-
ఆయిల్పామ్ సాగుతో లాభాలు
ములుగు రూరల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి గుండె అనసూయ అన్నారు. ఈ మేరకు శనివారం ఇంచర్ల శివారులోని కేన్ కంపెనీ ఆయిల్ పామ్ నర్సరీని, ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,775 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో సాగుకు అంచనా వేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతుల సహకారంతో లక్ష్యం చేరుకుంటామని వివరించారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు 5 వేల ఎకరాలు దాటితే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడుతారని , రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేన్ కంపెనీ కొనుగోలు చేస్తుందన్నారు. పంటసాగులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎకరాకు రూ.లక్ష మేర లాభం వస్తుందని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు నేరుగా ఉద్యనశాఖ అధికారిని కలువాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు, కేన్ కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
● మంత్రి ధనసరి సీతక్క ములుగు: పండించిన ధాన్యాన్ని విక్రయించే విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క భరోసానిచ్చారు. ఈ మేరకు జిల్లాలో కురిసిన వర్షం, రైతుల పరిస్థితి, కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పండించిన ప్రతీగింజను మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని వెల్లడించారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ఉంటామన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలోనూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మరో రెండు రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి సీతక్క సూచనలతో సివిల్ సప్లయీస్ డీఎం రాములు, ఇతర శాఖల అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను తరలించారు. -
బీజేపీకి అనుకూల వాతావరణం
హన్మకొండ: బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో కేజీ టు పీజీ విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, డి కన్వెన్షన్లో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు. ప్రశ్నించే గొంతుకై న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ బీజేపీ కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి ఓటు వేసే విధానంతో పాటు బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ పని చేస్తుందన్నారు. కేంద్ర ప్రఽభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తుంటే రాష్ట్రాలు వాటిని దారి మళ్ళిస్తున్నాయన్నారు. ఈక్రమంలో కేంద్రం నేరుగా విద్యార్థి ఖాతాలోనే ఉపకార వేతనాలు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వివరాలు పంపించలేదని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.వేల కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్చార్జ్ రాంచందర్ రావు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఝెండల లక్ష్మీనారాయణ, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, ఒంటేరు జయపాల్, జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్, ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, ప్రొఫెసర్ ఆజ్మీర సీతారాం నాయక్, వరంగల్ పార్లమెంట్ ప్రభారి వి.మురళీధర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, విద్యా సంస్థల ప్రతినిధులు బుచ్చిబాబు, అశోక్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రేమేందర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
ఓరుగల్లు మాణిక్యాలు
మధ్య తరగతి కుటుంబంలో విద్యా కుసుమాలు వికసించాయి. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈఏపీసెట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో మెరుగైన ర్యాంకులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన శ్రీవర్షిణి రాష్ట్రస్థాయిలో (అగ్రికల్చర్, ఫార్మసీ) 3వ ర్యాంకు, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం మణితేజ 9వ ర్యాంకు (ఇంజనీరింగ్) సాధించారు. – స్టేషన్ఘన్పూర్/హన్మకొండ చౌరస్తాఈఏపీసెట్లో మనోళ్లకు స్టేట్ ర్యాంక్లు ● అగ్రికల్చర్, ఫార్మసీలో శ్రీవర్షిణికి 3వ ర్యాంక్ ● ఇంజనీరింగ్లో కొంతం మణితేజకు 9వ ర్యాంక్ ● తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చిన విద్యార్థులు ● అభినందనలతో ముంచెత్తిన స్థానికులు, బంధువులు -
తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లిది కుట్టు పని
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. వేణుగోపాల్ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్ హైదరాబాద్ కూకట్పల్లి ఎస్ఆర్ శ్రీగాయత్రి కళాశాలలో ఎంపీసీ చదివాడు. ఇంటర్లో 715 మార్కులు సాధించాడు. కాగా ఈఏపీసెట్లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్ ర్యాంక్ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. -
రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం
ములుగు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో కక్షిదారులు రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకునేలా చూడాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్అదాలత్లో న్యాయపరమైన సలహాలు, సూచనల కోసమైనా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి సూచనలు పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కన్నోజు సునిల్కుమార్, న్యాయవాదులు మేకల మహేందర్, భిక్షపతి, బానోత్ స్వామిదాస్, రాజ్కుమార్, ప్రతాప్, సంజీవ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్ -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
ఆశవర్కర్లకు పారితోషికం అందించాలి
ములుగు రూరల్: లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశ వర్కర్లకు పారితోషికం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ కార్యాలయ అధికారి అల్లం రాజ్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం చెల్లించే రెమ్యూనేషన్ చెల్లించలేదన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారికి సైతం డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఎన్నికల విధుల డబ్బులు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి, శిరీష, కేతా, రజిత పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి ములుగు రూరల్: రైతులకు నాణ్యమైన విత్తనాలను ఇవ్వాలని, నకిలీ విత్తనాలు అమ్మితే వ్యాపారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర అన్నారు. ఈ మేరకు శనివారం ములుగు, వెంకటాపురం(ఎం) మండల కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. విత్తనాలు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలన్నారు. రశీదులను భద్రపరుచుకోవాలని తెలిపారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు తప్పనిసరిగా అగ్రిమెంట్ రాయించుకోవాలన్నారు. రైతులు సరైన వర్షపాతం నమోదు అనంతరం పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మునుకుంట్ల సంతోష్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి గోవిందరావుపేట: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల చేతికి అందివచ్చిన పంట నీళ్ల పాలైందన్నారు. కోతలకు వచ్చిన వరి పంట నేలవాలి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించాలన్నారు. మిర్చి సాగు రైతులకు జిల్లాలో గిడ్డంగులను ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు మిర్చి నిల్వలకు ఏసీ గోదాంలు నిర్మించాలన్నారు. ప్రభుత్వం తనికాకు కూలీలకు బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. వాజేడు మండల పరిధిలో మోడికుంట, గుండ్ల వాగు ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, సాంబశివ, చిట్టిబాబు, రాజేందర్, రఘు, తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ రద్దు చేయాలి ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి టెండర్ పిలవకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్ పిలవకుండా ఒక ఏజెన్సీకి 32 ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిమెంట్ అధికారి నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదన్నారు. గత నాలుగేళ్లుగా కొత్త ప్యానల్ ఏర్పాటు చేయకుండా ఏజెన్సీలకు అవకాశం కల్పించకుండా ఎంప్లాయిమెంట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నాన్లోకల్ ఏజెన్సీలకు నిబంధనలకు విరుద్దంగా టెండర్లు అప్పగిస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలకి సంబంధించిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రద్దు చేసి టెండర్ పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
స్కూల్ స్థాయి నుంచి టాపరే..
హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రికల్చర్, ఫార్మసీలో (హాల్ టికెట్ నంబర్ 2411ఆర్09048, మార్కులు 145.255026) రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి అంతంత మాత్రంగానే తెలిసిన శ్రీవర్షిణి సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించడంతో కాలనీవాసుల అభినందనలతో తల్లిదండ్రులు మురిసిపోయారు. గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె శ్రీవర్షిణి, కుమారుడు ఫణితేజ. ఫణితేజ కర్ణాటకలోని ధార్వాడలో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కన్నయ్య ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లావణ్య గృహిణి. శ్రీవర్షిణి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి 10/10 మార్కులు సాధించింది. హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివి 987 మార్కులు తెచ్చుకుంది. శ్రీవర్షిణి ఇటీవల నీట్ రాసింది. అందులోనూ 200లోపు ర్యాంక్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
వాజేడు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం ములుగు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి పరిశీలించారు. వాజేడు మండలం నుంచి 555 పట్ట భద్రుల ఓట్లు ఉండగా స్థానిక ఉన్నత పాఠశాలను పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో వసతులు పరిశీలించిన ఆయన తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో శ్రీకాంత్ నాయుడు, డీటీ రాహుల్ చంద్రవర్మ ఉన్నారు. వినియోదారులు సహకరించాలి ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ సాయికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, పత్తిపల్లి నుంచి కాశిందేవిపేట, సబ్ స్టేషన్ పరిధి గ్రామాలలో 33కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతుందని తెలిపారు. నేడు(శనివారం) ఉదయం 7నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులు సహకరించాలని కోరారు. వికసించిన ‘మే’ పుష్పం వాజేడు: అరుదుగా కనిపించే మే పుష్పం మండల పరిధిలోని పెద్ద గొళ్లగూడెం గ్రామంలో శుక్రవారం వికసించింది. పెద్ద గొళ్లగూడెం గ్రామానికి చెందిన జెజ్జరి సత్యనారాయణ ఇంట్లో ఈ మే పుష్పం కనిపించింది. దీంతో ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిగా వచ్చి తిలకించారు. సైబర్ నేరాలపై జాగ్రత్త అవసరంభూపాలపల్లి: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకొని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలు అనవసర లింక్లు క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పాస్వర్డ్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ–మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దన్నారు. గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు. లాటరీలు, బ్యాంకుల రివార్డు పేరిట, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ నంబర్ చెప్పండని, మీ ఏటీఎం పనిచేయడం లేదని, కారు గెల్చుకున్నారని, మనీ ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని... ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ‘భూములు ఇవ్వం’.. మొగుళ్లపల్లి: న్యూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇవ్వబోమని మొగుళ్లపల్లి మండల బాధిత రైతులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులతో ఆర్డీఓ మంగీలాల్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటుచేశారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. దీంతో తాము భూములు ఇవ్వబోమని రైతులు సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ రేటు ప్రకారం భూములకు ధరలు నిర్ణయించడం రైతులను మోసం చేయడమేనన్నారు. భూమికి బదులు భూమి ఇప్పించాలని రైతులు కోరారు. బలవంతంగా రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ సునీత, ఎస్సై అశోక్ ఆర్ఐ సురేందర్రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. తమ భూములు ఇవ్వబోమని, సర్వే ఆపాలంటూ ఆర్డీఓకు వినతిపత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీసీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ను విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక వసతుల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభించడానికి వ్యవధి 20రోజులే ఉందన్నారు. మంజూరు చేసిన పనులను ఆలోగా పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్ధులకు స్కూల్ యూనిఫాం జిల్లాలకు చేరుతుందన్నారు. జిల్లాలో కుట్టుమిషన్లో అనుభవం ఉన్న స్వశక్తి మహిళా సంఘాలకు యూనిఫాం కుట్టే పనులు అప్పగించాలని తదితర విషయాలపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, సివిల్ సప్లయీస్ మేనేజర్ రాంపతి, డీఈఓ పాణిని, వ్యవసాయాధికారి విజయ్ చంద్ర, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి తదితరులున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
హేమాచలక్షేత్రం ముస్తాబు
మంగపేట: జిల్లాలోని రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మంగపేట మండలం మల్లూరు గుట్టపైగల శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాల(జాతర)కు ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకులు(వేద పండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా జరిపించనున్నారు. రేపటి(19వ తేదీ) నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా పది రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శనిగల సురేష్ తెలిపారు. వైభవంగా దేవతామూర్తుల కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టంన 23వ తేదీ ఉదయం 9గంటలకు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధ్రువమూర్తుల కల్యాణం, మధ్యాహ్నం 12.23గంటలకు లభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో, అభయాంజనేయస్వామి, దైత అమ్మవారు, తదితర ఆలయాలు, ప్రధాన ఆర్చీలను వివిధ రకాల రంగులతో అలంకరించారు. జాతర ప్రాంగణంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా ఉండేందుకు ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారి ప్రాంగణం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ప్రత్యేక తడకల పందిళ్లను నిర్మించారు. భారీగా తరలిరానున్న భక్తులు హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు(జాతరకు) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవాదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా కల్యాణ మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, అదే విధంగా జాతర ప్రాంగణంలో వివిధ చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు కార్యనిర్వహణ అధికారి తెలిపారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 23న స్వామివారు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల తిరుకల్యాణం 10 రోజుల పాటు జరుగనున్న కార్యక్రమాలు రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు రేపటి(19వ తేదీ)సాయంత్రం అంకురార్పణ, 21న ఉదయం 9గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం 6 గంటలకు దేవతాహ్వానం, భేరీపూజా, గరుడాదివాసం ఉంటుందని తెలిపారు. 22న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎదుర్కోలు మహోత్సవం, 23న లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుకల్యాణ మహోత్సవం మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో జరుగుతుందని వివరించారు. 24న సాయంత్రం 7 గంటలకు రథోత్సవం 25న 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్యం(వేదాశీర్వచనం), ఊంజల్సేవ, 26న సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు తెప్పోత్సవం–రథోత్సవం 27న ఉదయం 10 గంటలకు చక్రస్నానం ఉంటుందని తెలిపారు. అదే విధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి, నాగవల్లి, ద్వాదశ ఆరాధనలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా పుష్పయాగం, 28న ఉదయం 10 గంటలకు వసంతోత్సవం 12 గంటల నుంచి సామూహిక రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నదాన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
పాఠశాలల ప్రారంభం రోజే పుస్తకాల పంపిణీ
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తామని డీఈఓ పాణిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510పాఠశాలలు ఉండగా 31,796 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. జిల్లాకు 2,12,554 పాఠ్య పుస్తకాలు అవసరం ఉందని విద్యాశాఖ తరుపున ప్రభుత్వానికి నివేదికలు అందించామని తెలిపారు. ఇందులో మొదటి విడుతగా ప్రభుత్వం నుంచి 66వేల పుస్తకాలను వచ్చాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏక రూప దుస్తులు అందించేందుకు సిద్ధం చేస్తున్నామని వివరించారు. కార్పోరేట్కు దీటుగా విద్యాబోధన చేపట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని వివరించారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గోవిందరావుపేట: వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షం కారణంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీగల ఆదిరెడ్డి, నర్సిరెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్రెడ్డి, సాంబశివరావు, సుధాకర్, శేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు: జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరితగతినన పూర్తి చే యాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్తో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, సుందరీకరణ వంటి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని గుర్తించబడిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఏపీఎం, ఏఈలు, ఎంఈఓలు పాల్గొన్నారు. యూనిఫాంలను సకాలంలో అందించాలి గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు యూనిఫాంలను కుట్టి సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో స్కూల్ యూనిఫాంలు కుట్టించే మహిళా సంఘాల సభ్యులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు సరైన కొలతలతో నాణ్యతగా కుట్టించి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే యూనిఫాంలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, ఏపీఎం నాగేశ్వర్రావు, సీసీలు రజియూ, శ్యాంసుందర్, సుభాషిని, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ -
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
ములుగు: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ చంద్ర, డీఎస్పీ రవీందర్లతో కలిసి జిల్లాలోని విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపు డీలర్లతో విత్తన చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎక్కవగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి రైతులకు కల్తీ విత్తనాలు అమ్మి మోసం చేస్తే సహించేది లేదన్నారు. విత్తన డీలర్లతో సమన్వయంగా పనిచేస్తూ నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ స్థా యిలో రైతులకు నాణ్యమైన విత్తనాలపై రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపటాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విస్తృత తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. డీలర్లు విత్తన చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ విధిగా నమోదు చేయాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతీ మందుకు, విత్తనాలకు, పురుగు మందులకు రశీదు అందించాలన్నారు. వ్యాపారులు విత్తనాల అమ్మకాల్లో కల్తీ, కాల పరిమితి లేని విత్తనాల అమ్మకంతో పాటు తదితర నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యాపారులతో పాటు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ శ్రీపాల్, ఏటూరునాగారం ఏడీ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలి ములుగు రూరల్: వరంగల్–ఖమ్మం–నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పని సరిగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలు, నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఇతర ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం నియమ నిబంధనలు ఉంటాయని వివరించారు. అభ్యర్థులు జిల్లాలో ప్రచారం నిర్వహించాలనుకుంటే ఆర్డీఓ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేయాల్సి వస్తే 1950లో సంప్రదించాలని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 6,587 మంది పురుషులు, 3,712 మంది మహిళలు మొత్తంగా 10,299 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. జిల్లాలో 7 సెక్టార్లు, 7 రూట్లలో విభజించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తప్పని సరిగా లెక్క చూపాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
డెంగీ నివారణకు సహకరించాలి
ములుగు: జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధి ఆడ ఎడిస్ దోమల వల్ల వస్తుందన్నారు. ఈ దోమలు పగటి పూట కుడతాయన్నారు. డెంగీ వ్యాధి బారిన పడితే తీవ్రమైన వేడితో కూడిన జ్వరం, భరించలేని తలనోప్పి, చర్మం పై దద్దుర్లు రావడంతో పాటు జ్వరం ఆగకుండా మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఉంటుందని తెలిపారు. అదే విధంగా కండరాలు, కీళ్ల నొప్పులు అధికం కావటం వ్యాధి లక్షణాలని తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. దోమలను నియంత్రించడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందుకోసం ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమ డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్, పవన్ కుమార్ ,డెమో తిరుపతయ్య, అసిస్టెంట్ మలేరియా అధికారి దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ అధికారి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని అనాథ బాలికలు, తల్లిదండ్రులు వదిలేసిన బాలికలు, బాలసదనంలో చదివిన బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాలికలు, పాలిటెక్నిక్ కోర్సులు చదివేందుకు శ్రీదుర్గాభాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్ వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 2024–25 విద్యా సంవత్సరంలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో 60 సీట్లు, డిప్లమా ఎలక్ట్రికల్స్లో 60సీట్లు, డిప్లమా కంప్యూటర్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, డిప్లమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో సమర్పించాలని లేదా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్లో సమర్పించాలని కోరారు. వైద్యశిబిరం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదాపురం, తిప్పాపురం గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిర వైద్యాధికారి భవ్యశ్రీ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలిపాక, బోదాపురంలో ఇద్దరు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలిములుగు రూరల్: లోక్సభ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురైన అపస్మారక స్థితిలోకి వెళ్లిన పోరిక మధు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదానికి గురైన మధు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఆయన కలెక్టర్, ఎన్నికల అధికారికి సమాచారం అందించి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక సర్వన్కుమార్, సారయ్య, జయరాం, రఘురాం, హట్కర్ సమ్మయ్య, సోమా నాయక్, జయరాం, సునిల్ కుమార్, రాజుకుమార్, ఏళ్ల మధుసూదన్, సమ్మరావు, అజ్మీర రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక క్వారీ పనుల అడ్డగింత పలిమెల: మండలంలో పంకెనలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు గురువారం పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనుషులతో ఇసుకను తీయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఇసుక క్వారీలో పనులు కల్పించాలని పనులను అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో వివిధ గనుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా నూతన జీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత అందరినీ సమన్వయం చేయాల్సిన అధికారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ నిబంధనలు పాటించకువండా బదిలీలు చేస్తున్నారని చెప్పారు. ఏరియా వర్క్షాపు నుంచి సింగరేణి ఏరియా ఆస్పత్రి, కేఎల్పీలకు బదిలీ చేస్తున్నారన్నారు. ఏకపక్షంగా బదిలీలు చేయడం సరైనది కాదన్నారు. -
‘ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి’
హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నారు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ రెమ్యునషన్ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
కాళోజీ సెంటర్: వరంగల్–ఖమ్మం–నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ లోకేష్కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణపై ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 65 జంబో బాక్సులు, 48 పెద్ద బాక్సులు రెడీగా ఉన్నాయని తెలిపారు. -
కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలి
ములుగు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాజీమార్గం ద్వారా కేసు పరిష్కరించుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసమైనా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి తగిన సహాయం పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రాములు, పరకాల సబ్జైల్ సూపరింటెండెంట్ ప్రభాకర్, ఎకై ్సజ్ సీఐలు సుధీర్కుమార్, బండారి కుమార్, ఎస్సైలు అశోక్, షేక్మస్తాన్, డీడబ్ల్యూఓ స్వర్ణలత, డీసీపీఓ ఓంకార్, సీడీపీఓ స్వామి, వరంగల్ డీపీఓ రాధ, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ -
మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం
ములుగు రూరల్: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఎన్నికల మాదిరిగానే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని గెలిపించేందకు ప్రతీ కార్యకర్త, నాయకుడు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, ఏనుగు రవీందర్రెడ్డి, కృష్ణాకర్, నాగరాజు, మల్లేష్, వెంకన్న, సునీల్, రాజ్కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక క్వారీ పరిశీలన
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు వద్ద రైతుల పట్టా భూముల్లో గోదావరిలో ఉన్న ఇసుక క్వారీని రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. గోదావరిలోని పట్టా భూముల్లో ఇసుకను తియ్యడానికి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తవ్వకాలు జరిపే భూములు తమవని రెవెన్యూ అధికారులకు తెలుపడంతో రెవెన్యూ అధికారులు ఆర్ఐ గణేశ్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అనుమతులు లేకుండా గోదావరిలో జేసీబీలతో తవ్వకాలు జరపడంతో పాటు, రోడ్డు పనులు కూడా చేపట్టినట్లు గుర్తించారు. అనుమతి పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందించిన తర్వాతే పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించినట్లు గణేశ్ తెలిపారు. -
రోడ్లపై లారీలు పార్కింగ్ చేస్తే చర్యలు
ఏటూరునాగారం: ఇసుక లారీలను ఎక్కడైన రోడ్లపై పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మహేష్ గీతె బాబాసాహెబ్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఇసుక లారీల డ్రైవర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని లారీల డ్రైవర్లు ఎక్కడైనా రోడ్ల పక్కన, రోడ్లపై లారీలను, ఇతర వాహనాలను నిలపరాదని తెలిపారు. ఏదైనా వాహనం చెడిపోతే దానికి పార్కింగ్ లైట్స్, వాహనదారులు గుర్తు పట్టే విధంగా గుర్తులు, మార్కింగ్ చేసి ఉంచాలన్నారు. లారీల డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్సులను రద్దు చేసి వాహనం సీజ్ చేస్తామన్నారు. ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. లారీల డ్రైవర్లు తమవంతు బాధ్యతగా పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్, లారీల డ్రైవర్లు పాల్గొన్నారు.ఏఎస్పీ మహేష్ గీతె బాబాసాహెబ్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement