ఈమేరకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించి న తిరుమల్రావుకు సీజీఎం (ఆపరేషన్) కిషన్, జీఎం మల్లికార్జున్, డీఈలు బి.సామ్యానాయ క్, రాంబాబు, శ్రీధరచారి, ఏడీఈలు కిరణ్, మధుకర్, అశోక్, ఈఈ జనార్దన్, అధికారులు, ఆయా సంఘాల నాయకులు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. -
అగ్నిగుండం
జనగామ: జిల్లా అధిక ఉష్ణోగ్రతలతో అగ్నిగుండంగా మారింది. ఐదు రోజుల క్రితం 45 డిగ్రీల సెల్సియస్ దాటిన టెంపరేచర్.. శుక్రవారం 46.1 డిగ్రీలకు చేరింది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. ప్రజలు డీ హైడ్రేషన్కు గురవుతుంటే.. తాగునీరులేక మూగ జీవాలు, పక్షులు అల్లాడి పోతున్నాయి. జఫర్గఢ్లో అత్యధికం జఫర్గఢ్లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రఘునాథపల్లి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ పరిధిలో 45 నుంచి 46 డిగ్రీలు దాటింది. ఆయా మండలాలకు రెడ్జోన్తో వార్నింగ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. మరో నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలుమండలం ప్రాంతం కనిష్ట గరిష్టం జఫర్గఢ్ జఫర్గఢ్ 35.9 46.1 రఘునాథపల్లి రఘునాథపల్లి 34.9 46.0 జనగామ వడ్లకొండ 34.4 46.0 పాలకుర్తి గూడూరు 36.5 45.5 స్టేషన్ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్ 34.7 45.0 బచ్చన్నపేట బచ్చన్నపేట 35.0 44.9 చిల్పూరు మల్కాపూర్ 37.0 44.2 కొడకండ్ల కొడకండ్ల 34.6 44.1 దేవరుప్పుల కోలుకొండ 35.2 43.0 లింగాలఘణపురం లింగాలఘణపురం 34.3 43.0 నర్మెట నర్మెట 33.1 42.6 తరిగొప్పుల అబ్దుల్నాగారం 35.4 42.5ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. శరీరం డీ హైడ్రేషన్కు గురి కాకుండా మజ్జిగ, ఉప్పుతో కలిపిన నిమ్మరసం, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు తీసుకోవాలి. అత్యవసరంగా బయటకు వెళ్తే గొడుగు, ముఖానికి టవల్, తలపై టోపీ, వదులుగా ఉన్న కాటన్ వస్త్రాలు ధరించాలి. వడదెబ్బకు గురైన వారికి మైగ్రేడ్ ఫీవర్, వాంతులు, విరేచనాలు, సోడియం, పొటాష్ తగ్గిపోయి కాళ్ల నొప్పులు, పెదాలు పగిలి పోవడం లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉంటే శీతల ప్రదేశానికి తరలించి చల్లని నీటితో శరీరానికి కాస్త ఉపశమనం కలిగించాక.. దగ్గరలో ఉన్న పీహెచ్సీకి తీసుకువెళ్లాలి. తాగునీరు ఎక్కువగా తీసుకోవాలి. పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు వెళ్లి తెచ్చకోవచ్చు. – డాక్టర్ సుగుణాకర్రాజు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్తజిల్లాలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు రెడ్ జోన్లో ఐదు మండలాలు ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం విలవిల్లాడి పోతున్న మూగ జీవాలు -
పోస్టల్, హోం ఓటింగ్ షురూ..
జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన పోస్టల్, హోం పోలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఎన్నిక ల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహ్తి స్తున్న బాధ్యులు పోస్టల్, ఇంటింటికీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగించారు. దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, ఎసెన్షియల్ సర్వీసెస్ విధులు నిర్వరిస్తున్న వారికి ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగుల కు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. జిల్లాలో హోం ఓటింగ్కు అర్హత కలిగిన ఓటర్లు 950, పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులు సుమారు 2,600 మంది ఉన్నారు. ఇందులో మొదటి రోజు రెండు కేటగిరీల్లో 420 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా.. మరో రెండు రోజుల సమయం ఉంది. మొదటి రోజు 420 ఓట్లు పోలింగ్ -
ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి
జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవా రం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీ య పార్టీల సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బరిలో 39 మంది, వరంగల్(ఎస్సీ నియోజకవర్గం)లో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదనపు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశామని, ఇందుకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఈవీఎంలకు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించి నియోజకవర్గాల వారీగా కేటాయించినట్లు పేర్కొన్నారు. జనగామ నియోజ కవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు 695, స్టేషన్ఘన్పూర్ 295 పోలింగ్ కేంద్రాలకు 738 బ్యాలెట్ యూనిట్లు, పాలకుర్తి 296 పోలింగ్ కేంద్రాలకు 740 బ్యాలెట్ యూనిట్లు కేటా యించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాస్కర్, రావెల రవి, విజయభాస్కర్, చంద్రశేఖర్, అజయ్కుమార్, కలెక్టరేట్ ఏఓ రవీందర్, ఎన్నికల సెల్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం ప్రతినిధి బాలు, సతీష్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం(రిటర్నింగ్ అధికారి)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు నమోదు చేసే విధానాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,003 మంది పోస్టల్ బ్యాలెట్లు వేయాల్సి ఉందని, ఇందుకు నియోజకవర్గాల వారీగా ఫెసిలి టేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎలక్షన్ కమిషన్ పంపించిన ఎస్ఎంఎస్ చేరవేశామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, ఆర్డీఓ కార్యాలయ ఏఓ ప్రకాష్రావు, తహసీల్దార్ అహ్మద్ ఖాన్, పోలింగ్ సిబ్బంది ఉన్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహణ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement