వెదురుకుప్పం : ప్రజా సేవ ముసుగులో టీడీపీ అభ్యర్థి థామస్ భారీ దోపిడీ చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఆదివారం మంఢలంలోని వేణుగోపాలపురం ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను పావుగా వాడుకుని వారికి రూ. 200 చొప్పున ఇస్తూ సమాజానికి సేవ చేస్తున్నట్లుగా ఫోటోలు తీయించి దేశంలోని చర్చిలు, పాస్టర్లకు పంపి రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి అక్రమార్కుడు నేను అవినీతికి పాల్పడ్డానని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. దళితులంటే గిట్టని చంద్రబాబు పార్టీలో చేరి ఎస్సీలపై కపటప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదం జరిగితే ఆ ఘటననూ రాజకీయ కోణంలో చూపి నేను చంపేందుకు కుట్ర చేస్తున్నానని థామస్ దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. ఆయనను చంపాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవం ముందు థామస్ ఒక బచ్చా అని తెలిపారు. తన ఇంట్లో తిని, పెరిగి ఇప్పుడు తన కుమార్తె కృపాలక్ష్మిపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దెయ్యాల రమేష్కు విశ్వాసం లేదని వివరించారు. తన పిల్లలు బాగా చదువుకుని చక్కగా సంపాదించుకుంటున్నారని, అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ తనకు లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం టీడీపీ, కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ముద్రగడకు ఆయన కుమార్తెకు రచ్చ పెట్టారని, సీఎం జగనన్నకూ షర్మిలమ్మకు గొడవ పెట్టారని, రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలను విభజిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీతో అందరి భ్రమలు తొలగిపోతాయని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని ప్రజలను బురిడీ కొట్టించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారని ఆరోపించారు. బాబు మేనిఫెస్టో బూటకమని తెలిసి బీజేపీ చేతులుదులుపుకుంటోందని వివరించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో మూడిందన్నారు. పేదల జీవితాల్లో నెలకొన్న చీకటిని తొలగించే సూర్యుడు జగనన్న అని కొనియాడారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం తథ్యమని స్పష్టం చేశారు.
సేవా ముసుగులో థామస్ దోపిడీ
Published Mon, May 6 2024 8:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement