-
సేవా ముసుగులో థామస్ దోపిడీ
వెదురుకుప్పం : ప్రజా సేవ ముసుగులో టీడీపీ అభ్యర్థి థామస్ భారీ దోపిడీ చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఆదివారం మంఢలంలోని వేణుగోపాలపురం ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను పావుగా వాడుకుని వారికి రూ. 200 చొప్పున ఇస్తూ సమాజానికి సేవ చేస్తున్నట్లుగా ఫోటోలు తీయించి దేశంలోని చర్చిలు, పాస్టర్లకు పంపి రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి అక్రమార్కుడు నేను అవినీతికి పాల్పడ్డానని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. దళితులంటే గిట్టని చంద్రబాబు పార్టీలో చేరి ఎస్సీలపై కపటప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదం జరిగితే ఆ ఘటననూ రాజకీయ కోణంలో చూపి నేను చంపేందుకు కుట్ర చేస్తున్నానని థామస్ దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. ఆయనను చంపాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవం ముందు థామస్ ఒక బచ్చా అని తెలిపారు. తన ఇంట్లో తిని, పెరిగి ఇప్పుడు తన కుమార్తె కృపాలక్ష్మిపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దెయ్యాల రమేష్కు విశ్వాసం లేదని వివరించారు. తన పిల్లలు బాగా చదువుకుని చక్కగా సంపాదించుకుంటున్నారని, అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ తనకు లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం టీడీపీ, కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ముద్రగడకు ఆయన కుమార్తెకు రచ్చ పెట్టారని, సీఎం జగనన్నకూ షర్మిలమ్మకు గొడవ పెట్టారని, రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలను విభజిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీతో అందరి భ్రమలు తొలగిపోతాయని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని ప్రజలను బురిడీ కొట్టించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారని ఆరోపించారు. బాబు మేనిఫెస్టో బూటకమని తెలిసి బీజేపీ చేతులుదులుపుకుంటోందని వివరించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో మూడిందన్నారు. పేదల జీవితాల్లో నెలకొన్న చీకటిని తొలగించే సూర్యుడు జగనన్న అని కొనియాడారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం తథ్యమని స్పష్టం చేశారు. -
No Headline
‘‘ఎన్నికలు వస్తే బూటకాల చంద్రబాబు బయటకు వస్తారు.. ఓట్ల కోసం మాయమాటలు చెబుతారు.. పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలను సైతం యథేచ్ఛగా కాపీ కొట్టేస్తారు.. బడ్జెట్కు మించి పథకాలు అమలు చేస్తామని కల్లబొల్లి కబుర్లు వల్లిస్తారు.. అలవి కాని హామీలను గుప్పిస్తారు.. నమ్మి ఓటేస్తే నిర్మొహమాటంగా నట్టేట్లో ముంచేస్తారు.. భవిష్యత్ను రంగులమయం చేస్తానంటూ పేదల ఆశపెట్టి నిస్సిగ్గుగా మోసం చేసేస్తారు.. ఇదీ చంద్రబాబు సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ అనుభవం’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘పోస్టల్’ పోలింగ్
పూతలపట్టు : పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు.ఆదివారం పూతలపట్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ను సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ బూత్లలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించే పద్ధతిని పరిశీలించారు.ప్రశాంత వాతావరణంలో పోస్టల్ ఎన్నికలను నిర్వహించాలని, ఓటర్లకు పక్కాగా మౌలిక వసతులు ఆర్డీఓ చిన్నయ్యకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు కల్పించాలని స్పష్టం చేశారు. టీడీపీ ప్రచారంలో 104 నర్సు పుంగనూరు : టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం సోమల మండలం కందూరులో ఎన్నికల పచ్రారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఆశ అనే 104 నర్సు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి టీడీపీ అభ్యర్థికి హారతులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన నర్సుపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ద్రోహి మందకృష్ణ చిత్తూరు రూరల్(కాణిపాకం): మందకృష్ణ మాదిగ దళిత ద్రోహి అని ఎమ్మార్పీఎస్, మాల మహానాడు నాయకులు వరదరాజులు, అశోక్రాజ్ విమర్శించారు. ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో వారు విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ ఇక్కడ టీడీపీకి మద్దతు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం మాదిగలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మాల..మాదిగల మధ్య చిచ్చుపెట్టిన టీడీపీకి మద్దతు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అగ్రవర్ణాలకు మంత్రి పదవులు కట్టబెట్టి, దళితులను దూరం పెట్టారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు మేలు జరిగిందన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం వంటి పదవులు దక్కాయని వివరించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్సార్సీపీకే మద్దతు ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో రమేష్, జయ శేఖర్, నవీన్, చిన్న రాయుడు, ధనుంజయలు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థికి కోపమొచ్చింది! చిత్తూరు రూరల్(కాణిపాకం):మీడియా ప్రశ్నలకు టీడీపీ ఎంపీ అభ్యర్థికి కోపమొచ్చింది. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు అలిగి వెళ్లిపోయారు. ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్కు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. తొలుత ఆయన చిత్తూరు ఏం చేయాలనుకుంటున్నారో వివరించారు. ఆ తర్వాత పలు అంశాలపై పాత్రికేయులు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానం చెప్పలేక గుటకలు మింగారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తారేంటి అంటూ చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. -
ఓటెత్తిన ఉద్యోగులు
● జిల్లాలో 74.34 శాతం పోలింగ్చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఆదివారం తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు ఓటు వేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ పుల్లయ్య పర్యవేక్షించారు. ఈ నెల 8వ తేదీ వరకు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు అసెంబ్లీ, పార్లమెంట్కు 74.34 శాతం పోస్టల్బ్యాలెట్ పోలింగ్ అయ్యింది. అత్యధికంగా నగరి నియోజకవర్గంలో 83.04 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే పుంగనూరులో 76.39 శాతం, జీడీ నెల్లూరులో 79.53 శాతం, చిత్తూరులో 65.09 శాతం, పూతలపట్టులో 75.46 శాతం, పలమనేరులో 71.32 శాతం, కుప్పంలో 73.29 శాతం పోస్టల్బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం పోలైన పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. -
● ఇచ్చిన హామీలను నెరవేర్చని ఘనుడు ● ఓట్ల కోసమే చంద్రబాబు మయామాటలు ● సీకే బాబు.. ఆరణితోనే చిత్తూరు వెనుకబాటు ● వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పేదల అభ్యున్నతే జగన్ అజెండా సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం పేదల అభ్యున్నతి కోసమే అధికారంలోకి రావాలనుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఐదేళ్లలో 99శాతం హామీలు నెరవేర్చిన ఘనత దేశంలోనే జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. అందుకే అమలు చేసే పథకాలతోనే నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామని వెల్లడించారు. పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు అందిస్తామని, మేనిఫెస్టోలో సీఎం జగన్ చేసేదే చెప్పారని స్పష్టం చేశారు. చిత్తూరు కార్పొరేషన్ : చంద్రబాబునాయుడు ఎప్పుడూ మాట మీద నిలబడరని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని, మళ్లీ ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ అంటే నమ్మకమని, బాబు అంటే అబద్ధమని స్పష్టం చేశారు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మోసపు వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, నమ్మితే మునిగిపోవడం తథ్యమని హెచ్చరించారు. వెనుకబడ్డ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు వైఖరితో చిత్తూరు చాలా నష్టపోయిందన్నారు. ఆయన రౌడీయిజం కారణంగా చిత్తూరుకు రావాలంటే ఇతర ప్రాంతాలవారు భయపడ్డారని తెలిపారు. ఇతర జిల్లాలకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటే చిత్తూరు మాత్రం వెనుకబడిందన్నారు.ఈ క్రమంలోనే ఆరణి శ్రీనివాసులును చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే విశ్వాసం లేకుండా జనసేనకి వెళ్లారని మండిపడ్డారు. ఇక్కడ భూములన్నీ కబ్జా చేసేసి, ఇప్పుడు తిరుపతిపై పడ్డారని ఆరోపించారు. కరోనా సమయంలో గురజాల ఎక్కడ? జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా సమయంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీసీ నేత రావూరి ఈశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీ గెలుపునకు కారణమైతే అధికారంలో వచ్చాక మోసంచేశారని మండిపడ్డారు. రూ.300 కోట్లు విలువైన తన ఫ్యాక్టరీని నలుగురు నాయకులు కుట్రపన్ని మూయించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు గాయత్రిదేవి మాట్లాడుతూ కనకనేరి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలను టీడీపీ అభ్యర్థి గురజాల అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సరళామేరి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు లీనారెడ్డి పాల్గొన్నారు. మేనిఫెస్టో కూడా కాపీనే చంద్రబాబుకు ఎప్పుడూ ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదని, మేనిఫెస్టోను సైతం సొంతంగా ప్రకటించే దమ్ము లేదని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు కావాలని, అందుకే ఆయన మాటల్ని ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వస్తే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేసిన సంస్కృతి చంద్రబాబుదని, అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తోపాటు దత్తపుత్రుడు పవన్కల్యాణ్ కూడా భాగస్వామ్యమేనని ఆరోపించారు. బడా వ్యాపారవేత్తలు, డబ్బుండే నాయకులు, సొంత ఆస్తులు పరిరక్షణే కోసమే చంద్రబాబు అధికారం కోరుకుంటున్నారని తెలిపారు. కష్టం వస్తే ఆదుకుంటూ.. వైఎస్సార్సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పదేళ్లుగా చిత్తూరు ప్రజలకు సేవ చేస్తున్నారని, కష్టం వస్తే ఆదుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. సీకేబాబు లాంటి రౌడీని ఎదుర్కోవాలంటే తెలివైన విజయానందరెడ్డికే సాధ్యమన్నారు. ఈ పర్యాయం అధికారంలోకి రాగానే అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు శాశ్వతంగా నీటి సరఫరా చేయిస్తామని తెలిపారు. ఔటర్ రింగ్రోడ్డు, ఇంటర్ రోడ్డు కనెక్టవిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి రాయితీలను మరింత పెంచేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డబ్బులు పంచి, దొంగ ఓట్లతో గెలవాలని టీడీపీ యత్నిస్తోందన్నారు. చిత్తూరు ఎంపీగా రెడ్డెప్పను, ఎమ్మెల్యేగా విజయానందరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవే పరమావధి ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప మాట్లాడుతూ జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగనన్న ఆశీస్సులు, మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నామని, తమను ఆశ్వీరదించాలని అభ్యర్థించారు. గత పాలకుల శాపాలతోనే చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి రౌడీయిజం కారణంగా ఎన్నో కుటుంబాలు దిక్కులేకుండా పోయాయని, మరొకరి భూదాహం కారణంగా రూ.వందల కోట్ల ప్రజాధనం లూటీ అయ్యిందని విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్కు అర్హత సాధించిన స్కాట్లాండ్
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
కర్నూలు.. ఫ్యాన్ జోరు!
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement