-
ఎన్డీయే శక్తులను ఓడించాలి
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి ● ఖానాపూర్కు చేరిన బస్సుయాత్ర ఖానాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే శక్తులను ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఖానాపూర్ పట్టణానికి చేరింది. సీపీఐఎంల్ మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అధ్యక్షతన స్థానిక బస్టాండ్ ఏరియాలో ఫారెస్ట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఓటు చైతన్యయాత్రలో ఆయన మాట్లాడారు. ఈసారి రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే వైపు ఎన్నికలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక ఎన్డీయే కూటమిని ఓడించాలని కోరారు. పదేళ్ల ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందని ప్రశ్నించారు. ధరల నియంత్రణ, పక్కా ఇళ్లు, విద్య, వైద్యం హామీల ఊసే లేకుండానే రాష్ట్రంలో పాలన కొనసాగిందని ఆరోపించారు. 50శాతానికి పైగా వ్యవసాయంపై జీవించే రైతుల నడ్డివిరిచే మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. దేశ సంపద కార్పొరేట్ల వశమయ్యే చట్టాలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. యాత్ర సమన్వయ కర్త నైనాల గోవర్ధన్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి టీ శ్రీనివాస్, సీపీఐ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, ప్రొఫెసర్లు కే లక్ష్మీనారాయణ, పద్మజాషా, ఎన్ఆర్ఐ రాయదాస్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మంగ, నాయకులు రామలక్ష్మణ్, జ్యోతి, అరుణ, కల్పన, నిర్మల, స్వరూప, శ్రీకాంత్, శ్రీను, రాజేశ్, రాజ్కుమార్, అశోక్, అంకుశ్రావు, లింగన్న, శంకర్, ప్రసాద్, వాహిద్, గౌస్, రాము, అంజి, వినయ్, శివ తదితరులున్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి పెరిగి ఉక్కపోత తీవ్రమవుతుంది. వడగాలులు వీస్తాయి. పలుచోట్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. లక్ష మెజార్టీ సాధిస్తాం ● రాహుల్ సభను సక్సెస్ చేయాలి ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నిర్మల్చైన్గేట్: ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ మొదటిసారి ఒక మహిళను నిలిపిందని, లక్ష మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆత్రం సుగుణ ప్రజాసమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవాలని, రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆత్రం సుగుణ తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం ఉదయం 11గంటలకు నిర్మల్లోని క్రషర్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రానున్నారని తెలిపారు. రాహుల్గాంధీ పాల్గొనే సభను సక్సెస్ చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి శ్రవణ్కుమార్రెడ్డి, సత్తు మల్లేశ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ పట్టణా ధ్యక్షుడు నాందేడపు చిన్ను తదితరులున్నారు. -
మొబైల్లో కథలు
నిర్మల్ రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెలవుల్లో ప్రతిరోజూ కొత్త కొత్త కథలు వినిపించేందుకు రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ సహకారంతో ఓ మొబైల్ నంబర్ను ఏర్పా టు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన పో స్టర్ను శనివారం డీఈవో కార్యాలయంలో డీ ఈవో రవీందర్రెడ్డి, అధికారులు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి 040–45209722 నంబర్కు ఫోన్ చేస్తే రోజుకు ఓ కొత్త కథ వినిపిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు రోజుకు ఒక కథ వింటూ వారి గ్ర హణ శక్తిని పెంపొందించుకోవాలని సూచించా రు. కథలు వినడం ద్వారా సొంతంగా కథలు తయారు చేసే సృజనాత్మక శక్తి, ఊహాశక్తి పెరుగుతుందన్నారు. జూన్ 12వరకు ఈ కథలను ప్రతిరోజూ వినవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్వోలు నర్సయ్య, సలోమి కరుణ, రాజేశ్వర్, ప్రవీణ్, వెంకటరమణ, రూమ్ టు రీడ్ జిల్లా కోఆర్డినేటర్ గోనె రవి పాల్గొన్నారు. -
స్వీప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో పోలింగ్శాతం పెంచేలా స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ను విస్తృతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీప్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్స్కు ఓటుహక్కు విని యోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో జిల్లాలోని ఓటర్లంతా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ అధికసంఖ్య లో పోలింగ్లో పాల్గొనాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంప్, వీల్ చై ర్స్ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 636 మంది దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు హోం ఓటింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం ట్రాన్స్జెండర్స్కు గుర్తింపుకార్డులు అందజేశారు. డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమాధికారి నాగమణి, అధికారులు, సిబ్బంది, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. -
మోదీ నాయకత్వాన్ని బలపరచండి
నర్సాపూర్(జి): ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సాపూర్ (జీ), రాంపూర్ గ్రామాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు వాగ్దానాలిచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించా రు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడమే ల క్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. బీజేపీ ఎంపీ అ భ్యర్థి నగేశ్ మాట్లాడుతూ.. మోదీ నాయకత్వాన్ని దేశానికి మరోసారి అందించడమే లక్ష్యంగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, నరేందర్, రాజేందర్, దత్తురాం, సుధాకర్, లక్ష్మణ్, విజయ్, గంగారాం, సవీన్, రాజు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement