-
ఎండవేడి.. ఉక్కపోత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శనివారం సైతం ప్రచండ భానుడు ప్రకోపాపం ప్రదరించాడు. ఉదయం తొమ్మిది దాటక ముందే నిప్పులు కక్కాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్రమైన వడగాలులు వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవగా.. ప్రజలు కూలర్లు, ఏసీల కింద సేదతీరారు.శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు(డిగ్రీల సెల్సియస్లో..)అల్లీపూర్(జగిత్యాల)46.8వీణవంక(కరీంనగర్)46.8పెద్దపల్లి 46.1రాజన్న సిరిసిల్ల45.3 -
ధాన్యంలో కోతలు విధించొద్దు
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని మ ద్దతు ధరతో కొనుగోలు చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ కోతలు విధించవద్దని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు సూచించాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ లో వేగం పెంచాలని అన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల, పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు ఉన్నారు.‘నిజాయతీగా ఓటేస్తాం’ కోల్సిటీ(రామగుండం): ‘నిజాయతీగా ఓటేస్తాం’ అని సింగరేణి కార్మికులతో స్వీప్ జిల్లా నోడల్ అధి కారి రవూఫ్కాన్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్జీ–1 ప రిధి జీడీకే–2 గనిపై శనివారం నిర్వహించిన ఓటు ప్రాధాన్యతపై వారు అవగాహన కల్పించారు. ప్ర జాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలతో అలరించారు. గని మేనేజర్ తిరుపతి, ఐసీడీఎస్ ప్రతినిధి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. -
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ 13 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలతో భారీగా జనాభా ఉన్న సువిశాలమైన జిల్లా. ఇంతటి జనాభా ఉన్న పాత జిల్లాలో సామాన్యులు చట్టప్రకారం అందాల్సిన కనీస సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. సామాజికపరంగా భద్రత కల్పించే అనేక రకాల సదుపాయాలను వివిధ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టింది. ఇంతవరకూ ఆ సేవలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో అందడం లేదు. కొన్ని సేవలు నేటికీ అసంపూర్తిగానే అందుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు గెలిచాక ఆయా సమస్యలకు ఈ సారైనా పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ సేవలెక్కడ? ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా మూడు రంగాల్లో కా ర్మికులు పనిచేస్తున్నారు. వీరు అనారోగ్యం పాలైతే వైద్యం అందించేందుకు కేంద్రం ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు తీసుకొచ్చింది. రామగుండంలో చిన్న డిస్పెన్సరీ తప్ప జనాభాకు తగినట్లు ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. అసలు ఆ ఆసుపత్రి ఉన్న విషయం కూడా చాలామంది తెలియకపోవడం గమనార్హం. ఈ సేవలు పొందాలంటే వరంగల్, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల మంది ప్రైవేటు టీచర్లు వివిధ స్కూళ్లలో పని చేస్తున్నారు. కానీ, వీరిలో 50శాతంపైగా మందికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేవు. 1,000 వరకు ఉన్న రైసుమిల్లుల్లో 20వేలకు పైగా కార్మికులు ఉన్నారు. అలాగే దాదాపు లక్షా తొంబై వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 370 వరకు గ్రానైట్ క్వారీల్లో 25వేల వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సరైన పీఎఫ్, ఈఎస్ఐ సేవలు అందడం లేదు. వేతన సవరణతో సేవలకు దూరం ఆపద కాలంలో కనీసం హైదరాబాద్లో అయినా ఈఎస్ఐ సేవలు పొందే వీలుండేది. 2015లో రూ.15,000 ఉన్న వేతన పరిమితిని కేంద్రం రూ.2,1000కు పెంచింది. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. కానీ, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత కేసీఆర్ ప్రభుత్వం 30శాతం వేతనం పెంచింది. దీంతో చాలామంది కార్మికుల వేతనాలు రూ.21,100 దాటాయన్న కారణంతో ఈఎస్ఐ సేవలకు దూరమయ్యారు. మారుతున్న కాలానికి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25వేలకు పెంచాలన్న కార్మికుల డిమాండ్ ఇంకా అమలుకు నోచుకోలేదు.అంగన్వాడీ ప్రతిపాదనలేవి? పిల్లలకు సరైన పోషకాహారంతోపాటు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అంగన్వాడీ కేంద్రాలు..పేద, సామాన్యుల పాలిట వరం. మన రాష్ట్రంలో దాదాపు 37,500 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి పెరుగుతున్న జనాభా, వెలుస్తున్న కొత్త కాలనీలకు అనుగుణంగా కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఆన్ డిమాండ్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది. అయినా, ఈ కేంద్రాల అమలుకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఆశించినంత స్థాయిలో చొరవ తీసుకోవడం లేదు. కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) కింద ఏర్పాటు చేయాల్సిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు మన వద్ద లేకపోవడం గమనార్హం. అలాగే 13 నియోజకవర్గాల్లో జరుగుతున్న సివిల్ పనుల్లో 0.1 శాతం మొత్తాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్)కు జమవుతుంది. ఆ మొత్తాన్ని వివిధ సివిల్ పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు గ్రాడ్యుయేట్ ఫినిషింగ్ స్కూల్ కోసం వెచ్చిస్తారు. అలాంటి శిక్షణ కేంద్రం ఉమ్మడి జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేసినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినవారవుతారు. కేంద్రం పరిధిలోని నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్తో రాష్ట్రం సమన్వయం చేసుకోని కారణంగా ఇక్కడ మైనార్టీలకు సరైన ఆర్థికసాయం అందడం లేదు. మైనార్టీ సంఖ్యను చూసినప్పుడు కరీంనగర్లో 1,29,000, పెద్దపల్లిలో 70,000పైగా, నిజామాబాద్లో 3,00,00 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లింలు అధికభాగం ఉండగా, మైనార్టీలు, సిక్కులు తదితరులు మిగిలిన సంఖ్యలో ఉన్నారు. ఈసారి గెలిచే ఎంపీలైనా మైనార్టీల ఆర్థికసాయానికి చొరవ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హజ్ యాత్రికులకు టీకాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో టీకాలు వేయించినట్లు అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ తెలిపారు. టీకాల కోసం గతంలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇపుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. స్థానిక డ యాగ్నస్టిక్ హబ్ వద్ద శనివారం ఏర్పాటు చేసి న ఈ శిబిరం ద్వారా 22 మంది యాత్రికులకు టీకాలు వేసినట్లు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ తెలిపారు. ప్రతినిధులు రమాకాంత్, శౌరయ్య, కృపాబాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దే ఓటు వినియోగం పెద్దపల్లిరూరల్: దివ్యాంగులు, 85ఏళ్ల వయ సు దాటిన వృద్ధులు తమ ఇంటివద్దే ఓటుహ క్కు వినియోగించుకోవాలని, ఇందుకోసం ఎ న్నికల సంఘం మంచి అవకాశం కల్పించింద ని పెద్దపల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఇంటివద్ద ఓటుహక్కు వినియోగం ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల అధికారులు, ఓటర్లకు పలు సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ను ఈనెల 7లోగా వినియోగించుకోవాలని గంగయ్య సూచించారు. ఇందుకోసం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.‘దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు ఇవి’గోదావరిఖని: అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు దేశభవిష్యత్ను నిర్ణయిస్తాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీ చలపతిరావు అన్నారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలు, రాష్ట్రాల హక్కులపై దాడులు తీవ్రమయ్యాయని ఆయన ఆరోపించారు. కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, ప్ర తిపక్షాలు, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటరీ సంస్థలు, మైనార్టీలు, ప్రత్యేకంగా ము స్లింలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు ఐ. కృష్ణ, నరేశ్, వెంకన్న, బి.అశోక్, చిలుక శంకర్, మల్లేశ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కానున్నా యని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ తెలిపారు. స్థానిక అడ్డగుంటపల్లి, మారుతీనగర్, హనుమాన్ టెంపుల్ వద్ద 48 డివిజన్ కార్పొరేటర్ పొన్న విద్య ఆధ్వర్యంలో శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బెందె నాగభూషణంగౌడ్, పెరుమాండ్లుగౌడ్, కదిరి సత్యనారాయణ, చిర్ర సంపత్రెడ్డి కాంగ్రెస్లో చేరిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక బీఆర్ఎస్ నుంచి పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక దుర్గానగర్లో జరిగిన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ వారికి కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరి న వారిలో నాయకులు అవినాశ్, సతీశ్, సురేశ్, అజయ్ తదితరులు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆసిఫ్పాషా, రమేశ్ పాల్గొన్నారు. బొందల గడ్డగా మార్చింది కేసీఆరే.. పాలకుర్తి(రామగుండం): సింగరేణిలో ఓసీపీలు తవ్వించి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఎద్దేవా చేశారు. రామారావుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రిలో నీళ్లు, బొగ్గు లేకున్నా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని అన్నారు. స్థానికంగా నీళ్లు, బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నా.. జెన్కో ప్లాంట్ను విస్తరించకుండా ఈప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభు త్వ విప్గా, మంత్రిగా వివిధ పదవులు అనుభవించిన బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్.. రామగుండం ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని మక్కాన్ సింగ్ అన్నారు. చేతిగుర్తుపై ఓటువేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కన్నాల సింగిల్విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, జయ్యారం ఎంపీటీసీ గంగాధర రమేశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): స్థానిక గౌతమినగర్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ గడప గడప కూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. నాయకులు మహంకాళి స్వామి, బెద్రం సునీత, ఆసిఫ్ఖాన్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement