-
అకాల వర్షం.. రైతుల ఆగమాగం
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. వివిధ గ్రామాల్లోని రైతులు కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మిరప కల్లాల వద్ద కూడా కొంతమేర కాయలు తడిసిపోయాయి. అదే విధంగా గాలి దుమారానికి కోత దశకు వచ్చిన వరిపంట నేలమట్టమైంది. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పలు చోట్ల చెట్లు విరిగిపడిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు గంటల తరబడి శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.దావూద్ డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఆరబెట్టిన, కుప్పలు పోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వర్షం వచ్చిందన్నారు. దీంతో పలువురు రైతులు ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలిపారు. కోతకు వచ్చిన ధాన్యం కూడా నేలవాలిందని వివరించారు. పంటల పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చిన రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం కుప్పలు -
బీరన్న కల్యాణ మహోత్సవం
ములుగు: జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బీరన్న బోనాలు కార్యక్రమంలో భాగంగా మూడో రోజు స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం యాదవులు ఘనంగా జరుపుకున్నారు.తొలుత బైకాని మల్లయ్య ఇంటి వద్ద సుంకుపట్టి కులస్తులకు బియ్యం అందజేశారు. పట్టణంలోని యాదవులు ప్రతీ ఇంటి నుంచి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో తరలివెళ్లారు. బీరన్న పూజారులు యాదవ సాంప్రదాయం ప్రకారం బోనాల చుట్టూ గొర్రెను గావుపట్టి పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా డోలివాయిద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలనీలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కులపెద్దలు గొర్రె కొంరయ్య, సారిగొల్ల ఇమ్మడి భిక్షపతి, గోపు చంద్రమల్లు, ఎల్లావుల సమ్మయ్య, గుండెబోయిన కుమార్, కొనుపుల కుమార్, సంపత్, కృష్ణ, గోపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. బొడ్రాయి వార్షికోత్సవ పూజలు వాజేడు: మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి కొత్తూరులో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. బొడ్రాయి ఏర్పాటు చేసి ఏడాది కావడంతో గ్రామస్తులు అందరు కలిసి పూజారి అనికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలను జరిపించారు. వేణుగోపాల స్వామికి వైద్యరత్న అవార్డుగోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు కల్యాణపు వేణుగోపాల స్వామి కరోనా సమయంలో ప్రజలకు అందించిన వైద్య సేవలు గుర్తించి వైద్యరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో కల్యాణపు వేణుగోపాల స్వామి ఎంపికై నట్టు ప్రకటించి ఆయనను అభినందించారు. జూన్ 10న మహారాష్ట్రలోని పూనేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా వేణుగోపాల్ స్వామికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం.గౌతం, రాష్ట్ర కో ఆర్డినేటర్ హనుమండ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు తాటికొండ ఐలయ్యలు, వేణుగోపాల స్వామి హజరుకానున్నారు. విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు కాటారం: అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చరించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో వన్యప్రాణుల వేట నిర్మూలన, అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల వేట చట్టరీత్య నేరం అన్నారు. ఎవరైనా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు అమర్చడం కారణంగా వన్యప్రాణులు, మూగజీవాలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జెట్ విమానం చక్కర్లుకాళేశ్వరం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దు గ్రామాల్లో జెట్ విమానం చక్కర్లు కొడుతోంది. మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, కాటారం తదితర గ్రామాలపై నుంచి తరుచూ జెట్ విమానం చక్కర్లు కొడుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జెట్ విమానం ఎక్కడి నుంచి వస్తుంది..? ఎందుకు సంచరిస్తుంది..? ఎవరి కోసం చక్కర్లు కొడుతుందో అంతు చిక్కడం లేదు. ఆదివారం కాళేశ్వరం, పలుగుల, మద్దులపల్లి, అన్నారం ప్రాంతంలో జెట్ విమానం తిరిగింది. కాగా, ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టారనే అనుమానంతో పోలీసులు జెట్ విమానంతో జల్లెడ పడుతున్నారని సమాచారం. ఈ విషయమై పోలీసులు మాత్రం ఎలాంటి వివరాలు తెలుపడం లేదు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం: కాకతీయుల కట్టడమైన కోటగుళ్లు శిల్పసంపద మహా అద్భుతమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె.జయరాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాంచంద్రారావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను ఆదివారం వారు కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. మొదట ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు. కాకతీయులు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి కట్టడాలు, శిల్పసంపద ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. ఈ అద్భుత కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. -
నాయకుల అప్రమత్తం
సాక్షి, మహబూబాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజార్టీ వచ్చింది.. మాకు ఎదురు లేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పెట్టినా గెలుస్తారు.. మా అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే’ అని ఎన్నికల ప్ర చారాన్ని పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నాయకులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేదని పార్టీ రాష్ట్ర నాయకులు అసంతృప్తి వెల్లగక్కినట్లు ప్రచారం. అయితే ఈ షాక్ నుంచి తేరుకోకముందే కేసీఆర్ రోడ్షోకు జనం కిక్కిరిసిపోయి సక్సెస్ కావడంతో.. అసలు ఏం జరుగుతుందో అని కాంగ్రెస్ నాయకులు డైలమాలో పడినట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చగా మారింది. దీనికి తోడు నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారంతో మానుకోట పార్లమె ంట్లోని ప్రజాప్రతినిధులు ప్రచార తీరు మార్చుకోవాలని అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయి నాయకులు గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రచారం ముమ్మురం చేశారు. కేసీఆర్ రోడ్షోను చూసిన తర్వాత.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఫ్యూహం మార్చుకొని అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు జిల్లా ప్రజలు నీరాజనం పట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో మానుకోట వీధులు గులాబీమయంగా మారాయి.జనాన్ని చూసిన కేసీఆర్ మురిసిపోయారు. ఎన్నడు లేని విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ బస్సుపై వేసిన నృత్యాలు వారి సంతోషానికి అద్దం పట్టాయి. ఇదంతా చూసిన కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైంది. నిన్నటి వరకు నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి ఊపులో ఉన్న సమయంలో సీఎం సభకు జనం వచ్చిన తీరు.. కేసీఆర్ సభకు జనం వచ్చిన తీరుపై బేరీజు వేసుకొని ఖంగుతిన్నట్లు తెలిసింది. బల నిరూపణ అంటే ఓట్లు వేయించడమే.. జిల్లాలోని జరిగిన పరిణామాలు, సీఎం, మాజీ సీఎం సభలు జరిగిన తీరు, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ సునాయసంగా గెలుస్తారనే చర్చ నుంచి.. ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ పార్లమెంట్ నియోకవర్గంపై ప్రత్యేక చర్చ కూడా పెట్టినట్లు తెలిసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ తుమ్మల నాగేశ్వర్రావు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తారో.. తెలియదు.. మీకు వచ్చిన మెజార్టీని మళ్లీ తీసుకురావాలి.. మీ బలం నిరూపించుకోవడం అంటే.. ఓట్లు వేయించడమే...దీనిని బట్టే పార్టీలోని మీ ప్రాధాన్యత, నామినేటెడ్, ఇతర పదువుల అప్పగించడంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో ఉన్న నాయకులు సీరియస్గా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి వరకు పార్టీలో చేరికలపై ఉత్సాహం చూపని నాయకులు ఇప్పుడు చేరికలు కూడా మొదలు పెట్టారు. జిల్లాలోని ఓ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడిని చేర్పించుకొని ఆ మండలాన్ని క్లీన్స్వీప్ చేయాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అర్థం అవుతుంది. అదేవిధంగా ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నించాలని నాయకులనుఆదేశించినట్లు తెలిసింది. ఇలా ఏ అవకాశాన్ని కూడా విడిచి పెట్టకుండా.. ఓటు బ్యాంకు ‘చెయ్యి’ జారకుండా అప్రమత్తం అవుతున్నారు. కేసీఆర్ రోడ్షో సక్సెస్తో కాంగ్రెస్ నేతల అలర్ట్ ప్రచారంలో నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు మళ్లీ చేరికలపై దృష్టి పెట్టిన నాయకులు ఎవరికి వారుగా మెజార్టీ చూపించుకోవాలని టార్గెట్ -
గుడిసైపె పిడుగు
వాజేడు: మండల పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన గాలి ఆదివారం సాయంత్రం వచ్చింది. ఈ క్రమంలో బొల్లారం గ్రామానికి చెందిన కంతి నాగేశ్వరరావు కొత్తగా ఇల్లు కట్టుకుంట్టుండడంతో కుటుంబ సభ్యులతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గాలిదుమారం ఎక్కువ కావడంతో వారు కొత్త ఇంట్లోకి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ గుడిసైపె పిడుగు పడింది. దీంతో వారికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోపడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement