ప్రశాంతంగా ‘నీట్‌’ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘నీట్‌’

Published Mon, May 6 2024 6:40 AM

ప్రశాంతంగా ‘నీట్‌’

ఎర్రవల్లిచౌరస్తా: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా నీట్‌ సిటీ కోఆర్టినేటర్‌ వెంకటేశ్వర్‌రావు ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్‌ పాఠశాలలోని కేంద్రంలో 200 మంది విద్యార్థులకుగాను 193 మంది, అలంపూర్‌ మాంటిస్సోరి పాఠశాలలో 312 మందికి గాను 309, శాంతినగర్‌ రాఘవేంద్ర పాఠశాలలో 288 మందికి గాను 283, వీరాపురం ఎస్‌.ఆర్‌ విద్యానికేతన్‌ పాఠశాలలో 312 మందికి గాను 306 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 1112 మంది విద్యార్థులకుగాను 1091 మంది హాజరైనట్లు తెలిపారు. 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement