జిల్లాకు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు | Sakshi
Sakshi News home page

జిల్లాకు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు

Published Mon, May 6 2024 10:45 AM

జిల్లాకు మరో 5 కంపెనీల  కేంద్ర బలగాలు

రాజస్థాన్‌ నుంచి రాక

అమలాపురం టౌన్‌: సార్వత్రిక ఎన్నికల బందోబస్తులో భాగంగా జిల్లాకు ఇప్పటికే నాలుగు సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర బలగాలు నెల రోజుల కిందటే వచ్చాయి. పలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో రోజూ కవాతు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకు మరో ఐదు కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర బలగాలు అదనంగా చేరుకున్నాయి. రాజస్థాన్‌ నుంచి ఈ బలగాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం 9 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు భయబ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ బలగాలు భరోసా ఇస్తున్నాయి. ఇప్పటికే చేరుకున్న అదనపు కేంద్ర బలగాలు శనివారం నుంచి విధుల్లో ఉన్నాయని జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement