-
మద్యం మత్తులో భార్యపై దాడి
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మద్యం మత్తులో భర్త తన భార్యపై దాడిచేశాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బంగ్లాస్ ఏరియాలోని సర్వెంట్ క్వార్టర్లో శ్రీను –స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీను మేషన్ పనిచేస్తున్నాడు. స్వప్న బంగ్లాస్ ఏరియాలోని క్యార్టర్లలో పనిచేస్తోంది. తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో శుక్రవారం మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో భార్యపై దాడి చేశాడు. ఈక్రమంలో అతి చేతిలోని బ్లేడ్ తగిలి స్వప్న గాయపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరిని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: వానాకాలంలో రైతులకు మేలుర కం విత్తనాలు విక్రయించాలని, నకిలీ, కల్తీ విత్తనా లు అంటగట్టేందుకు యత్నించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అ న్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ తదితరులతో ఆ యన సమావేశమయ్యారు. లైసెన్స్ పొందిన డీలర్లు మాత్రమే విత్తనాలు, ఎరువులను ఈపాస్ యంత్రా ల ద్వారా విక్రయించాలన్నారు. గడువు ముగిసిన విత్తనాలు అమ్మితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనల మేరకు రాయితీ విత్తనాలు విక్రయించాలని సూచించారు. నిల్వలను రిజిష్టర్లలో నమోదు చేయాలన్నారు. ఆ వివరాలు అందరికీ కనిపించేలా బోర్డుపై రాయాలని పేర్కొన్నారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు నకిలీ, కల్తీ విత్తన విక్రయాలను కట్టడి చేసేందుకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. బీటీ – 3 విత్తనాలను నిషేధించారని, వాటిని విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండలస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలతో ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించాలి ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను ఈనెలాఖరులోగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఽ కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ,, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. మార్చిలో ధరణిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. మళ్లీ స్పెషల్డ్రైవ్తో ఈ నెలాఖరు వరకు పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తిచేశారని సీఎస్ అభినందించారు. అమ్మఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు చేరాయని, పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయని, సజావుగా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయని, సీఎంఆర్ పూర్తయిందని, డెలివరీ చేయాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. ఆర్డీవోలు గంగయ్య, హనుమా నాయక్, డీఈవో మాధవి, డీఆర్డీవో రవీందర్, డీసీవో శ్రీమాల, పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్రెడ్డి, సీపీవో రవీందర్ పాల్గొన్నారు. -
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
పెద్దపల్లిరూరల్: రక్తపోటు(బీపీ)ని నియంత్రిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువకాలం జీవిస్తారని డీఎంహెచ్వో పమోద్కుమార్ అన్నారు. ప్రపంచరక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధులు దూరం.. గోదావరిఖని: బీపీ నియంత్రణలో ఉంటేనే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని సింగరేణి ఆ రోగ్య అధికారి సుమన్ అన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో అధిక రక్తపోటుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డాక్టర్లు అంబిక, రవి, భా స్కర్, మురళి, ప్రశాంత్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తాం ధర్మారం(ధర్మపురి): అకాలవర్షాలతో తడిసిన ధా న్యం కొనుగోళ్లపై రైతులు అధైర్యపడవద్దని, చివరిగింజ వరకూ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని విప్ కలిసి ధాన్యం కొనుగోళ్లపై వినతిపత్రం అందించారు. రైతుల సమస్యలను వివరించారు. -
సాగు ప్రణాళిక ఖరారు
● జిల్లాలో 2.77లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు ● వరి 2.08లక్షలు.. పత్తి 50వేల ఎకరాల్లో పండిస్తారని అంచనా ● ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్న అధికారులుసాక్షి, పెద్దపల్లి: జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుందనే అంచనాలతో అవసరమైన ఎరువులు, విత్తనాలను అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. అన్నదాతలకు వాటిని పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. వట్టిపోయిన జలవనరులు.. ● వర్షాలు, చెరువులు, కుంటల ఆధారంగా జిల్లాలో పంటలు పండిస్తున్నారు. ● ఎండలు దంచికొట్టడంతో బావులు, చెరువులు, కుంటలు వట్టిపోయాయి. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే జలకళ సంతరించుకుంటాయి. ● అయితే, రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వానాకాలం సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. ● దీంతో ఇప్పటికే రైతులు ఏ పంటలు సాగు చేస్తారు? ఎంత మేర విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయి? తదితర అంశాలతో వ్యవసాయ శాఖ అధికారులు వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. వరికే పెద్దపీట వానాకాలంలో జిల్లాలో 2.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు పండించనున్నారు. ఇందులో 2.08లక్షల ఎకరాల్లో వరి సాగుకే రైతులు అధిక ప్రా ధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత పత్తిని 57వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. గత వానాకాలంతో పోలిస్తే ఈసారి 740 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరు గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలా గే 32,082 మెట్రిక్ టన్నుల యూరియా, 8,280 మెట్రిక్ టన్నుల డీఏపీ, 24,579 కాంప్లెక్స్ ఎరువులు, 6,889 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 500 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీలను అందుబాటులో ఉంచనున్నారు. వేసవి దుక్కులకు సన్నద్ధం.. ● జూన్ ఒకట తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ● దీనికితోడు జూన్ 7న మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వానలు కురుస్తాయని అన్నదాతలు నమ్ముతారు. ● తొలకరితోనే నీరు నేలలోకి ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. ● వర్షాలకు ముందే.. అంటే వేసవిలో నేలను దున్నితే.. తొలకరి నీరు నేలలోకి ఇంకి కోతకు గురికాదు. ● లోతు దుక్కులతో నేల పైపొరలు కిందికి, కిందిపొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ● ఇలా నేలలో తేమ శాతం పెరిగి, భూసారం వృద్ధి చెందుతుంది. ● పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ లాంటి ప్రయోజనాలు సమకూరుతాయి. ● వేసవి దుక్కులకు ముందు పేడ, పోగు, కంపోస్టు, మట్టిని వెదజల్లడం ద్వారా నేల సారవంతమై తేమశాతం పెరుగుతుంది. గతేడాది నిరాశపరిచిన సాగు గతేడాది వర్షాలు సకాలంలో కురిశాయి. సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతులు సంతోషపడ్డారు. రెండు నెలల వరకు అంతాబాగానేఉంది. కానీ, ఆ తర్వాత అధిక వర్షాలు కురిశాయి. తెగుళ్లు ఆశించి పంటలు దెబ్బతిన్నాయి. వరదలకు వరి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తికి పూత, కాయ నిలువలేదు. పంట చేతికొచ్చే సమయంలో వడగళ్లతో ధాన్యం తడిసింది. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు.. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు అధికారులు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీస్ శాఖల సమక్షంలో డీలర్లతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.జిల్లాలో సాగు అంచనా పంట విస్తీర్ణం(ఎకరాల్లో) వరి 2,08,814 మొక్కజొన్న 780 పత్తి 57,269 మినుములు 5 పెసర 16 కందులు 158 పల్లి 10 నువ్వు 5 ఆయిల్పామ్ 10,686 -
కంగ్రాట్స్ సర్!
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా నిర్వహించడంలో విజయం సాధించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ తదితరులు ప్రశంసించారు. ఎన్నికల విధు ల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందితో మర్యాదపూర్వకంగా వ్యవహరించారని కితాబిచ్చారు. అంతేకాదు.. మెరుగైన వసతులు కల్పించి ఉ ద్యోగుల్లో ఉత్సాహం నింపారని పేర్కొన్నారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ను వారు సన్మానించారు. నాయకులు కొమురయ్య, మహేందర్రెడ్డి, సురేశ్, ప్రవీణ్, శ్రీనివాస్, రాజేశ్, రత్నం పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాల కోసం జూన్ 10వ తేదీ వ రకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపాల్ న ర్సింహాచారి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మెమో, కులం, ఆధార్, టీసీ, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో మొబైల్ నంబరు నమోదు చేయాలన్నారు. బెస్ట్ అవలేబుల్ స్కూల్లో.. బెస్ట్ అవలేబుల్ స్కూల్లో ప్రవేశాశాల కోసం జూన్ 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. నాన్రెసిడెన్షియల్లో 70, రెసిడెన్షియల్లో 73సీట్లు కేటాయించామన్నారు. లాటరీ పద్ధతిన, రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు 90101 36407, 99082 61045 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. యూనిఫామ్స్ సిద్ధం చేయాలి కమాన్పూర్(మంథని): ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు యూనిఫామ్స్ సిద్ధం చేయాలని డీఆర్డీవో రవీందర్ సూచించారు. స్థానిక ఆదివరాహ కుట్టు మిషన్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే యూనిఫామ్లు కుట్టేందుకు క్లాత్ పంపిణీ చేసిందని, నిర్వహకులు యూనిఫామ్ను గడువులోగా సిద్ధం చేసి పాఠశాలలకు అందించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్ల పరిశీలించారు. ఏపీవో శైలజశాంతి, ఎంపీవో శేషయ్యసూరి పాల్గొన్నారు. పీహెచ్సీ సందర్శన ఓదెల(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ శుక్రవారం సందర్శించారు. వైద్య సిబ్బంది వివరాల గురించి ఆరా తీశారు. డా క్టర్ షాబొద్దీన్, యూడీసీ అనిసోద్దీన్ ఉన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ అ డ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ తెలిపారు. ఇంటర్ నోడల్ అధికారి కల్పనతో కలిసి కలెక్టరేట్లో పరీక్షలపై సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 5,510 మంది (ఇందులో 3,196మంది ఫస్టియర్, 2,314 సెకండియర్) విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరికోసం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డీఈవో మాధవి, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, ఎన్పీడీసీఎల్ డీఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన డార్జ్ పోటీలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): స్థానిక అ బ్దుల్ కలాం స్డేడియంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి డార్జ్బాల్ పో టీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఆర్జీ–2 జీఎం సూర్యనారాయణ హాజరయ్యారు. ఓవరాల్ చాంపియషిప్ సాధించిన హర్యాణా జట్టుకు ఐడీబీఎఫ్ ఫెడరేషన్ కప్తోపాటు బంగారు పతకం అందజేశారు. వివిధ రాష్టాల నుంచి పాల్గొన్న 24 జట్లలో ప్రతిభ చూపిన పురుషుల జట్ల నుంచి హర్యాణాకు చెందిన అమన్, మహిళ జట్ల నుంచి హర్యాణాకు చెందిన వన్షికను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు ఇండియన్ డార్జ్బాల్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ రవీందర్, ప్రతినిధులు శంకర్ నాయక్, జక్కుల దామోదర్, టంగుటూరి రాజయ్య, నిర్వాహకులు పాశం శ్రీను, ఓదెలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల నిర్వహణకు సింగరేణి సహకారం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): జాతీయ, ప్రాంతీయ క్రీడల నిర్వహణకు సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆర్జీ–2 జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాం స్టేడియంలో డార్జ్బాల్ జాతీయస్థాయి ఫెడరల్ కప్–24 పోటీలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో నిర్వహించే పలురకాల క్రీడలకు సహకారం అందించామని పేర్కొన్నారు. కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు, సింగరేణి ప్రభావిత గ్రామాల యువకులకు విశాలమైన క్రీడామైదానం అవసరానికి అనుగుణంగా ఉండడంతో పాటు అన్ని సదుపాయాలు యాజమాన్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో ఇండియాన్ డాడ్జిబాల్ ఫెడరల్ జనరల్ సెక్రెటరీ నర్సింహారెడ్డి, నిర్వాహకులు పాశం శ్రీను, ఓదెలుయాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు. ● ఆర్జీ–2 జీఎం సూర్యనారాయణ -
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
పెద్దపల్లిరూరల్: మాయమాటలతో అధికారం చేజి క్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగాలం కష్టపడే రైతన్నలను దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆరోపించారు. ధాన్యానికి మ ద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్న హా మీని వెంటనే అమలు చేయాలని గురువారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరస న దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానన్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు సన్నరకానికే అంటూ మాట మార్చడాన్ని తప్పుబట్టారు. రైతు వ్యతిరేక విధానా లను విడనాడి వెంటనే వారికి మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీలు బాలాజీరావు, సంపత్, నాయకులు మెహన్రావు, దాసరి ఉష, మర్కు లక్ష్మణ్, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, సతీశ్, ఉప్పు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర పర్యవేక్షణ
రామగిరి(మంథని): ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. మండలంలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో గురువారం స్ట్రాంగ్రూమ్ల భద్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు కల్పించిన మూడంచెల భద్రత, బందోబస్తును పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. జూన్ 4న జరిగే కౌంటింగ్కు సంబంధించి వాహనాల పార్కింగ్, కెమెరా మానిటరింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు వి.హనుమానాయక్, బి.గంగయ్య, గోదావరిఖని ఏసీపీ రమేశ్గౌడ్, మంథని సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ● రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
జ్యోతినగర్(రామగుండం): పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని ఎన్టీపీసీ రామగుండం– తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్పాండు అన్నారు. గురువారం పర్మనెంట్ టౌన్షిప్లో స్వచ్ఛతా పక్షోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. మనం నివాసం ఉండే ప్రదేశంతో పాటు విధులు నిర్వహించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. చెత్తను ఇష్టానుసారంగా పడేయకుండా సంబంధిత స్థలాల్లో వేయాలన్నారు. స్వచ్ఛత నియమాలు పాటిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈనెల 31 వరకు స్వచ్ఛతా పక్షోత్సవాల సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్ను నుంచి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్, ఉద్యోగ గుర్తింపు సంఘం జనరల్ సెక్రెటరీ ఆరెపల్లి రాజేశ్వర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం ఇంటి అనుమతులు
పెద్దపల్లిరూరల్: గ్రామాల్లో నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అన్నారు. పెద్దపల్లి మండలం చీకురాయిలో గురువారం పర్యటించారు. పంచాయతీ కార్యాలయ రికార్డులను పరిశీలించి ఇంటి నిర్మాణ అనుమతులపై ఆరా తీశారు. చీకురాయి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నందున లేఅవుట్ లేని భూముల్లో ఇంటి నిర్మాణాలను చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. వర్మి కంపోస్టు తయారీ గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. డీపీవో వెంట ఎంపీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి రాధ తదితరులున్నారు. 17న విత్తన, ఎరువుల చట్టంపై అవగాహనపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో 17న విత్తనాలు, ఎరువుల నియంత్రణ చట్టంపై అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి తెలిపారు. వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో వచ్చే సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తగు సూచనలిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ, పోలీసు అధికారులతో పాటు డీలర్లు పాల్గొంటారని తెలిపారు. జీజీహెచ్లో ట్రాన్స్జెండర్ క్లినిక్కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్సింగ్, సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్టంలోని ట్రాన్స్జెండర్లను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, వారి ఆరోగ్య సమస్యలపై వైద్య సేవలందించేందుకు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో తొలిసారిగా జీజీహెచ్లో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలోని రూం నంబర్ 39 ట్రాన్స్జెండర్ క్లినిక్గా కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ అర్చన, నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ పాల్గొన్నారు. కాగా క్లినిక్ ఏర్పాటుపై ట్రాన్స్జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో డెంగీని నివారిద్దాంపెద్దపల్లిరూరల్: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలను వృద్ధి చెందకుండా చూస్తే డెంగీని నియంత్రించవచ్చని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజహితం కోసం డెంగీ వ్యాధిని నియంత్రించేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. జ్వరం, తలనొప్పి, వికారం, చికాకు తదితర లక్షణాలుంటే డెంగీ వ్యాధిగా అనుమానించి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎలిసి పరీక్ష, టీహబ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సుధాకర్రెడ్డి, వైద్యాధికారి మమతతో పాటు ఉమామహేశ్వర్రావు, రాజేశం పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ వర్సెస్ టీబీజీకేఎస్
గోదావరిఖని(రామగుండం): ‘టీబీజీకేఎస్ ఫైరవీల యూనియన్.. ఆ యూనియన్తో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. తామంతా కార్మికుల కోసం కష్టించి పనిచేస్తే యూనియన్ తీరుతో సింగరేణి వ్యాప్తంగా ఓడిపోయాం. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యూనియన్ రద్దు చేయాలని ఆదేశించారు’ అని జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పుట్ట మధు వ్యాఖ్యలు పార్టీ, యూనియన్లో చర్చనీయాంశంగా మారాయి. వ్యూహాత్మమా.. లేదా కావాలనే యూనియన్ నాయకులపై ఆరోపణలు సంధించారా?.. అనే చర్చ జరుగుతోంది. దశాబ్దకాలం పాటు.. సింగరేణిలో దశాబ్దకాలం పాటు ఒక వెలుగువెలిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఒకేసారి చతికిలపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కోల్బెల్ట్ ప్రాంతంలో వ్యతిరేక ఫలితాలు రావడంతో యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు యూనియన్కు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండటంతో వాటికి కూడా దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో చాలా మంది నాయకులు ఇతర యూనియన్లలోకి వెళ్లారు. ఈక్రమంలో టీబీజీకేఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే గుర్తింపు ఎన్నికల నామినేషన్ పూర్తవడంతో పోటీ అనివార్యమైంది. అయినా అధిష్టానం ఆదేశాలతో టీబీజీకేఎస్ నాయకులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యూనియన్ను పునర్వ్యవస్థీకరించాలని నాయకులు ముందడుగు వేశారు. ఇటీవల ప్లీనరీ నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు సజావుగానే ఉన్న పార్టీ నాయకులు యూనియన్పై వ్యతిరేక స్వరం పెంచారు. ఈక్రమంలో బుధవారం జెడ్పీ చైర్మన్ పుట్ట మధు యూనియన్ నాయకత్వం తీరుపై చేసిన వాఖ్యలు కీలకంగా మారాయి. కార్మికుల్లో పట్టున్నా పార్టీకి నష్టం కోలిండియాలో ఎక్కడాలేని విధంగా టీబీజీకేఎస్ కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు, సొంతింటి కోసం రూ.10లక్షలు వడ్డీలేని రుణం, సకల జనుల సమ్మె వేతనాలు, లాభాల వాట గణనీయంగా పెంచి కార్మికులకు అందించింది. దేశంలోనే అత్యధికంగా హక్కులు సాధించిన క్రమంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు సింగరేణిలో ఓడిపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. యూనియన్పై వచ్చిన అవి నీతి ఆరోపణలు పార్టీకి ప్రతికూల ప్రభావం చూపాయని అంటున్నారు. కాగా, టీబీజీకేఎస్ 2012 జూలై 28న గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. అత్యధికంగా 40వేల కార్మికుల సభ్యత్వాన్ని సాధించింది. 2017 అక్టోబర్లో రెండోసారి గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఒక దశలో సింగరేణిలో మిగతా యూనియన్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితిని టీబీజీకేఎస్ తీసుకవచ్చింది. ‘పుట్ట’ వ్యాఖ్యలు యూనియన్, పార్టీలో చర్చనీయాంశం వ్యూహాత్మకమా.. కావాలనేనా.. టీబీజీకేఎస్తో పార్టీకి నష్టం: పుట్ట మధు తామెన్నడూ పార్టీ అనుబంధమని చెప్పలేదు: మిర్యాల పార్టీకి అనుబంధమని ఎక్కడా చెప్పలేదు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కార్మిక సంఘం నేషనల్ ఫెడరేషన్కు అనుబంధంగా కొనసాగవచ్చు. సింగరేణిని కాపాడుకోవాలి, గనుల వేలాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగాం. అనుబంధంగా పనిచేస్తామని ఏనాడూ చెప్పలేదు. పార్టీ అధిష్టానమే అనుబంధం అని కరపత్రాలు వేసింది. ట్రేడ్ యూనియన్లో తలదూర్చేందుకు పుట్ట మధు ఎవరు?. ట్రేడ్యూనియన్ యాక్ట్ ప్రకారం సంఘాన్ని నడుపుకుంటాం. పార్టీ అధినేతలు కొప్పుల ఈశ్వర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలిపిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగినం. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు యూనియన్తో పార్టీకి సంబంధం లేదు పార్టీకి యూనియన్తో సంబంధం లేదు. పార్టీకి టీబీజీకేఎస్ అనుబంధం అయితే అధినేత కేసీఆర్ ఆదేశాలతో ముందుకు సాగాలి. ఇష్టానుసారంగా కమిటీలు వేసుకుంటామంటే ఊరుకునేది లేదు. యూనియన్ మూలంగానే సింగరేణిలో పార్టీ ఓటమి పాలైంది. దీంతో యూనియన్ను రద్దు చేయాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అనాడే ఆదేశాలు జారీ చేశారు. యూనియన్ ఉండాలా వద్దా అనేది అధినేత నిర్ణయం తీసుకోవాలి. – పుట్ట మధు, జెడ్పీ చైర్మన్ -
సుల్తానాబాద్లో దంచికొట్టింది
సుల్తానాబాద్(పెద్దపల్లి): సుల్తానాబాద్లో గురువారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. రైతన్నలకు తీవ్ర నష్టం మిగిల్చింది. శాస్త్రినగర్లోని కేంద్రంలో ధాన్యం నీటిపాలైందని, తేమశాతం వచ్చినా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి వర్షం కురవడంతో కొందరు రైతులు టార్పాలిన్లు కప్పగా, కొందరి ధాన్యం తడిసిముద్దయింది. ఈదురుగాలులకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో విద్యుత్ వైర్లు కిందపడి ప్రమాదకరంగా మారడంతో కాంగ్రెస్ నాయకుడు అమిరిశెట్టి తిరుపతి అధికారులకు సమాచారం ఇవ్వగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మికి ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతేమశాతం వచ్చినా కొంటలేరు శాస్త్రినగర్ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తేమశాతం వచ్చినా కొంటలేరు. అకాల వర్షం పడడంతో వడ్లు తడిశాయి. తడిసిన వడ్లను వెంటనే కొనాలి. – నరహరి, రైతు, సుల్తానాబాద్ -
పరిహారం చెల్లించండి
పాలకుర్తి(రామగుండం): గతంలో తమతో చేసు కున్న ఒప్పందం ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి తక్షణమే పరిహారం చెల్లించాలని ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తులు, నాయకులు డిమాండ్ చేశారు. బసంత్నగర్ కేశోరాం సి మెంట్ కర్మాగారంలోని ప్రైవేట్ కాంట్రాక్టర్ గోపు అయిలయ్య యాదవ్కు చెందిన వాహనాలను బుధవారం వారు అడ్డుకున్నారు. పరిశ్రమలోని కాంట్రాక్టర్ అయిలయ్య యాదవ్ వద్ద ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కోడిపుంజుల రాజు లారీ డ్రైవర్గా పనిశాడని తెలిపారు. అయితే, విధి నిర్వహణలో భాగంగా మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు దుర్మరణం చెందాడని అన్నారు. ఆ సమయంలో మృతుడి కుటుంబానికి రూ.18లక్షల పరిహారం చెల్లించేందుకు అయిలయ్య యాదవ్ అంగీకరించారని గుర్తుచేశారు. మూడేళ్లు గడిచినా పైసా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు రాజు కుటుంబసభ్యులతోపాటు స్థానికులు అయిలయ్యకు చెందిన వాహనాలు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. కేశోరాం సిమెంట్ పర్మినెంట్ యూనియన్ నాయకులు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. రాజు కుటుంబానికి పరిహారం చెల్లించే వరకూ ఆందోళన విరమించేదిలేదని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, నాయకులు, గ్రామస్తులు అన్నవేని నగేశ్, ఓడ్నాల రాజు, మృతుడి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం అమలు చేయండి ఈసాలతక్కళ్లపల్లి గ్రామస్తుల డిమాండ్ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విన్నపం -
అనుమతితోనే మట్టి తవ్వకాలు
కమాన్పూర్(మంథని): జూలపల్లి పెద్దచెరువులో అనుమతితోనే మట్టి తవ్వకాలు సాగుతున్నాయని జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాస్ తెలి పారు. నిబంధలను ఉల్లంఘించి మట్టి తవ్వ కాలు చేపట్టారనే ఫిర్యాదు మేరకు ఏడీ బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. పెద్దపల్లి సమీపంలోని ఇటుకల తయారీ కంపెనీ 20వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం కోసం దరఖాస్తు చేయగా, అనుమతి మంజూరైందని తెలిపారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మట్టి తరలించాలని, రాత్రి వేళ తరలిస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఏడీ హెచ్చరించారు. ఆయన వెంట నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు. కార్మికులకు మెరుగైన సేవలు పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ కేశో రాం సిమెంట్ కర్మాగారంలోని కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం ఎంతోకృషి చేశామని, గత రెండేళ్లలో మెరుగైన సేవలు అందించా మని కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు సూ ర సమ్మయ్య అన్నారు. బుధవారం కంపెనీ ఆ వరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు గ్రేడ్ ప్రమోషన్, లోడింగ్ కార్మికులకు వేజ్బోర్డు కార్మికులుగా పదోన్నతి, ఒకేసారి దీపావళి బోనస్ చెల్లింపు, రిటైర్డ్ కార్మికులకు 3 వస్తువులు, 25మంది కాంట్రాక్ట్ కార్మికులకు బేసిక్ అగ్రిమెంట్ చేసినట్లు ఆ యన వివరించారు. గతంలో ఏ యూనియన్ చేయని విధంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించామని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ అంజయ్య యాదవ్, దాడి పోశమల్లు యాదవ్, ముల్కల రాజేశం, తిప్పని శ్రీనివాస్, సూర సంతోష్, ఎరుకలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కవి రాకుమారకు రాష్ట్రస్థాయి పురస్కారం కోల్సిటీ(రామగుండం): రెండు తెలుగు రాష్ట్రాల స్థా యి కవితల పోటీల్లో గో దావరిఖని నగరానికి చెందిన ప్రముఖ కవి, రచయి త రాకుమార మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నా రు. సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మారకార్థం వసుంధర విజ్ఞాన వికాస మండలి నిర్వహించిన పోటీల్లో రాకుమార రాసిన ‘నేను – నాదేశం’ కవితకు బహుమతి లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు మధుకర్ వైద్యుల తెలిపారు. హైదరాబాద్లో త్వరలో జరిగే సంస్థ 31వ వార్షికోత్సవంలో పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. మల్లన్న స్వామికి ఎండ ఎఫెక్ట్ ఓదెల(పెద్దపల్లి): ఓదెల శ్రీమల్లికార్జునస్వామిపై ఎండల ఎఫెక్ట్ పడింది. కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండడంతో భక్తుల రాక తగ్గింది. బుధవారం కూడా భక్తుల తగ్గడంతో ఆలయం బోసిపోయి కనిపించింది. ఎండల తీవ్రత, వడగాల్పుల ధాటికి దూరప్రాంతాలకు చెందిన భక్తులు రాలేక పోతున్నారు. దాదాపు పదిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండవారాల నుంచి భక్తుల రాక తగ్గిందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
ఎత్తిపోతలు ఇప్పట్లో లేనట్లే..
● కాళేశ్వరం ప్రాజెక్టులో నిలిచిన పంపింగ్ ● మరో పదిరోజుల్లో వర్షాకాల సీజన్ ప్రారంభం రామగుండం: గోదావరి నదిపై నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎత్తిపోతలకు ఇప్పట్లో అవకాశం లేదని తెలుస్తోంది. ప్రాజెక్టు లోపాలపై నేషనల్ డ్యా మ్ సేఫ్టీ అథారిటీ ఇంజినీర్ల నివేదిక ఆధారంగా ప్ర భుత్వం చేపట్టిన విచారణ వేగవంతంగా సాగడం, పునరుద్ధరణ పనులు చేపట్టడం సాధ్యం కాదని ని ర్మాణ సంస్థ ప్రకటించడం, మరో పదిరోజుల్లో వర్షాకాల సీజన్ ప్రారంభం కానుండడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయని అంటున్నారు. మూడో పంపు గోలివాడ.. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో మూడోది పార్వతీ(గోలివాడ) పంపుహౌస్. దీనినుంచి ఎత్తిపోతలు ప్రారంభించి గతేడాది డిసెంబర్ 19వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తయ్యింది. 2017 డిసెంబర్ 16న భూమిపూజ చేశారు. 2018 డిసెంబర్లోనే ఎత్తిపోతలు ప్రారంభించారు. పంపుహౌస్ ప్రత్యేకత ఇది.. గోలివాడ పంపుహౌస్ నిర్మాణానికి రూ.1,737.56 కోట్లు వెచ్చించారు. గోదావరి నదిపై నిర్మించిన ని ర్మించిన ఎల్లింపల్లి ప్రాజెక్టులోకి రోజూ 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనిని డిజైన్ చేశారు. తొలివిడ తలో ఆస్ట్రియా, ఫిన్లాండ్కు చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తొమ్మిది విద్యుత్ మోటార్లను బిగించారు. 40 మీటర్ల ఎత్తులోని ఎ ల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. వీటిని 24 గంటలపాటు రన్చేస్తే 656 క్యూసెక్కులు(2టీఎంసీలు) ఎత్తిపోసేందుకు 360 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇందు కోసం మెగా కంపెనీ ఆధ్వర్యంలో 400 కేవీ సామర్థ్యంగల విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పా టు చేసింది. పార్వతీ బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 8.83 టీఎంసీలు. ఏడు నెలల క్రితం ఎత్తిపోతల నిలిపివేత.. మేడిగడ్డ(లక్ష్మీ)బ్యారేజీ కుంగడంతో దాని ఎగువన ఉన్న గోలివాడ, సుందిళ్లతోపాటు మేడిగడ్డ బ్యారేజీల్లోని నీటిని ఖాళీ చేయించారు. సుమారు ఏడునెలల క్రితం నీటిని ఖాళీచేయించి ఎత్తిపోతలు నిలిపివేశారు. గోదావరి నదిపై నిర్మించిన మూడు బ్యారేజీల్లోని నీటిని ఖాళీ చేయించడంతో అందులోని చేపల సంపద లేకుండాపోయింది. ఫలితంగా చేపలవేటపై ఆధారపడ్డ వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. అంతేకాదు.. ఎత్తిపోతలు ప్రారంభించే ప్రతీ డిసెంబర్లో పర్యాటకుల సందడి ఈసారికూడా లేకుండా పోతుందనే చర్చ సాగుతోంది. చాలాకాలం పాటు మోటార్లను రన్ చేయకుంటే తుప్పు పట్టే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. -
నేటి నుంచి డాడ్జిబాల్ జాతీయస్థాయి పోటీలు
● ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నర్సింహారెడ్డి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): స్థానిక అబ్దు ల్ కలాం స్టేడియంలో గురువారం నుంచి రెండు రో జుల పాటు జాతీయస్థాయి డాడ్జిబాల్ పోటీలు ని ర్వహిస్తామని ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నర్సింహారెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్ర పంచంలోనే అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడల్లో డాడ్జిబాల్ ఒకటన్నారు. సింగరేణి స హకారంతో తెలంగాణ డాడ్జిబాల్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో పోటీలు చేపట్టామన్నారు. తొలిసారి వి విధ రాష్ట్రాల నుంచి 20జట్లు హాజరవుతాయని పే ర్కొన్నారు. పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన రెండు జట్లు ఎంపికచేసి వచ్చే ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు ఆస్ట్రియా దేశంలో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని ఆయన వెల్లడించారు. 12 మంది క్రీడాకారులతో 20 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఈక్రీడ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆయన వివరించారు. అసోసియేషన్ తెలంగాణ కార్యదర్శి పాశం శ్రీనివాస్, రెఫరీ బోర్డు చైర్మన్ సత్యనారాయణ, ప్రతినిధులు రవీందర్, సతీశ్, ఓదెలుయాదవ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ఓటమి
టీబీజీకేఎస్ నాయకుల ఆగడాలతోనే రామగిరి(మంథని): టీబీజీకేఎస్ నాయకుల ఆగడాలతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ధ్వజమెత్తారు. సెంటనరీకాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న సమయంలో కార్మికుల పక్షాన పోరాడాల్సిన నాయకులు.. వారిని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయితే, టీబీజీకేఎస్ నాయకుల అవినీతి, అక్రమాలతో బీఆర్ఎస్కు కార్మికులు దూరమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికల సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు పోటీకి దూరంగా ఉన్నా రని, కొందరు రాజీనామా చేశారని తెలిపారు. గ తంలో రద్దు చేసిన పదవులపై కేసీఆర్, కేటీఆర్ నిర్ణ యం తీసుకుంటారని వెల్లడించారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులమని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి అ మ్ముడుపోయే నాయకులు టీబీజీకేఎస్ పేరిట మళ్లీకార్మికుల వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, నా యకులు జక్కు రాకేశ్, పూదరి సత్యనారాయణగౌ డ్, మ్యాదరబొయిన కుమార్ యాదవ్, దర్ముల రాజసంపత్, దేవ శ్రీనివాస్, గండి శ్రీనివాస్, కన్నూరి శ్రీశైలం, ఆసం తిరుపతి పాల్గొన్నారు.● జెడ్పీ చైర్మన్ పుట్ట మధు -
వేగంగా ధాన్యం కొనుగోలు
పెద్దపల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వారంలోగా పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన ధాన్యం కొనుగోళ్ల తీరుపై సమీక్షించారు. ఇప్పటివరకు 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇంకా 70వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసుందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికపు డు రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. అన్లోడ్ చేసే సమయంలో రైతులను ఇబ్బంది పెట్టేలా కోతలు విధిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీవో రవీందర్, డీఎస్వో ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వెంట తిరిగి.. హ్యాండిచ్చి..
● కొంపముంచిన కోవర్టులు! ● అంతర్గత సమావేశాలు, సమీక్షలో తేల్చిన నేతలు ● సైలెంట్ ఓటింగ్తో టఫ్ ఫైట్గా మారిన వైనం ● పార్లమెంట్ ఎన్నికలపై పోస్ట్మార్టంసాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కో వర్టులు కొంపముంచారనే ప్రచారం ఆయా పార్టీల అభ్యర్థులో గుబులు రేపుతోంది. పోలింగ్కు ముందు అభ్యర్థులు వేసుకున్న గెలుపోటముల అంచనాలను సైతం వీరు తారుమారు చేశారనే అభిప్రాయా లూ వ్యక్తమవుతున్నాయి. విజయావకాశాలపై ఎవ రి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా అభ్యర్థులను లోలోపల కోవర్టుల తీరు కలవరపాటు కలిగిస్తోంది. సా ధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి ని ర్వహిస్తే క్రాస్ ఓటింగ్కు ఆస్కారం ఉంటుంది. ఒక పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు వేస్తే.. మ రోపార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంకో ఓటు వే స్తారు. అలాగే కొందరు పార్టీలోనే ఉంటూ కోవర్టు రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తుంటారు. ఇలాంటి ఘటన లు తరచూ వెలుగు చూస్తుంటాయి. కానీ, ఈసారి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో గతా నికి భిన్నంగా అన్ని పార్టీల్లోని కొందరు(కోవర్టులు) ఒక పార్టీ వైపు మెగ్గుచూపినట్లు పోలింగ్ సరిళిపై నిర్వహించిన సమీక్షల్లో తేలడంతో నేతల్లో ఆందోళ న మొదలైంది. పోలింగ్ శాతం అధికంగా నమోదైన స్థానాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుచరులే.. రాత్రింబవళ్లూ తమవెంటే తిరిగి ప్రచారం చేసిన కొందరు నేతలు, పోలింగ్ జరిగిన రోజున పలానా పార్టీకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సుమారు 10శాతం పోలింగ్ తక్కువ నమోదైంది. దీంతో ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు పరాజయం పాలవువుతారనే దానిపై లెక్క లు కడుతున్నారు. రెండు నెలల పాటు ప్రచారం హోరెత్తితే.. ఫలితం వచ్చేందుకు మిగిలిన 20రోజు ల పాటు ఎదుర్కొనే ఉత్కంఠ ఒక ఎత్తుని అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అంతుచిక్కని లెక్కలు.. ఆందోళనలో నేతలు రూరల్, పట్టణ ఓటర్లు, లబ్ధిదారులు, వృద్ధులు, మ హిళలు, మైనార్టీలు, దళితులు, బీసీలు.. ఇలా వర్గాల వారీగా ఎటువైపు మెగ్గుచూపారని నేతలు లెక్కలు తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్తో అన్నిపార్టీల్లో కోవర్టులు ఉన్నట్లు తే ల్చుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందనే ప్రచారం ఉంది. పెద్దపల్లిలో బీజేపీలోని ఒక వర్గం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లీనట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు టీబీజీకేఎస్ నేతలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. డబ్బులు కావాలని ఓటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక పైనుంచి డబ్బులు రాలేదని, ఇష్టం వ చ్చిన పార్టీకి ఓట్లు వేసుకోవానలి కాంగ్రెస్లోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇలాగే చెప్పినట్లు తెలుస్తోంది. సైలెంట్ ఓటింగ్.. టఫ్ ఫైటింగ్ ఓటరు నాడీ పట్టేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీల్లో సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలమనేది అంతుచిక్కడం లేదు. ఏ ఇద్దరు కలిసినా మోదీ హవా పనిచేసిందా? బీజేపీ వైపు మొగ్గు చూపారా? అనే చర్చ సాగుతోంది. అభ్యర్థిని కాకుండా మోదీ క్రేజ్తో మహిళలు, వృద్ధులు, యువత చేసిన సైలెంట్ ఓటింగ్ బీజేపీ కలిసొచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంపీ ఎన్నికల్లో కనిపించలేదని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీగా సొమ్ము పంచడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసిసోచింది. కానీ, లోక్సభ ఎన్నికలు జాతీయ అంశాల ఆధారంగా జరగటంతో ఓటర్లు అటువైపే మొగ్గు చూపారనే విశ్లేషణ తెరపైకి వస్తోంది. ఏదేమైనా క్రాస్ఓటింగ్ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనేది అంచనా. అయితే ఇది బీజేపీకి అనుకూలమా, లేక కాంగ్రెస్కు అనుకూలమా ?బీఆరఎస్కు ప్రయోజనం చేకూర్చుతుందా? అనేది జూన్ 4 వరకు వేచిచూస్తేనే తెలుస్తుంది. -
కలుషితం.. అనారోగ్యం
గోదావరిఖని: రామగుండం నగరంలోని సింగరేణి కార్మిక కుటుంబాలకు సమీప గోదావరి నది నుంచి పంపింగ్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ తదితర కాలనీల్లో నివాసం ఉండే కార్మిక కుటుంబాలకు రోజూ 35ఎంఎల్డీ నీరు అందిస్తున్నారు. ఇందుకోసం నదిలో ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఫిల్టర్బెడ్ వరకు తరలించి.. భారీ విద్యుత్ మోటార్లతో నేరుగా కార్మికవాడలకు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఈ ప్రక్రియ సాఫీగానే సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీటి సరఫరాలో సమస్యలు మొదలయ్యాయి. బ్యా క్ వాటర్తో నదిలో నీటినిల్వలు భారీగా పెరిగా యి. ఏడాది పొడవునా నదిలో నీటి నిల్వలు ఉండడం, నగరంలోని వివిధ ప్రాంతాల్లోంచి విడుద లయ్యే మురుగునీరు, ఆర్ఎఫ్సీఎల్ నుంచి వెలువ డే రసాయనాలు కలిసిన నీరు నేరుగా గోదావరి న దిలో కలుస్తుండడంతో నది నీరు కలుషితమవుతోంది. ఈనీటిన తాగిన కార్మిక కుటుంబాలు డయేరి యా, మలేరియా, ఇతరత్రా ప్రాణాంతక వ్యాఽ దు లకు గురయ్యారు. వర్షాకాలంలో మురికినీరు రా వడంతో ఎందుకూ పనికిరాకుండాపోయింది. హైదరాబాద్కు ‘భగీరథ’ ద్వారా సరఫరా ● గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ అధికారులు.. వీటి ద్వారా హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ● గోదావరి నదిలోని ఇదే ప్రాంతం నుంచి సమీప సింగరేణి కార్మిక కుటుంబాలకు మాత్రం కలుషిత నీరు సరఫరా అవుతోంది. ● తద్వారా కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలుషిత నీరు తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు. ● హైదరాబాద్ తరహాలోనే స్థానికులమైన తమకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కొద్ది నెలలుగా డిమాండ్ వస్తోంది. ● సమాచారం అందుకున్న అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్.. మిషన్ భగీరథ తరహాలోనే ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ● ఇందుకోసం రెండేళ్ల క్రితమే నిధులు మంజూరు చేశారు. ● సాంకేతిక కారణాలతో అవి నిలిచిపోయాయి. ● ఫలితంగా ప్లాంట్ పనులు స్తంభించాయి. రూ.20కోట్లు కేటాయింపు.. సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పలు కార్మిక సంఘాలు, కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు. ఈక్రమంలో ఇటీవల రూ.20కోట్లు మంజూరయ్యా యి. దీంతో ఆర్జీ–1 ఏరియా జీడీకే–1, 3గని ఫ్యాన్హౌస్ సమీపంలో 35ఎంఎల్డీ సామర్థ్యంతో ర్యాపి డ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈఏడాది మార్చి 16వ తేదీన సింగరేణి డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ ప్లాంట్ పనులకు భూమిపూజ చేశారు. అయితే, రెండు నెలల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా ప్లాంట్ నిర్మాణం.. సింగరేణి యాజమాన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. అయితే, సాంకేతిక కారణాలతో పనుల్లో సుమారు రెండు నెలలు జాప్యం జరిగింది. మ్యాప్లు, సాంకేతిక అనుమతుల మంజూరులో పనుల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ పనుల్లో జాప్యం కార్మిక కాలనీలకు అందని స్వచ్ఛమైన తాగునీరు గడువులోగా పూర్తి చేస్తాం సాంకేతిక కారణాలతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ పనుల్లో జాప్యమైంది. అయినా, ప్రస్తుతం ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. నిర్దేశిత ఏడాదిలోగా ప్లాంట్ ప్రారంచేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఆర్జీ–1 జీఎం -
2.11 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రైతులు ఈ యాసంగిలో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 53, సహకార సంఘాల ద్వారా 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో 2,10,196మెట్రిక్ టన్నులను రైస్మిల్లులకు తరలించారు. 21,957మంది రైతులకు చెందిన 1,52,383మెట్రిక్ టన్ను ధాన్యం డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వారంలోగా పూర్తిచేసేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు కొనుగోల్లు వేగవంతం చేశారు. ● వారంలోగా సేకరణ పూర్తి -
ఓటెత్తిన మహిళలు
రామగుండం: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులోనూ పట్టణాల కన్నా గ్రామాల్లోనే వీరిఓటు శాతం అధికంగా నమోదైంది. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు వెనుకంజలో నిలిచారు. కలెక్టర్ ప్రకటించిన ఓటింగ్ జాబితాను పరిశీలిస్తే అంతర్గాం మండల పరిధిలోని అత్యధిక పోలింగ్ బూతులలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. -
బీఆర్ఎస్ విజయం ఖాయం
● ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము గెలిచిన తర్వాత హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మాఫీ కోసం కృషి చేస్తామని, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలయ్యేలా పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తద్వారా అనతికాలంలోనే ప్రజల చీత్కారానికి గురైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంకార ధోరణి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేలా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించండి
● ‘కేశోరాం’ కార్మికుల డిమాండ్ ● ఫ్యాక్టరీ ఎదుట ధర్నాపాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి యాజమాన్యం తీరుపై నిరసన తెలిపారు. కంపెనీలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తోందన్నారు. ఇప్పటికీ యూనియన్ నాయకులు రాజీనామా చేయకుండా కాలయాపనతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. తద్వారా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కేశోరాం పర్మినెంట్ యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ కార్మికుల ఆందోళనకు మద్దతును ప్రకటించారు. స్పందించిన హెచ్ఆర్ మేనేజర్ గోవిందరావు.. నాయకులు, కార్మికులతో చర్చించారు. జూన్ 10వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈకార్యక్రమంలో ప్రతినిధులు నగునూరి రమేశ్, బొడ్డు రాములు, వెంకటేశ్, సతీశ్, గట్టయ్య, ప్రసాద్, కట్కూరి సురేశ్, ఇటిక్యాల శ్రీకాంత్, పోతుల ప్రసాద్, ఖదీర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత● పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్
రామగిరి(మంథని): స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని, వాటి భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లు, ఈవీఎంల తరలింపు ప్రక్రి యను పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రావీశ్గుప్తాతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చామని కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తిచేశామని ఆయన వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం యంత్రాల తరలింపు పారదర్శకంగా చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు అరుణశ్రీ, హనుమా నాయక్, దివాకర, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలు తరలించిన స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈవీఎంలు తరలించిన మంథని జేఎన్టీయూలోని స్ట్రాంగ్రూమ్లను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత చేపట్టామని ఆయన అన్నారు. స్థానిక పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు నిత్యం పహరా కాస్తున్నాయని వివరించారు. సీసీ కెమరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు సాయుధ రక్షణలో స్త్రాంగ్రూమ్లు ఉంటున్నాయని చెప్పారు. ఏసీపీ పర్యవేక్షణలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలతోపాటు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేశ్, సీఐలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పత్రాల పరిశీలన పోలింగ్ పత్రాలను పరిశీలించామని ఆర్వో ముజమ్మిల్ఖాన్ అన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల ఎన్నికల పత్రాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement