-
ప్రశాంతంగా ‘నీట్’
ఎర్రవల్లిచౌరస్తా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా నీట్ సిటీ కోఆర్టినేటర్ వెంకటేశ్వర్రావు ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలోని కేంద్రంలో 200 మంది విద్యార్థులకుగాను 193 మంది, అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో 312 మందికి గాను 309, శాంతినగర్ రాఘవేంద్ర పాఠశాలలో 288 మందికి గాను 283, వీరాపురం ఎస్.ఆర్ విద్యానికేతన్ పాఠశాలలో 312 మందికి గాను 306 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 1112 మంది విద్యార్థులకుగాను 1091 మంది హాజరైనట్లు తెలిపారు. 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్ సీఎం రాక
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో సోమవారం నిర్వహించే బీజేపీ ఇంటలెక్చువల్ మీట్కు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు. అలాగే జిల్లాకేంద్రంలోని సుదర్శన్గార్డెన్లో నిర్వహించే మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్లు, పార్టీ సంస్థాగతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా తీసుకుంటున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
జనజాతర సభ సైడ్లైట్స్
● సాయంత్రం 4.42 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్లో పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 4.48 గంటలకు ప్రత్యేక కాన్వాయ్లో సభా ప్రాంగణానికి బయల్దేరారు. ● 5 గంటలకు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైకి చేరుకున్నారు. ● ముందుగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించిన తర్వాత చివరలో రాహుల్గాంధీ మాట్లాడారు. ● రాహుల్గాంధీ ప్రసంగం 5.50 గంటలకు ముగిసింది. ● హెలీకాప్టర్లో 5.55 గంటలకు రాహుల్గాంధీ తిరిగి వెళ్లిపోయారు. ● జై కాంగ్రెస్ అని గట్టిగా నినదిస్తే బంగ్లాలో గుండెలు దద్దరిళ్లాలని సీఎం రేవంత్రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. – అలంపూర్ /ఎర్రవల్లి చౌరస్తా/ మానవపాడు/ ఉండవెల్లి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement