-
‘గజ్జలమ్మ’కు పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేష్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, పల్లకి సేవ నిర్వహించారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కడార్ల హరిప్రసాద్, బోయ సాయిలు, గట్టుపల్లి శ్రీనివాస్, తాటి శివ, చిప్ప సంజీవ్, గంగాధర రాజు, పల్లికొండ గజేందర్, భూమన్న, గజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–2002 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరిట వడ్యాల్లోని రాజరాజేశ్వర ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతా కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు. నాడు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఉన్నతికి కారకులైన గురువులకు పూలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాటి గురువులు కిషన్రావు, నాజీర్ అహ్మద్, మోహన్రావు, అరవింద్ కుమార్, లక్ష్మణ్, నరేందర్, మంజుల, మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లి శ్రీసరస్వతి శిశుమందిర్లో 2006–2007 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మిత్రులంతా ఒక్కచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న పాఠశాలకు రూ.20వేల విలువైన సౌండ్ సిస్టం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉమ్మడి ఆదిలాబాద్ శిశు మందిరాల అధ్యక్షుడు డాక్టర్ దామోదర్రెడ్డి, విభాగ్ సహ కార్యదర్శి సరికొండ దామోదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జీలకర రాజేశ్వర్, డా.మహిపాల్, ధర్మపురి సుదర్శన్, ఉపాధ్యాయులు నాగభూషన్, దత్తాత్రి, నితిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోజన్న, తదితరులు పాల్గొన్నారు. -
‘కోనోకార్పస్’ కోరల్లో!
● పక్షులు వాలవు.. పశువులు తినవు ● పర్యావరణానికి ప్రయోజనం శూన్యం ● పువ్వుల రేణువులతో అనారోగ్యం ● జిల్లాలో విపరీతంగా పెరిగిన చెట్లు ● ఇప్పటికే ఈ చెట్లపై నిషేధం.. ● అయినా తొలగించని అధికారులు, పాలకులు నిర్మల్: సాధారణంగా అడవులను, చెట్లను ఎవరైనా నరికేస్తే.. పర్యావరణ ప్రేమికులు, సాధారణ పౌరులూ ఆందోళన చెందుతుంటారు. కానీ ఇప్పుడు ఏపుగా, పచ్చగా పెరుగుతున్న ‘కోనోకార్పస్’ చెట్లను చూస్తే పర్యావరణ వేత్తలే హడలిపోతున్నారు. ‘వద్దు బాబూ.. వీటిని వెంటనే తొలగించండి..’ అంటున్నారు. ఎందుకంటే.. ఇవి అంత ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటితో పర్యావరణానికి మేలు జరగకపోగా.. ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో దేశాలు, దేశంలోని చాలా రాష్ట్రాలు కోనోకార్పస్ చెట్లను నిషేధించాయి. చాలా దేశాల్లో కూకటివేళ్లతో పెకిలించి వేశాయి. జిల్లాల్లో మాత్రం ఈ చెట్లు వేళ్లానుకుని పోయాయి. హరితహారం తెచ్చిన శాపం.. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం. కానీ.. అదే శాపంగానూ మారింది. ప్రభుత్వం పెట్టిన గడువు, నిబంధనలకు స్థానిక అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మంచి చెడులను ఆలోచించకుండా త్వరగా పెరిగే మొక్కలను తీసుకువచ్చి విరివిగా నాటేశారు. ఇప్పుడు వాటి దుష్ఫలితాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోకి వచ్చింది కోనోకార్పస్ మొక్క. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై డివైడర్ల మధ్యలో మొత్తం ఇవే మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లోనూ వీటినే పెంచారు. పచ్చగా, ఏపుగా పెరగడంతో అంతా ‘వావ్..’ అన్నారు. ఇప్పుడు పువ్వులు, కాయలూ కాస్తుండటం, అవి ప్రజారోగ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయని తెలియడంతో ‘ఈ చెట్లు వద్దు బాబో..’ అంటున్నారు. పుప్పొడితో పరేషాన్.. కోనోకార్పస్ చెట్ల పువ్వుల పుప్పొడి పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా మనుషుల్లో అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు, అస్తమా వంటివి వస్తున్నట్లు తేలింది. ఈచెట్టు ఎంత ప్రమాదకరమంటే వీటి వేళ్లు భూమిలోతులోకి వెళ్లి బలంగా నాటుకుంటాయి. ఈక్రమంలో పునాదులతోపాటు భూమిలో వేసిన కేబుళ్లు, పైపులనూ ఇది ధ్వంసం చేస్తోంది. ఇక ఈ మొక్కలు హరితహారంలో పెంచడానికి మరోకారణం.. వీటిని పశువులు తినవు. కనీసం పక్షులు గూళ్లు కూడా పెట్టవు. వీటి పవ్వులు, పుప్పొడిపై సీతాకోక చిలుకలు కూడా వాలవు. అంటే.. ఆ చెట్టు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నిషేధం.. భూమి లోతు వరకూ నాటుకుపోవడంతో కోతకు గురికాకుండా ఉంచే కోనోకార్పస్ చెట్లను తీరప్రాంతాల్లో విరివిగా పెంచారు. ప్రపంచంలోని చాలా దేశాలు మొదట్లో వీటిని విరివిగా పెంచాయి. తర్వాత వీటివల్ల కలుగుతున్న అనర్థాలు తెలియడంతో మూలాలతో సహా పెకిలించి వేశాయి. దుబాయ్లో వీటిని విస్తారంగా పెంచారు. తర్వాత ఎడారి దేశం సైతం వీటిని పీకేయించింది. మన దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా వీటిని నిషేధించాయి. తెలంగాణలోనూ ఈ మొక్కలను హరితహారంలో నాటవద్దని చెప్పినా.. అప్పటికే జరగాల్సి న నష్టం జరిగిపోయింది. కొమ్మలు కాదు.. చెట్లనే తొలగించాలి ఎక్కడా పెంచని కోనోకార్పస్ మొక్కలను జిల్లాలో మాత్రం నిత్యం నీళ్లు పోసి పెంచుతున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ మొక్కలు ఉన్నాయి. రియల్ఎస్టేట్ నిర్వాహకులు వెంచర్లలో వీటిని ఎక్కువగా పెంచారు. ఇప్పుడు ఈ చెట్లు అంతటా పువ్వులు, కాయలు కాసే దశకు చేరాయి. తరచూ వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆ పువ్వులు, కాయలు కాసే కొమ్మలను కొట్టేస్తున్నాయి. కానీ.. దీనివల్ల ప్రతీ ఏడాది రెండుసార్లు ఖర్చు తప్ప.. ప్రజారోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేదన్న వాదన పెరుగుతోంది. వీటిని మొత్తానికే తొలగించాలన్న డిమాండ్ బలపడుతోంది. మొత్తానికే తొలగించాలి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రోడ్డులో ఇటీవల కోనోకార్పస్ చెట్ల కొమ్మలను మున్సిపల్ సిబ్బంది కొట్టేశారు. ఇలా ఏడాదికి రెండుసార్లు చేయడం వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు ఆ చెట్లవల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కోనోకార్పస్ చెట్లను మొత్తానికే తీసివేయాలి. – దశరథ పోశెట్టి, నిర్మల్ నష్టాలే ఎక్కువ.. కోనోకార్పస్తోపాటు ఎనిమిది ఆకుల చెట్టు, గన్నేరుచెట్లతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. ఈ చెట్లను చాలాదేశాలు, రాష్ట్రాలు నిషేధించాయి. స్థానికంగా అవగాహన లేకపోవడంతోనే విరివిగా పెంచుతున్నారు. పర్యావరణంతోపాటు పశుపక్షాదులు, ప్రజారోగ్యానికీ ఇవి ప్రమాదకరం. వీటిని తొలగించాలి. – డాక్టర్ వెల్మల మధు, అసోసియేట్ ప్రొఫెసర్, భైంసా డిగ్రీ కళాశాల -
అంగన్వాడీల ప్రక్షాళన
నిర్మల్● టీచర్లు, ఆయాలకు వయో పరిమితి ● 65 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ● జూన్ నుంచి అమలుకు కసరత్తు ● జిల్లాలో ఖాళీ కానున్న 123 పోస్టులు ● కొత్త వారిని నియమించే అవకాశం రైతులూ జాగ్రత్త..! మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు జా గ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 8లోuసోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024‘బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలి’ ఖానాపూర్: బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన ఒప్పందం ఏప్రిల్ 30తో ముగిసిందన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ నోటీస్ ఇవ్వగా ప్రభుత్వం ఈ నెల 25న బీడీ యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.3,650, నెలసరి ఉద్యోగులకు రూ.1,700 చొప్పున వేతనాలు పెరిగాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు వేయి బీడీలకు రూ.4.25 పైసల చొప్పున కూలి రేట్ల పెంపునకు ఒప్పందం కుదిరిందన్నారు. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలు చేయాలని, లేనిపక్షంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దుర్గం లింగన్న, చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు. జిల్లా వివరాలు ప్రాజెక్టులు : 4 సెక్టార్లు : 37 మెయిన్ అంగన్వాడీలు : 816 మినీ అంగన్వాడీలు : 110 ప్రాజెక్టుల వారీగా సిబ్బంది ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు భైంసా 11 14 ఖానాపూర్ 0 21 ముధోల్ 7 25 నిర్మల్ 9 36 నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ప్రక్షాళనకు సిద్ధమైంది. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తూ వయోభారంతో ఉన్న టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో అంగన్వాడీల వివరాలు సేకరిస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 123 మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగ విరమణ పొందనున్నారు. 123 మంది గుర్తింపు.. ప్రభుత్వ ఆదేశాలతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో వివరాలు సైతం ఉన్నాయి. టీచర్ల వయస్సు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఆయాలు పెద్దగా చదువుకోక పోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న వివరాలకు ఆయాల ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అప్పటికే అధికారులు సేకరించిన వివరాల మేరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడి రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నవారు టీచర్లు 27 మంది, ఆయాలు 96 మందితో కలిపి మొత్తంగా 123 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరంతా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే కొంతమంది మాత్రం పుట్టినతేదీ సరిగాలేని కారణంగా తాము తొందరగా విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ కొందరు అధికారులను ఆశ్రయించారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. అలాంటి వారిని జిల్లా ఆస్పత్రిలో వయస్సు నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గందరగోళం.. ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎంఎస్)లో ఉన్న వివరాలకు ఆయాల వద్ద ఉన్న వివరాలకు పొంతన లేకుండా పోయింది. అంగన్వాడీ టీచర్లకు పదో తరగతి సర్టిఫికెట్లు ఉండగా ఆయాలు చదువు కోకపోవడంతో వారి వయస్సు నిర్ధారణ కోసం అధికారులు ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. అందులో కూడా చాలామంది వయస్సు హెచ్చుతగ్గులు ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని చెబుతున్నారు. ప్రభుత్వానికి జాబితా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 65 ఏళ్లు నిండిన అంగన్వాడీ టీచర్, ఆయాలను గుర్తిస్తున్నాం. అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఏప్రిల్ 30 వరకు 65 ఏళ్ల వయస్సు పైబడిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో 123 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. – ఏ.నాగమణి, డీడబ్ల్యూవోన్యూస్రీల్రిటైర్మెంట్ బెనిఫిట్స్పై చిన్నచూపు.. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన వారు అనేకం. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అనుకున్న మేర సాయం అందడం లేదు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోతే మా పరిస్థితి ఏమిటని అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వ సాయం ఏమాత్రం సరిపోదని టీచర్లు, ఆయాలు అంటున్నారు. అంగన్వాడీలకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.926 అంగన్వాడీ కేంద్రాలు.. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ముధోల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 816, మినీ అంగన్వాడీ కేంద్రాలు 110 ఉన్నాయి. వీటిలో ప్రధాన సెంటర్లలో టీచర్, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్లలో రిటైర్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో వయస్సు పైబడిన వారి స్థానంలో కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల బెన్ఫిట్ కల్పిస్తామని ప్రకటించింది. -
సన్నబియ్యంపై ఆశలు..!
భైంసాటౌన్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకుందని, అందుకే సన్నవడ్ల సాగు ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ ప్రకటించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులు సన్నబి య్యం పంపిణీపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తు తం రేషన్ దుకాణాల్లో దొడ్డురకం బియ్యం అందిస్తుండగా వాటిని తినలేక చాలామంది లబ్ధి దారులు బియ్యం అమ్ముకుంటున్నారు. రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తుండడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం రైస్మిల్లులకు కేటాయించేది. మిల్లర్లు బియ్యం మరాడించి ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపితే వాటిని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. 6.41 లక్షల మందికి ప్రయోజనం... జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 2,08,462 ఉండగా 6,41,411 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా యూనిట్కు ఆరు కిలోల చొప్పున అందిస్తున్నారు. దీంతో నెలకు 40,560 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండగా చాలావరకు నాసిరకంగా ఉంటున్నా యి. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని తినలేక కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయించుకుంటున్నారు. మార్కెట్లో సన్నబియ్యం కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు ధర పలుకుతున్నాయి. దీంతో ఆర్థికంగా భారమైనా సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా నెలకు 25 కిలోల బస్తాకు రూ.1300 నుంచి రూ.1700 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే పేదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అక్రమ రవాణాకు చెక్... ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో అందిస్తున్న దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించుకోవడంతో అక్రమ రవాణకు తరలుతున్నాయి. కొందరు రైస్మిల్లర్లు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం మరాడించకుండా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల ద్వారా లబ్ధిదారుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యాన్నే తిరిగి ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి దళారులకు, వారి నుంచి రైస్మిల్లులకు, అక్కడి నుంచి ఎఫ్సీఐకి, మళ్లీ రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకే రీసైకిల్ అవుతోంది. ఫలితంగా నాసిరకం బియ్యం పంపిణీ అవుతోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులు విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రేషన్బియ్యం అక్రమ రవాణాకు చెక్ పడుతుంది. రేషన్ దుకాణాల్లో పంపిణీకి యోచన అమలు చేస్తే కార్డుదారులకు ప్రయోజనం దొడ్డు బియ్యం అక్రమ రవాణాకు చెక్జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు ఏఎఫ్ఎస్సీ కార్డులు : 12,672ఎఫ్ఎస్సీ కార్డులు : 1,95,758అంత్యోదయ కార్డులు : 32మొత్తం రేషన్ కార్డులు : 2,08,462 లబ్ధిదారులు : 6,41,411 అవసరమైన బియ్యం కోటా : 40,56,074 కిలోలు -
● డీపీవో శ్రీనివాస్
నర్సాపూర్ (జి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీలను పరిశీలించి సరిగా నిర్వహణ చేపట్టాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్డులో కంపోస్ట్ ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అనంతరం పలు దుకాణాలు, హోటళ్లను పరిశీలించారు. పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలని యజమానులకు సూచించారు. ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనవెంట పీఆర్ ఏఈ శివకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వీణారెడ్డి ఉన్నారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి కుంటాల: గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. కుంటాల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను సిగ్రిగేషన్ షెడ్లకు తరలించి తడిచెత్త, పొడి చెత్త వేరుచేసి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఎంఏ.రహీం, ఏపీవో గట్టుపల్లి నవీన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. యూనిఫాం స్టిచింగ్ త్వరగా పూర్తి చేయాలి కుంటాల: పాఠశాలలు తెరుచుకునేలోపు విద్యార్థుల యూనిఫాం సిద్ధం చేయాలని ఈమేరకు స్టిచింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని డీపీవో శ్రీనివాస్ ఆదేశించారు. కుంటాలలో స్వయం సహాయక సంఘాల మహిళలు కుడుతున్న దుస్తులను పరిశీలించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించిందని పేర్కొన్నారు. అనంతరం వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివాస్ -
డబుల్ రోడ్డు విస్తరణకు సహకరిస్తాం
● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావులక్ష్మణచాంద: మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పూర్తికి సహకరిస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు వీడీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. లక్ష్మణచాంద వీడీసీ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును శనివారం కలిశారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. స్పందించిన డీసీసీ చీఫ్ ఆర్అండ్బి ఎగ్జిక్యూట్ ఇంజినీర్ ఫోన్లో మాట్లాడారు. విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అట్ల రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఒడ్నాల రాజేశ్వర్, నాయకులు ఈటెల శ్రీనివాస్, జెడ్పీటీసీ వోస రాజేశ్వర్, నాయకులు నాగేశ్, అట్ల రవీందర్రెడ్డి, రవి, సుంకరి గంగయ్య, అట్ల శ్రీనివాస్రెడ్డి, నాయిడి రవి, జంగం రాజు, లక్కం రవి, ఈటల పరమేశ్, గోవింద్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
నిర్మల్టౌన్: కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక సూచించారు. కేసుల సత్వర పరిష్కారంపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు ఉన్నతాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల అదుపునకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసులు పరిష్కారంకాని సందర్భంలో లోక్ఆదాలత్ ద్వారా పరిష్కరించేలా చూడాలన్నారు. చట్టాల ఆవశ్యకతను వివరించాలన్నారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 8న జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్, సివిల్, భూతగాదాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ డీఎస్సీ గంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
● వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు చిన్నారులు ● వేసవి విరామం సొంత ఊర్లలోనే.. ● అనుభవాలను వల్లె వేస్తూ.. ఆత్మీయంగా గడుపుతూ.. ● బంధుత్వాలమధ్యన గడిపేందుకే ప్రాధాన్యం...
బంధుత్వాల ప్రాధాన్యతను గుర్తిస్తూ... ప్రస్తుతం ఉద్యోగం, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడుతూ ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నంగా మారుతున్నాయి. చదువులు, మార్కులు, ర్యాంకులు, సెల్ఫోన్ వంటివి తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిల్లో గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించడానికి, పిల్లలు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వారింట్లో వారి సమక్షంలోనే వేసవి సెలవులను గడుపుతున్నారు. బంధుత్వాలు, కుటుంబసభ్యుల మధ్యన కొనసాగే కబుర్ల ద్వారా కుటుంబ బంధాల ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకునే వీలుంటుంది. -
విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెమినార్
ఖానాపూర్: పట్టణంలోని బర్కత్పురకాలనీ ఉర్దూ భవన్లో ఇక్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెమినార్ శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ఖాన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణగా మెలిగితేనే ఉన్నత లక్ష్యాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యారంగంలో సేవలు అందించడానికి ఇక్రా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఇంతియాజ్ అహ్మద్, వాహిద్ఖాన్, షోయబ్, ఇమ్రాన్, సజ్జద్ అలీ, అమీర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
● సెలవుల్లోనూ దోపిడీ చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు ● బడుల్లోనే యూనిఫామ్స్, నోట్, పాఠ్యపుస్తకాల విక్రయాలు ● అడ్మిషన్ల పేరిట ముందే ఫీజుల వసూళ్లు ● దోపిడీ నియంత్రించాలంటున్న విద్యార్థి సంఘాల నాయకులు
నిర్మల్ఖిల్లా: మే నెల అంటేనే విద్యా సంస్థలకు వేసవి సెలవుల కాలం. కానీ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలకు మాత్రం ఈ మాసం వ్యాపారం జోరుగా సాగే కీలక సమయం. సెలవులు పూర్తికాకమునుపే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల వ్యాపారధోరణి మితిమీరిపోతోంది. అడ్మిషన్ల పేరిట ముందే ఫీజుల వసూళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యా సంవత్సరం మొదలుకాక ముందే నోట్ బుక్కులు, పుస్తకాలను యథేచ్ఛగా విద్యార్థులకు అంటగడుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలతోపాటు, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఏర్పడ్డాయి. దీంతో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేస్తారన్న బలహీనతను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఆసరాగా తీసుకుంటున్నాయి. ఫీజులు ఎంత పెంచినా అడిగేవారుండరని ఇష్టారీతిగా పెంచుతున్నారు. తల్లిదండ్రుల జేబులకు చిల్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 663కిపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలు జూన్ 12 నుంచి పునఃప్రారంభంకానున్నా విద్యార్థుల చేరికలు మాత్రం మే నెల నుంచే ప్రారంభించారు. విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ టెస్టు ఫీజు, అడ్మిషన్ ఫీజు అన్ని తరగతుల వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. తరగతిని బట్టి ట్యూషన్ ఫీజు నిర్ణయించారు. యూకేజీకి రూ. 25 వేల నుంచి, పదో తరగతికి రూ.58 వేల వరకు ఉన్నాయి. కార్పొరేటు పాఠశాలల్లో అయితే మరో 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. దీనికి తోడు స్కూల్ యూనిఫామ్స్, షూ, టై బైల్ట్కు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. బస్సు ఫీజు రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజు లెక్కలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల గుండె గుబేల్ మంటోంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు అయినా మంచి పాఠశాలల్లో చేర్పించాలని ఒక్కో పిల్లాడిపై సూమారు రూ.55 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. హాస్టల్ సౌకర్యం ఉంటే ఒక్కో విద్యార్థికి రూ.1.5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోవాలి... ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల్లో విద్యా సంవత్సరం మొదలు కాకముందే పుస్తకాలు అమ్ముతున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలుకాకముందే పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు పేరిట 70 శాతం ఫీజును ముందే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఇటీవలనే కలెక్టర్కు, డీఈవోకు ఫిర్యాదు చేశాం. – కై రి శశి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్, నిర్మల్డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న జిల్లా ఏబీవీపీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు.. జిల్లా పాఠశాలలు మంచిర్యాల 218 నిర్మల్ 192 ఆదిలాబాద్ 151 కుమురంభీమ్ 102 తోక పేర్లతో గారడీ.. ఐఐటీ, టెక్నో, ఒలంపియాడ్ వంటి పేర్లతో గారడీ చేస్తున్నారు. తమ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నాయని, రంగు రంగుల కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ప్రైవేట్ పాఠశాలలో 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచుతున్నారు. దీనికి తోడు విద్యార్థుల యూనిఫామ్స్, పుస్తకాలు అయా పాఠశాలలకు అనుబంధంగా కొన్నిషాపుల యజమానులతో బేరం కుదుర్చుకుంటున్నారు. కొందరు పాఠశాల ఆవరణలోనే పుస్తక, యూనిఫామ్ దుకాణాలు తెరుస్తున్నారు. తమ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడా లభించవని తమవద్దే దొరుకుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
బాల సదన్ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
నిర్మల్ రూరల్: మండలంలోని కొండాపూర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న బాలసదన్ను సీనియర్ సివిల్ జడ్జి రాధిక శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీనెల బాల సదన్ను సందర్శిస్తానని తెలిపారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జడ్జి వెంట జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నాగమణి, బాలల సంక్షేమ సమితి సభ్యురాలు సల్ల శ్రీలత, ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎం.కవిత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దేవి మురళి, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఎస్.రాజు, శ్రీరామ్ మూర్తి, శైలజ, కరుణశ్రీ, నరేందర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
మధురఫలమా..గరళమా! మామిడి విషతుల్యంగా మారుతోంది. రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. ఈ పండ్లు తింటే అనారోగ్యం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి మరమ్మతుల్లో వేగం పెంచాలి కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని అపరేషన్ అండ్ మెంటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు ఆదేశించారు. మరమ్మతు పనులను శనివారం పరిశీలించారు. – 08లో ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 20248లోu ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ భైంసాటౌన్: పట్టణంలోని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్యాధికారి పరశురాం శనివారం తనిఖీ చేశారు. మదీనా కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వశిష్ఠ జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాల్లో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జూఫిషాన్ సుల్తానా ఉన్నారు. వేసవి సెలవుల్లో పల్లెలు పిల్లలతో సందడిగా మారాయి. అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో వచ్చిన పిల్లలంతా సరదాగా ఊరిని చుట్టేస్తున్నారు. పెద్దవాళ్లూ పిల్లల్ని వెంటబెట్టుకుని అందరి ఇళ్లకు తీసుకువెళ్లి పరిచయం చేస్తున్నారు. పొలాల దగ్గరకి, చెరువు గట్టుకు తీసుకెళ్లి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలు పల్లెల్లో దొరికే ప్రేమను పొందుతున్నారు. మట్టి వాసన తెలుసుకుంటున్నారు. కొందరు పిల్లలైతే ఆవులు, బర్రెల వెంట పరుగులు తీస్తున్నారు. పాలు ఎలా పితుకుతారో కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మనవలు, మనవరాళ్లు రావడంతో నానమ్మ, అమ్మమ్మలు సైతం కొత్త ఉత్సాహంతో వారికి రోజూ ఏదో ఒకటి తినిపించాలని ఉబలాటపడటం కనిపిస్తోంది. మామిడి పండ్ల సీజన్ కావడంతో తోటల వద్దకు తీసుకువెళ్లి పండ్లను తినిపిస్తున్నారు. అల్లనేరేడు, జామపండ్ల రుచి చూపిస్తున్నారు. పల్లెల్లో ప్రకృతిలో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. – నిర్మల్ఖిల్లామనుమలు, మనుమరాళ్లతో కలిసి అష్టాచెమ్మ ఆడుతున్న వృద్ధురాలుగతానికి ఇప్పటికీ ఎంతో తేడా... గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే కుటుంబంలో మూడు నాలుగుతరాల్లోని దాదాపు పది నుంచి పాతిక మంది వరకు చిన్న పిల్లలు, పెద్దలు ఉమ్మడిగా కలిసి జీవించేవారు. ఆ కుటుంబ సభ్యులందరూ యజమాని చెప్పిన బాటలోనే నడుచుకునేవారు. పిల్లలు పెద్దలు చెప్పే కథలు వినేవారు, వారితో కాలక్షేపం చేసేవారు. ప్రస్తుతం కుటుంబాలన్నీ విచ్చిన్నమై చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో వేసవికాలం సెలవులు అయినా ఆనందంగా అందరితో గడపడానికి కుటుంబ ప్రాధాన్యతను చిన్న పిల్లలకు తెలియ చెప్పడానికి సరైన అవకాశంగా భావిస్తున్నారు. తద్వారా చిన్నపిల్లలు పెద్దలతో వ్యవహరించే తీరు, నడవడిక, వ్యవహార శైలి, భావోద్వేగాలు, సామాజిక మర్యాదల వంటివి తెలుసుకుంటున్నారు. సెలవులు.. సరదాగా.. సెలవులకి అమ్మమ్మ, మామయ్య బంధువుల ఇంటికి వెళ్లడం ద్వారా పిల్లల ఆలోచన విధానంలో, అలవాట్లలో మార్పులు జరుగుతాయి. బంధుత్వాలు తెలుస్తాయి. స్నేహితులు పరిచయం అవుతారు. కుటుంబం ప్రాధాన్యత తెలుస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలను అనుభవాలను పిల్లలు మనసులో శాశ్వతంగా ఉంచుకుంటారు. ఇటు పిల్లలకు.. అటు పెద్దలకు.. పిల్లలను గ్రామాలకు పంపడం ద్వారా ఇటు పిల్ల లకు, అటు పెద్దలకు లాభం జరుగుతుంది. సంప్రదాయాలు బదిలీ అవుతాయి. అనుబంధాలు పెరుగుతాయి. పిల్లలు దూరంగా ఉన్నారన్న భావన దూరం అవుతుంది. అమ్మమ్మ, తాతయ్యలను కలిశామన్న సంతోషం పిల్లలకు మిగులుతోంది. గ్రామీణ వాతావరణం అర్థమవుతుంది. పాతకాలపు వంటకాలు, పాడి పశువులు, పంట పొలాలు, వ్వయసాయం, రైతుల కష్టం గ్రామీణ పనులపై అవగాహన కూడా వస్తుంది. 1న రౌండ్ టేబుల్ సమావేశం నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో జూన్ 1న నిర్మల్ జిల్లా ఉచిత విద్య, వైద్య సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కోకన్వీనర్ పోశెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో శనివారం సమావేశం నిర్వహించారు. జూన్ 1న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి ఉచిత విద్య ,వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ కిసాన్సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యకాంత్, లంబడా హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ పాలొగన్నారు. ● సీనియర్ సివిల్ జడ్జి రాధికన్యూస్రీల్తనివితీరా ఆడుకోనివ్వండి... నాలుగు గోడల మధ్య ఉండడం కన్నా పిల్ల లను తనివి తీరా ఆడుకోనివ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. గ్రామాలకు పంపించడం ద్వారా మమతలను పంచే అనుబంధాల వారధులుగా మారతారని పేర్కొంటున్నారు. ప్రేమానురాగాలకు అసలు సిసలైన కోవెలలు గ్రామాలే. ఆత్మీయ దోస్తులు అక్కడే పరిచయం అవుతారు. పిల్లలతో స్వగ్రామానికి.. మాది సారంగాపూర్ మండలం జాం గ్రామం. ఉద్యోగరీత్యా మహబూబ్నగర్ జిల్లాలో పని చేస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలు నానమ్మ, తాతయ్యలతో గడపాలని తీసుకుని వచ్చాం. సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. గ్రామీణ వాతావరణం అర్థం చేసుకుంటున్నారు. సాయంత్రాలు పంట పొలాల్లో గడుపుతూ వ్యవసాయం ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు. – జగ్గని భోజన్న– విగ్నేశ్వరి, జామ్, మండలం సారంగాపూర్ అప్పటి రోజులే వేరు... అప్పట్లో పాఠశాలలకు సెలవులు వచ్చాయంటే తెగ ఆనంద పడిపోయే వాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఊర్లకు వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకునే వాళ్లం. కొత్త స్నేహితులు పరిచయమయ్యేవారు దోస్తులతో రోజంతా ఆడుకునే వాళ్లం, పొలంగట్ల మీద స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆస్వాదించే వాళ్లం. సంప్రదాయ ఆటలు ఆడేవాళ్లం. ఇప్పుడు స్పెషల్ క్లాసులు, కంప్యూటర్ శిక్షణలు, ట్రైనింగ్లు అంటూ సెలవుల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. – పూసల చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్ -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 909 మంది విద్యార్థులకు 843 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కేటరీలో 833 మందికి 776 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 76 మందికి 67 మంది హాజరయ్యారు. సెకండియర్లో మొత్తం 608 మంది విద్యార్థులకు 574 మంది హాజరవగా, 34 మంది గైర్ హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 596 మందికి 566 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 12 మందికి 8 మంది హాజరయ్యారు. ఇంటర్ జిల్లా అధికారి పరుశురాం ముధోల్, భైంసాలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
యూనిఫాంల పంపిణీపై కలెక్టర్ సమీక్ష
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు యూనిఫాంలు పంపిణీ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా జూన్ 12న ప్రతీ విద్యార్థికి ఒక జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశించారు. అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు స్టిచ్చింగ్ సెంటర్లు కుట్టిన దుస్తుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్డీవో రత్నకల్యాణి, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవోఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, సీపీవో బాబురావు, సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్గౌడ్, మనోహర్, మెప్మా పీడీ సుభాష్, ఎంఈవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
సేత్వారి సమస్య పరిష్కారానికి కృషి
సోన్: న్యూవెల్మల్ గ్రామ సేత్వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన సేత్వారి రైతులు వీడీసీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడిని నిర్మల్లోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈమేరకు వినతిపత్రం అందిచారు. 45 ఏళ్లుగా గ్రామం సెత్వారీ కాకపోవడంతో పండించిన పంటను అమ్ముకోవడానికి, రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు వంటి పథకాలు తమకు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి చాలాసార్లు సమస్య తీసుకెళ్లామని, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వీడీసీ చైర్మన్ రోడ్డ రాజేశ్వర్, కోశాధికారి గజ్జల గంగాధర్, మాజీ సర్పంచులు తోట సాయన్న, గడ్డం స్వామి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, సేత్వారీ రైతులు ఉన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలో పాలిసెట్ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,946 మంది విద్యార్థులకు 1,720 మంది హాజరవగా, 226 మంది గైర్హాజరయ్యారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కేంద్రానికి ఓ విద్యార్థిని 5 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. విద్యార్థినితో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలిపినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగింది. -
తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొంటుంది
కడెం: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. మండలంలోని అంబర్పేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. తర్వాత దోస్త్నగర్, లక్ష్మీపూర్, నవాబ్పేట్, పాండవాపూర్, ఉప్పరిగూడెం, బెల్లాల్, చిట్యాల, చిట్యాల, గోండుగూడా, ఎల్లగడప, పాతమద్దిపడగ, లింగాపూర్ తదితర గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈదురు గాలులకు ఉట్నూర్–కడెం ప్రధాన రహదారిపై కూలిన వృక్షాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురిని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పునఃప్రారంభం నాటికి వసతులు కల్పించాలి
● టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి నిర్మల్రూరల్: గత ప్రభుత్వంలా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి వసతులు కల్పించాలని, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మూతపడిన పాఠశాలలను తెరిపించాలని, అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, మన ఊరు – మన బడి పథకంలో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యావలంటీర్లను నియమించాలన్నారు. బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, ప్రతీ పాఠశాలకు ఒక పారిశుధ్య కార్మికుడు, ఒక నైట్ వాచ్మెన్ను నియమించాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ఖాన్, జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, ఎ.లక్ష్మీప్రసాద్రెడ్డి, వివిధ మండలాల బాధ్యులు మొయిజుద్దీన్, మతీన్, లక్ష్మారెడ్డి, కరిపె శివప్రసాద్ పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
నిర్మల్ రూరల్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష నిర్వహించారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 1214 మంది విద్యార్థులకు 1116 మంది హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 1,010 మందికి 930 మంది హాజరవగా, 80 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 204 మందికి 186 మంది హాజరవగా 18 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్లో మొత్తం 438 మంది విద్యార్థులకు 401 మంది హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 365 మందికి 333 మంది హాజరయ్యారు. 32 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 73 మందికి 68 మంది హాజరవగా ఐదుగురు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కే ంద్రాన్ని డీఐఈవో పరశురాం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
● కానరాని ఫిట్నెస్.. అనుభవం లేని డ్రైవర్లు ● నిబంధనలు పాటించని యజమానులు ● ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
ఆదిలాబాద్ వయా నిర్మల్ నుంచి హైదరాబాద్కు బుధవారం రాత్రి బయల్దేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్మల్ ఘాట్ సెక్షన్ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్ లోడ్ కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడగా, అందులో ప్రయాణిస్తున్న 25 మంది గాయాలపాలయ్యారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో ప్రయాణికుల రోదనలు మిన్నంటాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రతిరోజు బస్ టాప్పైన, వెనుక, కింది భాగంలో నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్ తరలించడం సర్వసాధారణంగా మారింది. రవాణాశాఖ అధికారులకు ఇదంతా తెలిసినా ‘మామూలు’గా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నిర్మల్ వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సుఆదిలాబాద్టౌన్: ప్రైవేట్ బస్సు ప్రయాణం సురక్షితమేనా అనే అనుమానం వ్యక్తమవుతుంది. కాలం చెల్లిన ఫిట్నెస్ లేని డొక్కు బస్సులు.. అనుభవం లేని డ్రైవర్లు.. నిబంధనలు పాటించని యజమానుల కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వారు చేసే తప్పిదంతో తాజాగా ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ధనార్జనే తప్పా ప్రయాణికుల ప్రాణాలు వారికి లెక్కలేకుండా పోతోంది. ప్రతిరోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో, రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు. అక్కడినుంచి తిరిగి జిల్లా కేంద్రానికి ప్రయాణికులను తీసుకొస్తున్నారు. కొన్ని బస్సులు మినహా చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. నిర్మల్ ఘాట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. అందులో 49 మంది వరకు ప్రయాణించినట్టు సమాచారం. రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ బస్సుల యజమానులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో.. ఆదిలాబాద్ నుంచి ప్రతిరోజు 20 వరకు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్కు వెళ్తుంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి కూడా అదే సంఖ్యలో జిల్లా కేంద్రానికి వస్తుంటాయి. వీటితో పాటు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులు సైతం జిల్లా ప్రయాణికులను తరలిస్తుంటారు. అలాగే మరో 97 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా కాల పరిమితి దగ్గరగా ఉన్నవే ఉన్నాయి. చాలా వాటిలో అరిగిన టైర్లు, సరిగా ఉండని అద్దాలే దర్శనమిస్తాయి. అయినా ఏసీ పేరిట వీడియోకోచ్, తదితర సౌకర్యాలు ఉన్నట్లు చెప్పి టికెట్లు బుక్ చేసుకుంటారు. బస్సు ఎక్కే సరికి ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి. తీరా చేసేదేమి లేక అదే డొక్కు బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన దుస్థితి. గూడ్స్ తరలింపే వారి ధ్యేయం.. నిబంధనల ప్రకారం ప్రయాణికులను తరలించే బ స్సుల్లో గూడ్స్ తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ కాసులకు కక్కుర్తిపడి ప్రైవేట్ బస్సుల య జమానులు బస్సుల్లో పెద్ద ఎత్తున గూడ్స్ తరలిస్తున్నారు. ప్రయాణికుల పరిమితితో పాటు గూ డ్స్ త రలిస్తుండడంతో ఆ బస్సులు ఎక్కడ బోల్తాపడతా యోనన్న భయాందోళన ప్రయాణికుల్లో నెలకొంటుంది. బుధవారం జరిగిన ఘటన ఇదే కోవలోకి వస్తుంది. గతంలోనూ ఓ ప్రైవేట్ బస్సు నిర్మల్ ప్రా ంతంలో బోల్తా పడింది. పదేపదే ఘటనలు చోటు చేసుకుంటున్నా రవాణా శాఖ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావి స్తోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడమే తప్పా మళ్లీ ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటు ప్రయాణికుల చార్జీలతో పాటు అటు గూడ్స్ తరలించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల గురించి పట్టించుకోకుండా గ్యాస్ సిలిండర్లు, గంజాయి, తదితర మత్తు పదార్థాలు సైతం ఇందులో తరలిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తనిఖీలు కరువు.. రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేయాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. వారి నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రతి బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉండగా, ఒక్కరితోనే ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఫస్ట్ఎయిడ్ బాక్స్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఏ బస్సులోనూ కనిపించదు. ఫైర్ పరికరాలు మచ్చుకు కానరావు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు సైతం అంతంతే. వీటికి తోడు అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికులను తరలిస్తున్నా అధికారుల తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవాణా శాఖలో ఇదివరకు రెగ్యులర్ డీటీసీ ఉండగా, ఆయన వరంగల్కు బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికారి ఇన్చార్జిగా ఉన్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ప్రస్తుతం పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ ఆ శాఖ అధికారుల వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు. -
కడెం మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
కడెం: కడెం ప్రాజెక్టు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు మరమ్మతు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా మరమ్మతు పనుల్లో వేగం పెంచాలన్నారు. అనంతరం లింగాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సారంగాపూర్ గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో అరుణ తదితరులు ఉన్నారు. -
కిం కర్తవ్యం..!?
నిర్మల్కదలరు.. వదలరు బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో పలువురు ఉద్యోగులు ఏళ్లుగా తిష్ట వేసి ఇక్కడే పని చేస్తున్నారు. పలుకుబడి ఉపయోగించుకుంటూ కుర్చీని పట్టుకొనే ఉంటున్నారు.9లోu శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి లక్ష్మణచాంద: మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని డీఆర్వో భుజంగరావు సూచించారు. రాచాపూర్, లక్ష్మణచాంద, ధర్మారం, పీచర, మునిపెల్లి, పార్పెల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణచాంద, చింతల్చాంద, తిర్పెల్లి గ్రామాల్లోని రైస్ మిల్లులను పరిశీలించారు. మిల్లులకు వచ్చిన ధాన్యం లారీలను త్వరగా అన్లోడ్ చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జానవి, ఆర్ఐ దేవిక ఉన్నారు.నిర్మల్: జిల్లాలోని నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో రెండేళ్ల క్రితం మొదలైన నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాల కథ అంతులేకుండా సాగుతూనే ఉంది. పలు మలుపులు తిరుగుతున్నా.. ఇప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అప్పట్లో నియమితులైనవారు హైకోర్టుకు వెళ్లగా, కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ.. బాధితులకు వేతనాలు చెల్లించాలంటూ ఆదేశించింది. అసలు.. ఈ నియామక ప్రక్రియనే తప్పుదోవ పట్టించారని, విధివిధానాలను పాటించలేదని తాజాగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) అప్పటి నిర్మల్, భైంసా మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, అలీంను మంగళవారం సస్పెండ్ చేసింది. మరోవైపు.. నియమితులైనవారికి అప్పటి కలెక్టర్ ముషరఫ్అలీ వేతనాలు ఇవ్వకుండా కోర్టుధిక్కారానికి పాల్పడ్డారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన గురువారం స్టే తెచ్చుకున్నారు. వీటన్నింటి మధ్య ఆ.. నియామకాలకు సంబంధించిన ఫైల్ మిస్సయ్యిందన్న విషయం బయటకు రావడంతో అసలు ఈ పోస్టులపై ఏం చేస్తారనేది తేలడం లేదు. కమిషనర్లపై చర్యలు.. నాలుగో తరగతి పోస్టుల ఎంపిక ప్రక్రియలో కీలకంగా ఉన్న కలెక్టర్తోపాటు కమిషనర్లపైనా ప్రభావం పడింది. అసలు ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోకుండా, విధివిధానాలు పాటించకుండా, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పోస్టుల ఎంపిక ప్రక్రియ చేపట్టారంటూ సీడీఎంఏ సీరియస్ అయ్యింది. అప్పటి నిర్మల్, భైంసా కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, అలీంపై సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లక్రితం జరిగిన నియామకాలపై తాజాగా స్పందించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అప్పటి కలెక్టర్, కమిషనర్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చిన తరుణంలోనే ఇటు సీడీఎంఏ నుంచి కమిషనర్ల సస్పెన్షన్ ఆర్డర్లు రావడం గమనార్హం. ఇప్పుడేం చేస్తారో.. తమ చేతుల్లోకి అపాయింట్మెంట్ ఆర్డర్లు, ట్రెజరీల్లోకి పేర్లు వచ్చినా.. తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో నియమితులు అనిశ్చితిలో ఉన్నారు. కోర్టులో తీర్పు వచ్చినప్పటికీ అధికారుల నుంచి తమకు అనుకూలంగా ఎలాంటి కదలిక లేకపోవడంతో వారిలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ పోస్టుల నియామకాలపై కోర్టుకు వెళ్లిన నిరుద్యోగులు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. న్యూస్రీల్ ‘మున్సిపల్’ పోస్టుల్లో అనిశ్చితి..! నియమితులకు వేతనాలివ్వాలన్న కోర్టు నియమించినవారినే తొలగించిన సీడీఎంఏ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న అప్పటి కలెక్టర్వేతనాలివ్వాలని.. నిర్మల్ మున్సిపాలిటీలో 2022, ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. వీటి ప్రకారం ట్రెజరీకీ వెళ్లారు. కానీ.. వేతనాలు మాత్రం రాలేదు. దీంతో నియమితుల్లో నుంచి 15 మంది హైకోర్టుకు వెళ్లారు. తమకు 2022 ఫిబ్రవరి నెల నుంచి వేతనాలను ఇప్పించాలంటూ కోరారు. ఈమేరకు అదే ఏడాది సెప్టెంబర్లో కోర్టు వీరికి జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. అంతకు నోటిఫికేషన్, పోస్టుల ఎంపిక తీరుపై పలువురు నిరుద్యోగులు వేసిన పిటీషన్లనూ ఇందులోనే ఇంప్లీడ్ చేశారు. ఈమేరకు తమకు వేతనాలను ఇస్తారని నియమితులు ఆశించారు. నెలలు గడిచిన తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో మరోసారి వారు కోర్టును ఆశ్రయించారు. మే 3న అప్పటి కలెక్టర్ ముషరఫ్అలీ, కమిషనర్ సత్యనారాయణరెడ్డి ధిక్కరణకు పాల్పడినట్లు భావించిన హైకోర్టు నెలరోజుల జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. స్టే తెచ్చుకున్న మాజీ కలెక్టర్.. నిర్మల్ పూర్వ కలెక్టర్(ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ ఎండీ) మహమ్మద్ ముషారఫ్అలీ ఫారూఖీ హైకోర్టు నుంచి తనపై వచ్చిన జైలుశిక్ష ఉత్తర్వుల నుంచి ఊరట పొందారు. కోర్టు ధిక్కరణ కేసులో ఈనెల 3న సింగిల్ జడ్జి ఇచ్చిన ఒక నెల సాధారణ జైలు శిక్ష ఉత్తర్వులపై ఆయన కోర్టులో అప్పీల్కు వెళ్లగా గురువారం ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని ఆదేశించింది. -
బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి
ఖానాపూర్: ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు కోరారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల ప్రారంభానికి ముందే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాల ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో స్కావెంజర్ల ను నియమించాలని, పాఠశాలలను ఉన్నతీకరించాలని కోరారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు, పా ఠ్యపుస్తకాలతోపాటు ఉచితంగా నోటు పుస్తకా లు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్నాయక్ పాల్గొన్నారు. -
బుద్ధుని మార్గం అనుసరణీయం
భైంసాటౌన్: బుద్ధుని మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. పట్టణంలోని రాహుల్నగర్ మైత్రేయ బుద్ధవిహార్లో గురువారం నిర్వహించిన బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బుద్ధుని బోధనలు ప్రపంచశాంతికి బాటలు వేశాయన్నారు. అంతకుముందు గౌతమ బుద్ధుని విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా జెండా ఆవి ష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాయణ్రెడ్డి, గాలి రాజన్న తదితరులు పాల్గొన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధవిహార్లో వైశాఖ బుద్ధ పూర్ణిమ ఘనంగా నిర్వహించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- 13 నిమిషాలు యథాతథం
- Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Advertisement