-
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సం జరిపించారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, బదిరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషన మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరుములు.. మెరుపులు
సాక్షి నెట్వర్క్: సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. సూర్యాపేట పట్టణంలోని ఎంజీరోడ్డు, కొత్తబస్టాండ్ చౌరస్తాతో పాటు పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. నాగారం మండలంలో మామిడి, నిమ్మకాయలు నేలరాలాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాలెంల గ్రామంలోని ఓ ఇంటిపై, జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో దుర్గాభవాని హోటల్ వెనుక తాటిచెట్టుపై పిడుగు పడింది. నాగారం మండల కేంద్రం సమీపంలో జీబీకే సిమెంట్ బ్రిక్స్ ఎదురుగా తాటిచెట్టుపై, నాగారం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో పిడుగు పడింది. అదేవిధంగా మద్దిరాల మండల పరిధిలోని చందుపట్లలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. అర్వపల్లిలో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు, రేకులు, దుకాణాల బోర్డులు లేచిపోయాయి. కాగా కొనుగోలు కేంద్రాల్లో, హైవేలపై పోసిన ధాన్యం తడిసిపోయింది. నేరేడుచర్లలోని జాన్పహాడ్ రోడ్లో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. తిరుమలగిరిలో విద్యుత్ స్తంభాలు, భారీ వక్షాలు నేలకొరిగాయి. ఫ ఈదురుగాలులతో కూడిన వర్షం ఫ నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ఫ అంధకారంలో పలు గ్రామాలు -
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
హుజూర్నగర్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటు వేసేందుకు అవకాశం ప్రతి ఎన్నికల్లోనూ కలిస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తు పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరు ఓటు వేసేందుకు హుజూర్నగర్ పట్టణంలోని వీవీఎం హైస్కూల్లో రెండు కౌంటర్లు, సూర్యాపేటలో ఆరు కేంద్రాలు, కోదాడలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు ఈ కౌంటర్లలో ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 8,344 మంది ఉద్యోగుల నమోదు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారంతా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎనన్ఐసీ) పోర్టల్లో 12 ఫారం అప్లోడ్ చేసి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 8,344 మంది ఉద్యోగులు పోస్టల్ ఓటింగ్కు నమోదు చేసుకున్నారు. ఇందులో సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్కు 2944 మంది, హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 2,800 మంది, కోదాడ నియోజకవర్గంలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం వరకు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 396 మంది, సూర్యాపేటలో 716 మంది, కోదాడలో 573 మంది ఉద్యోగులు మొత్తం 1685 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఫ ఇప్పటివరకు ఓటు వేసిన 1,685 మంది ఉద్యోగులు ఫ 8వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ -
వంటింట్లో ధరల మంట!
తిరుమలగిరి (తుంగతుర్తి): నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కోడి గుడ్ల వంటి నిత్యావసరాల ధరలు చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంటింటి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రతి ఇంటా నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరిగిన సన్న బియ్యం ధరలు సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాది వ్యవధిలోనే సన్నబియ్యం క్వింటాకు రూ.1,200, పాత బియ్యం రూ.1,000 చొప్పున పెరిగాయి. ప్రతి ఒక్కరూ సన్న బియ్యం వినియోగిస్తుండటంతో ధరలు బాగా పెరిగాయి. సీజన్ ఆరంభంలోనే కొత్త బియ్యం ధర క్వింటా రూ.3,800 పలికితే ఇంకో రెండు నెలలు గడిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం కొత్తవి క్వింటాకు రూ.4,800, పాతవి రూ.5,600 ధర పలుకుతోంది. గతంలో కంటే సన్న ధాన్యం తెగుళ్లతో నష్టం జరగడం, పంట దిగుబడి సరిగా రాకపోవడంతో బియ్యం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. కనికరించని కంది పప్పు కంది పప్పు ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగిస్తుంటారు. పప్పు లేకుంటే చాలా మందికి ముద్ద దిగదు. అయితే కంది పప్పు మార్కెట్లో కుతకుత ఉడుకుతోంది. గత ఏడాది జనవరిలో కిలో రూ.110 ఉంటే జూన్లో రూ.150కి చేరింది. ప్రస్తుతం కిలో కంది పప్పు రూ.170 ఉంది. జిల్లాలో పప్పు దినుసుల సాగు అంతంత మాత్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఇతర రాష్ట్రాల్లో కూడా దిగుబడి తగ్గిందని, అందువల్లే డిమాండ్కు అనుగుణంగా దిగుమతులు లేవని వ్యాపారులు చెబుతున్నారు. దరాఘాతంతో సామాన్యులు కందిపప్పుకు ప్రత్యామ్నాయంగా పెసర, శనగ, ఎర్ర పప్పులను వినియోగిస్తున్నారు. మినపప్పు ధర కూడా రూ.130 నుంచి రూ.200లకు పెరిగింది. అల్లం వెల్లుల్లి కూడా అంతే. బహిరంగ మార్కెట్లో అల్లం, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం జనవరిలో కిలో రూ.60 పలికిన అల్లం ధర ప్రస్తుతం కేజీ రూ.150 పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి ధర కేజీకి రూ.300 పలుకుతుంది. వేసవిలో మామిడి పచ్చళ్లకు ఉపయోగించే అల్లం, వెల్లుల్లి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలు ఇలా..ధరలు 2023 2024 (రూ.లో) (రూ.లో) బియ్యం (కొత్తవి) 3,300 4,800 బియ్యం (పాతవి) 5,200 6,000 కంది పప్పు 110 170 పెసర పప్పు 90 130 శనగ పప్పు 70 90 మినపప్పు 140 200 అల్లం 60 150 వెల్లుల్లి 70 300ఫ భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు ఫ సామాన్య, మధ్య తరగతి ప్రజల నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం నిత్యావసరాలు కొనలేని పరిస్థితి గతంలో కంటే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కనీసం కంది పప్పు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. మామిడి కాయ పచ్చడి పెట్టాలన్నా ధరలు పెరగడంతో వెనకాడుతున్నాం. – రమ, తిరుమలగిరి -
‘నీట్’కు 997 మంది హాజరు
సూర్యాపేటటౌన్: వైద్య విద్య ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మొత్తం మూడు సెంటర్లలో 1,028 మంది విద్యార్థులకు గాను 997 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 528 మంది విద్యార్థులకు 508 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. అంజలి స్కూల్ సెంటర్లో 216 మందికి 211 మంది హా జరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. ఎంఎస్సార్ సెంట్రల్ స్కూల్ సెంటర్లో 284 మంది విద్యార్థులకు 278 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరైనట్లు సిటీ కో ఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు. ఫ 31 మంది విద్యార్థులు గైర్హాజరు ఫ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement