-
అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు
నిర్మల్: రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి... 2015, 2018లో రాహుల్గాంధీ నిర్మల్ జిల్లాకు వచ్చినప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఏలేటి మహేశ్వర్రెడ్డి ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలను ఆయన దగ్గరుండి విజయవంతం చేశారు. 2018లో భైంసా సభ విజయవంతానికి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రామారావుపటేల్ తీవ్రంగా శ్రమించారు. మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్ వీరిద్దరూ పార్టీ మారి బీజేపీలో చేరి ఎమ్మెల్యేలయ్యారు. ప్రస్తుతం అదే కాంగ్రెస్పై తమ ప్రచారంలో నిప్పులు కురిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్తో పోటీపడిన కూచాడి శ్రీహరిరావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలచారి ప్రస్తుతం అదే హస్తం పార్టీ, రాహుల్ సభ విజయవంతానికి శ్రమిస్తుండటం గమనార్హం. -
కాసవేణ రవికి కన్నీటి వీడ్కోలు
● స్వగ్రామం వంగరలో అంత్యక్రియలు ● హాజరైన అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీలు బెల్లంపల్లి: మావోయిస్టు దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి ఉరఫ్ అశోక్ ఉరఫ్ వినయ్(48)కు అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. రవి గత మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని టేక్మేటా–కాంకూర్ గ్రామాల మధ్య పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. రవి భౌతిక కాయంపై ఎర్రజెండా కప్పి, పూలు చల్లి జోహార్లు అర్పించారు. రవి పెద్ద అన్న కాసవేణ వెంకటేష్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర నాయకురాలు పద్మకుమారి, సికాస మాజీ నాయకుడు మహ్మద్ హుస్సేన్, విప్లవ రచయిత సంఘం నాయకులు, అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీ పీపుల్స్ వార్, సింగరేణి కార్మిక సమాఖ్య సభ్యులు, సానుభూతి పరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం. -
ఆదాయం రూ.6 వేలు.. ఖర్చు 2 లక్షలు!
ఆదరణ కరువైన సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు ● రోజుకు సగటున 250 మంది మాత్రమే ప్రయాణం ● ప్రస్తుతం కేవలం 40 కి.మీ వేగంతో నడుస్తున్న రైలు ● మూడుచోట్ల కొనసాగుతున్న వంతెనల పనులే కారణం ● బస్సు కన్నా గంటకు పైగా ఎక్కువ ప్రయాణ సమయంతో ఆసక్తి చూపించని ప్రజలు సాక్షి, హైదరాబాద్: ఆ రైలు రోజుకు రెండు ట్రిప్పులు తిరుగుతోంది. ఆ రెండు ట్రిప్పుల్లోనూ అందులో ప్రయాణించే వారి సంఖ్య సగటున 250 మంది మాత్రమే. కాగా టికెట్ల రూపంలో రైల్వేకు రోజుకు వస్తున్న ఆదాయం కేవలం సుమారు రూ.6 వేలు. కానీ ఈ రెండు ట్రిప్పులకు అయ్యే నిర్వహణ వ్యయం ఎంతో తెలుసా? ఏకంగా రూ.2 లక్షలు! సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య తిరుగుతున్న డెమూ రైలు కథ ఇది. పరుగులు పెట్టాల్సిన ఈ రైలు షెడ్యూల్ ప్రకారం గానే అయినా దాదాపు నడుస్తున్నట్టు వెళ్లడమే ఈ పరిస్థితికి కారణం. నగరంలోని జూబ్లీ బస్స్టేషన్ నుంచి బయలుదేరే బస్సు 2.15 గంటల్లో సిద్దిపేటకు చేరుకుంటుంటే, ఈ రైల్లో మాత్రం ఇందుకోసం కనీసం 3 గంటల నుంచి మూడున్నర గంటల సేపు ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ రైలు సగటు వేగాన్ని అధికారులు గంటకు కేవలం 40 కిలోమీటర్లకే పరిమితం చేశారు. అందుకనే 116 కి.మీ (రైలు రూట్ కి.మీ. ప్రకారం) ప్రయాణానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు స్టేషన్ సిద్దిపేటకు దూరంగా ఉంది. దీంతో సిద్దిపేట నుంచి స్టేషన్కు రావాలన్నా, స్టేషన్ నుంచి సిద్దిపేటకు వెళ్లాలన్నా ప్రత్యేకంగా ఆటోలో ప్రయాణించాల్సి వస్తోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు రైలు ఎక్కడం కంటే బస్సు బెటరని అటు మళ్లుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగింపు రెండు ట్రిప్పుల్లో సగటున నాలుగైదు వేల మంది ప్రయాణించాల్సి ఉండగా 250 కూడా మించటం లేదు. సిద్దిపేటలో 30 మందికి మించి రైలు ఎక్కడం లేదు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సిద్దిపేట చేరుకునే సరికి అంతే సంఖ్యలో ప్రయాణికులు మిగులుతున్నారు. మధ్యలో ఉండే స్టేషన్లలో ఐదారుగురు చొప్పున ఎక్కి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రైల్లో 50–60 మంది ప్రయాణికులు కూడా ఉండటం లేదని సిబ్బంది చెప్పడటం ఈ రైలుకున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఇలాంటప్పుడు రైల్వే దీనిని డిమాండ్ లేని సర్వీసుగా పరిగణించి రద్దు చేస్తుంది. కానీ భవిష్యత్తులో ఇది కరీంనగర్ (పెద్దపల్లి) వరకు సేవలు అందించాల్సిన సర్వీసు కావటంతో, ఇప్పుడు రద్దు చేస్తే మళ్లీ పునరుద్ధరించేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ, తదనంతర అనుమతులు రావడం లాంటి తతంగం ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రైలును కొనసాగిస్తోంది. ఎందుకింత మెల్లగా.. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మార్గం సిద్ధం కావటంతో రైలు ప్రారంభించారు. కానీ మధ్యలో మూడు నాలుగు చోట్ల ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిద్దిపేట–జనగామ రోడ్డులో రంగధామపల్లి వద్ద ఆర్ఓబీ నిర్మాణం జరుగుతోంది. కొమురవెల్లి స్టేషన్ సమీపంలో ఆర్యూబీ నిర్మాణం కొనసాగుతోంది. కుకునూరుపల్లి వద్ద ఆర్ఓబీ ఇటీవలే పూర్తయింది. ఈ మూడు కీలక నిర్మాణాల కారణంగానే వేగాన్ని బాగా తగ్గించి రైలు నడుపుతున్నారు. రోజుకు 1,800 లీటర్ల డీజిల్ ఖర్చు ఇది ఎనిమిది కోచ్లుగా ఉండే రేక్. దీనికి రెండు పవర్ కార్లుంటాయి. ఒక్కో పవర్ కార్కు నాలుగు కోచ్లు అటాచ్ అయి ఉంటాయి. ఒక ట్రిప్పునకు (వెళ్లి రావడానికి) 900 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. రెండు ట్రిప్పులకు 1800 లీటర్లు ఖర్చవుతున్నాయి. ఇక ఈ సర్వీసు సిబ్బందికి ఒకరోజు జీతం రూ.20 వేలుగా ఉంటోంది. ఈ మొత్తం కలిపితే రోజుకు రూ.2 లక్షల ఖర్చవుతోంది. ఆ దారి బాగు చేయండి సిద్దిపేట, రైల్వేస్టేషన్కు మధ్య (ప్రధాన రహదారి) దాదాపు నాలుగు కి.మీ.దూరం ఉండటం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. గుండ్ల చెరువు మీదుగా వెళ్తే ఒకటిన్నర కి.మీ.దూరమే ఉంటుందని, కానీ ఆ దారి మధ్యలో ధ్వంసం కావటంతో వాహనాల రాకపోకలు కుదరటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దారి బాగు చేస్తే తమకు కొంతవరకు సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. 75 కిలోమీటర్లకు పెరగనున్న వేగం ఆర్ఓబీ, ఆర్యూబీల పనులను త్వరగా పూర్తి చేసి రైలు వేగాన్ని పెంచాలని ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో రైలు గరిష్ట వేగాన్ని 75 కి.మీ.కు పెంచాలని నిర్ణయించారు. అదే జరిగితే ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు తగ్గుతుంది. అప్పుడు రెండున్నర గంటల్లోనే రైలు గమ్యం చేరుతుందని, ప్రయాణికుల ఆదరణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైలు వేళలు ఇలా.. ● సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్లో ఉదయం 10.35కు బయలుదేరి మధ్యాహ్నం 1.45కు సిద్దిపేట చేరుకుంటుంది. ● సిద్దిపేటలో 2.05కు బయలుదేరి సిక్రింద్రాబాద్కు సాయంత్రం 5.20కు చేరుకుంటుంది. ● సికింద్రాబాద్లో.5.45కు బయలుదేరి రాత్రి 8.45కు సిద్దిపేటకు చేరుకుంటుంది. ● మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడల్లో ఆగుతుంది. -
ప్రతిభకు గుర్తింపు ఏది?
గోదావరిఖని: ప్రపంచస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ఇందు లో పాల్గొనే ప్రతినిధుల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 6న జరిగే ఇంటర్వ్యూ, పరీక్ష కోసం 33 మంది హాజరు కావాలని ఆయా గనుల అధికారులకు లేఖలు పంపించింది. అయితే యువకులు, అవార్డులు సాధించిన వారికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొలంబియాలో పోటీలు.. ● ఈసారి 13వ ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్(ఐఎంఆర్సీ) పోటీలు కొలంబియాలో సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. ● ప్రపంచంలోని వివిధ దేశాల మైన్స్ రెస్క్యూ బృందాలు హాజరవుతాయి. ● రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీలకు సింగరేణిలోని రెస్క్యూ సభ్యులు రెండు దశాబ్దాలుగా హాజరవుతూ వస్తున్నారు. ● జాతీయస్థాయి పోటీల్లో డబుల్హాట్రిక్ సాధించిన సింగరేణి రెస్క్యూ ప్రతినిధులు.. అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటడం లేదు. ● ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిబంధనలకు అనుగుణంగా శిక్షణ లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు. నిధులు భారీగా వెచ్చించినా.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి రాజీపడకుండా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఈపోటీల్లో పాల్గొనే సభ్యులకు శిక్షణ ఇస్తోంది. విదేశాలకు వెళ్లివచ్చేందుకు ఖర్చు భరిస్తోంది. ప్రత్యేక యూనిఫాం, షూలు, ఇతర ఏర్పాట్ల కోసమే రూ.50లక్షలకుపైగా ఖర్చు చేస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన పోటీల్లో కూడా సింగరేణి జట్టు పాల్గొంది. కానీ బహుమతులేవీ సాధించకుండానే వెనుదిరిగింది. ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ సాధిస్తున్న సింగరేణి జట్టు.. అంతర్జాతీయ పోటీల్లో ఎందుకు చతికిల పడిపోతోందనేది అంతుచిక్కకుండా ఉంది. మరోవైపు.. పోటీల్లో పాల్గొనే సభ్యులను ఎంపిక చేమడంలో నిబంధనలు పాటించడం లేదని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని పక్కనబెట్టి పైరవీలకు పెద్దపీట వేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విమర్శలు ఉన్నాయి. అంతర్జాతీయ పోటీల సమాచారం.. ● సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీవరకు ఐఎంఆర్సీ పోటీలు నిర్వహిస్తారు. ● ఇందులో పాల్గొనే రెస్క్యూ బ్రిగేడియర్ల ఎంపిక కోసం ఈనెల6న సింగరేణి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ● సంస్థలోని 33మందికి ఆహ్వానం పంపించింది. ● ఇందులో గత రెండేళ్లలో పాల్గొన్న బ్రిగేడియర్లు, టీం కోచ్లే ఉన్నారు. ● 12వ ఐఎంఆర్సీలో పాల్గొన్న వారికి ఈసారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది. ● వంద మార్కుల ప్రశ్నల్లో 50మార్కులు లిఖిత పూర్వక, 40మార్కులు రెస్క్యూ స్కిల్స్, మరో 10మార్కులు అనుభవానికి కేటాయిస్తున్నారు. ● ఈసారి ఇంటర్వ్యూలకు పిలిచిన వారిలో కొందరు ఇప్పటికే పింఛన్ పొందుతూ ఈఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేసేవారూ ఉన్నారని తెలిసింది. ● రెస్క్యూలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువత ను కావాలనే పక్కన పెట్టారని అంటున్నారు. ● తద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ బోర్డు(ఐఎంఆర్సీ) పోటీల్లో సింగరేణి ఎప్పుడు ఏడాది దేశం సాధించిన బహుమతి 5వ సారి 2006 చైనా 1. ఫస్ట్ఎయిడ్లో ఓవరాల్ రెండోస్థానం 2. మైన్స్ రెస్క్యూలో ఐదోస్థానం 6వసారి 2008 అమెరికా గౌరవ గుర్తింపు అవార్డు 7వ సారి 2010 ఆస్ట్రేలియా ఫస్ట్ఎయిడ్లో ఓవరాల్ బెస్ట్ 8వసారి 2012 ఉక్రెయిన్ 1. ఇంజినీరింగ్ అనాలసిస్లో 6వస్థానం 2. రెస్క్యూ ఈవెంట్స్లో 9వ స్థానం 9వ సారి 2014 పోలండ్ హాజరుకాలేదు 10వ సారి 2016 కెనడా గౌరవ గుర్తింపు 11వ సారి 2018 రష్యా హాజరు కాలేదు 12వ సారి 2020 – కోవిడ్తో పోటీలు నిర్వహించలేదు 13వ సారి 2022 అమెరికా గౌరవ గుర్తింపు 13వ సారి 2024 సెప్టెంబర్ 12నుంచి 20 కొలంబియా అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు ప్రామాణికంపై అనుమానాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు రేపు రెస్క్యూ పోటీల ఎంపిక ఇంటర్వ్యూలుప్రతిభావంతులకే పట్టం మెరికల్లాంటి రెస్క్యూ సభ్యులను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తాం. నిధులు కేటాయించడంలో రాజీపడే ప్రసక్తేలేదు. బంధుప్రీతికి తావులేకుండా పారదర్శంగా ఎంపిక ఉండేలా ఆదేశాలు జారీచేస్తాం. సింగరేణి జట్టు ఐఎంఆర్సీలో పాల్గొనడం సంస్థకు గర్వకారణం. ప్రపంచస్థాయిలో సత్తా చాటితేలా అన్నిచర్యలు తీసుకుంటాం. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement