-
No Headline
జిల్లా కేంద్రంలో కొందరు అక్రమార్కులు నాలాలను సైతం ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. నాలాలు కనిపించకుండా నివాస గృహాలు, దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో వరదనీరు ఇళ్లలోకే ప్రవహిస్తోంది. మూడేళ్లుగా ప్రధాన రహదారులన్నీ జలమయమై జిల్లా వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
ఎస్టీపీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) కాంట్రాక్టు, భూనిర్వాసిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీ బలరాంను బీఎంఎస్ అనుబంధ కాంట్రాక్టు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూ నియన్ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో సీఎండీ కార్యాలయంలో పలు స మస్యలపై వినతిపత్రం అందజేశారు. అర్హతకు తగి న వేతనాలు, పదోన్నతులు, అలవెన్సులు, కార్మి కుల కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బోడకుంట శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ పెద్దిరెడ్డి, కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట ఎరువుల వినియోగం పెంచాలి
భీమారం: భూసారం పెంపునకు దోహద పడే పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని రైతులు మరింత పెంచాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు జీలుగ విత్తనాల బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా పచ్చిరొట్ట ఎరువుల విని యోగం పెంచేందుకు రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వా డకంపై దృష్టి సారించాలని కోరారు. భూమిలో పో షకాలు పెరిగి సారవంతంగా తయారవుతుందని తెలిపారు. ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల తయారీ కోసం జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందజేస్తోందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మార్క్గ్లాడ్స్టన్, ఏఈవో అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాలి’
పాతమంచిర్యాల: ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీల హత్యాకాండ ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మోదీ, అమిత్షా ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో 120 మందికి పైగా గిరిజనులు, మహిళలు, పిల్లలను బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపిందని ఆరోపించారు. పాలకవర్గాలు విప్లవ సంస్థల కార్యకలాపాలను శాంతిభద్రతల సమస్యగా చూడడం సరైంది కాదని అన్నారు. విప్లవ సంస్థల లక్ష్యం ప్రజల ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై పోరాటమేనని తెలిపారు. దేశంలో అసమానతలు, దోపిడీ, పీడన ఉన్నంత కాలం విప్లవ సంస్థల కార్యకలాపాలు, ఉద్యమాలు ఉంటాయని అన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి బ్రహ్మానందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, అధ్యక్షురాలు జ్యోతి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్కుమార్, అరుణోదయ సమితి రాష్ట్ర కోశాధికారి మల్లన్న, డి.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఈఏపీ సెట్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ
బెల్లంపల్లి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీఓఈ) కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శనివారం ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడ్డాయి. బైపీసీ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23 మంది అర్హత సాధించారు. జుమ్మిడి ప్రణయ్ 4,885వ ర్యాంకుతో కళా శాల టాపర్గా నిలువగా, ఎం.శివకృష్ణ 7,123వ ర్యాంకు, యార్కర్ నికిత్ 17,928వ ర్యాంకు, గోమాస అఖిల్ 18,578వ ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రకటించారు. ఎంపీసీ విభాగంలో 38 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 37 మంది అర్హులయ్యారు. వీరిలో వెలుతురు అఖిల్ 17,133వ ర్యాంకుతో కళాశాల టాపర్గా నిలిచాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సైదులు, అధ్యాపకులు పిన్నింటి కిరణ్, శ్రీరామవర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీనారాయణ, శోభ, కట్ల రవీందర్, అనుముల అనిరుధ్ అభినందించారు. -
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మంచిర్యాలఅగ్రికల్చర్: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో, ఇన్చార్జీ పౌరసరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, డీఎం గోపాల్తో కలిసి జిల్లాలోని రేషన్డీలర్లు, గోదాముల ఇన్చార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నెల ఒకటి నుంచి 17 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతీ డీలర్ బయోమెట్రిక్ విధానంలో బియ్యం తీసుకోవాలని, బస్తాలను తూకం వేసే సమయంలో డీలర్లు అక్కడే ఉండి పరిశీలించుకోవాలని తెలిపారు. చౌకధరల దుకాణాల్లో రేషన్ డీలర్ పేరు, మొబైల్ నంబర్, నిల్వలు, పంపిణీ వివరాలతో బోర్డులు నిర్వహించాలని తెలిపారు. పంపిణీ సమయంలో రేషన్డీలర్లు చౌకధరల దుకాణాల్లోనే ఉండాలని తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బంది తలెత్తకుండా బియ్యం పంపిణీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అధికారికంగా టీజీ అమలు మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై టీఎస్ బదులుగా టీజీ అని అధికారంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, అధికారిక పత్రాలు(లెటర్ హెడ్, రిపోర్టు, నోటిఫికేషన్ ఇతరత్రా), ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇతర అధికారిక సంప్రదింపుల్లో టీజీ అని తక్షణమే అమలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన అధికారిక కమ్యూనికేషన్ అంతర్గతంగా, బహిర్గతంగా టీజీ అని ఉపయోగించాలని, టీజీగా నవీకరించి ప్రచురించిన సామగ్రిని వినియోగించాలని తెలిపారు. -
45 మంది ఉపాధ్యాయులకు షోకాజ్
ఆదిలాబాద్టౌన్: ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జా రీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 13న నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని పేర్కొంటూ ఐటీడీఏ పీవో, బోథ్ ని యోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా 45 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్ రూరల్లో ఆరుగురు, ఆదిలాబాద్ అర్బన్లో ఏడుగురు, తలమడుగులో ముగ్గురు, గుడిహత్నూర్లో ఐదుగురు, బేలలో ముగ్గురు, బోథ్లో ఎనిమిది మంది, ఇంద్రవెల్లిలో ఐదుగురు, భీంపూర్లో ఇద్దరు, తాంసిలో ఒకరు, ఇచ్చోడలో ఒకరు, ఉట్నూర్లో ఒకరు చొప్పున 45 మందికి నోటీసులిచ్చారు. ఇందులో 43 మంది డీఈవో పరిధిలోని ఉపాధ్యాయులుండగా ఇద్దరు ఐ టీడీఏ ఉపాధ్యాయులున్నారు. అయితే వీరిలో చా లామంది బోథ్ నియోజకవర్గ పరిధిలోని తమకు కేటాయించిన వివిధ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించారు. అయితే కొంతమంది సకాలంలో రిపోర్టు చేయకపోవడం, రిజిస్టర్లో సంతకాలు చే యకపోవడంతో వారిని గైర్హాజరుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేయాలని డీఈవోను ఆదేశిస్తూ పీవో ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో డీఈఓ సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా ఆ ఉపాధ్యాయులందరికీ షోకాజ్ జారీ చేశారు. విధులకు గైర్హాజరు కావడానికి గల కారణాలేంటో రెండు రో జుల్లోగా తెలపాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వారిచ్చే వివరణల ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా, ఈ నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు విస్తుపోవడంతో పాటు అధికా రుల తీరును తప్పుపడుతున్నారు. విధులు నిర్వహించి, ఎన్నికల రెమ్యూనరేషన్, డ్యూటీ సర్టిఫికెట్ పొందిన తమకు నోటీసులివ్వడమేంటని మండిపడుతున్నారు. దీనిపై సంబంధితాధికారులు పునఃపరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో ప్రణీతను వివరణ కోరగా.. బోథ్ ఏఆర్వో ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వారిచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుం టామని తెలిపారు. మరోవైపు అధికారుల తీరుపై పీఆర్టీయూ, ఎస్జీటీయూ, పీఆర్టీయూ తెలంగాణ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించిన వారికి సైతం నోటీసులు విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు -
‘ఇంజనీర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి’
శ్రీరాంపూర్: జైపూర్ ఎస్టీపీపీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్ కిరీటి మృతికి కారకులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి అఽధికారుల సంఘం (సీఎంఓఏఐ) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం పీ.శ్రీనివాసును కలిసి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిఒత్తిడి, విజిలెన్స్ అధికారుల ఎంక్వయిరీ వలన మరణిస్తున్నట్లు నోటు రాసి సదరు ఇంజనీర్ చనిపోయాడని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరైన వసతులు లేకున్నా, సంస్థ కోసం అహర్నిశలు పనిచేస్తున్న అధికారుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా అనాలోచిత చర్యలు తీసుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీధర్, అధికారులు మురళీధర్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ‘అధికారులపై వేధింపులు ఆపాలి’ మందమర్రిరూరల్: సింగరేణిలో అధికారులపై విచారణ పేరిట వేధింపులకు ఆపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం మందమర్రి ఏరియా అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో శనివారం ఎస్వో టూ జీఎం రాజేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కిరీటి ఆత్మహత్యకు పనిఒత్తిడి, విజిలెన్స్ అధికారుల వేధింపులే కారణమన్నారు. మృతిపై విచారణ జరిపించాలి జైపూర్: ఎస్టీపీపీలో వోఅండ్ఎం ఎస్ఈగా పనిచేసిన బి.కిరీటి మృతిపై విచారణ జరిపించాలని ఎస్టీపీపీ జీఎం బసివిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, సెక్రెటరీ సంతోశ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఇటీవల సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో పదమూడేళ్ల బాలుడు మొబైల్ ఫోన్కు బాగా అలవాటుపడ్డాడు. రో జంతా సెల్ఫోన్లలో సోషల్ మీడియా, రీల్స్ తదితర మాధ్యమాల్లో మునిగితేలుతుండడంతో ఆ అలవాటు మాన్పించాలని అతని తండ్రి మందలించాడు. అయితే మనస్తాపానికి గు రైన ఆ యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9 గంటల తర్వాత దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల లోపు యువకులు ద్విచక్ర వాహనాలపై ఇష్టారీతిన నడుపుకుంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. ఆరా తీస్తే అప్పటికే వారు దాబాహోటల్లో మద్యం సేవించి ఇంటికి తిరిగి వస్తున్నట్టు తెలిసింది. పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మందలించి ఇంటికి పంపించారు. -
కజకిస్తాన్ దేశంలో అల్లర్లు
● చిక్కుకున్న పలువురు తెలుగు విద్యార్థులు ● మంచిర్యాల విద్యార్థిని సురక్షితం మంచిర్యాలక్రైం: కజకిస్తాన్ దేశంలో జరుగుతున్న అల్లర్లలో కొందరు తెలుగు విద్యార్థులు చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులకు అందిన సమాచారంతో ఆందోళన చెందుతున్నారు. ఇందులో మంచిర్యాలకు చెందిన ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని కూడా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అల్ల ర్లు జరుగుతున్న ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలోని ఆల్మైటి ప్రాంతంలో పలువురు తెలుగు విద్యార్థులతో కలిసి క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ముందస్తుగా లాక్డౌన్ ప్రకటించి, తెలుగు విద్యార్థులు బయటకు వెళ్లవద్దని ఆంక్షలు విధించింది. దీంతో కొంత ఆందోళన నెలకొంది. -
● ఏటా వరదలతో ప్రజలు అతలాకుతలం ● గోదావరి, ప్రాణహిత నదీ తీర పంటలపై ప్రభావం ● జిల్లా కేంద్రంలో పలు కాలనీలకు జలగండం ● ముందస్తు చర్యలపై ఇప్పటికీ పట్టింపు కరువే
చర్యలు ప్రారంభిస్తే మేలువరదలతో ముప్పుపై ముందస్తుగా చర్యలు చేపడితే నష్టం తగ్గించే అవకాశం ఉంది. వరదల తీవ్రత అంచనా వేసి ఉపశమన చర్యలు తీసుకోవాలి. గోదావరిలో భారీగా నీటి నిల్వ లేకుండా పర్యవేక్షించడంతోపాటు ముందస్తుగానే లోతట్టు కాలనీల్లో అవసరమైన చర్యలు చేపట్టాలి. తీరం వెంట చాలా మంది రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ముప్పుపై వ్యవసాయ అధికా రులు అవగాహన కల్పించాల్సి ఉంది. మా తాశిశు సంరక్షణ కేంద్రంలో వర్షకాలం సీజన్ ముందే జాగ్రత్త వహించాల్సి ఉంది. కరకట్టల నిర్మాణానికి తగిన అధ్యయనం చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో రాళ్లవాగుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంతోపాటు ఇరువైపుల వాగు బఫర్ ప్రాంతాన్ని రక్షించాల్సి ఉంది. ముంచుతున్న వరదలుగోదావరి, ప్రాణహిత నదీ తీరాల్లో అధిక వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత సీజన్లో చెన్నూర్, కోట పల్లి, జైపూర్ మండలాల్లోనే 42 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. వేమనపల్లి మండలంలో పది గ్రామాలు, మంచిర్యాల, నస్పూర్ మండలాల నుంచి రెండేసి చొప్పున ప్రభావి తం అయ్యాయి. 5,201 మంది రైతులకు సంబంధించిన 9,065ఎకరాల్లోని పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొదట అంచనా వేసి చివరకు జరిగిన నష్టం మేరకే ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. పరిహారం కోసం గత ఏడాది రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. జిల్లాలో దాదాపు 27వేల ఎకరాలపై వరద ప్రభావం పడుతోంది. అధి కంగా పత్తి పంట వేస్తున్న రైతులు పెట్టుబడి నష్టపోతున్నారు. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలోనే నీట మునిగి నష్టం వాటిల్లుతోంది. మొక్క దశ నుంచే చేనుపై ప్రభావం చూపుతోంది. గోదావరి తీర ప్రాంతం చెన్నూర్, ప్రాణ హిత తీర ప్రాంతాలైన కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో రైతులకు మరింత ఇబ్బందిగా మా రింది. ఈ ప్రాంతాల్లో రైతుల భూములు సేకరించడమో లేక పరిహారం చెల్లించడం, ప్రత్యామ్నాయం చూపించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో రైతులకు వరదల గోస తప్పేలా లేదు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత మూడేళ్లుగా జిల్లాను వరద నీరు ముంచెత్తుతోంది. అటు రైతుల పంటలు మునిగి.. ఇటు గోదావరి తీర ప్రాంతంలోని మంచిర్యాల, నస్పూర్ పట్టణాలు, శివారు ప్రాంతాలకు నీటిగండం పొంచి ఉంటోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే నైరుతి రుతు పవనాల రాకతో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వరదలపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో రాబోయే ముప్పు ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల హడావుడిలో ఉంటూ వరద ముప్పుపై పట్టింపు లేదనే వాదనలున్నాయి. హామీల అమలు ఎప్పుడో.. వరద ముంపు తగ్గించేందుకు మంచిర్యాల పట్టణ శివారు గోదావరికి, రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణంతోపాటు లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ నాయకులు హామీలు గుప్పించారు. వానకాలం సమీపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి వరద ఉధృతి సమయంలో గేట్లు ఎత్తితే దిగువన ప్రభావం చూపిస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో రాళ్లవాగు, శివారులోని మంచిర్యాల పట్టణం రాళ్లవాగుకు ఆనుకుని ఉన్న కాలనీ అధికంగా ప్రభావానికి గురవుతున్నాయి. ర్యాలీ వాగుతో వేంపల్లి వరకు ప్రభావం చూపుతోంది. గోదావరి ఒడ్డున ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. అత్యవసర వేళ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలను వరద వస్తే హుటాహుటిన తరలించాల్సి వస్తోంది. ఆ సమయంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల తర్వాత ఆస్పత్రి మళ్లీ ప్రారంభించే వరకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వస్తోంది. ఇక ముంపు కాలనీలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు నీట మునిగితే భారీగా బాధితులకు ఆస్తినష్టం ఏర్పడుతోంది. -
చెడు స్నేహాలు దరిచేర నీయొద్దు
మానవుని జీవిత కాలంలో టీనేజ్ అత్యంత కీలకమైన దశ. ఈ వయసు వారిలో పిల్లలు, యువత చాలా ఉత్తేజ స్థితిలో ఉంటారు. ఇలాంటి వారిపై వారి తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు వహిస్తూ క్రమశిక్షణలో ఉంచుకోవాలి. అనుక్షణం వారిని పర్యవేక్షించాలి. వేసవి సెలవులను వృధా చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధంకావడం, ఉన్నత తరగతుల పుస్తకాలు చదవడం, క్రీడల కోసం శిక్షణ తీసుకోవడం వంటి అలవాట్లవైపు వారి దృష్టి మళ్లించాలి. చెడుస్నేహాలకు దూరంగా ఉంచాలి. – డా.అల్లాడి సురేష్, సైకియాట్రిస్ట్, మానసిక వైద్యనిపుణులు, నిర్మల్ -
‘పల్లె’ సమరానికి సన్నద్ధం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక ‘పల్లె’ సమరానికి సన్నద్ధత మొ దలైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వా త పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. బ్యాలెట్ బాక్సులు సరి చూసుకోవాలని, అవసరమైతే కర్నాటక, మహారాష్ట్ర రా ష్ట్రాల నుంచి తెప్పించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. నిబంధనల ప్రకా రం ప్రత్యేక అధికారుల పాలన మూడు నెలలకు మించి కొనసాగించడానికి వీలు లేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వచ్చేలోగా జిల్లాలో ఓటరు జాబితా తయారీ, బ్యాలెట్ బ్యాక్సులు సమకూర్చడం, బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది నియామకం తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకునేలా ప్రణాళికతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. కానీ అప్పుడే కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చింది. పార్లమెంటు ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా రూపొందించే అవకాశం ఉంది. ఓటరు సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా రూపకల్పన ఉంటాయి. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉండగా.. 2,730 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు లోక్సభ ఫలితాల అనంతరం నోటిఫికేషన్..? జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలుగత ఏర్పాట్లను సమీక్షిస్తాం...ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి. గతంలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఓటర్లు పెరగడంతోపాటు పోలింగ్ కేంద్రాలు కూడా పెరగవచ్చు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు మరోసారి ఏర్పాట్లు పునః సమీక్షిస్తాం. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి వాటిపై కసరత్తు పూర్తి చేశాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయితీ అధికారి -
‘ఉపాధి’లో క్షేత్ర సహాయకుల కొరత
● జిల్లాలో పంచాయతీలు 311 ● పనిచేసేది 165 మందిప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..జిల్లాలో ఉపాధి హామీలో క్షేత్ర సహాయకుల కొరత ఉన్నది వాస్తవమే. కొత్తగా ఏర్పడిన పంచాయతీల ప్రకారం కొత్తవారిని నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే మాత్రం నియమిస్తాం. – కిషన్, డీఆర్డీవో, మంచిర్యాలదండేపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల(ఫీల్డ్ అసిస్టెంట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 311 పంచాయతీల్లో 165మంది మాత్రమే పని చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో వాటి సంఖ్య 311 చేరింది. పంచాయతీలకు అనుగుణంగా క్షేత్ర సహాయకులను నియమించలేదు. ప్రస్తుతం పాత పంచాయతీల వారీగానే పని చేస్తున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్కు ఒకటి రెండు గ్రామ పంచాయతీలు అదనంగా.. లేనిపక్షంలో సీనియర్ మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరికొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్లను క్రమబద్ధీకరించాలని సమ్మె చేపట్టడంతో అందరినీ విధుల నుంచి తొలగించింది. ఒక దశలో ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వారిని విధుల్లోకి తీసుకుంది. కానీ పంచాయతీకి ఒకరి చొప్పున మాత్రం కేటాయించలేదు. కొత్త సాఫ్ట్వేర్తో.. ఉపాధి హామీ పథకంలో గత రెండేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించేవారు. అన్ని రాష్ట్రాల సాఫ్ట్వేర్లు ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అప్పటి నుంచి కొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. మొదట్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాలు పాత పంచాయతీ నుంచి విడిపోయి కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డా.. కూలీల పేర్లు రెండు పంచాయతీల్లో కనిపించడంతో చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అధికారులు సాఫ్ట్వేర్లో పంచాయతీలను వేరు చేశారు. అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం పంచాయతీలను యూనిట్గా చేసి పనులు గుర్తించారు. ఈ లెక్కన పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. అన్ని చోట్ల కూలీల హాజరు నమోదు, క్షేత్రస్థాయిలో ఫొటోలు అప్లోడ్ చేయడం కొంత ఇబ్బందిగా మారుతోంది. సీనియర్ మేట్లతో.. ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో పని ప్రదేశాల్లో ఉపాధి కూలీల హాజరు, ఫొటోలు తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కొన్ని చోట్ల సీనియర్ మేట్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకో క్షేత్ర సహాయకుడిని నియమించాలని పలువురు కోరుతున్నారు. -
కదిలిన మున్సిపల్ అధికారులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో ‘పారిశుధ్యం అస్తవ్యస్తం’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వార్డులో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించారు. రోడ్లపై పారుతున్న నీటిని పక్కకు మళ్లించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. అనుమతి లేని పాఠశాలకు గుర్తింపు ఇవ్వొద్దుబెల్లంపల్లి: బెల్లంపల్లిలో ప్రారంభించనున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని, ఆ పాఠశాలకు గుర్తింపు ఇవ్వొద్దని స్థానికులు డీఈవో యాదయ్యను కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు విద్య, అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు ఇతర శాఖల నుంచి అనుమతులు రాలేదని తెలిపారు. రేకులషెడ్డులో పాఠశాల నిర్వహణకు సిద్ధమవుతున్నారని, ఫ్లెక్సీలు, కరపత్రాలు పంపిణీ చేసి మోసపూరిత ప్రకటనలతో అమాయక తల్లిదండ్రులను వంచిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కే.సల్మాన్పాషా, నస్పూరి అఖిల్, కళ్యాణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సనే చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, పేరు ముందు డాక్టర్ అని రాసుకోవద్దని, ఎలాంటి మందులను ప్రిస్క్రిప్షన్పై రాయవద్దని, అర్హతకు మించి వైద్యం చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో జాతీయ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ద్వారా ఆర్ఎంపీలు, పీఎంపీలపై తనిఖీలు చేపడుతున్నాయని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారంగా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, ఇష్టారీతిన మందులు ఇవ్వడం, రాయడం వంటివి చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
రైతు వేదికలో కిష్కింద కాండ
● ఫ్యాన్లు, ట్యూబ్లు, ఫైళ్లు చిందరవందర ● ఇద్దరిని కరిచిన వానరాలు జన్నారం: మండలంలోని కలమడుగులో రైతుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదిక వానరాల చిలిపి చేష్టలతో కిష్కింద కాండ సృష్టించాయి. మూడు రోజుల క్రితం భవనంలోకి చొరబడిన కోతులు విద్యుత్ పరికరాలు, ఫైళ్లను చిందర వందర చేశాయి. ఫ్యాన్ల రెక్కలు వంచాయి. ట్యూబ్ లైట్లను తొలగించాయి. ఏఈవో గదిలోకి ప్రవేశించి కాగితాలు, ఫైళ్లను చించివేశాయి. రాత్రి కూడా అందులోనే ఉంటూ గది మొత్తం మలమూత్రాలతో నింపాయి. రెండు రోజుల క్రితం రైతు వేదికను శు భ్రం చేయడానికి వెళ్లిన పనిమనిషి భీమక్కపై దాడిచేసి గాయపరిచాయి. రైతు వేదికకు వచ్చిన రైతులను కూడా తరిమినట్లు రైతులు పేర్కొంటున్నారు. కాన్ఫరెన్స్ ఎలా నడిపేది? ప్రస్తుత ప్రభుత్వం త్వరలో రైతులకు సూచనలు అందించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని ఏఈవో దివ్య తెలిపారు. ఒకవేళ టీవీ అమర్చితే కోతులు పడేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఫ్యాన్లను వంచి పనికి రాకుండా చేశాయని, బాత్ రూమ్ ట్యాంక్ పైపులను తొలగించడంతో నిరుపయోగంగా మారాయన్నారు. కోతులు రైతువేదిక లోనికి చొరబడకుండా జాలీలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ స్వదేశ్కుమార్, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఏవో సంగీతను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశానని, ఏదైనా ఫండ్ వస్తే పరిష్కారం చేసే అవకాశం ఉందన్నారు. -
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవుల కాలం కొనసాగుతోంది. అయితే ఈ దశలో ఉన్న పిల్లలు, టీనేజ్ యువత పక్కదారులు పడుతున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల కాలాన్ని దుర్వినియోగం చేస్తూ సిగరెట్లు, మద్యం, మొబైల్ ఫోన్ వంటి ఇతర దురలవాట్లకు బానిసగా మారుతున్నట్లు ఇటీవలి కొన్ని ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మత్తు కోసం మాత్రలు, గంజాయి వంటి వాటిని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి వేళల్లో సైతం బైక్లపై రైడ్ల కోసం కోసం జాతీయ రహదారిపై తిరుగుతున్నారు. దాబా హోటళ్లలో మద్యం సేవించి ఇష్టారీతిన ప్రధాన రహదారిపై తిరగడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా కొన్ని రకాల శీతల పానీయాల్లో చాక్లెట్ల వంటి పదార్థాలు కలుపుకుని మత్తును ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు కేసులు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నట్లు సమాచారం. మత్తుకు బానిసైన వారిలో ఎక్కువగా కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపై ప్రభావం పడడమే కాకుండా మతిమరుపు, రక్తహీనత, నరాల బలహీనత వంటి వ్యాధులకు కారణమవుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పిల్లలు యువత ప్రవర్తనపై వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మందమర్రిరూరల్: ఐటీఐలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ దేవానంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ పొందేవారు వెరిఫికేషన్ రుసుం రూ.100 చెల్లించి జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రేడ్ల ప్రాధాన్యతక్రమంలో వెబ్ ఆప్షన్తో దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలని, మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలి’ శ్రీరాంపూర్: సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని కోరుతూ బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య సంస్థ సీఎండీ బలరాంనాయక్ను కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆయనను క లిసి వినతి పత్రం అందజేశారు. సింగరేణి సంస్థ కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తుందని, కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి కంపెనీ పాఠశాలల్లో సీబీఎస్ఈ ప్రవేశపెట్టాలన్నారు. కార్మికుల పిల్లలు ఉత్తమ విద్యా ప్రమాణాలతో చదివి కార్పొరేట్ సంస్థలకు దీటుగా రాణిస్తారన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి నాతాడి శ్రీధర్ రెడ్డి, నాయకులు దుస్సా భాస్కర్, బోడకుంట శ్రీధర్, కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
హత్య కేసులో ఇద్దరి అరెస్టుఆసిఫాబాద్రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య కళావతి, అక్కలపెల్లి రవీందర్ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ సతీష్ తెలిపారు. మండలంలోని రహపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి జరిగిన సంఘటన. అక్కలపెల్లి రవీందర్తో వివాహేతర సంబంధం పెటుకున్న కళావతి ప్రియుడితో కలిసి భర్త చున్కాకర్ రవీందర్ను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇంట్లో దూలానికి వేలాడదీశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.మిస్సింగ్ కేసు నమోదునెన్నెల: మైలారం గ్రామానికి చెందిన యు వతి (18) నాలుగు రోజులుగా కనిపించడం లేదని ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14న బెల్లంపల్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి వెంక అభి శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
‘అధికారుల తీరు మార్చుకోవాలి’
శ్రీరాంపూర్: అధికారులు తమ తీరు మార్చుకోవాలని ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు అన్నారు. శనివారం ఎస్సార్పీ1 గనిలో కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కొందరు అధికారులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లకు తొత్తులై ఇన్నాళ్లు పనిచేశారని ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఐఎన్టీయూసీని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి అధికారులను ఉపేక్షించేది లేదని, కార్మికుల క్షేత్రంలో వారిని నిలదీస్తామన్నారు. అనంతరం గని మేనేజర్ను కలిసి సమస్యలు విన్నవించారు. పనిస్థలాల్లో వెంటిలేషన్ సౌకర్యం మెరుగుపర్చాలని, కార్మికులకు టూల్ బాక్స్లను ఏర్పాటు చేయాలని, మ్యాన్రైడింగ్ యంత్రాన్ని షిఫ్ట్కు 10 నిమిషాల ముందే ప్రారంభించాలని, క్యాంటీన్లో సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి తిరుపతి, కేంద్ర కమిటీ నాయకులు లాగల శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, వెంకటస్వామి, జీవన్రావు, పిట్ సెక్రెటరీ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్లంపల్లి’లో భగీరథ ప్రయత్నం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భూగర్భ జలాలు అడుగుంటుతున్నాయి. జిల్లాలోని గోదావరి నదీ జలాలు కూడా ఎండిపోయాయి. మిషన్ భగీరథ నీటి పథకానికి ఈ వేసవిలో ఇటీవల కష్టకాలం ప్రారంభమైంది. ఈ పథకం ప్రారంభమై ఆరేళ్లు అవుతున్నా ఈ వేసవిలో వచ్చినంత సమస్య గతంలో ఎన్నడూ కాలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండగా గత మూడు వారాలుగా మంచినీటి పంప్హౌజ్లు తేలిపోతున్నాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ మంచినీటి సమస్య తలెత్తకుండా సమీక్షిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 టీఎంసీల సామర్థ్యంతో ఉండగా ప్రస్తుతం 5 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుని డెడ్స్టోరేజీ పరిస్థితిలో ఉంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజవవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలతోపాటు పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలోని మిషన్ భగీరథ ప్లాంట్ ద్వారా నీటిని బుగ్గగట్టుపై ఉన్న భారీ నీటి ట్యాంకుకు తరలించి అక్కడి నుంచి మూడు నియోజకవర్గాలకు మిషన్ భగీరథ నీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీల ప్రజలకు ఇంటెక్ వెల్ ద్వారా మోటార్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరడంతో పంప్హౌజ్ పరిసరాల్లో నీటి వనరులు లేకపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు అధికారులు మంచినీటి సరఫరాలో అంతరాయం కలగకుండా భారీ ప్రొక్లెయినర్లతో కాలువలు తీయిస్తూ పంప్హౌజ్ల చుట్టూ నీటివనరులు ఉండేలా చూస్తున్నారు. బెటాలియన్ కుళాయే దిక్కు.. హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ వద్ద బెటాలియన్ సిబ్బంది కో సం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క నీటి కుళాయి ఇప్పు డు అందరికీ దిక్కుగా మారింది. ఈ నీటి కుళాయి గుడిపేట బెటాలియన్ పరిసరాల్లో ఉన్న ఏడు గ్రామాల ప్రజల మంచినీటి దాహార్తి తీరుస్తోంది. అడుగంటుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పొక్లెయిన్లతో కాలువలు తీయిస్తున్న అధికారులు -
పంట వాసనకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని..●
వేమనపల్లి: వరి కోతల సమయంలో పంట పొలాల నుంచి వచ్చే వాసన వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. దస్నాపూర్, నాగారం బీట్ పరిధిలో శుక్ర, శనివారాల్లో రెండు చుక్కల దుప్పులు కుక్కల దాడిలో మృతి చెందాయి. గ్రామాల్లో ముమ్మరంగా వరి కోతలు సాగుతున్నాయి. హార్వెస్టర్లతో పంట నూర్పిడి చేయిస్తుంటే పైరు నుంచి వచ్చే కమ్మటి వాసన కిలోమీటర్ దూరం వరకు వెళ్తోంది. నాగారం అటవీ ప్రాంతం నుంచి పొలాల వైపునకు చుక్కల దుప్పి రాగా కుక్కలు వెంబడించాయి. పొలాల నుంచి గ్రామాల్లోకి రావడంతో అటవీ అధికారులు కుక్కల బారి నుంచి దుప్పిని కాపాడి వైద్యం చేయిస్తుండగానే మృతి చెందింది. ఇదే తరహాలో శుక్రవారం సాయంత్రం దస్నాపూర్ అటవీ ప్రాంతం నుంచి పొలాల వైపు నుంచి వచ్చిన దుప్పిని కుక్కలు తరిమాయి. గ్రామస్తులు కాపాడి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎఫ్ఎస్ఓ బేగ్, ఎఫ్బీఓ పోశన్న ఆధ్వర్యంలో బేస్ క్యాంపు సిబ్బంది వెంకటి, రవి, మహేష్ ఘటన స్థలానికి వెళ్లి దుప్పికి వైద్యం చేయించారు. వెటర్నరీ సిబ్బంది ఫెరోజ్, శ్రీకాంత్లు వైద్యం అందించేలోపే చుక్కల దుప్పి మృతి చెందింది. విషయం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. -
మామిడికాయల దొంగలు అరెస్ట్
నెన్నెల: మామిడికాయలు దొంగిలించి వాహనంలో తరలిస్తున్న పది మందిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్సై కుందారపు ప్రసాద్ తెలిపారు. బొప్పారం శివారులో ఓ రైతుకు చెందిన తోటను మందం శ్రీనివాస్రెడ్డి లీజ్కు తీసుకున్నాడు. రాత్రిపూట పది మంది ఆ తోటలో చొరబడి 15 క్వింటాళ్ల మామిడి కాయలు కోసుకుని టాటా ఏసీ ట్రాలీ వాహనంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా నెన్నెల టీ రోడ్డు వద్ద తెల్లవారుజామున 3 గంటలకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసిన నిందితులు వాహనాన్ని వదిలి పారిపోయేందుకు యత్నించగా వారిని వెంబడించి పట్టుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా మామిడి కాయలు దొంగలించి అమ్ముకునేందుకు మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని ఎస్సై పేర్కొన్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
భయాందోళన సృష్టించిన ఎద్దులు
బెల్లంపల్లి: పట్టణంలోని బజార్ ఏరియా ప్రాంతంలో శనివారం రాత్రి ఆంబోతులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రోడ్డు పైకి వచ్చిన రెండు ఆంబోతులు ఒక్కసారిగా కుమ్ములాటకు దిగాయి. డివైడర్కు అటు ఇటుగా ఆంబోతులు కొమ్ములతో కలబడి తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాయి. రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డు మీద నడిచి వెళ్లే పాదచారులు షాపులకు పరుగులు పెట్టారు. కొందరు యువకులు కర్రలు పట్టుకుని ఆంబోతులను విడగొట్టడానికి యత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. బజార్ ఏరియా రోడ్ నంబర్ 3 గల్లీ వద్ద నుంచి రోడ్ నంబర్ 4 , పై గల్లీ వరకు రంకెలు వేస్తూ భయానక పరిస్థితులు కల్పించాయి.పెద్ద ఎత్తున జనం గుమిగూడి కర్రలు పట్టుకుని అదిరిస్తూ అతి కష్టంగా రెండింటిని విడగొట్టారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిమందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందు క్లబ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ(60) అల్లుడు ఇటీవల చనిపోగా ఆదివారం నిర్వహించనున్న దశదినకర్మ కోసం శనివారం మందమర్రికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి సీఎస్పీ రోడ్డు వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తేనెటీగల దాడిలో పూజారి మృతిరెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి భీమన్న ఆలయ పూజారి పోషం (68) శనివారం తేనెటీగల దాడిలో మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన పోషం (68) గోలేటి టౌన్షిప్ లోని భీమన్న ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకునే కట్టెలతో పొయ్యి వెలిగించారు. దీంతో పొగ వ్యాపించడంతో సమీపంలోని వేపచెట్టుపై ఉన్న తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన పోషం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు భీంరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement