-
65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ..
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మెడికల్ టెస్ట్లు ప్రారంభంనిజామాబాద్నాగారం: అంగన్వాడీ టీచర్లు, ఆ యాల ఉద్యోగ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్ల వయస్సును నిర్ధారించింది. ఈ వయస్సు దా టిన వారు ఖచ్చితంగా ఉద్యోగ విరమణ చేయాల్సిందేనని ఆదేశాలు సైతం జారీ చేసింది. జిల్లా లో ఇప్పటికే 65 ఏళ్లు దాటిన వారు 250 మంది ఉన్నారని అధికారుల అంచనా. అయితే కొంత మంది తమ వయస్సు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టి న తేదీలు మార్చుకుంటున్న నేపథ్యంలో ప్రభు త్వం మెడికల్ టెస్ట్లు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, భీమ్గల్, ఆర్మూర్ ప్రాజెక్టు కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 1500 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 80,747, గర్భిణులు 1134, బాలింతలు 10260 మంది ఉన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 120కుపైగా టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో వీటిని భర్తీ చేస్తామని చెప్పినా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ వయస్సును ప్రకటించగా జిల్లాలో సుమారు 250మంది టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సర్టిఫికెట్లలో మార్పులు.. చేర్పులు 65 ఏళ్లు నిండిన ఆయాలు, టీచర్లు తమ వయ స్సు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన తేదీలను మార్పు లు చేర్పులు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు బెనిఫిట్స్లో అన్యాయం జరుగుతోందని గత ప్రభుత్వానికి వీరు విన్నవిస్తే రిటైర్మెంట్ తర్వాత రూ. 50వేలు ఆయాలకు, టీచర్లకు రూ. 1లక్ష ఇస్తామని చెప్పింది. కానీ టీచర్లకు రూ.5లక్షలు, ఆయాలకు రూ. 3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జాబితా సిద్ధం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మరో మూడు రోజుల్లో మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ అధికారులు సిద్ధమయ్యారు. ఆధార్కార్డులతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తూ, మెడికల్ పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షలతో వయస్సు ఎంతో ఉందో తేలనుంది. అప్పుడే పూర్తిస్థాయి జాబితాను సిద్ధమని అధికారులు పేర్కొంటున్నారు. వైద్య పరీక్షలు చేస్తాం జిల్లాలో ఉద్యోగ విరమణ వయస్సుకు దగ్గరలో ఉన్న ఆయాలు, టీచర్లకు డాక్టర్ల ద్వారానే మెడికల్ ఫరీక్షలు చేస్తాం. దాంతో వారి వయస్సు ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. మరో మూడు రోజుల్లో మెడికల్ పరీక్షలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – రసూల్బీ, జిల్లా మహిళా సంక్షేమాధికారి -
తప్పుడు సమాచారం ఇచ్చారు
నిజామాబాద్నాగారం : సమాచార హక్కు చట్టానికి డీఎంహెచ్వో అధికారులు తూట్లు పొడిచారు. పైగా సమాచారం అడిగిన దరఖాస్తుదారుకు బెదిరింపులు.. దీంతో హైద్రాబాద్ ఆర్టీఐ హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో గత డీఎంహెచ్వో అధికారిపై కేసు నమోదు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలంలోని మిట్టాపల్లి గ్రామానికి చెందిన సమీర్ హైమాద్ 2022 నవంబర్ 23న జిల్లా వైద్యారోగ్యశాఖలో ఆర్టీఐ యాక్టు ద్వారా అద్దెవాహనాల వివరాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అద్దె వాహనాలు ఎన్ని ఉన్నాయి? ఆర్బీఎస్కే, ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, టీ హబ్లో ఉన్న అద్దె వాహనాలకు సంబంధించి లాగ్బుక్, అకౌంట్స్, ట్యాక్సీ ప్లేట్ నంబర్, ఆర్సీబుక్ జిరాక్సు కాపీలను కోరారు. అధికారులు 30 రోజుల్లో వివరాలు అందించాల్సి ఉండగా ఏడాది గడిచిపోయినా నిర్లక్ష్యం వహించారు. దీంతో సమీర్ నేరుగా హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో 2023 జనవరి 20న ఫిర్యాదు చేశారు. తాజాగా దరఖాస్తుదారుకు డీఎంహెచ్వో అధికారులు 2024 ఏప్రిల్ 10న తప్పుడు సమాచారం ఇచ్చారు. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సమీర్ పేర్కొన్నారు. ఆర్బీఎస్కే జీవో కాపీలతో పాటు, వాహనాల నంబర్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో టీ హబ్ వివరాలు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీఐ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా అప్పటి జిల్లా డీఎంహెచ్వో అధికారిపై కేసు నమోదు చేశారని సమీర్ తెలిపారు. ఈ సందర్భంగా తనను అధికారులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మళ్లీ హైదరాబాద్ కమిషనర్ ఆఫీసుతో పాటు, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తానని,. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారుల నిర్వాకం ఆర్టీఐ దరఖాస్తుదారు ఆవేదన -
No Headline
కమ్మర్పల్లి: స.హ చట్టం సెక్షన్–7 ప్రకారం దరఖాస్తుదారుడు నిర్ణీత కాలంలో సమాచారం తీసుకోవడానికి కొంత రుసుములు చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. సెక్షన్–8, 9 ప్రకారం దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎటువంటి సమాచారం అయినా రుసుములు చెల్లించి తీసుకోవాలి. ఉత్తర్వు నంబర్ 740, 454 ప్రకారం సమాచారం ఇవ్వాల్సిన ప్రజా సమాచార అధికారులు ఏ–4 లేదా ఏ–3 పరిమాణం గల కాగితానికి రూ. 2 చొప్పున తీసుకోవాలి. సమాచారం ఎక్కువగా ఉంటే సీడీ, డీవీడీ లేదా ప్లాపీ రూపంలో సమాచారాన్ని తీసుకోవచ్చు. ఒక సీడీకి రూ.100, డీవీడీకై తే రూ.200, ప్లాపీకై తే రూ.50 చెల్లించి తీసుకోవాలి. కానీ 4(1)–బి రూపంలో ఉన్న 17 అంశాల సమాచారం మాత్రం దరఖాస్తుదారుడికి ఉచితంగా ఇవ్వాలి. సహజంగా దరఖాస్తుదారులు కోరే సమాచారంలో 90 శాతం 4(1)–బి కి సంబంధించిన సమాచారమే ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో రుసుములు అడుగుతూ కొందరు అధికారులు స.హ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. అధికారులే అడ్డు గోడలు... ఉమ్మడి జిల్లాలో పౌరులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి స.హ చట్టం ఉత్తర్వు నంబర్ –740, సెక్షన్–7ను ఆయుధంగా చేసుకొని అధిక రుసుం వసూలు పేరుతో స.హ చట్టానికే మస్కా కొడుతున్నారు. స.హ చట్టం సెక్షన్–6(1) ప్రకారం ఒక ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం గగనంగా మారింది. సాధారణ సమాచారం అయితే ఇస్తున్నారు కానీ, అవినీతితో ముడిపడిన సమాచారం గానీ, లోపాలు గల సమాచారం ఇవ్వడానికి అధికారులు రుసుముల పేరుతో కొత్త ఎత్తుగడ అనుసరిస్తున్నారు. అధిక రుసుములపై సమాచార కమిషన్కు సెక్షన్–18(1) దరఖాస్తుదారులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, ఆ అప్పీల్ విచారణకు రావడానికి రెండేళ్లు సమయం పడుతోంది. ఈ దశలో దరఖాస్తుదారులు ఏమి చేయాలో తెలియక మిన్నకుండిపోతున్నారు.దరఖాస్తుదారుడికి బషీరాబాద్ పంచాయతీ కార్యదర్శి పంపిన లేఖ -
సమాచారానికి ‘సహకారం’ కరువు
ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన స.హ చట్టం రెండు దశాబ్దాలుగా ఎన్నో అక్రమాలను బయట పెట్టింది. కానీ ఇది నాణేనికి ఒక పార్శ్యం మాత్రమే. చట్టం వచ్చి 19 ఏళ్లు అవుతున్నా అధికారులు తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు చట్టానికి యఽథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో రుసుములు చెల్లించాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. కొందరు అధికారులైతే స.హ. చట్టం నిబంధనలు తెలియనట్లు ప్రవర్తిస్తూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.● ఆలూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి స.హ చట్టం కింద దరఖాస్తు చేస్తూ తాను చేసిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు తెలపాలని కోరగా.. సదరు పీఐవో సమాచారం ఇవ్వలేదు. మొదటి అప్పీల్ వేసినా స్పందించడం లేదు.● కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఒక దరఖాస్తుదారుడు సమాచార హక్కు(స.హ) చట్టం– 2005 కింద మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు కోరుతూ మండల పరిషత్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సమాచారానికి సంబంధించి 7146 పేజీలు ఉన్నాయి.. పేజీకి రూ. 3 చొప్పున రూ. 21,438 చెల్లించాలని దరఖాస్తుదారుడికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అంతేకాక ఇదే మాదిరిగా మిగతా పంచాయతీల కార్యదర్శులు కూడా సమాచార పేజీలకు సంబంధించి పేజీకి రూ. 3 చొప్పున చెల్లించాలని తమ లేఖల ద్వారా సమాచారం అందించారు.● జిల్లాలో ప్రతి ఏడాది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న దరఖాస్తుల సంఖ్య 2500–3000 ● మొదటి అప్పీల్కు వెళ్తున్నవి 1800 ● రెండవ అప్పీల్కు వెళ్తున్నవి 950● అందని సమాచారం.. పట్టని నిబంధనలు ● అధిక రుసుములు వసూలు చేస్తున్న అధికారులు ● స.హ. చట్టం స్ఫూర్తికి తూట్లు -
బాన్సువాడ గడ్డ పోచారం అడ్డా..
బాన్సువాడ/నస్రుల్లాబాద్: ‘బాన్సువాడ గడ్డ పోచా రం అడ్డా.. నీ పప్పులు ఏం ఉడకవు’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బీర్కూ ర్, బాన్సువాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో, నస్రుల్లాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడను అభివృద్ధి చేశానన్నారు. అందు లో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించానని.. కానీ వాటికి సంబంధించిన రూ. 26 కోట్ల బిల్లులు ఆపేశారన్నారు. 15 రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, కుటుంబంతో సహా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు. గతంలో నాతో ఓడిన వ్యక్తులు సఖ్యతగానే ఉన్నారని.. కానీ ఎల్లారెడ్డిలో ఓడిన వ్యక్తి బాన్సువాడకు వచ్చి ఏం చేయలేరన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పార్లమెంట్లో మాట్లాడతానని పేర్కొన్నారు. బోధన్–బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోచారం భాస్కర్రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement