మందకృష్ణను అడ్డుకుంటాం | Sakshi
Sakshi News home page

మందకృష్ణను అడ్డుకుంటాం

Published Mon, May 6 2024 4:45 AM

మందకృష్ణను అడ్డుకుంటాం

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు

అనంతపురం కార్పొరేషన్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎమ్మార్పీఎస్‌ మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే ఆయన పర్యటను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు హెచ్చరించారు. ఆదివారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ చేసిన ఆరోపణలను ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వాకంతోనే మాదిగలపై వివక్ష పెరిగిందన్నారు. మాదిగల ఎదుగుదల ఇష్టం లేని చంద్రబాబుకు మందకృష్ణ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి దళితులను బిచ్చగాళ్లుగా చూసింది చంద్రబాబేనన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దళితులకు అన్ని విధాల న్యాయం చేకూరిందన్నారు. ఇప్పటికై నా మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement
Advertisement