-
చక్కదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
● చంద్రబాబు హయాంలో వెబ్ల్యాండ్లో అక్రమాలు ● రైతులను నిండా ముంచేసిన గత టీడీపీ ప్రభుత్వం ● ఒకరి భూమి మరొకరి పేరున నమోదు ● గత మోసాలకు అడ్డుకట్ట వేసి, చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పచ్చ భూచోళ్ల అక్రమాల్లో పైవి కొన్ని మాత్ర మే. టీడీపీ హయాంలో జరిగిన భూ ఘోరాలెన్నో. వెబ్ల్యాండ్లో రికార్డులు మార్చేసి ప్రభుత్వ భూము ల్ని, ప్రైవేటు వ్యక్తుల్ని తమ పేర్లపై రాసుకుని దర్జాగా అనుభవించడం, వాటిపై బ్యాంకుల్లో పెట్టి రుణాలు కాజేయడం వంటివి ఎన్నో చేశారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్టుగా సాగిపోయారు. దీనికంతటికీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన వెబ్ల్యాండ్ విధానమే కారణం. చంద్రబాబు హయాంలో వెబ్ల్యాండ్లో ఎన్నో అక్రమాలు జరిగాయి. జిల్లాలో 5.66లక్షల రైతులుండగా వారిలో 40శాతం మేర రైతుల భూముల రికార్డులు తప్పుల తడకగా ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో ఉన్న భూమి కంటే ఎక్కువగా వెబ్ల్యాండ్లో నమోదు చేయగా, కొన్ని గ్రామాల్లో ఉన్న భూమి కంటే తక్కువ నమోదు చేశారు. ఒకరి సర్వే నంబర్లు మరొకరి పేరున, ఉన్న భూముల కన్న ఎక్కువగా, ఎక్కువ భూములున్న వారికి తక్కువ నమోదు చేయడం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూమే లేని వారికి భూమి ఉన్నట్టు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వివాదాస్పద భూములను, అమాయక రైతుల భూములను టీడీపీ నేతలు తమ పేర్లతో నమోదు చేయించుకున్నారు. వారసత్వ భూములు వారసుల పేరిట నమోదు కాకపోవడంతో మ్యూటేషన్కు దరఖాస్తులు చేసుకున్నా వెంటనే పని జరగని సందర్భాలు ఉన్నాయి. మాన్యువల్ అడంగళ్ నుంచి కంప్యూటరైజ్డ్ వెబ్ల్యాండ్ లో నమోదు చేసినప్పుడు చాలా ఖాతాలు (వన్బీ)లు నమోదు కాలేదు. దీన్ని సరిచేయడానికి ముప్ప తిప్పలు పడ్డారు. రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు జరిగిన తరువాత భూములు కొనుగోలు చేసుకున్న వారి పేరిట రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీన్ని గాడిలో పెట్టేందుకు నానా అవస్థలు పడ్డారు. అక్రమాలకు చెక్ ● గ్రామాల సరిహద్దు నుంచి భూముల వరకు ప్రతి అంగుళం విడిచిపెట్టకుండా సర్వే చేయడం వల్ల ఎన్నో వివాదాలకు చెక్ పడింది. ● భూ సర్వేలో డ్రోన్ల సాయంతో ఫొటోలు తీయడం మొదలుకొని, మ్యాపింగ్ వరకూ అన్ని వివరాలూ ఆన్లైన్లో నమోదయ్యాయి. ● రికార్డులు చెరిపేయడానికి, టాంపరింగ్ చేయడానికి ఆస్కారం లేని విధంగా సర్వే కొనసాగుతోంది. ● రీ సర్వే పూర్తయిన తర్వాత రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. దీని వల్ల అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ● రైతుల పేరున పక్కాగా రికార్డులు ఉండేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసింది. ● వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాల్లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ● యాజమాన్య హక్కులు ధ్రువీకరించేందుకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసే అవకాశం లేని రీతిలో అడుగులు వేసింది. ● అంతేకాకుండా గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా సచివాలయం రిజిస్ష్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూమి వివాదాల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమల్లోకి తెచ్చింది. దేశంలో తొలిసారిగా అత్యంత శాసీ్త్రయ పద్ధతిలో సమగ్ర భూసర్వే ప్రారంభించింది. తొలి విడత 354 గ్రామాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పూర్తి చేయగా, రెండో విడత 195 గ్రామాల లక్ష్యంతో రీసర్వే చేసింది. -
పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు ఉండగా, తొలిరోజు ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు తదితరులు బ్యాలెట్ ఓట్లు వేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనూ, ఆయా నిర్దేశిత కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను శనివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్, జేసీ ఎం.నవీన్, ఇతర అధికారులు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 7004 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 643, పలాసలో 756, టెక్కలిలో 862, పాతపట్నంలో 760, శ్రీకాకుళంలో 1582, ఆమదాలవలసలో 988, ఎచ్చెర్లలో 630, నరసన్నపేటలో 783 ఓట్లు పడ్డాయి. -
‘బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవు’
శ్రీకాకుళం క్రైమ్ : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గానీ, ఇతర రాష్ట్రాల మద్యాన్ని గానీ గ్రామాలు, వార్డుల్లోకి తీసుకువెళ్లి బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) బి.సుబ్బారావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో ఆరు కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశామని, రూ. 10 వేల విలువ గల 15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈఎస్ సుబ్బారావు అన్నారు. అరెస్టయిన ఆరుగురూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి వాటిని బెల్టుషాపుల్లో నిల్వ చేసి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. బెల్టుషాపులు నిర్వహించేవారిపై ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు సంయుక్తంగా దాడులు చేసి కేసులు బుక్ చేసి రిమాండ్ విధించడమే కాక పెనాల్టీ విధిస్తామని తెలిపారు. ‘ప్రేరణ’లో విద్యార్థుల ప్రతిభ సరుబుజ్జిలి: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో ఏప్రిల్ 19న జరిగిన జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవం (డ్రాయింగ్, వ్యాసరచన) పోటీల్లో టెక్కలి జెడ్పీ హైస్కూ ల్ విద్యార్థి లమ్మట అఖిల్ (9వ, తరగతి), శ్రీకాకుళానికి చెందిన మైత్రిముంజి (10వ తరగతి) అనే విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారు. వీరిద్దరూ ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారని జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ డి.పరశురామయ్య, లక్ష్మీనారాయణలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరికి గుజరాత్లోని వాడ్నగర్లో ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం పరిశీలన పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్లోని నాలుగు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ శనివారం పరిశీలించారు. పోలింగ్ పనితీనును ఆర్వో అప్పారావు ను అడిగి తెలుసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలానికి ఒక్కో పోలింగ్ కేంద్రం, హిరమండలం, ఎల్.ఎన్ పేట మండలాలకు కలిపి ఒక పోలింగ్ కేంద్రం కేటాయించారు. మొదటి రోజు పీఓ, ఏపీఓలు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. అలాగే మార్కెట్ యార్డు గోడౌన్లో నిర్వహిస్తున్న ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ నల్లి సాయి, తహసీల్దార్ ప్రసాదరావు పాల్గొన్నారు. -
వెబ్ల్యాండ్ ముసుగులో గతంలో మోసాలు
● ఎచ్చెర్ల పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఎస్ఎంపురం వెళ్లే దారిలో ఉన్న కృష్ణ బంద చెరువును టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) ఆక్రమించారు. 2016లో ఈ చెరువుకు సంబంధించిన రికార్డులను మార్పు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టగా దాదాపు 3.11ఎకరాల భూమిని ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. ఆక్రమిత భూమి అంతా పూర్తిగా చెరువు గర్భమని గుర్తించి, రికార్డుల నుంచి చౌదరి బాబ్జీ పేరు తొలగించారు. ● ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో సర్వే నంబరు 112లో కొండ ప్రాంతాన్ని సబ్ డివిజన్గా చేసినట్టుగా చూపిస్తూ 638లో 4.35 ఎకరాల మేర టీడీ పీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) అక్రమంగా పట్టా సంపాదించారు. తన తండ్రి చౌదరి సత్యనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడిగా కొనసాగారని, దానిలో భాగంగా తన తల్లి సరస్వతమ్మ పేరున 1999లో ప్రభుత్వ భూమి ఇచ్చారని, అది వారసుడిగా తనకు వచ్చిందని 2018లో వెబ్ల్యాండ్లో ఎక్కించా రు. వాస్తవంగా స్వాతంత్య్ర సమరయోధుడి గా వేరే చోట భూములు పొంది విక్రయించారు. కానీ ఈ కొండలో తమకు పట్టాలిచ్చినట్టు గా ఫేక్పత్రాలు సృష్టించారు. దీనిపై స్థాని కులు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపారు. వెబ్ల్యాండ్.. గుర్తుందా ఈ పేరు ? చంద్రబాబు హయాంలో తీసుకువచ్చిన ఈ విధానం సామాన్యుల భూములకు భద్రత లేకుండా చేసింది. ఒకరి పేరున ఉన్న భూమిని మరొకరి పేరుతో నమోదు చేయడం, అక్రమంగా పట్టాలు చేయించడం, పేదల భూమిని ఎక్కడో ఉండి అమ్మేయడం వంటి అక్రమాలెన్నో జరిగాయి. ఇలాంటి పచ్చ ‘భూ’చోళ్ల బారి నుంచి భూములను రక్షించడానికి వైఎస్ జగన్ సర్కారు సంస్కరణలను ప్రవేశ పెట్టింది. -
No Headline
టీడీపీ నేత చౌదరి బాబ్జీ ఆక్రమించిన కృష్ణబంద చెరువు (ఫైల్)● కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరుడు మదన్గౌడ్ నందిగాం మండలం మాదిగా పురం పరిధిలో గురుబెల్లి చిన్నిమ్ములు, తలగాపు సత్యవతిల పేరున సుమారు 14 ఎకరాలను, సొంఠినూరు పరధిలో గురుబెల్లి చిన్నమ్మలు పేరున 15 ఎకరాలు, తలగాన సత్యవతి పేరున 15 ఎకరాలు, కల్లేపల్లి త్రినాథరావు పేరున 15 ఎకరాలకు రెవెన్యూ రికార్డులను తయారు చేయించి వారి పేరున 1బీలు, అడంగల్ కాపీలు తయారు చేశారు. వీటిని హైదరాబాద్కు చెందిన నల్లబొంతుల కరుణాకర్కు అమ్మకం పెట్టేశారు. అదంతా తప్పుడు డాక్యుమెంట్లు అని తెలుసుకుని కరుణాకర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి మదన్గౌడ్ను అరెస్టు చేశారు. ఇప్పుడిది కోర్టులో ఉంది. ● అచ్చెన్నాయుడు మరో అనుచరుడు, మెళియాపు ట్టి మండలానికి చెందిన టీడీపీ నేత హనుమంతు చంద్రశేఖర్ కరజాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 373–41, 373–42, 373–43లో ఉన్న 3.62 ఎకరాల ప్రభుత్వ భూ మిని తన భార్య హనుమంతు హేమలత పేరు తో పట్టా చేయించుకున్నారు. అంచెలంచెలుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకు ని కంప్యూటర్ అడంగల్ పొందాడు. వాస్తవానికి ప్రభుత్వ భూమి పొందితే డీ పట్టా అని రాయించాలి. కానీ అనువంశికం అని రికార్డుల్లో నోట్ చేయించి బ్యాంకు రుణాలు పొందాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement