-
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి పంచామృత అభిషేకాల్లో 24, లక్ష్మీగణపతి హోమంలో 15 మంది పాల్గొని పూజలు చేశారు. 25 మంది నూతన వాహన పూజ, చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాలు జరిపారు. ఐదుగురు తలనీలాలు సమర్పించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,458 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.1,38,900 ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
జిల్లాకు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు
రాజస్థాన్ నుంచి రాక అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల బందోబస్తులో భాగంగా జిల్లాకు ఇప్పటికే నాలుగు సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలు నెల రోజుల కిందటే వచ్చాయి. పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో రోజూ కవాతు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకు మరో ఐదు కంపెనీల సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలు అదనంగా చేరుకున్నాయి. రాజస్థాన్ నుంచి ఈ బలగాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం 9 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు భయబ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ బలగాలు భరోసా ఇస్తున్నాయి. ఇప్పటికే చేరుకున్న అదనపు కేంద్ర బలగాలు శనివారం నుంచి విధుల్లో ఉన్నాయని జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. -
కోటసత్తెమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి సమిశ్రగూడేనికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్ (గోదావరి స్టీల్స్) 150 లీటర్ల పెరుగు అందజేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,05,069 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. -
శాంతి కల్యాణం.. కడు రమణీయం
సఖినేటిపల్లి: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహుని దేవస్థానంలో ఆదివారం ఆర్జిత సేవగా స్వామివారి శాంతి కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బహుళ ద్వాదశి తిథి కావడంతో అర్చకులు ఈ వేడుకను నిర్వహించారు. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఆశీనులు గావించారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు ఈ వేడుక నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆధ్వర్యాన సిబ్బంది కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి మూలవిరాట్ దర్శనం, అన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పించారు. -
వైఎస్సార్ సీపీకే ఆర్యవైశ్య సంఘం మద్దతు
●● శ్రీఘాకోళ్లపు, మట్టే శ్రీనుబాబు వెల్లడి ● పెద్దాపురంలో ఆత్మీయ సమ్మేళనంసామర్లకోట: తమ మద్దతు వైఎస్సార్ సీపీకే ఉంటుందని పెద్దాపురం ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. పెద్దాపురం మట్టే ఆదినారాయణ, శ్రీమతి నాగలక్ష్మీ కల్యాణ వేదికలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఆయన హామీ ఇస్తే తప్పనిసరిగా అమలు చేసి చూపిస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడి పాలనను 14 ఏళ్ల పాటు చూశామని, జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్లో పోయినా మూడేళ్లలో అనేక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి అవినీతికీ తావు లేకుండా అమలు చేశారని అన్నారు. అటువంటి నేతకు మరో పర్యాయం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక ద్వారా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే శ్రీనుబాబు మాట్లాడుతూ, స్థానికుడైన దవులూరి దొరబాబుకు వైఎస్సార్ సీపీ పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, వీరిద్దరికీ ఆర్యవైశ్య నాయకుల మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. దవులూరి దొరబాబు మాట్లాడుతూ, రాజకీయంగా ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహిస్తామని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సమావేశంలో కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మట్టే ఆదేష్బాబు, కంతేటి కాశీ (మండపేట), మట్టే శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement