బాన్సువాడ గడ్డ పోచారం అడ్డా.. | Sakshi
Sakshi News home page

బాన్సువాడ గడ్డ పోచారం అడ్డా..

Published Sun, May 5 2024 6:10 AM

-

బాన్సువాడ/నస్రుల్లాబాద్‌: ‘బాన్సువాడ గడ్డ పోచా రం అడ్డా.. నీ పప్పులు ఏం ఉడకవు’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శనివారం బీర్కూ ర్‌, బాన్సువాడలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో, నస్రుల్లాబాద్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడను అభివృద్ధి చేశానన్నారు. అందు లో భాగంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించానని.. కానీ వాటికి సంబంధించిన రూ. 26 కోట్ల బిల్లులు ఆపేశారన్నారు. 15 రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, కుటుంబంతో సహా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు. గతంలో నాతో ఓడిన వ్యక్తులు సఖ్యతగానే ఉన్నారని.. కానీ ఎల్లారెడ్డిలో ఓడిన వ్యక్తి బాన్సువాడకు వచ్చి ఏం చేయలేరన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పార్లమెంట్‌లో మాట్లాడతానని పేర్కొన్నారు. బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement