మట్టపల్లిలో నిత్యకల్యాణం | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్యకల్యాణం

Published Mon, May 6 2024 10:10 AM

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సం జరిపించారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు కృష్ణమాచార్యులు, బదిరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషన మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement