-
బీసీలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
కదిరి: బీసీలకు ఏ నాయకుడు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చి పాలనలో భాగస్వామ్యం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ ఎన్నికల్లో బీసీలంతా మద్దతుగా నిలవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు అండ... వైఎస్సార్ సీపీ జెండానే అన్నారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక దత్తా ఫంక్షన్ హాలులో బీసీ నేత నరసింహగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, కదిరి పట్టణం వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెప లాడింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..మన పిల్లల భవిష్యత్ కోసం బీసీలంతా ఈసారి ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి, వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు నిచ్చారు. జగన్ను ఓడించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఏకమయ్యాయన్నారు. కానీ జగన్ వెంట పేదలంతా ఉన్నారని, ఆయనకు దేవుడి దీవెనలు, ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతుంటే చంద్రబాబుతో పాటు ఆయనకు వత్తాసు పలికే ఇంకొందరు, ఎల్లో మీడియా అడ్డుకోవాలని చూసిందని ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. బీసీలకు తెలివి తేటలు లేవు..బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖలు రాసిన వారు.. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బీసీల దగ్గరకు వస్తున్నారని, వారికి ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. అన్నింటా బీసీలకు సగభాగం.. రాష్ట్ర బడ్జెట్లోనూ, రాజకీయాల్లోనూ అలాగే విద్యలో ఇలా ప్రతి దాంట్లో బీసీలకు 50 శాతం వాటా ఇచ్చి చేతల్లో చూపించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఇసీ్త్ర పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే బీసీల ఆత్మబంధువు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాత్రం బీసీలను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తెచ్చేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ.. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ, వైఎస్సార్ సీపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.హరిప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే, జగన్ బీసీలకు పదవులిచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించిన నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారని వారు గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, కానీ జగనన్న మాత్రం ఎంతోమంది బీసీలను రాజ్యసభకు పంపారని అన్నారు. వైఎస్సార్ సీపీ కదిరి అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బీసీ సభప్లాన్ కింద ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఇస్తానని చెప్పి చంద్రబాబు దగా చేస్తే, సీఎం జగనన్న ఏడాదికి రూ.15 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా మాట్లాడుతూ, బీసీలకు వైఎస్సార్ సీపీలోనే తగిన గుర్తింపు ఉందన్నారు. ఎస్కేయూ పాలక మండలి సభ్యుడు కొమ్ము భాస్కర్ మాట్లాడుతూ, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?అని చంద్రబాబు దళితుల పుట్టుకనే ఆవహేళన చేశారన్నారు. దీంతో సభలో ఉన్న వారంతా ‘బాయ్ బాయ్ బాబు’ అని గట్టిగా అరిచారు. మద్దతు ఇవ్వండి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా వెన్నుదన్నుగా నిలవాలన్నారు. బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన తమకు సీఎం జగన్ టికెట్లు ఇచ్చారని, మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర బీసీ నాయకులు దశరథనాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి వేమల ఫయాజ్, సింగిల్విండో అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, లీగల్సెల్ జోనల్ ఇన్చార్జ్ లోకేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాఘవయ్య, రామయ్య, రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు. బీసీలంతా జగన్కు బాసటగా నిలవాలి ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం.. జగన్కు జై కొడదాం ‘జయహో బీసీ’ సభలో హోరెత్తిన జగన్నినాదం -
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
ఒకరు భూ కబ్జాకోరు, హత్యా రాజకీయాలకు మారు పేరు.. మరొకరు అవినీతి అక్రమాలకు దేశస్థాయిలో పేరుగాంచిన వారు.. బ్యాంకులకే ఎగనామం పెట్టిన వారు ఇంకొకరైతే, బ్లాక్మెయిలింగ్కు పేరుగాంచిన మహానుభావుడు మరొకరు.. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన చంద్రబాబు.. తనకు తగ్గ టీంనే ఈసారి బరిలోకి దించారు. దౌర్జన్యకారులు, ఖూనీకోరులను ఎంపిక చేసి మరీ టికెట్లు కట్టబెట్టారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారిలో ఎవరి చరిత్ర చూసినా కళ్లు బైర్లు కమ్ముతాయి. వీరిని తలచుకుంటేనే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. కానీ, వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో సచ్ఛీలురు కావడమే దౌర్భాగ్యం. అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ, ఎదురొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రబాబు టీంలోని వీరు ఒకవేళ కర్మ కొద్దీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. దళితులకు శఠగోపం.. హత్యా రాజకీయం.. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై 2015లో ఏకంగా హత్య కేసు నమోదైంది. వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక.. బండమీద పల్లిలో ఓ దళితుడి భూమిని అక్రమంగా లాక్కున్నాడన్న కారణంగా బాధితుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. డాక్టర్ వద్దంట.. కేసుల వీరుడే ముద్దంట మడకశిర నియోజకవర్గ సీటును 52 కేసులున్న ఎమ్మెస్ రాజుకు చంద్రబాబు కేటాయించారు. ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సునీల్కు ముందు టికెట్ ఇచ్చిన బాబు... ఆ తర్వాత ఆయన నుంచి టికెట్ లాక్కుని మరీ నేర చరితుడికి కట్టబెట్టారు. బ్లాక్మెయిలింగ్ చేయడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడం ఇలా రకరకాల కేసులు ఎమ్మెస్ రాజుపై నమోదై ఉండడం గమనార్హం. శింగన మల, అనంతపురం ప్రాంతాల్లోని స్టేషన్లలో దాదాపు 52 కేసులు ఇతనిపై ఉన్నాయి. జేసీ చరిత్రంతా నేరాల మయమే.. జేసీ.. ఈ పేరు చెబితే చాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుంటుంది. ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించి చలి కాచుకున్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. అవినీతి చేయడంలోనూ పేట్రేగిపోయారు. నకిలీ ఇన్వాయిస్లతో వాహనాల అమ్మకం, అనుమతులు లేకుండా బస్సులు తిప్పడం కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దేశస్థాయిలో వీరి ఘనకార్యంపై చర్చ నడిచింది. ఇప్పుడు అలాంటి నేరచరిత్ర కలిగిన అస్మిత్ రెడ్డికే చంద్రబాబు తాడిపత్రి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ తాడిపత్రిలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే. తిట్టి.. టికెట్ కట్టబెట్టి.. గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్లు జయరాంను తిట్టని తిట్టంటూ లేదు.మట్కా ఆడిస్తారని, పేకాట క్లబ్బులు నడిపిస్తారని, బెంజ్కార్లు లంచంగా తీసుకున్నారని ఇలా లెక్కలేనని ఆరోపణలు చేశారు. అయితే, ఎప్పుడైతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వెంటనే సచ్ఛీలుడై పోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టిన బాబే ఆయనకు గుంతకల్లు టికెట్ ఇవ్వడంతో స్థానికులే కాదు.. జిల్లా ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంది. పరిటాలకే ఎందుకో..? టీడీపీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పరిటాల సునీత కుటుంబం పేరెత్తితేనే గతంలో ఆ కుటుంబం సాగించిన రక్తచరిత్ర గుర్తుకొస్తుంది. సునీత భర్త పరిటాల రవి అప్పట్లో చేసిన హత్యారాజకీయాల గురించి ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆర్వోసీ పేరుతో కొన్ని వందల మందిని ఊచకోత కోసినట్లు చెబుతారు. దీనికితోడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు. కబ్జాల కందికుంట కదిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కందికుంట వెంకటప్రసాద్పై లెక్కలేనన్ని కేసులున్నాయి. కదిరిలో కంటికి కనిపించిన భూములన్నీ కబ్జా చేసేస్తాడనే ఆరోపణలున్నాయి. ఒక రేప్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నట్లు గతంలో ఓ సర్వే సంస్థ వెల్లడించింది. హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. చెక్బౌన్స్ కేసులైతే లెక్కలేనన్ని. నకిలీ డీడీల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసును ఇటీవల కొట్టేయడంతో ఇదే అదనుగా చంద్రబాబు ఆయనకు సీటిచ్చేశారు. ● పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత కూడా తక్కువేమీ కాదు. గ్రానైట్, మట్టి, పెట్రోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఈమైపె అనేక కేసులున్నాయి. టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ గుజ్జల నగేష్ (ఫైల్) అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్పై ఏకంగా హత్య కేసు ‘కదిరి’ కందికుంట ప్రసాద్పై లెక్కలేనన్ని కేసులు బ్లాక్మెయిలింగ్, దౌర్జన్యం కేసుల్లో ఎమ్మెస్ రాజు దిట్ట జేసీ కుటుంబ కేసుల చరిత్ర వింటే దిమ్మతిరగాల్సిందే ఒక హత్య.. మరో హత్యాయత్నం! ఎన్నికల నేపథ్యంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. కొన్ని రోజుల క్రితం అనంతపురం అర్బన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై పచ్చ పార్టీకి చెందిన జయరాం నాయుడు వర్గీయులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు కదిరి నియోజకవర్గం జౌకుల గ్రామంలో నాగభూషణం అనే యువకుడిని టీడీపీ వర్గీయులు చంపేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేర చరితులకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడంతోనే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు
ధర్మవరం: ‘‘ఽఢిల్లీ స్థాయి నాయకుడినని గొప్పలు చెప్పుకునే నువ్వు.. కార్పొరేట్ తరహాలో ధర్మవరంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నావు.. ఓట్ల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నావు.. ప్రచారానికి ఏకంగా కేంద్ర హోం మంత్రిని తీసుకువచ్చావ్.. నిజంగా చేనేతలపై నీకు ప్రేమ ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చేనేతకు జీఎస్టీ పన్ను రద్దు చేయించు. పోలింగ్ రోజు లోపు జీఎస్టీ రద్దు ప్రకటన చేయిస్తే నేను ఎన్నికలు వదిలేసి ఇంట్లో కూర్చుంటా’’ అని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన ధర్మవరంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ బీసీకార్డుతో చేస్తున్న మోసాలను, జాతీయ నాయకుడినంటూ చేస్తున్న పబ్లిసిటి స్టంట్పై మండిపడ్డారు. యాదవ సామాజికవర్గం అంటూ చెప్పుకుంటున్న సత్యకుమార్ అసలు బీసీనే కాదని, అతను ఆర్యక్షత్రియుడన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలకు ఏం మంచి చేస్తారో చెప్పి ఓట్లు అడగాలే తప్ప, అసత్యాలు, గొప్పలు చెప్పడం ఏ స్థాయి రాజకీయమో సత్యకుమారే చెప్పాలన్నారు. ఎంత ప్రలోభపెట్టినా స్థానికంగా ఎవరూ సహకరించక పోవడంతో సత్యకుమార్ ఇతర రాష్ట్రాల నుంచి వందల మందిని ధర్మవరానికి తీసుకువచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. అలాగే 30 మందికిపైగా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను ప్రచారానికి తీసుకువచ్చారన్నారు. కానీ వారు ఎక్కడివారో.. ఏం చేస్తారో ధర్మవరం వాసులకు తెలియదన్నారు. అందువల్లే సత్యకుమార్ ప్రచారానికి ఎక్కడా ప్రజా స్పందన లభించడం లేదన్నారు. దీంతో అతను ఏకంగా సినిమా హీరోయిన్లను ధర్మవరానికి తీసుకువస్తున్నారన్నారు. అయినా జనం పట్టించుకోకపోవడంతో రోజుకో డ్రామా ఆడుతున్నారన్నారు. అయినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. చేనేతపై జీఎస్టీ పన్ను 5 శాతం ఉండగా, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 శాతానికి పెంచాలని చూస్తే తాను పోరాటం చేశానన్నారు. తమ పార్టీ ఎంపీలతో కలసి ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి చేనేతల పరిస్థితి వివరించి జీఎస్టీ పెంచవద్దని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించి జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారన్నారు. ఈవిషయం ధర్మవరం వాసులందరికీ తెలుసన్నారు. ఇప్పటికై నా సత్యకుమార్ అసత్యాలు మానుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి హితవు పలికారు. పోలింగ్ రోజులోపు ప్రకటన చేయిస్తే ఎన్నికలు వదిలేస్తా ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్కు ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ -
ప్రమాదంలో యువకుడి మృతి
లేపాక్షి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం బయన్నపల్లికి చెందిన వినీత్ (22) ఇంట్లో ఆదివారం పుణ్యతిథి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లేపాక్షిలో వేచి ఉన్న కొండూరు నుంచి వచ్చిన బంధువులను పిలచుకుని వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. ఇద్దరు మహిళలను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళుతుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి ముగ్గురూ కిందపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వినీత్ను బెంగళూరుకు తీసుకెళుతుండగా కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలోకి చేరుకోగానే మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు మహిళలు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మందకృష్ణను అడ్డుకుంటాం
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు అనంతపురం కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే ఆయన పర్యటను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు హెచ్చరించారు. ఆదివారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ చేసిన ఆరోపణలను ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వాకంతోనే మాదిగలపై వివక్ష పెరిగిందన్నారు. మాదిగల ఎదుగుదల ఇష్టం లేని చంద్రబాబుకు మందకృష్ణ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి దళితులను బిచ్చగాళ్లుగా చూసింది చంద్రబాబేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు అన్ని విధాల న్యాయం చేకూరిందన్నారు. ఇప్పటికై నా మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement