-
‘ముడుపుల చెల్లింపులు అవాస్తవం’
కాజీపేట అర్బన్: జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి వసతి గృహ సంక్షేమాధికారులు, హెడ్ మాస్టర్లు ముడుపులు చెల్లించినట్లు వస్తున్న ఆరోపణలు అ వాస్తమని వసతి గృహ సంక్షేమాధికారులు, హెడ్ మాస్టర్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలోని గిరి జన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం వసతి గృహ సంక్షేమాధికారులు, హెడ్ మాస్టర్లు మాట్లాడారు. అదనపు బాధ్యతలు నిర్వహించడం భారమైనా నిర్వహిస్తున్నామని, ఇందుకు ముడుపులు చెల్లించడం అవాస్తమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారులు, హెడ్ మాస్టర్లు జ్యోతి, కృష్ణ, తిరుమల, విజయలక్ష్మి, రజని, రమాదేవి, రాజారావు, శంకర్కుమార్ పాల్గొన్నారు. -
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి వార కల్యాణం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈఓ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణామాచార్యుల వేద మంత్రాల నడుమ కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. 47 మంది గైర్హాజరుజనగామ రూరల్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు రెండో రోజు 47 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరాజు తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఎస్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్లకు పరీక్షల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పలు సూచనలు చేశారు. ఉదయం జరిగిన పరీక్షలో జనరల్ విద్యార్థులు 278 కు గాను 253 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 116 మందిగాను 102 హాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు గాను జనరల్ విభాగంలో 105 మంది విద్యార్థులకు గాను 97 మంది పరీక్షలకు హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 33 మందికి 37 హాజరయ్యారు.ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి జనగామ రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు డి. సుమ అధ్యక్షతన ఫీజు నియంత్రణ చట్టం–అవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం మంత్రుల సబ్ కమిటీ వేసి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ప్రకారం ఉచిత విద్యా అందించాలన్నారు. ప్రతీ ప్రైవేట్ విద్యా సంస్థలో 25 శాతం ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. నింబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, యూసఫ్, అజయ్, విప్లవ్, శ్రీకాంత్, శ్రవన్ తదితరులు పాల్గొన్నారు. విత్తన కొనుగోలులో జాగ్రత్తలు పాటించండిలింగాలఘణపురం: విత్తనాల కొనుగోలులో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని డీఏఓ వినోద్కుమార్ కోరారు. శనివారం మండలంలోని నేలపోగులలో రైతులకు విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ముఖ్యంగా పత్తి విత్తనాల కొనుగోలులో ప్యాకెట్లు లేకుండా లూజు విత్తనాలు కొనవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మా త్రమే కొనుగోలు చేయాలని, బిల్లుల్లో తయారీ తే దీ, ఎక్స్పైరీ తేదీలను చూడాలని, బిల్లు రశీదులను పంట చేతికొచ్చే వరకు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జీఈఏసీ (జెనిటిక్ లైసెన్స్ నంబర్) ఉండే విధంగా చూసుకోవాలని, ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయించినట్లు అనుమానం వస్తే ఏఈ, ఏఈఓలకు సమాచారం అందజేయాలని సూచించారు. డీఏఓతో పాటు ఏఓ వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల్లో ఏఈఓలు శ్రీనివాసు, స్పందన, అపూర్వ, సౌజన్యతో పాటు రైతులు పాల్గొన్నారు. -
ఉన్నత చదువులకు ‘దోస్త్’
జనగామ రూరల్: పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెల్లడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ‘దోస్త్’ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి దశ ప్రవేశాల నమోదు ఈ నెల 25తో ముగియగా రెండు, మూడో దశ ప్రవేశాల నమోదుకు జూన్ 25 వరకు అవకాశం ఉంది. ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జిలాల్లో 10 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. పేరొందిన ఏకై క ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లా కేంద్రంలో ఉంది. ఇందులో అన్ని రకాల వసతులు, ఉత్తమ అధ్యాపకులచే బోధన అందిస్తున్నా రు. గతంలో 541 పైగా అడ్మిషన్లు వచ్చాయి. గత సంవత్సరం 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాల గ్రంథాలయంలో 26వేల పుస్తకాలు ఉన్నాయి. గత ఏడాది కళాశాలకు చెందిన విద్యార్థులు పొలిటికల్ సైన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించి 25 వేల నగదు ప్రోత్సాహకం అందుకున్నారు. ప్లేస్మెంట్ ద్వారా కళాశాలకు చెందిన 88 మంది వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వీరిలో ఐదుగురు భారత నేవీలో ఉద్యోగం సాధించారు. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ డిగ్రీలో ప్రత్యేక పథకాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొంది మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కమిషనర్ ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. ప్రతీ గ్రూప్లో యూనివర్సిటీ టాపర్కు ఉచిత ల్యాప్టాప్, అలాగే ప్రతీ సబ్జెక్టులో జిల్లా టాపర్కు రూ.3,000 నగదు బహుమతి ఇస్తారు. జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ సీటు పొందిన వారికి రూ.50,000 నగదు ప్రాత్సాహకం అందజేస్తారు. ప్రారంభమైన డిగ్రీ ప్రవేశాలు పూర్తయిన మొదటి విడత నమోదు ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక వసతులు‘దోస్త్’ ప్రవేశాల వివరాలు మొదటి దశ : ప్రవేశాల నమోదు ఈనెల 25 వరకు అవకాశం. వెబ్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన మే 24, 25. సీట్ల కేటాయింపు జూన్ 3న. రెండో దశ : ప్రవేశాల నమోదు జూన్ 4 నుంచి 13 వరకు. వెబ్ ఆప్షన్లు జూన్ 4 నుంచి 14 వరకు. సర్టిఫికెట్ల పరిశీలన 13 వరకు. సీట్ల కేటాయింపు జూన్ 14న. మూడో దశ : ప్రవేశాల నమోదు జూన్ 19 నుంచి 25 వరకు. వెబ్ ఆప్షన్లు ఆగస్టు 19 నుంచి 25 వరకు. సర్టిఫికెట్ల పరిశీలన 26న. సీట్ల కేటాయింపు 29న. కళాశాలల్లో అన్ని దశల సీట్ల కేటాయింపు తర్వాత స్లైడింగ్ ముగిశాక ఫైనల్ రిపోర్ట్తో తరగతులు ప్రారంభమవుతాయి. -
నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తా..●
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి జనగామ: విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశానని, ఒక్కసారి అవకాశం కల్పిస్తే నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో లైబ్రరీ, కోర్టు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీలో ధర్మం కోసం నిబద్ధతతో పనిచేశానని ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.మోడి సహకారంతో స్వయం సమృద్ధి నిరుద్యోగులకు అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి,ఉడుగుల రమేష్, సౌడ రమేష్, శివరాజ్ యాదవ్, మహంకాళి హరిచంద్రగుప్త, పెద్ది శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్●
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించిన బీఆర్ఎస్ దొందూదొందేనని, హామీలను విస్మరించి యువతను, నిరుద్యోగులను దగా చేశాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుతోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బూర్ల శంకర్, ఇనుగాల వెంకటేశ్వర్రెడ్డి, తోట సత్యం, దుంపల పద్మారెడ్డి, గట్టు రమేష్, సింగపురం వెంకటయ్య, గాండ్ల రాజు, కిషన్రాజ్, సంపత్, కొంతం శ్రీను, జీడి రమేష్, గుర్రం ఫాతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ల జోరు
జనగామ: ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో బెట్టింగ్ల జోరు కొనసాగింది. తొలి క్వాలీఫయర్లో తడబడిన సన్రైజర్స్...ఆర్ఆర్తో జరిగిన పోరులో సత్తాచాటుకుంది. పరుగులు వేటలో తడబడిన ఎస్ఆర్హెచ్.. 175 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ టీం ముందు ఉంచింది. పరుగులు ఎక్కువగా అనిపించినా... ప్రస్తుత సీజన్లో 200 పైచిలుకు స్కోర్ చాలా చిన్నదిగా మారిపోయింది. దీంతో సన్రైజర్స్ ఫైనల్కు అర్హత సాధిస్తుందా లేదా అనే టెన్షన్.. అభిమానులను కలవర పాటుకు గురి చేసింది. అభిమానుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగి భారీగా డబ్బుల వసూళ్లకు తెరలేపినట్లు ప్రచారం జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే.. బెట్టింగ్ రాయుళ్లతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరిగింది. స్థానికంగా ఉన్న ఏజెంట్ల సహకారంతో ఐపీఎల్లో బెట్టింగ్ దందా కొనసాగినట్లు సమాచారం. ఓవర్లు, సిక్స్, వికెట్.. పవర్ ప్లేలో చేసే స్కోర్ ఎంత ఇలా ఒక్కో కేటగిరి వారీగా రూ.1000 నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్కు పాల్ప డినట్లు చర్చకు దారి తీసింది. ఆన్లైన్ రమ్మీ, మట్కాకు అలవాటు పడిన వారితో పాటు యువకులు, ఆయా వర్గాలకు చెందిన కొత్తవారు సైతం అత్యాశకు పోయి ఐపీఎల్ బెట్టింగ్లో లక్షలకు లక్షలు పోగొట్టుకుని చేతులు కాల్చుకుంటున్నారనే ప్రచారం లేకపోలేదు. వాట్సాప్ కాల్ చేస్తూ.. హైదరాబాద్ కేంద్రంగా జనగామలోని పలువురు ఏజెంట్ల సహకారంతో యువతను టార్గెట్ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్, తదితర విద్యాభ్యాసం చేస్తున్న యువతకు వా ట్సాప్ కాల్ చేస్తూ.. బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నారని తెలుస్తోంది. ఒకటికి రెండు... రూ. 100కు రూ.100 అంటూ సినిమా ట్రయల్ చూపిస్తూ.. జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఇందులో చాలా మంది విధి లేని పరిస్థితిల్లో బెట్టింగ్ జూదం అలవా టు చేసుకుని.. దానికి బానిసలుగా మారిపోతున్నా రు. జిల్లా కేంద్రంలోనే లక్షల్లో బెట్టింగ్ జరుగుతుందన్న ప్రచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాల్ బాల్కు పెరిగిన బెట్టింగ్ చైన్నె చపాక్ స్టేడియంలో ఈ నెల 24న రాజస్తాన్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన రెండవ క్వాలీఫయర్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఇ క్కడే బెట్టింగ్ ముఠాలకు కాసులు కురిపించగా... అత్యాశకు పోయిన అమా యకులు జేబులు ఖాళీ చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగా... రాజస్తాన్ విజయం ఖాయమని అంతా భావించారు. మెజార్టీ వర్గాలు రాజస్తాన్ విజయం సాఽ దిస్తుందని లక్షల రూపాయలు బెట్టింగ్కు పాల్పడగా...79 పరుగులకు చేరుకునే సరికి ఆర్ఆర్ 5 వికెట్ల కోల్పోవడంతో బెట్టింగ్ జూదం కాస్త సన్రైజర్స్ వైపు తిరిగింది. మొదటగా రాజస్తాన్ వైపు బెట్టింగ్కు దిగిన వారితో పాటు మరికొందరు ఎస్ఆర్హెచ్ వైపు మొగ్గు చూపారు. మ్యాచ్ 15వ ఓవర్ నుంచి ఓవర్, మూడు బాల్స్, వికెట్, సిక్స్ ఇలా కేటగిరీ వారీగా వన్టైంలోనే రూ.లక్షకు బెట్టింగ్కు దిగిన వారు ఉన్నారని పట్టణంలో ప్రచారం జరుగుతుంది. చివరి 8 బాల్స్లో ప్రతీ బాల్కు బెట్టింగ్ జరిగినట్లు మాట్లాడుకుంటున్నారు. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం సాధించి.. ఫైనల్ పోరుకు అర్హత సాధించగా... ఇందులో గెలుపోటములపై అప్పుడే బెట్టింగ్లు మొదలయ్యాయి. బయటకు చెప్పు కోలేక.. ఐపీఎల్ క్రికెట్ పుణ్యమాని వందలాది కుటుంబాలు మానసిక వేదనకు గురవు తున్నారు. ఇంట్లోని కొంతమంది కుటుంబ సభ్యులు బెట్టింగ్కు బానిసలుగా మారిపోతూ... లక్షలు పోగొట్టుకుంటున్నారు. గతంలో బెట్టింగ్లో ఆ త్మహత్యాయత్నాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న తప్పిదాలతో బయటకు చెప్పుకోలేక మదన పడిపోతున్నారు. అప్పులిచ్చిన వారు ఇంటిపైకి వచ్చి గొడవలకు దిగు తుండడంతో తల తాకట్టు పెట్టి కొడుకుల రుణం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు పాకిన బెట్టింగ్ మహమ్మారి.. పరిస్థితి ఇలాగే ఉంటే... కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఇళ్లు, వ్యవసాయ భూములు సైతం తాకట్టుపెట్టే ప్రమాదం లేకపోలేదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసు శాఖ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ఉత్కంఠ రేపిన క్వాలిఫయర్ మ్యాచ్ హైదరాబాద్ కేంద్రంగా జిల్లా నుంచి దందా...! చివరి మూడు ఓవర్లలో రూ. వేలు, లక్షల్లో బెట్టింగ్ ఫైనల్కు రంగంలోకి దిగిన ఏజెంట్లు? -
కాంగ్రెస్, బీజేపీలకి గుణపాఠం తప్పదు
స్టేషన్ఘన్పూర్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో దగాకోరు కాంగ్రెస్, బీజేపీలకి గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని తాటికొండ, శివునిపల్లి గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దపు హామీలతో కాలం గడుపుతున్నాయన్నారు. పట్టభద్రులు ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల కుమార్, తాటికొండ సురేష్, కనకం గణేష్, అక్కినపెల్లి బాలరాజు, గాదె చిట్టిబాబు, గుర్రం యేసుబాబు, మాతంగి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ: ఈ నెల 27న నిర్వహించనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ తో కలిసి పోలింగ్ నిర్వహణపై నోడల్ అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రూట్ అధికారులు, సెక్టార్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. జనగామ, ఘన్పూర్ (స్టేషన్) డివిజన్ల వ్యాప్తంగా (23,419) మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బ్యాలెట్ జారీ, తదుపరి కౌంటర్ ఫైల్ పై ఓటరు సంతకం తీసుకోవాలన్నారు. పురుష, మహిళా ఓటర్ల సంఖ్యను నమోదు చేయాలని, బ్యాలెట్ పేపరును ఓటరుకు ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్లను ఓపెన్ చేసి చూపాలన్నారు. ఓటరుకు ఎడమ చేతి మధ్య వేలుకు ఇండిబుల్ ఇంకు పెట్టాలన్నారు. నేడు మెటీరియల్ పంపిణీ నేడు కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) జరుగుతుందని, అదే రోజు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. వ యోవృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో వీ ల్ చైర్లు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అంతకుముందు పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల సీలింగ్ విధానంపై ఎన్నికల అధికారులందరికీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, పీఓ లు, ఏపీఓలు, ఓపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కౌలు రైతులకు రూ.12 వేలు ఇవ్వాలి
జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూమి లేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ.12 వేలు చెల్లింపు తక్షణం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లా ప్లీనంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు రూ.12 వేలు, మహిళలకు రూ.2,500, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. అర్హులందరికీ తెల్ల రేషన్కార్డులు, ఉపాధి డబ్బులు పెండింగ్లో పెట్టి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. -
కేసీఆర్ నిరంకుశ పాలనతోనే నిరుద్యోగ సమస్య
స్టేషన్ఘన్పూర్: కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ పాలనతోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అఽఽధికమైందని నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. డివిజన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల్ని పట్టించుకోలేదని, 46 జీఓతో ఉద్యోగుల గొంతు నొక్కారన్నారు. తాను బ్లాక్మెయిలర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదని ఎద్దేవా చేశారు. ‘నీ అయ్య కేసీఆర్ పాస్పోర్టు బ్రోకరని, నీ అక్క కవిత లిక్కర్స్కామ్లో ఊచలు లెక్కబెడుతున్నా సిగ్గు రాలేదా’ అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ, కేయూ విద్యార్థులు కీలక భూమిక పోషించారని, రాష్ట్ర ఏర్పాటుకు, నీ అయ్య సీఎం కావడానికి ఆ ఉద్యమాలే కారణమని అన్నారు. దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్ని డబ్బులు పంచి నా తీసుకోండి.. ఆ డబ్బంతా ప్రజలను దోపిడీ చేసిందే అని పట్టభద్రులకు సూచించారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓట్లు వేయాలని, దగాకోరు బీఆర్ఎస్, బీజేపీకి గుణపాఠం చెపుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పట్టభద్రులను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ శోభ, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, నాయకులు సీహెచ్.నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, శిరీష్రెడ్డి, బూర్ల శంకర్, జగదీష్చందర్రెడ్డి, లింగాజీ, దిలీప్రెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి, తోట సత్యం, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న -
మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలి
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జనగామ మండలం పెంబర్తి మహిళా మండలి భవనంలో స్కూల్ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి దుస్తులు విద్యార్థులకు అందేలా చూడాలని, స్టిచ్చింగ్లో నాణ్యత పాటించాలని సూచించారు. సిద్ధమైన యూనిఫాంను విద్యార్థికి ధరింపజేసి పరిశీలించారు. డీఆర్డీఓ మొగులప్ప మాట్లాడుతూ.. 3,117 యూనిఫాంలు కుట్టించి ఇవ్వడానికి సిద్దెంకి, పెద్దపహడ్, చౌడారం, పెంబర్తి కేంద్రాల్లో ఇచ్చామని, ఇప్పటి వరకు 800 దుస్తులు సిద్ధమయ్యాయని చెప్పారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలో తాగు నీటి సదుపాయం కోసం చేపట్టిన పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్కుమార్, ఏపీఎం కవిత, సీసీలు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత
● సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేసింగ్ జనగామ: పట్టణంలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఐఈఆర్ పోర్టల్ ద్వారా ట్రేసవుట్ చేసి శుక్రవారం అప్పగించారు. స్థానిక పోలిస్టేషన్లో ఏసీపీ అంకిత్కుమార్ చేతుల మీదుగా 19 మందికి ఫోన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణించే సమయంలో, అలాగే చోరీకి గురైన సందర్భంలో వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) వెబ్సైట్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలన్నారు. దీంతో పోయిన సెల్ఫోన్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. బాధితులు మొదట అదే నంబర్ కొత్త సిమ్ తీసుకుని మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత www.ceir.gov.in వెబ్ సైట్లో లాగిన్ చేసి అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టాలెన్ మొబైల్ లింకును క్లిక్ చేసిన తర్వాత పోయిన సెల్ ఫోన్ ఐఎంఈ నంబర్, కంపెనీ పేరు, మోడల్, కొనుగోలు చేసిన రశీదు, మీసేవ దరఖాస్తు రశీదు నంబర్ అప్లోడ్ చేసి ఎక్కడ పోగొట్టుకున్నారనే(రాష్ట్రం, జిల్లా, పోలిస్టేషన్ పరిధి, వినియోగదారుడి పేరు, చిరునామా) వివరాలు పొందు పర్చాలన్నారు. ఇలా చేయడం వల్ల వెంటనే ఫోన్ ఐఎంఈ నంబర్ బ్లాక్ అవుతుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక పోలీస్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు 120 ఫోన్లను తిరిగి అప్పగించామని, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను కనుగొన్న కానిస్టేబుల్ సురేష్ను ఏసీపీ, సీఐ అభినందించారు. సీఐ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
చిటుకు రోగం నివారణకు టీకాలు
జనగామ: గొర్రెల్లో చిటుకు రోగ నివారణకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో టీకా కార్యక్ర మం ప్రారంభమైంది. నాలుగేళ్ల క్రితం జిల్లా పరిధి 59 గ్రామాల్లో గొర్రెలకు చిటుకు రోగం వ్యాపించడంతో నివారణకు ఐదేళ్ల పాటు వరుసగా ముందస్తు టీకాలు వేయడానికి నిర్ణయించారు. చిటుకు రోగం నిర్ధారణ అయిన గ్రామాల పరిధిలో 2,25, 610 గొర్రెలను గుర్తించారు. బచ్చన్నపేట మండలంలో 26,526, చిల్పూరు 9,601, దేవరుప్పుల 16,582, జనగామ 13,012, కొడకండ్ల 18,501, లింగాలఘణపురం 37,233, నర్మెట 7,899, పాలకుర్తి 26,250, రఘునాథపల్లి 17,195, స్టేషన్ఘన్పూర్ 22,740, తరిగొప్పుల 4,663, జఫర్గఢ్లో 25,410 గొర్రెలకు టీకాలు వేయనున్నారు. వైద్యులను సంప్రదించండి గతంలో చిటుకు రోగం వ్యాప్తి చెందిన గ్రామాల్లో సంబంధిత గొర్రెల యజమా నులు పశుసంవర్ధక శాఖ వైద్యులను సంప్రదించి జీవాలకు టీకాలు వేయించాలని జిల్లా అధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. వర్షాకాలం తొలకరి జల్లులతో పచ్చిగడ్డి మేసే సమయంలో క్లాస్టీడియం బ్యాక్టీరియా సోకడంతో చిటుకు రోగం వస్తుందని చెప్పారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలకు వైద్యం చేయించేలోపే మృత్యువాత పడే అవకాశం ఉంటుందని, ముందుగానే టీకాలు వేయిస్తే మరణాలను నివారించవచ్చన్నారు. 59 గ్రామాల పరిధిలో టీకాలు పూర్తయ్యే వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో 59 గ్రామాల గుర్తింపు 2.25లక్షల జీవాలకు టీకాలు -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి●
బచ్చన్నపేట: ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో కూలీల సంఖ్యను మరింత పెంచాలని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీడీఓ రఘురామకృష్ణతో కలిసి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఈజీఎస్ కూలీలకు ఉపాధి పథకంలో పని కల్పించాలన్నారు. కూలీలు రోజుకు నాలుగు గంటలు తప్పనిసరిగా పనిచేస్తేనే ప్రభుత్వం నిర్ణయించిన వేతనం గిట్టుబాటు అవుతుందని చెప్పారు. పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని తెలిపారు. కొలతల ప్రకారం పనులు జరిగేలా చూస్తూ మస్టర్లను ప్రతీ వారం కార్యాలయంలో అందించడంతోపాటు కూలీల డబ్బులు సకాలంలో పడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుకాణాల్లో స్టాక్ వివరాలు ఉండాలిబచ్చన్నపేట : ఎలక్ట్రికల్, హార్డ్వేర్ దుకాణాల్లో స్టాక్ వివరాలను తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హార్డ్వేర్, ఎలక్ట్రికల్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ షాపుల్లోని స్టాక్ వివరాలు, వస్తువుల గరిష్ట చిల్లర ధర, తయారీ చిరునామా, నెల, సంవత్సరం, కస్టమర్ కేర్ వివరాలు ఏమీ లేవని చెప్పారు. ఇంతకు ముందు తనిఖీ చేసిన సమయంలో హెచ్చరించినా రికార్డులు రాయలేదని, ఆయా దుకాణాలపై ఆరు కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికై నా వివరాలను నమోదు చేయకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూజనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగి న పరీక్షకు జనరల్ విద్యార్థులు 492 మందికి 464, ఒకేషనల్ 280 మందికి 257 మంది, మధ్యాహ్నం పరీక్షకు జనరల్ 264 మందికి 251, ఒకేషనల్ 77 మందికి 76 మంది హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరాజు తెలిపారు. నీటి పారుదలశాఖ ఇన్చార్జ్ ఎస్ఈగా ఓంకార్ సింగ్ హసన్పర్తి: నీటి పారుదలశాఖ వరంగల్ సర్కి ల్ ఇన్చార్జ్ ఎస్ఈగా ఓంకార్సింగ్ను నియమించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇన్చార్జ్ ఎస్ఈగా కొనసాగుతున్న మహబూబాబాద్ ఎస్ఈ వెంకటేశ్వర్లు ను ఆ బాధ్యత నుంచి తప్పించడంతో రామగుండం నీటిపారుదల శాఖ డివిజన్–3లో ఈఈగా వ్యవహరిస్తున్న ఓంకార్సింగ్కు వరంగల్ సర్కిల్ ఇన్చార్జ్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన ను టీఎన్జీఓస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపా రు. టీఎన్జీఓస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజమౌళి, టీఎన్జీఓస్ హసన్పర్తి యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు నవీన్ పాల్గొన్నారు.పోలింగ్ రోజున 144 సెక్షన్ వరంగల్ క్రైం: ఈనెల 27న జరిగే వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని, పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రావొద్దని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరా రు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరిజనగామ: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ భగ్గుమంటోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఐదు రోజులుగా 39 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు తిరిగి 42 డిగ్రీలకు పెరిగా యి. శుక్రవారం జిల్లా పరిధి 10 మండలాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. చిల్పూరు, లింగాలఘణపురం మండలాలకు ఎల్లో అలర్ట్గా ప్రకటించింది. జఫర్గఢ్లో అత్యధికంగా 42.8, అత్యల్పంగా లింగాలఘణపురంలో 39.5 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బచ్చన్నపేట 42.5, రఘునాథపల్లి 42.3, జనగామ 41.5, పాలకుర్తి 40.1, నర్మెట, స్టేషన్ఘన్పూర్, తరిగొప్పుల 41 చొప్పున, కొడకండ్ల 40.6, దేవరుప్పుల 40.2, చిల్పూరు 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
అవగాహనతో అగ్ని ప్రమాదాల నివారణ
● ప్రదర్శనతో వివరించిన సిబ్బంది జనగామ: అవగాహనతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నా రు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో శుక్రవారం అవగా హన సదస్సులు, ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పేలుడు పదార్థాలతో పాటు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు పెట్రోలు, డీజిల్ నిల్వ చేసే ప్రదేశాలల్లో ఎక్కువగా చోటుచేసుకునే అగ్ని ప్రమాద ఘటనలకు సంబంధించి నివారణపై సిబ్బంది ప్రదర్శన ద్వారా వివరించారు. ఆస్పత్రుల్లో పనిచేసే ప్రతీ ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైర్ ప్రొటెక్షన్ సిబ్బంది చేరుకునే లోపు అందుబాటులో ఉన్న ఆస్పత్రి సిబ్బంది స్పందిస్తే ప్రాథమిక దశలోనే మంటలను వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ హరీశ్రాజు, డీఐఓ డాక్టర్ మహేందర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రవీందర్గౌడ్, మాస్ మీడియా అధికారి ఎం.ప్రభాకర్, ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు పాల్గొన్నారు. -
పాలిసెట్ ప్రశాంతం
జనగామ రూరల్/స్టేషన్ఘన్పూర్: జిల్లాలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్–24) శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జనగామ పట్టణంలో నాలుగు, స్టేషన్ఘన్పూర్లో రెండు మొత్తం ఆరు సెంటర్లు కేటాయించగా.. 1,543 మంది విద్యార్థులకు 1,443 మంది(92.02 శాతం) పరీక్ష రాసినట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎ.నర్సయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రీస్తుజ్యోతి సెంటర్కు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయడంతో వెనుదిరిగారు. కనీసం సెంటర్లోకి అనుమతి కోసం అడుగుదామన్నా ఒక్క అధికారి అందుబాటులో లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ సెంటర్ను కోఆర్డినేటర్ నర్సయ్య సందర్శించారు. ఇదిలా ఉండగా.. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 360 మందికి 338, పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లో 60 మందికి 55 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ పోచయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. విద్యార్థులు 10 గంటల వరకే సెంటర్లకు చేరుకున్నారు. 92.02 శాతం మంది హాజరు ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులు గేట్లు మూసి ఉండడంతో నిరాశతో తిరుగు పయనం -
విత్తన కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్ చిల్పూరు/నర్మెట: వానాకాలం పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యవసాయ శాఖ అనుమతులు లేకుండా గుర్తు తెలియని వారు విక్రయించే విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్ అన్నారు. చిల్పూరు మండలం మల్కాపూర్, నర్మెట మండలకేంద్రం, బొమ్మకూర్ గ్రామాల్లో శుక్రవారం విత్తన కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. లూజుగా, విడిగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయొద్దని, వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు ఉన్న దుకాణాల్లో మాత్రమే తీసుకోవాలని చెప్పారు. నచ్చిన విత్తన ప్యాకెట్కు సంబంధించిన పూర్తి సమాచారం, రకం, గడువు తేదీలను రశీదుపై తప్పని సరిగా రాయించాలని పేర్కొన్నారు. అలాగే పంట కాలం పూర్తయ్యే వరకు విత్తనాలకు సంబంధించిన ఖాళీ ప్యాకెట్లను భద్రపర్చుకోవాలని సూచించారు. బీటీ 3, హెచ్టీ విత్తనాల క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరమని, సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. నర్మెటలో రైతు ప్రజ్ఞాపురం శ్రీనుకు చెందిన డ్రిప్ ఆధారిత పత్తి క్షేత్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారులు బూర్ల నర్సింహులు, జగదీష్, అలు గుగులోతు వినయ్కుమార్, భూక్య రేవంత్, మాచర్ల ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. -
జయప్రకాశ్ ట్రోఫీ విజేత జనగామ
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ లాల్బహదూర్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న జయప్రకాశ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా జనగా మ జిల్లా జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ను వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ద ప్రవీణ్ ప్రారంభించారు. ఫైనల్లో ములుగు, జనగామ జిల్లా జట్లు తలపడ్డా యి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జనగామ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ములుగు జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఈ టోర్నీలో ప్రతిభ కనబరి చిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్(మార్షల్) తెలిపారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్లో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. -
వైభవంగా రథోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవుడి రథసేవకుల(పద్మశాలీ కులస్తులు) ఆధ్వర్యాన చేపట్టిన రథో త్సవం సందర్భంగా భక్తులు మంగళహారతులతో స్వామి వారికి స్వాగతం పలికారు. అర్చకులు మత్తగజం నాగరాజు తదితరులు పాల్గొన్నా రు. ఇదిలా ఉండగా.. హనుమాన్ మాల ధరించిన భక్తులు ఉదయం గిరి ప్రదక్షిణ చేశారు. స్ట్రాంగ్ రూంల తనిఖీ జనగామ రూరల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని లోక్సభ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భద్రత, రికార్డు ల నిర్వహణపై సూచనలు చేశారు. కొనుగోళ్లు పూర్తి చేయాలి చిల్పూరు: వర్షాలు మొదలైనందున కేద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోళ్లను ఈనెల 25 వరకు ఽపూర్తి చేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ హెచ్చరించా రు. నష్కల్లోని ఐకేపీ కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తరలింపునకు లారీల కోసం ఎదురు చూడొద్దని, ట్రాక్టర్ల ద్వారా కూడా తరలించాలని చెప్పారు. మిల్లర్లు నిరాకరిస్తే వెంటనే తనకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ఈద రమేష్కుమార్, తహసీల్దార్ సరస్వతి, ఆర్ఐ కల్వల శ్రీనివాస్, పాశం రాధిక, దీప్తి, మోడెం స్వప్న, ఎంపీటీసీ పాశం శిరీషసురేష్, మాజీ సర్పంచ్ స్వప్నవెంకటేష్, రంగు రాజు తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ సెంటర్ల పరిశీలన స్టేషన్ఘన్పూర్: జిల్లాలో నేడు(శుక్రవారం) నిర్వహించే పాలిసెట్–2024 పరీక్షకు సంబంధించి డివిజన్ కేంద్రంలోని రెండు సెంటర్లను ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య, స్పెషల్ అబ్జర్వర్ జి.నరేందర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులను గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని చెప్పారు. రామకృష్ణ, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం పెంచాలి నర్మెట: వర్షాకాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో విరివిగా ప్లాంటేషన్ చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించాలని జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్కుమార్ అన్నారు. స్థానిక జీపీతో పాటు పల్లెప్రకృతి వనాలు, నర్సరీ, డంపింగ్యార్డు, క్రిమిటోరియంను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఆస్తి వివరాలు తెలుసుకుని రికార్డులను పరిశీలించా రు. తడి పొడిచెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. ఇన్చార్జి ఎంపీడీఓ అరవింద్ చౌదరి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. పనులు వేగంగా చేపట్టాలి జఫర్గఢ్: ఉపాధి హామీ పథకం పనులను వేగంగా చేపట్టాలని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, హరితహారం తదితర అంశాల పై పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని, రోజు వేతనం రూ.250 పొందేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి 200 మందికి మించకుండా కూలీలకు పని కల్పించాలని, ఈ విషయంలో జిల్లాలో జఫర్గఢ్ మండలం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఎంపీడీఓ సుమన్, ఏపీఓ రాజకరుణ పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు లింగాలఘణపురం: నాగారం గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన బొట్ల ప్రకాశ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. సదరు బాలికను తల్లిదండ్రులు తీసుకెళ్లక పోవడంతో సఖి కేంద్రానికి పంపినట్లు చెప్పారు. -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
స్టేషన్ఘన్పూర్: మండల పరిధి గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో విద్యుత్ వైర్లు తెగి పలు గ్రామాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాంనూర్, నమిలిగొండ, శివునిపల్లి, ఇప్పగూడెం, తాటికొండ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గురువా రం ఉదయం రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడానికి అష్టకష్టాలు పడ్డారు. ధాన్యం తడిసిందిరెండున్నర ఎకరాల్లో వరి సాగుచేశాం. పంట కోసం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి బుధవారం మధ్యాహ్నం తీసుకువచ్చాం. ఒక్కరోజు ఆగితే కాంటా అయ్యేది. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా వచ్చిన వానతో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులగోసను అధికారులు గుర్తించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. – చెరుకు ఉపేంద్ర, రైతు, పాంనూర్ -
నేటినుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ పరీక్షలు
జనగామ రూరల్ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీ య సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం(24వ తేదీ) నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు సంబంధించి వివరాల ను డీఐఈఓ ఆంజనేయరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 3,990 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారని, ఇందులో ఫస్టియర్ 2,384, సెకండియర్ 1,606 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఫస్టియర్ జనరల్ 1,879, ఒకేషనల్ 505, సెకండియర్ జనర ల్ 1,230, ఒకేషనల్ 376 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత కళాశాలలో హాల్టికెట్లు తీసుకోవాలని, వెళ్లలేని వారు https.tsbie.cgg.in ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఏమైనా తప్పులుంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు. ఇవీ పరీక్ష కేంద్రాలు.. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు 11 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో జనగామలో స్టేషన్రోడ్డు ప్రభుత్వ బాలికల కళాశాల, కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ధర్మకంచ, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, ఏబీవీ జూనియర్ కళాశాల, ప్రెస్టెన్ జూనియర్ కళాశాల ఉన్నాయి. అలాగే స్టేషన్ఘన్పూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షమే గురుకుల బాలుర కళాశాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్గఢ్, పాలకుర్తి జూని యర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికారుల నియామకం.. డీఐఓ ఆంజనేయరాజు ఆధ్వర్యంలో డెక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. ఒక కస్టోడియన్ అధికారి, 11 మంది చొప్పున సీఎస్లు, డీఓలు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు ఒక్కొక్కటి, హెపర్ కమిటీ పర్యవేక్షిస్తుందని డీఐఓ తెలిపారు. 3,990 మంది విద్యార్థులు.. 11 సెంటర్లు ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరాజు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
జనగామ రూరల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, నాణ్యమైన విత్తనాలు అమ్మాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీ సీతారాం, ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి వానాకాలం పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 237 విత్తన దుకానాలు, 238 ఎరువులు, 183 పురుగు మందుల షాపులు ఉన్నాయని, వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖలు డీలర్లను సమన్వయం చేసుకుని నకిలీ విత్తనాలను అరికట్టడానికి చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డీలర్లు విత్తన చట్టానికి లోబడి నిబంధనలు అనుసరిస్తూ వ్యాపారం నిర్వహించాలని సూచించారు. స్టాక్ బోర్డు, రిజిస్టర్ విధిగా నిర్వహించాలని, సీడ్ డీలర్లు సైతం సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. డీసీపీ సీతారాం మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా రెన్యూవల్ చేయకుండా, కాలపరిమితి ముగిసిన వాటిని విక్రయించొద్దని చెప్పారు. అంతకు ముందు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. డీఏఓ వినోద్కుమార్, విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడు పజ్జూరు గోపయ్య, ఏడీఏలు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా తనిఖీలు
జనగామ: జిల్లాలోని చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా, జనరేటర్ విని యోగంపై టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణమాధవ్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో ని రెండు జనరేటర్లు ఆస్పత్రితోపాటు బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ప్లాంట్కు కనెక్ట్ చేశారని చెప్పారు. జిల్లా ఆస్పత్రికి పాత సబ్స్టేషన్ నుంచి కనెక్షన్ ఉండగా.. గీతానగర్ 11కేవీ నుంచి స్టాండ్బైగా ఉంచినట్లు పేర్కొన్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 50కేవీ స్థానంలో 125 కేవీ జనరేటర్ ఏర్పాటు చేసుకుంటే లోడ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా అందుకోవచ్చని సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధకు సూచించినట్లు వివరించారు. ఆస్పత్రి మెట్ల ప్రాంతంలోని కంట్రోల్ ప్యానల్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. చంపక్హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రికి ఓబుల్కేశ్వాపూర్, పసరమడ్ల 11కేవీల నుంచి 24 గంటల పాటు కరెంటు సరఫ రా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంసీహెచ్లో ఎమర్జెన్సీ కోసం 160 కేవీఏ, 125 కేవీఏ జనరేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
పాలకుర్తి: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన బాషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతం, కొనుగోళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో రైతులకు డబ్బులు జమను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో వెంటనే ఓపీఎంఎస్లో నమోదు చేయాలన్నారు. గ్రామంలోని విత్తన డీలర్లను అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా సొసైటీలో 210 మంది దగ్గర కొనుగోలు చేసి తరలించగా 187 మంది రైతులకు డబ్బులు జమ అయినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ డీఏఓ వినోద్, జిల్లా డీసీఓ రాజేందర్ రెడ్డి, డీసీఎస్ఓ రోజా రాణి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రసాద్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశం, సర్కిల్ డీటీ దేవా, ఏడీఓ పరశరాములు, కార్యదర్శి రణధీర్, ఏఈఓ సంధ్య, వెంకటేశం, రాజేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్కు సపోర్ట్గా నిలిచిన విశ్వక్ సేన్
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
రాజ్కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
snake bite: పట్టిన పామే కాటేసింది
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
తప్పక చదవండి
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement